Monday 27 May 2013

Danny Letters May 2013

Danny Letters
27 May 2013
మిత్రులు పసునూరి రవీందర్ గారికి,

వారం క్రితం ఆంధ్రజ్యోతి డైలీ ఎడిట్ పేజీలో మీ వ్యాసం చూశాను. బాగుంది ఇంకోసారి తీరిగ్గా  చదవాలి అనికూడా అనుకున్నాను. కానీ, ఆ కాపీ ఎక్కడో పొయింది.

ఇప్పటి తెలంగాణ ఉద్యమంలో వర్గదృక్పధాన్ని కొనసాగిస్తున్న రచయిత మీరు ఒక్కరే అనిపిస్తోంది.

మీ వ్యాసం కాపీ నాకు మెయిల్ చేయగలరా?


ఉషా యస్ డానీ  

Sunday 26 May 2013

Danny Quotes May 2013

  
Danny Notes
27 May 2013

చేసిన పాపము ఊరకపోదు
ఛత్తీస్ గడ్ లో తను చేసిన ’కర్మ’ లకు ఒకడు చనిపోయాడు.  దానితో దేశంలోని అధికార పక్షాలు, ప్రతిపక్షాలు ముక్త కంఠంతో, అహింసామార్గం గురించీ,  భారత రాజ్యాంగం గురించీ,  పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి, వాళ్లకే తెలియని ఆదర్శాలు వల్లె వేస్తున్నాయి. కొందరైతే, బాబా సాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అని మరీ గుర్తుచేస్తున్నారు. కానీ, ఆ చనిపోయినవాడు జీవితంలో ఒక్కసారైనా   అహింసా సూత్రాల్ని ఆచరించాడా? భారత రాజ్యాంగాన్ని గుర్తించాడా? కనీసం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలనైనా పాటించాడా? అనే అనుమానం మాత్రం ఒక్కరికీ వచ్చినట్టులేదు.

Danny Notes
27 May 2013

ఎమర్జెన్సీకి  వారసుడొచ్చాడు

"మా అమ్మ సోనియా గాంధీకి సహనం ఎక్కువ. నేను మా నాయనమ్మ  ఇందిరాగాంధి ఒళ్ళో పెరిగినవాడిని" -  రాహుల్ గాంధి.

("మా అమ్మ సోనియా గాంధీకి సహనం ఎక్కువ. మంత్రుల అవినీతి బయటపడిపోతే రాజీనామాలతో సరిపెట్టింది. అదే మా నాయనమ్మ ఇందిరాగాంధి అయితే విపక్షాలు విమర్శలకు దిగినప్పుడు ఏకంగా ఎమర్జెన్సీ  పెట్టేది. నాది  ఇందిరాగాంధి తత్వం") 

Danny Notes
27 May 2013

ఉద్యమం - లాబీయింగ్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఇప్పుడు రెండు మార్గాలున్నాయి.
ఒకటి ఉద్యమమార్గం; రెండు లాబియింగ్ మార్గం.

Danny Notes
27 May 2013  

భిన్నత్వంలో ఏకత్వం
కల్వకుంట చంద్రశేఖర రావు, లగడపాటి రాజగోపాల్ ఇద్దరూ రాజకీయాల్లో బద్ద శత్రువులుగా కనిపిస్తారు. నిజానికి ఇద్దరి రాజకీయ విధానాలూ ఒక్కటే. కెసిఆర్ ఢిల్లీలో లాబీయింగ్ చేసి, తెలంగాణ తెద్దామనుకుంటారు. మరోవైపు లగడపాటి కూడా ఢిల్లీలో లాబీయింగ్ చేసి తెలంగాణను అడ్డుకోవాలనుకుంటారు.


Danny Notes
27 May 2013

ఉద్యమంలో లాబీయింగ్ వుండదు. లాబీయింగులో ఉద్యమం ఉండదు. ఉద్యమంలో ఎప్పుడూ ప్రజలే ప్రయోజనం పొందుతారు. లాబీయింగ్ లో ఎప్పుడు వ్యక్తులే లాభపడతారు.       
Danny Quotes
26 May 2013

పాఠకుల్ని రెచ్చగొట్టడంకన్నా రచయిత చేసే  గొప్ప పని మరొకటి ఏమైనా వుంటుందా?  

Saturday 4 May 2013

NOT BEFORE ME - Danny Story


"నాట్ బిఫోర్ మీ"
డానీ
గరటయ్యను నిందితుల బోనులో చూసి హైకోర్టు విస్తృత ధర్మాసనం కాస్సేపు కంపించింది. గరటయ్యకు ఘనమైన చరిత్రవుంది. పోలీసు రికార్డుల్లో అది ఇప్పటికీ భద్రంగావుంది. విజయవాడ రైల్వే యార్డులో పాత ఇనప ముక్కలు దొంగిలించాడని ముఫ్ఫయి యేళ్ల క్రితం అతని మీద ఆర్పీయఫ్ వాళ్ళు కేసు నమోదు చేశారు. పోలీసులు అతని మీద ఆ కేసు పెట్టకుండా వుండివుంటే, జడ్జిగారు అతనికి వారం రోజుల శిక్ష వేయకుండా వుండివుంటే, గరటయ్య ఇప్పటికీ రైల్వే యార్డుల్లో పాత ఇనపముక్కలు ఏరుకుంటూ బతుకు వెళ్ళబోసుకుంటూ వుండేవాడు. పోలీసులు కేసుపెట్టి, న్యాయస్థానం శిక్షవేసి, గరటయ్య జీవితాన్ని మార్చేశారు. ఆర్పీయఫ్ వాళ్ళు పట్టుకుని, రైల్వే కోర్టు బోనులో నిలబెట్టినపుడు గరటయ్యకు  పౌరుషం వచ్చింది. జడ్జీగారు శిక్ష వేసినపుడు పట్టుదల వచ్చింది. అంతే, పదేళ్ళు తిరక్కుండానే ఏపీలో ఓ అరడజను, పొరుగురాష్ట్రాల్లో మరో అరడజను మినీ స్టీలు ప్లాంటులు కట్టేసి, మినీ లక్ష్మీమిట్టల్ గా అవతరించాడు గరటయ్య.

