Wednesday 29 April 2015

చంద్రబాబు చైనా యాత్ర మరోకోణం

చంద్రబాబు చైనా యాత్ర మరోకోణం
డానీ

చంద్రబాబు చైనా యాత్రలో సాధించిన విజయాల గురించి మీడియాలో రంగురంగుల కథనాలు అనేకం వచ్చాయి. వస్తున్నాయి. రాష్ట్రంలో అపారంగావున్న ఎర్రచందనం నిల్వల్ని  చైనాకు అమ్మడానికి  రంగం సిధ్ధం అయిందనీఅలా సమకూరే నిధులతో కొత్త రాజధాని అమరావతి నిర్మాణం చేపడతారనేది ఈ కథనాల్లో ప్రధానాశం.

కొత్త రాజధాని నిర్మాణానికి దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని ఏడాదిన్నర క్రితమే చంద్రబాబు అంచనావేశారు. అ నిధుల్ని తాను  మిత్రపక్షంగా వుంటున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం అందింస్తుందని వారు ఇన్నాళ్ళు రాష్ట్ర ప్రజల్ని నమ్మిస్తూ వచ్చారు.
నిజానికి కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయంరైతుల రుణమాఫీ అనే రెండు అంశాలు చంద్రబాబు పక్షాన లేకుంటే మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజల తీర్పు భిన్నంగా వుండేది.  రైతుల రుణమాఫీని హామీలమాఫీగా మార్చడానికి ఏడాది కాలంగా ప్రభుత్వ పెద్దలు ఎన్ని విధాలుగా రేయింబవళ్ళు శ్రమిస్తున్నారో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు కొత్తరాజధానికి కేంద్ర నిధుల వ్యవహారం కూడా అటక ఎక్కినట్టే కనిపిస్తోంది. అనుమానం వున్నవాళ్ళు కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ సాక్షాత్తు పార్లమెంటులో ఇచ్చిన  డిజిటల్ డిస్ ప్లే ను చూడవచ్చు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమూ లేదు. మాకు ఆ ఉద్దేశమూ లేదు” అని వారు కుండ బద్దలుగొట్టారు. పదేళ్ల ప్రత్యేక హోదానే ఇవ్వనివాళ్ల నుండి రాష్ట్ర రాజధానికి ఐదు లక్షల కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ఆశించడం అమాయకత్వమే అవుతుంది.

ఇప్పుడు ఐదు లక్షల కోట్ల రుపాయలు సమకూర్చుకోవడానికి చంద్రబాబు దగ్గరున్న ఏకైక వనరు ఎర్రచందనం నిల్వలే. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్ల ద్వార 4,160 టన్నుల ఎర్రచందనం దుంగలను అమ్మకానికి పెట్టినపుడు సగటున టన్నుకు 18 లక్షల రూపాయల చొప్పున మొత్తం 750  కోట్ల రూపాయల నిధులు సమకూరాయి. ఈ లెఖ్ఖన 5లక్షల కోట్ల రూపాయల నిధుల్ని సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 30 లక్షల టన్నుల ఎర్రచందనం దుంగల్ని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మాల్సి వుంటుంది. ఆస్థాయిలో గిరాకీ వున్నదాఅనేది ఒక ప్రశ్న అయితేఅసలు అంతటి నిల్వలు మన దగ్గర వున్నాయా? అనేది ఇంకో ప్రశ్న. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసియన్) సంస్థ అంతరించిపోతున్న వృక్షసంతతిగా పేర్కొన్న ఎర్రచందననాన్ని ప్రభుత్వం ఆస్థాయిలో అమ్మకానికి పెట్టవచ్చునాఅనేది ఇంకో సందేహం.

ప్రపంచ పటం మీద ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు జిల్లాలకే పరిమితమైన ఎర్రచందనాన్ని భారీ వెలపెట్టి కొంటున్న అంతర్జాతీయ దిగుమతిదారులు దాన్ని దేనికోసం వాడుతున్నారుఅనేది అన్నింటికన్నా కీలక ప్రశ్న. చైనా జపాన్ దేశాల్లో ఫర్నిచర్సాంప్రదాయ వాయిద్యాల తయారీ కోసం వాడుతుంటారని చాలా కాలం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. లైంగిక పటుత్వాన్ని పెంచే మందుల్లో వాడుతున్నారనీ ఇటీవల వార్తలు వచ్చాయి. ఇవన్నీ రక్షణ రహాస్యాల్ని దాచడం కోసం చైనా. జపాన్ దేశాలు ప్రణాళికాబధ్ధంగా సాగించిన తప్పుడు ప్రచారమనే అభిప్రాయం కూడా బలంగావుంది.