పేదరికంలో మనుషులకు కులమతాలు వుండవు.  వుండవంటే వుండవనీకాదు. అలా మన్ను తిన్న వానపాములా ఓ పక్కన పడివుంటాయి.  మనుషులకు డబ్బు వచ్చేకొద్దీ కులా, మతాలకు మంచి ఎరువుపడి, వానపాములు కాస్తా త్రాచుపాములుగా మారి బుసలు కొడుతాయి. అలా డబ్బు సంపాదించే క్రమంలో గరటయ్య ఓ రోజు గరటయ్య నాయుడు అయిపోయాడు. అతని వ్యాపార సంస్థ ’జీయన్’ గా మారిపోయింది. ’జీయన్’ అంటే షేర్ మార్కెట్లో అదో ఇది.           

దొంగ సొత్తు త్వరగా పోతుందని పాతకాలంవాళ్ళు అంటారుగానీ, ఇప్పుడు దేశంలో, కాలుష్యంకన్నా, దొంగసొత్తే వేగంగా పెరిగిపోతోంది. కార్పొరేట్ దిగ్గజంగా మారేక గరటయ్యనాయుడు విశ్వరూపం ప్రదర్శించాడు.  అంటే, వ్యాపారంలో ప్రపంచ ఆటగాళ్లతో జట్టుకట్టాడు. గత ప్రభుత్వ హయాంలో రెండు గ్యాస్ బేస్డ్ పవర్ ప్రాజెక్టులు, అంతకుముందున్న ప్రభుత్వంలో రెండు ధర్మల్ పవర్ ప్రాజెక్టులు తన ఖాతాలో వేసుకున్నాడు.  నాయుడి పేరుతోనో, నాయుడి బినామీల పేరుతోనో, రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ ఇరిగేషన్ ప్రాజెక్టులు, సెజ్జులు చెరో అరడజను వెలిశాయి.

మార్కెట్లోకి కొత్తగా దిగే లగ్జరీ మోడలు కార్లన్నీ తన గ్యారేజీలో హాజరు వేయించుకోవాలనిన్నూ, శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగే  సెలబ్రెటీలందరూ ఒక పూటైనా తన ఆతిథ్యం స్వీకరించాలనిన్నూ, గరటయ్యనాయుడు ఓ జీవో జారీ చేశాడు. జీవో అనగా ’గవర్నమెంటు ఆర్డరు’ అనిగాక, "గరటయ్యనాయుడి ఆజ్ఞ" అన్ని కొన్ని పత్రికలు తెలుగులో తర్జుమా కూడా చేశాయి.

తన అరచేతిలో ధన రేఖను గీసిన కోర్టువారన్నా, తన నెత్తి మీద లక్ష్మీకటాక్షాన్ని కురిపించిన పోలీసువారన్నా గరటయ్యనాయుడుకు చాలా గౌరవం. గరటయ్యనాయుడి ఆతిథ్యం స్వీకరించేవారిలో, ముందు పోలీసు అధికారులే వుండేవారు. ఆ తరువాత అతిథుల పరిధి పెరిగింది. మంత్రులు, సినిమా హీరోలు, క్రికెటర్లు, మీడియా టైకూన్లు చేరారు. ఇటీవల హైకోర్టు న్యాయమూర్తులకు కూడా అతిథుల జాబితాలో చోటు కల్పించాడు గరటయ్యనాయుడు.

సరిగ్గా ఈ సమయంలోనే గరటయ్య నాయుడి కథ మలుపు తిరిగింది. ప్రభుత్వాధినేతలతో గరటయ్యనాయుడు పనులు చేయుంచుకునేవాడేతప్ప, ఎవరితోనూ, ఎప్పుడూ మరీ పూసుకు తిరిగేవాడుకాదు. మనిషి ఎదగాలంటే, కుర్చీ ప్రధానం, కుర్చీలో కూర్చున్నవాడు అప్రధానం అనేది అతని పాలసీ. కానీ, గత ప్రభుత్వంలో అతను ఒకే ఒకసారి పాలసీ తప్పాడు. గత సీయం రాష్ట్రాన్ని కనీసం ఇరవై యేళ్ళు ఏలుతాడని నమ్మేశాడు.  ఆ సీయంను భుజాలమీదేకాక ఏకంగా నెత్తిమీదే పెట్టేసుకున్నాడు. కానీ, ప్రభుత్వం పడిపోతుందని అతను కలలో కూడా అనుకోలేదు. అతను అనుకోనిది జరిగిపోయింది.
          
కొత్త ప్రభుత్వం గరటయ్యను బధ్ధశత్రువుగా భావించింది. గత సీయం మీదున్న కసినంతా, గరటయన్నాయుడి మీద తీర్చుకోవాలనుకుంది. అలా అనుకోవడమే తరువాయి, సిబీ‌ఐ చురుగ్గా కదిలింది. ముఫ్ఫయేళ్ళుగా గుట్టలుగా పేరుకుపోయిన ఫైళ్ళను బయటికి తీసి, వాటి బూజు కూడా దులపకుండా గరటయ్య నాయుడి నెత్తిన పడేసింది.

మనిషి మహత్తర విజయం సాధించడానికి ఒక్క మలుపు చాలు. మనిషి పతనాన్ని శాసించడానికి ఒక్క తప్పు చాలు.

ఫ్లాష్ బ్యాక్  ను వదిలేసి మల్లా వర్తమానానికి వచ్చేస్తే, ఆలా హైకోర్టు బోనులో నిలబడ్డాడు. ఆ షాకు నుంచి అందరికన్నా ముందుగా తేరుకుని ఆత్మపరిశీలన చేసుకున్నది ప్రధాన న్యామూర్తులంవారే. "జీయన్ సంస్థలో నాకు లక్షన్నర షేర్లున్నాయి. కనుక ఈ కేసును నేను విచారించడం సమంజసం కాదు. నాట్ బిఫోర్ మీ" అంటూ ఓక ప్రకటన చేసి, ధర్మాసనం దిగి, గౌను సర్దుకుంటూ, చకచకా వెళ్ళిపోయారువారు.

గరటయ్య నాయుడు జీవితంలో ప్రతి మెట్టులోనూ కోర్టు వాజ్యాలు ఎదుర్కొన్నాడు. ఏ కేసునూ అతను ఆషామాషీగా తీసుకోలేదు. ప్రతిదానికీ పెద్ద లాయర్లనే పెట్టాడు. విజయాలు సాధించాడు.  ఆ పెద్ద లాయర్లంతా ఇప్పుడు  న్యాయమూర్తులయ్యారు. అదియునూకాక, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నింటికీ గరటయ్య నాయుడు, తనవైన సేవలు అందించాడు. హైకోర్టు న్యాయమూర్తుల్లో, ఎక్కువమంది ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రాజకీయపార్టి సిఫారసుతో నియమితులైనవాళ్ళే. అదలావుంచినా, ఇప్పుడు హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న లాయర్లలో చాలా మంది, ప్రస్తుత న్యాయమూర్తుల వద్ద ఒకప్పుడు జూనియర్లుగా పనిచేసినవారే.   

మనం అంతగా గమనించంగానీ, ప్రపంచంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఘరానా దొంగలు, పెద్ద పోలీసు ఆఫీసర్లూ, పేరుమోసిన న్యాయవాదులూ, ప్రధాన రాజకీయపార్టీల నాయకులు, తీర్పు చెప్పే న్యాయమూర్తులూ అంతా ఒకే సామాజికవర్గానికి చెందివుంటారు.  లేకుంటే, ఒకే ఆర్ధికవర్గానికి చెందివుంటారు. సమాజాన్ని యేలేవాళ్ళే సాధారణంగా న్యాయస్థానాల్నీ ఏలుతారు.

కోర్టులో అందరూ ఒకసారి ఒకరిముఖాలు ఓకరు చూసుకున్నారు.  ధర్మాసనం మీది న్యాయమూర్తులకూ, ధర్మాసనం కింది న్యాయవాదులకూ, బోనులో నిలబడ్డ నిందితునికీ మధ్య ఎదో కనిపించని నూలుపోగు సంబంధం వుందని అందరికీ హఠాత్తుగా తెలిసివచ్చింది. అలా తోచిందే తడవుగా, న్యాయమూర్తులందరూ ధర్మాసనం దిగి, గౌన్లు సర్దుకుంటూ వెళ్ళి పొయారు. ఆ వెనుక న్యాయవాదులు కూడా కోర్టు హాలు వదిలి వెళ్ళిపోయారు.


ఈ పరిణామాల్ని చూసి, గరటయ్య నాయుడు ఖిన్నుడయ్యాడు.  "కడిగిన ముత్యంలా, సానబెట్టిన వజ్రంలా బయటికి వస్తాను" అని అతను భీకర ప్రతిజ్ఞ చేసి వచ్చాడు. ముప్పయి యేళ్ళుగా  న్యాయస్థానం మీద అతను పెంచుకున్న నమ్మకం అలాంటిది. "నన్ను వదిలి వెళ్లవద్దు" అని అతను అందర్నీ బతిమాలుకున్నాడు. ఎవ్వరూ అతని మాటల్ని వినలేదు.  దానితో గరటయ్యనాయుడిలో పౌరుషం పెల్లుబికింది. "నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే వరకు ఈ నిందితుడి బోనులో నుండి కదలనుగాక కదలను" అని అతను ఇంకో శపథం చేశాడు. 

హైకోర్టులో సింగిల్ జడ్జి బెంచీలు, డివిజన్ బెంచీలు, ఫుల్ బెంచీలు,  హాఫ్ బెంచీలు,  క్వార్టర్ బెంచీలు అంటూ అనేక ధర్మాసనాలుంటాయి. ధర్మాసనం అన్నాక న్యాయమూర్తులుంటారు. న్యాయమూర్తుల్లో తప్పనిసరిగా మనుషులు వుంటారు. మనుషులన్నాక కులాలు, మతాలు, తెగలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతీ-సాంప్రదాయాలు, వాణిజ్య-వ్యాపార ఆసక్తులు అన్నీ వుంటాయి.

అయితే, వాళ్ళందరికీ గరటయ్యనాయుడితో, నేరుగా సంబంధాలున్నాయని అనడమూ తప్పే. గరటయ్యనాయుడితో మానవ సంబంధాలులేనివాళ్ళు  హైకోర్టులో చాలామందే వున్నారు.   ముచ్చటపడి జీయన్ సంస్థలో షేర్లు కొనుక్కున్న కారణాన వాళ్లకు అతనితో మార్కెట్  అనుబంధం మాత్రమే  వుంది. ఏదైనా సంబంధం సంబంధమేకదా! భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే.   
 
హైకోర్టులోని బెంచీలన్నీ గరటయ్యనాయుడి కేసును విచారించడానికి తిరస్కరించడంతో, నాయుడి మనస్సు చివుక్కుమంది.  అతను, ఆ విస్తృత ధర్మాసనం ముందున్న బోనులో దాదాపు ఇరవై నాలుగు గంటలు తిండీతిప్పలులేక అలా నిలబడిపోయాడు.

నిందితుడు బోనులోనూ, న్యాయమూర్తులు ధర్మాసనం బయటనూ వుండిఫోవడంతో న్యాయవ్యవస్ద్థలోనే  సరికొత్త సంక్షోభం తలెత్తింది. పరిస్థితిని చక్కదిద్దడానికి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హుటాహుటిన రాష్ట్రపతి భవనానికి చేరుకున్నారు.  దేశంలోని న్యాయవేత్తలందరితో, అర్ధరాత్రి వరకు మేధోమధనం సాగించిన రాష్ట్రపతి, చివరాఖరికి నాయుడి సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు.