2012 అక్టోబరులో అంతర్జాతీయ బయో డైవర్సిటీ సదస్సు హైదరాబాద్ లో  జరిగినప్పుడే ఈ అంశం ప్రముఖంగా చర్చకు వచ్చింది.  రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్ డాక్టర్ ఆర్ హంపయ్య ఫర్నిచర్ తయారీ కోసం ఎర్రచందనాన్ని వాడుతున్నారనే వాదనని కొట్టివేశారు. పెళుసుగా వుండే ఎర్రచందనం కలప ఫర్నిచర్ కు పనికిరాదనీదాన్ని అణువిద్యుత్ కేంద్రాల్లో వినియోగిస్తున్నారని చైనా గుట్టు విప్పారు.  బెంగళూరులో రహాస్యంగా ఒక కలప కోత  మిల్లు  నడుపుతున్న నలుగురు చైనీయుల్ని మొన్న జనవరిలో కర్ణాటక సెంట్రల్ రేంజి ఐజిపి అరుణ్ చౌదరి అరెస్టుచేశారు. చైనాకు దొంగ ఎర్రచందనం ఎగుమతి చేయడంలో వాళ్లది  కీలక పాత్ర అని గుర్తించారు. దీనితో ఎర్రచందనం స్మగ్లింగ్ ను పొత్సహించడంలో చైన పాత్ర స్పష్టమయిపోయింది.

ఇప్పుడు చంద్రబాబుగారు చైనా వెళ్ళి చేసింది ఏమంటేదొంగదారిన కొనుగోలు చేస్తున్న ఎర్రచందనాన్ని రాజమార్గాన పట్టుకుపొండి అని.   

ఎర్ర చందనాన్ని చైనా అణువిద్యుత్ కేంద్రాల్లోనే  వినియోగిస్తోందాలేక అణ్వాయుధాల తయారీలోనూ వినియోగిస్తోందా?అన్నది కూడా ఎవరికయినా రావలసిన సందేహమే. దీనికి సమాధానం రెండోది కూడా అయితే చైనా అణ్వాయుధ పాటవాన్ని పెంచుకోవడంలో మనం సహితం ఎర్రచందనం పేడు ఒకటి ధారబోస్తున్నా’ మన్నమాటా. ఇది తెలిసే జరుగుతూ వుంటే అదో ఇది. తెలియక జరుగుతున్నా అదో ఇదే.

ఎప్పుడయితే అణ్వాయుధాల మాట వస్తుందో చైనాతో మన సంబంధాలు కూడా చర్చకు వస్తాయి. చైనాలో చంద్రబాబు11 ఒప్పందాలు చేసుకున్నారనే  వార్త వచ్చిన  రోజునే చైనా ప్రభుత్వం పదేళ్లుగా భారత రహస్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందని ఒక ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. కీలకమైన భారత వైమానికరక్షణ రంగాలతోపాటు పలు ప్రభుత్వరంగ సంస్థలపై చైనా ప్రభుత్వం నిఘా ఉంచిందని ఆసంస్థ ఓ నివేదికలో పేర్కొంది. చైనా హ్యాకర్లు ప్రభుత్వరంగ సంస్థల కంప్యూటర్లలోకి చొరబడి కీలకమైన సమాచారాన్ని సేకరిస్తున్నారన్నది దీని సారాంశం  భారత్ తోపాటు దక్షిణ కొరియాఫిలిప్పైన్స్వియత్నాంమలేషియానేపాల్సింగపూర్ఇండోనేషియా లాంటి ఆసియా దేశాలను లక్ష్యంగా చేసుకుని చైనా గూఢచర్యం సాగిస్తోందని ఆ సెక్యూరిటీ సంస్థ చెపుతోందీ. మరో వైపు తమ దేశంపై గూఢచర్యం చేస్తున్న ఉపగ్రహాలను కనుగొన్నామని రష్యా చేసిన ప్రకటన చైనా గూఢచర్య కార్యకలాపాలను నిర్ధారిస్తున్నాయి.