"ఈ కేసు, ఈ దేశపు ధర్మాసనాలు విచారించదగినదికాదు. ధర్మాసనాల పరిధిలోనికిరాని నేరాలేవీ నేరాలు కావు. ప్రస్తుతం అమల్లో వున్న చట్టాల ప్రకారం గరటయ్య నాయుడు సంపూర్ణ నిర్దోషి. అతను నిందితుల బోనును వదిలిపెట్టి, స్వేఛ్ఛగా ఇంటికి వెళ్ళిపోవచ్చు" అంటూ హైకోర్టు రిజిస్ట్రార్ వారు మరునాడు ఒక అధికార ప్రకటన చేశారు.

హైకోర్టు రిజిస్ట్రారువారి ప్రకటన అసలు ప్రతిని అందుకున్నాక మాత్రమే, గరటయ్య నాయుడు సగర్వంగా  తల ఎగిరేసి, బోను వదిలి బయటను నడిచాడు.

(కక్షిదారులతో భావబంధాలున్న న్యాయమూర్తులు కేసుల్ని విచారించడం సమంజసం కాదన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మదన్ లోకూర్ గారికి అభినందనలతో)

హైదరాబాద్
 5 May 2013

Danny Notes May 2013

Danny Notes
31 May 2013
అంతర్యుధ్ధం

చైనాతో కొత్తగా ప్రేమలో పడ్డాక, ఈశాన్య సరిహద్దుల్లో సైన్యానికి పనిలేకుండాపోయిందని భారత ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. నక్సల్స్ ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో సైనిక బలగాలని పంపించాలని భావిస్తోంది. అది అంతర్యుధ్ధం అవుతుందని ప్రభుత్వాధినేతలకు తెలిసినట్టులేదు. రేపు పాకిస్తాన్ తో కూడా ఏదోఒక సర్దుబాటు జరిగితే వాయువ్య సరిహద్దుల్లోని సైన్యాన్ని కూడా దేశం మీదికి దించవచ్చు. వర్గ సరిహద్దే రేపు దేశసరిహద్దు కావచ్చు!!    


Danny Notes, 31 May, 2013
బయ్యారం ఇనప గనులు

బయ్యారం ఇనప గనులపై సాగుతున్న చర్చలు చూస్తుంటే, వాటిని జగన్-అనిల్ కుటుంబానికో, కెసిఆర్ -హరీష్ కుటుంబానికో దక్కించాలనే ఎజెండాలు చెరోవైపు వున్నట్టు అనిపిస్తోంది. గిరిజనప్రాంతంలోని వనరులపై గిరిజనులకే హక్కు కల్పించాలనే ఆదర్శం ఎక్కడా కనిపించడంలేదు. భారత రాజ్యాంగంలో ఐదవ షెడ్యూలు అనేది ఒకటుందని అందరూ మరిచిపోయినట్టున్నారు; గవర్నరుతోసహా!  

Danny Notes
30 May 2013
పగలు రేయి: పశ్చిమ గోదావరి

పాత్రికేయ మిత్రుడు షేక్ కరీం ఈరోజు పోస్టులో ఇరవై ఏడేళ్ళ క్రితం నేను రాసిన ’పగలురేయి పశ్చిమ గోదావరి’ వ్యాసాన్ని ప్రస్తావించాడు.   1986  జనవరిలో ఉదయం దినపత్రికలో అచ్చయిన వ్యాసం ఇది. "ఎప్పుడైనా నీకు అనుభవంలో వున్నదే అర్ధం అవుతుంది. నీకు తెలిసిందే నువ్వు రాయి" అని నాకు తత్వశాస్త్ర పాఠాలు చెప్పిన త్రిపురనేని మధుసూదన రావు ఉపదేశించారు. ఆమేరకు మా స్వంతజిల్లా పశ్చిమ గొదావరి మీద వ్యాసం రాద్దామనుకున్నాను. రాసింది ఆర్ధిక అంశాల మీదే అయినా కాన్సెప్ట్ ను తత్వశాస్త్రం నుండి తీసుకున్నాను. మావో ’వైరుధ్యాలు’ వ్యాసంలో అనేక  ద్వంద్వాల గురించి ప్రస్తావిస్తాడు. గణితంలో ప్లస్, మైనస్, యంత్రశాస్త్రంలో చర్య, ప్రతిచర్య, భౌతిక శాస్త్రంలో ధన విద్యుత్తు, రుణ విద్యుత్తు, రసాయన శాస్త్రంలో సంఘటన, విఘటన, రాజకీయాల్లో యుధ్ధము, శాంతి ఇలా సాగుతుంది వైరుధ్యాల వ్యాసం. ఆ వరుసలో నేను పగలు రేయి అనే ద్వంద్వాన్ని సృష్టించాను. సమాచారం పుష్కలంగా వుండి, కాన్సెప్ట్ కూడా వుంటే వ్యాసం తయారైపొయినట్టే. నాకు అప్పటి వరకు విప్లవ పత్రికల్లో రాసిన అనుభవం మాత్రమే వుంది. ప్రధాన స్రవంతి పత్రికల్లో నేను రాసిన తొలి వ్యాసం అది. రచన శైలిలో ప్రధాన స్రవంతి ప్రమాణాల కోసం మిత్రుడు కే. శ్రీనివాస్ సహాయం తీసుకున్నాను.

ఈ వ్యాసం నాకు చాలా పేరు తెచ్చిపెట్టింది. ఇందులో నేను ప్రస్తావించిన  ’అభివృధ్ధి వైపరీత్యాలు’ అనే కాన్సెప్ట్ ఢిల్లి మిత్రుడు సివీ సుబ్బారావుకు  చాలా నచ్చింది. ఆయన యూనివర్శిటీల స్థాయిలో నా వ్యాసాన్ని ప్రచారం చేశాడు. అలా నాకు ఆర్.ఎస్. రావుగారు పరిచయమయ్యారు.  సంబల్ పూర్ యూనివర్శిటీలో ఆర్.ఎస్. రావుగారు నాతో ఒక మీట్ కూడా ఏర్పాటు చేశారు. తరువాతి కాలంలో ఆర్.ఎస్. రావుగారి దగ్గర నేను రాజకీయార్ధికశాస్త్రంలో అనేక మెళుకువలు  నేర్చుకున్నాను.

ఆ సమయంలోనే ఆర్.ఎస్. రావుగారు ’అభివృధ్ధి వెలుగు నీడలు’ అనే పెద్ద వ్యాసం రాశారు. ఆ వ్యాసం ప్రేరణతో నేను ’పగలురేయి పశ్చిమగోదావరి’ వ్యాసం రాశానని కొందరు అనుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ, అది నిజంకాదు. నా వ్యాసం వచ్చిన కొన్ని నెలల తరువాత ఆర్.ఎస్. రావుగారి వ్యాసం వచ్చింది. అయినప్పటికీ,  ఆ రంగంలో వారు గొప్పవారు. నాకు గురువుగారు. 


Danny Notes
30 May 2013

రానున్న ఉప్పెనకు తొలి సంకేతం
ఆంధ్రప్రదేశ్  రాజకీయాల్లో ప్రస్తుతం  కొనసాగుతున్న నాలుగు స్థంభాలాట 2014 ఎన్నికలతో ముగుస్తుంది. జగన్ గాలి, కేసిఆర్ తంత్రం, చంద్రబాబు చక్రం తిప్పడాలు, కిరణ్ కుమార్ రెడ్ది ఆరాటం, ఈ నాలుగు స్థంభాలాట మధ్య నాలుగు సీట్లు తమ సంచిలో వేసుకుందామనుకునే కమలనాధులు, కమ్యూనిస్టుల ఆశలు వగయిరాలన్నీ వచ్చే ఎన్నికల్లో ఒక కొలిక్కి వస్తాయి. ఈ నాలుగు స్థంభాలాట సుడిగుండంలో రాష్ట్రమంతటా దాదాపు నాలుగేళ్ళుగా అనేక ప్రజా సమస్యలు  మూలన పడిపోయాయి. ఒక్కసారి ఎన్నికల హోరు తగ్గగానే, అవి ముందుకు వస్తాయి. ఈనాడు మనకు ప్రముఖంగా కనిపిస్తున్న పార్టీలు, వ్యక్తుల్ని చరిత్ర చెత్త బుట్టలో పడేసి, ఒక ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది.

మొన్నటి ఛత్తీస్ గఢ్ ’కర్మ’కాండ రెండేళ్ల క్రితం జరిగివుంటే ప్రధాన స్రవంతి రాజకీయపార్టీలు ఒక నెల రోజులు ఎడతెరపిలేకుండా గగ్గోలు పెట్టివుండేవి. ఇప్పటి పరిస్థితి వేరు. ఎవరూ పెద్దగా నోరు విప్పడంలేదు. ’కర్మ’కాండ మీద ప్రధాన స్రవంతిలోనే ఒక పరోక్ష  ఆమోదాంశం కనిపిస్తున్నది. రానున్న ఉప్పెనకు ఇది తొలి సంకేతం.

Danny Notes
30 May 2013
ఏబీకే కల్ట్

తెలుగు జర్నలిజంలో ఏబీకే ప్రసాద్ ఒక కల్ట్ ఫిగర్. నేనూ ఆ కల్ట్ లో సభ్యుడ్నే. ఏబీకే శిష్యుడిగానే నేను వర్కింగ్ జర్నలిస్టుగా మారాను. ప్రింట్ మీడియా కొలువులో నాకు ఆదియూ అంతమూ  ఏబీకే గారే. మొదట్లో ఆంధ్రభూమిలో, చివర్లో ఆంధ్రప్రభలో వారి దగ్గర పనిచేశాను. 

Danny Notes
28 May 2013

విబంధుడు - వాడ్రేవు చినవీరభద్రుడు

శీర్షికలు సాహిత్య పేజీ ఇన్ చార్జీల   Proprietary, Discretion  అక్కడ రచయితలు కాలో, వేలో పెట్టగలిగే ఆస్కారంలేదు. విబంధుడు పదం కొత్తగా విన్నట్టు అనిపించింది. బంధాలూ లేనివాడేమో అనుకున్నాను. శీర్షికను వదిలేస్తే, త్రిపుర మీద వాడ్రేవు చినవీభద్రుడు రాసిన  వ్యాసం (ఆంధ్రజ్యోతి) చాలా హృద్యంగా వుంది. సమాచారం వుంది, విశ్లేషణవుంది. ఇటీవలి కాలంలో వాడ్రేవు చినవీభద్రుడు, పసునూరి రవీందర్ ల రచనల్ని  నేను ఇష్టంగా చదువుతున్నాను. వాళ్ళిద్దరికీ సాహిత్యమూ తెలుసు; తత్వశాస్త్రమూ తెలుసు, సామాజిక కోణమూ తెలుసు. ఈ మూడూ తెలిసినవారి రచనల్నే నేను చదవగలుగుతున్నాను.

Danny Notes
28 May 2013
హింసా-ప్రతిహింసా

హింస ద్వారానే పాలకులు పాలించగలుగుతారు. ప్రతిహింస ద్వారానే ప్రజలు దాన్ని నిలవరించ గలుగుతారు. పరస్పర విరుధ్ధ ఆర్ధిక ప్రయోజనాలుండే వర్గ సమాజంలో ఇది ప్రాధమిక నియమం. వర్గసమాజం వున్నంత వరకు ఈ నియమంలో మార్పు వుండదు.

ఆధునిక సమాజాల్లో ఈ హింసా-ప్రతిహింసా ప్రక్రియలు ఎప్పటికప్పుడు ఆధునిక రూపాన్ని సంతరించుకుని ముందుకు సాగుతుంటాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వాటిల్లో ఒకటి. పాలకుల పరిశోధన-అభివృధ్ధి విభాగాలు, ప్రజల పరిశోధనా-అభివృధ్ది విభాగాలకన్నా, విస్తృతిలో పెద్దవి సారాంశంలో కుటిలమైనవి. ప్రజలు ఒక రూపంలోని దోపిడీ, అణీచివేతలని అర్ధం చేసుకునే లోపలే పాలకులు పది కొత్త రూపాల్లో దోపిడీ, అణీచివేతలని ప్రయోగిస్తుంటాయి. కొంచెం ఆలస్యం అయినా ప్రజలు వాటిని గట్టిగానే తిప్పికొడతారు. రాక్షసులు ఎన్ని రకాల  కామరూపాల్లో వచ్చినప్పటికీ, చివరకు రాక్షస రూపం బయటపడిపోయి చనిపోతారని జానపదకథల్లో చదువుకున్నాం. ఇక్కడా సరిగ్గా  అలానే జరుగుతుంది.

నన్ను కొంచెం నిరుత్సాహపరిచే అంశం ఏమంటే, నేను అభిమానించే విప్లవసంస్థల ప్రస్తుత నాయకులు గత తరాలంత ముందుచూపుతోనూలేరు, చురుగ్గానూలేరు. మరోవైపు, విప్లవశ్రేణుల్ని పాలకవర్గాలు చాలా వుధృతంగా చెడగొట్టేస్తున్నాయి; లొంగదీసుకుంటున్నాయి; రెండూ కుదరకపోతే చంపేస్తున్నాయి. సకలదేశాల శ్రామికులు ఏకం అవ్వకముందే, సకల దేశాల పాలకులు ఏకం అయిపోతున్నారు.

భాగవతంలో, శ్రీకృష్ణుడ్ని గర్భంలోనే చంపేయడానికి కంసుడు ప్రయత్నిస్తాడు. పాలుతాగే వయసులో, నడక నేరుస్తున్న వయసులో, అలా అనేక దశల్లో అనేక కామరూపుల్ని పంపి చంపాలనుకుంటాడు. ఆ దాడులన్నింటినీ తిప్పికొడుతూ, పెద్దాడయిన శ్రీకృష్ణుడు ఒకరోజు కంసుని సభకే వచ్చి హతం చేస్తాడు. అలాంటి అద్భుతం ఒకటి సమీపభవిష్యత్తులోనే జరుగుతుందని ’నమ్మేవాళ్ళలో’ నేనూ ఒకడ్ని.  అన్ని రోజులూ పాలకులవికావు. ప్రజలకూ తమ రోజు వస్తుంది

Danny Notes
28 May 2013
అహింసామార్గాన్ని పాటించాల్సింది ఎవరూ?

స్వాతంత్ర ఫలాలు అందరికీ అందడమే ముఖ్యం. ఆ కర్తవ్యాన్ని డెభ్భయి యేళ్ల తరువాత కూడా మన పాలకులు పూర్తి చేయలేదు. దిక్కులేనివాళ్లకిచ్చే అంత్యోదయ కార్డుల కోసం భారత ప్రజలు ఇప్పటికీ క్యూల్లో నిలబడుతున్నారు. దీన్ని గట్టిగా ప్రశ్నించే వాళ్ళను హింసావాదులు అంటున్నారు. "ఏ ఉద్యమమైనా అహింసామార్గంలో ఉండాలి" అని ఒక హితబోధ చేస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం అహింసామార్గంలో "నే" వచ్చిందని ఒక బూటకాన్ని సాంప్రదాయంగా మారుస్తున్నారు. ఇంతకీ ఈ అహింసామార్గాన్ని పాటించాల్సింది ఎవరూ? ప్రభువులా? ప్రజలా? స్వతంత్ర భారత దేశాన్నీ, అందులోని రాష్టాల్నీ, పాలించినవాళ్లలో ఇంత వరకు "అహింసో పరమధర్మం" అనుకున్నవాళ్ళు ఏ ఒక్కరైనా వున్నారా
Danny Notes
27 May 2013

హింసామార్గంలోనే భారత స్వాతంత్రం

భారతదేశానికి  అహింసామార్గంలో స్వాతంత్రం వచ్చిందని నమ్మేవాళ్ళు కొందరు వున్నారు. ఇది నిజం కాదు. రెండో ప్రపంచ యుధ్ధమంతటి నరమేధం జరిగిన తరువాత మనకు స్వాతంత్రం వచ్చింది. అది కూడా, అహింసావాదం మీద ఏమాత్రం నమ్మకంలేని,  ఒక సోషలిస్టు (లేబర్) పార్టి ఇంగ్లండ్ లో అధికారం లోనికి వచ్చిన తరువాత  మనకు స్వాతంత్రం వచ్చింది. అహింసా ప్రవక్తగా భావించే మహాత్మా గాంధీజీ రెండో ప్రపంచ యుధ్ధంలో చిత్రమైన తర్కంతో బ్రిటన్ ను సమర్ధించారు. ౩౦ లక్షల మంది భారత  సైనికులు ఆ యుధ్ధంలో పాల్గోన్నారు. మరోవైపు, శతృవుకు శతృవు మిత్రుడు అనే నినాదంతో సుభాష్ చంద్రబోస్ జపాన్ తో చేతులు కలిపాడు. ఆ మేరకు గాంధీజీకన్నా బోస్ బ్రిటీషువాళ్లను ఎక్కువగా ఇబ్బందిపెట్టాడు. అసలు విషయం ఏమంటే, అప్పటికీ స్వాతంత్రాన్ని ఇవ్వకపోతే, దేశంలో భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి హింసావాదులు వందలుగా పుట్టుకు వస్తారని బ్రిటిష్ పాలకులు భయపడ్డారు. మధ్యేవర్గం చేతుల్లో  పెట్టడం తమకూ  ప్రయోజనకరం అని భావించి అధికారాన్ని కాంగ్రెస్ కు బదిలీ చేశారు. మనకు చాలా స్పష్టంగా  హింసా మార్గంలోనే స్వాతంత్రం వచ్చింది. 


Danny Notes
27 May 2013

చేసిన పాపము ఊరకపోదు
ఛత్తీస్ గడ్ లో తను చేసిన ’కర్మ’ లకు ఒకడు చనిపోయాడు.  దానితో దేశంలోని అధికార పక్షాలు, ప్రతిపక్షాలు ముక్త కంఠంతో, అహింసామార్గం గురించీ,  భారత రాజ్యాంగం గురించీ,  పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి, వాళ్లకే తెలియని ఆదర్శాలు వల్లె వేస్తున్నాయి. కొందరైతే, బాబా సాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అని మరీ గుర్తుచేస్తున్నారు. కానీ, ఆ చనిపోయినవాడు జీవితంలో ఒక్కసారైనా   అహింసా సూత్రాల్ని ఆచరించాడా? భారత రాజ్యాంగాన్ని గుర్తించాడా? కనీసం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలనైనా పాటించాడా? అనే అనుమానం మాత్రం ఒక్కరికీ వచ్చినట్టులేదు.
  

Danny Notes
27 May 2013

ఎమర్జెన్సీకి  వారసుడొచ్చాడు

"మా అమ్మ సోనియా గాంధీకి సహనం ఎక్కువ. నేను మా నాయనమ్మ  ఇందిరాగాంధి ఒళ్ళో పెరిగినవాడిని" -  రాహుల్ గాంధి.

("మా అమ్మ సోనియా గాంధీకి సహనం ఎక్కువ. మంత్రుల అవినీతి బయటపడిపోతే రాజీనామాలతో సరిపెట్టింది. అదే మా నాయనమ్మ ఇందిరాగాంధి అయితే విపక్షాలు విమర్శలకు దిగినప్పుడు ఏకంగా ఎమర్జెన్సీ  పెట్టేది. నాది  ఇందిరాగాంధి తత్వం") 

Danny Notes
27 May 2013

ఉద్యమం - లాబీయింగ్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఇప్పుడు రెండు మార్గాలున్నాయి.
ఒకటి ఉద్యమమార్గం; రెండు లాబియింగ్ మార్గం.

Danny Notes
27 May 2013  

భిన్నత్వంలో ఏకత్వం
కల్వకుంట చంద్రశేఖర రావు, లగడపాటి రాజగోపాల్ ఇద్దరూ రాజకీయాల్లో బద్ద శత్రువులుగా కనిపిస్తారు. నిజానికి ఇద్దరి రాజకీయ విధానాలూ ఒక్కటే. కెసిఆర్ ఢిల్లీలో లాబీయింగ్ చేసి, తెలంగాణ తెద్దామనుకుంటారు. మరోవైపు లగడపాటి కూడా ఢిల్లీలో లాబీయింగ్ చేసి తెలంగాణను అడ్డుకోవాలనుకుంటారు.


Danny Notes
27 May 2013

ఉద్యమంలో లాబీయింగ్ వుండదు. లాబీయింగులో ఉద్యమం ఉండదు. ఉద్యమంలో ఎప్పుడూ ప్రజలే ప్రయోజనం పొందుతారు. లాబీయింగ్ లో ఎప్పుడు వ్యక్తులే లాభపడతారు.       


మతోన్మాదం, జాతియోన్మాదం
27 May 2013


మతోన్మాదంలేని జాతియోన్మాదం మనకు సాధ్యమా? 


వడగాల్పులు
26 May 2013

వడగాల్పుల్లో మనుషులు పిట్టల్లా చనిపోవడం ప్రకృతి వైపరీత్యంకాదా? విషయంలో ప్రభుత్వం చేయగలిగింది ఏమీలేదా? యుగంలో వున్నాం మనం!!

జలగ్రహం - భూగ్రహం
26 May 2013

1980 నాటి మాట. అనంతపురంలో వున్నాను. చిన్నప్పుడు నరసాపురంలో మేము రోజూ కాలవలో స్నానం చేసేవాళ్ళమంటే జిల్లా మిత్రుడు ఒకడు నమ్మలేదు. నిజంగా మనిషి మునిగి స్నానం చేసేంత నీళ్ళు కాలవలో వుంటాయా అని పదిసార్లు అడిగాడు. వాళ్లకూ పెన్నా నది వుంది. అయితే వాళ్ళు దాన్ని బొందల పెన్నా అంటారు. ఇసక మేటతప్ప అందులో నేను ఎప్పుడూ నీళ్ళు చూడలేదు.

మావూర్లో మూడు పిల్ల కాలువలు, ఒక మేజర్ కాలువ, ఒక గోదావరి నది, ఒక సముద్రం వుంటుందంటే నేను అతనికి ఒక జానపద కథ వినిపిస్తున్నాను అనుకున్నాడు. వరద కాలంలో మా వూరి రోడ్ల మీద పడవలు తిరిగేవి అంటే నా అనంతపురం మిత్రుడు చాలా అసహనానికి గురయ్యాడు.

ఇప్పుడు భయం ఏమిటంటే, మా నరసాపురంలోనూ నీళ్ళు అంతరించిపోతున్నాయి. భవిష్యత్తులో మా వూరి నీళ్ల గురించి చెపితే, మా వూరివాళ్ళే నమ్మరేమో!!

మన జలగ్రహం నిజంగానే భూగ్రహం అయిపోతుందా?



Danny Notes
19 May 2010

శ్రమ
స్వతంత్ర భారతదేశంలో తొలితరం శ్రమను ప్రేమించింది. దేశనిర్మాణంలో కీలకపాత్ర నిర్వహించింది. తాముపడినంత శ్రమను తమ సంతతి పడకూడదనీ కలలు కన్నది. కలల సత్ఫలితాల్ని కొన్నాళ్ళు మనం చూశాం. వాటి దుష్ఫలితాలని ఇప్పుడు చూస్తున్నాం. విద్యాధికులైన నేటి యువతరం శ్రమను అసహ్యించుకుంటున్నది. గతంలో మనకు గ్రామీణప్రాంతాల్లో భూమిలేని భూస్వాములు కనిపించేవారు. నేటి నగర యువతలో డబ్బులులేని కోటీశ్వరులు కనిపిస్తున్నారు. ఇలాంటి ధోరణి ఉత్పాదక రంగాన్ని దెబ్బతీస్తుంది.

Danny Notes
19 May 2010

సహాయం
బాల్యంలోనో, శిక్షణ పొందే దశలోనో మాత్రమే మనం ఇంకొకరి సహాయం తీసుకోవాలి. వృధ్ధాప్యంలో ఎలాగూ మళ్ళీ ఇంకొకరి సహాయం తీసుకోక తప్పదు. బాల్యానికి వృధ్ధాప్యానికి మధ్య మన బతుకు మనం బతకాలి. ఇంకొకరి జీవనానికీ సహాయకారులం కావాలి.

ఒక వ్యక్తి జీవితంలో బాల్యం, వృధ్ధాప్యం ఎంత చిన్నవిగావుంటే అంత మంచిది. వాటి మధ్య కాలం ఎంత పెద్దదిగావుంటే అంత మంచిది
విజయం- పతనం
Danny Notes, 5 May 2013

మనిషి మహత్తర విజయం సాధించడానికి ఒక్క మలుపు చాలు. మనిషి పతనాన్ని శాసించడానికి ఒక్క తప్పు చాలు.

సమాజం - న్యాయస్థానం 
Danny Notes, 5 May, 2013  

సమాజాన్ని యేలేవాళ్ళే సాధారణంగా న్యాయస్థానాల్నీ ఏలుతారు.

ఒకే సామాజికవర్గం
Danny Notes, 5 May, 2013  

మనం అంతగా గమనించంగానీ, ప్రపంచంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఘరానా దొంగలు, పెద్ద పోలీసు ఆఫీసర్లూ, పేరుమోసిన న్యాయవాదులూ, ప్రధాన రాజకీయపార్టీల నాయకులు, తీర్పు చెప్పే న్యాయమూర్తులూ అంతా ఒకే సామాజికవర్గానికి చెందివుంటారు.  లేకుంటే, ఒకే ఆర్ధికవర్గానికి చెందివుంటారు.

ఆడవాళ్ల భాష
Danny Notes, 5 May, 2013  

మగవారికన్నా మహిళలు నుడికారంతో మాట్లాడుతారు. ఏదైనా కొత్త భాషను  నేర్చుకోవాలనుకున్నప్పుడు, ఆడవాళ్ల మాటతీరును పరిశీలించడం మంచిది. 

అతివాదులు, మితవాదులూ ఒక్కటే
Danny Notes, 3 May, 2013

దేశభక్తి గురించి భారతీయ జనతా పార్టి అతిగా మాట్లాడుతుంది. భారత భూమిని, గనుల్ని ఘనపు అడుగుల చొప్పున తవ్వేసి, కోట్ల టన్నుల ఇనప ఖనిజాన్ని చైనాకు తరలించిన ’గనుల ఘనుడు’ గాలి జనార్దనరెడ్డి కమలనాధుడే!  దేశానికి ఈ స్థాయిలో ద్రోహం చేసినవాడూ సమీప గతంలో మరొకడులేడు!

అద్వానీయో, వెంకయ్యనాయుడో "ఇప్పుడు గనుల ఘనులు మాతోలేరు", "కర్ణాటక బీజేపి పునీత మయింది" అంటే జనం నమ్ముతారా?

గాలి జనార్దన రెడ్డిని సిబిఐ అరెస్టు చేసిన తరువాత బీజేపి దూరంగా పెట్టిందా? అతని దేశద్రోహాన్ని ముందే కనిపెట్టి పక్కన పెట్టిందా? ఈ ప్రశ్న ఎప్పుడూ సజీవంగానే వుంటుంది. 

కాంగీయులు కూడా భారీ స్కాములు నడిపారు.  గాలి జనార్దన రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి  శత్రుదేశానికి సహకరించాడు!  నేరం చేస్తున్నపుడు అతను కర్ణాటకలో బీజేపి మంత్రి! 

విలాసవంతమైన పాత్రికేయ జీవితం
Mayday,2013,  Danny Notes

విలాసవంతమైన పాత్రికేయ జీవితంలో దొరకనిది సమయం ఒక్కటే!!
ఈరోజు ఉదయం నాలుగు గంటలకు లేచాను. మా హైస్కూలు పూర్వ విద్యార్ధుల సమావేశాలు నెల 10,11 నర్సాపురంలో జరుగుతున్నాయి. సందర్భంగా తెచ్చే సావనీర్ కు ఒక ఆర్టికల్ కావాలని మా అమ్మనమంచి కృష్ణశాస్త్రి -మేయిల్. కృష్ణశాస్త్రి మాటంటే అదో శాసనం. నేను చాలాసార్లు శాసనోల్లంఘనం చేశానుగానీ, కృష్ణశాస్త్రి ఆదేశాల్ని మాత్రం ఉల్లంఘించలేకపోయాను.

అలనాటి నా సహాధ్యాయుల్ని తలుచుకుని ఒక ఆర్టికల్ రాయడం మొదలెట్టా. దాన్ని పూర్తి  చేయక ముందే, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ పంతుకుల శ్రీనివాస్ వచ్చాడు. పక్షం రోజులుగా అడుగుతుంటే అతనికి రోజు అప్పాయింట్ మెంట్ ఇచ్చాను. నన్ను ఇంటర్వ్యూ  చేయడానికి నలభై ప్రశ్నలతో వచ్చాడతను. అతనికి సమాధానాలు ఇస్తున్నపుడే, మా గురువుగారు వాసిరెడ్డి వేంకట కృష్ణారావుగారు ఫోన్ చేశారు.   వారి ఫోన్ లో ఒబామా నుండి ప్రచండ వరకు చాలా విషయాలుంటాయి. ఆర్టికల్, ఫోన్, ఇంటర్వ్యూ!!!  త్రిపాత్రాభినయం!! మధ్యాహ్నం పన్నెండు అయింది, అప్పటి వరకు నో బ్రేక్ ఫాస్ట్పంతుకుల శ్రీనివాస్ ను పంపించి, శాస్త్రికి -మెయిల్ పంపితే, టీచర్స్ మీద ఇంకో ఆర్టికల్ పంపాలని ఇంకో ఫర్మానా!! అదీ పూర్తి చేసే సమయానికి రెండు దాటింది. శెలవురోజైనా టీవీలకు శెలవు వుండదు కదా. మళ్ళీ మా ఆవిడతో కలిసి  ఆఫీసు, అక్కడ రోజువారీ స్క్రిప్టు, తరువాత రాత్రి ఎనిమిది గంటలకు పర్చేజింగులు. సో ఆన్!!!

మే డే ! ఇప్పుడు మనమున్న పరిస్థితికన్నా, చికాగో పోరాటానికి ముందు రోజులే బాగుండేవేమో!