చంద్రబాబు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యాక చైనాలో జరిగిన పరిణామాలు మరింత ఆసక్తికరంగా సాగాయి. చంద్రబాబు ఇండియా విమానం ఎక్కిన మరునాడే చైనా అధ్యక్షుడు జీ జింగ్ పింగ్ పాక్ స్థాన్ విమానం ఎక్కారు. నవాజ్ షరీఫ్ ని ఆలింగనం చేసుకుని మన స్నేహబంధం కొండలకన్నా ఎత్తైనది, సముద్రాల కన్నా లోతైనది, తేనెకన్నా తీయ్యనైనది అన్నారు. ప్రపంచపటం మీద చైనా ఒంటిరిగా వున్నప్పుడు బీజింగ్ కు స్నేహహస్తాన్ని చాచింది ఇస్లామాబాద్ ఒక్కటే అని గుర్తు చేసుకున్నారు.  ఈ ఏడాది తన విదేశీ పర్యటనని పాకిస్తాన్ తోనే మొదలుపెట్టానని గొప్పగా చెప్పుకున్నారు. అటు నవాజ్ షరీఫ్ కూడా జిన్ పింగ్ కు దేశంలోనే అత్యున్నత పౌరపురస్కారమైన 'నిషాన్-ఈ -పాకిస్థాన్'తో సత్కరించారు. ఇది మన భారతరత్నతో సమానం.

ఒకవైపు, సాంస్కృతిక సారూప్యత రీత్యా ఎపి కొత్త రాజధాని అమరావతిని చైనీయులు రెండో స్వగృహంగా భావించాలని చంద్రబాబునాయడు కోరివస్తే, మరోవైపు చైనా తన దేశం నుండి మధ్యధరాసముద్రానికి చేరే  చారిత్రక శిల్క్ రూట్ పునరుధ్ధరణకు పాకిస్తాన్ తో ఒప్పందం చేసుకుంది.  రూ. 3 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ3వేల కిలోమీటల కారిడార్‌ ప్రాజెక్టు వల్ల పాకిస్తాన్‌-చైనా మధ్య రోడ్డు లింకులు రైల్లు మార్లాలుపైపు లైనులు నిర్మించనున్నారు.

చంద్రబాబు అమరావతి –బీజింగ్ మధ్య రక్తచందన మార్గం నిర్మించాలని ఆశిస్తుంటే, జింగ్ పింగ్ బీజీంగ్ – ఇస్లామా బాద్ మీదుగా మధ్యధరా సముద్రానికి చేరడానికి పట్టు రహదారిని నిర్మించేపనిలోపడ్డారు! వర్తమాన చరిత్రలో ఇంతకన్నా వైచిత్రి ఏముంటుందీ?


(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
మొబైల్ నెం. 7674999063


ప్రచురణ : సాక్షి దినపత్రిక
30 - 4- 2015


Wednesday 15 April 2015

యుధ్ధము ముగియలేదు ప్రభూ!;ఇప్పుడే ఆరంభము అయినది !!

యుధ్ధము ముగియలేదు ప్రభూ!;ఇప్పుడే ఆరంభము అయినది !!

ఉషా యస్ డానీ

వానపాముని చూపించి అనకొండ అనిపించడానికీ, ఎలుకను చూపించి డైనోజార్ అనిపించడానికీ, కూలీల్ని చూపించి అంతర్జాతీయ స్మగ్లర్లు  అనిపించడానికీ, ఒక వాస్తవాన్నీ అబద్దం చేయడానికీ, ఒక అబధ్ధాన్ని నిజం అనిపించడానికీ సమస్త అధికారగణాలన్నీ ఇప్పుడు ఏకం అవుతున్నాయి.

అందరికీ తెలుసు వాళ్ళు చెట్లు నరికే కూలీలని. అందరికీ  తెలుసు స్మగ్లర్లు ఎండాకాలం అడవిలో గోచి చుట్టుకునిగొడ్డళ్ళుపట్టి, చెమట కక్కుకుంటూ  చెట్లు నరికే శ్రమజీవులు కారనీవాళ్ళు కాళ్లకు చెప్పులు, ఒంటి మీద చొక్కాలు లేని కడుపేదరికంలో వుండరనీఅందరికీ  తెలుసు ఎర్రచందనం  స్మగ్లర్లు  చెన్నైలోనో, బెంగళూరులోనో నక్షత్రాల హోటళ్లలో విలాసాలు చేస్తుంటారని. వాళ్ళు దొరికితే మారిషస్ లోనో, రాజమండ్రి సెంట్రల్ జైల్లోనో  రాజభోగాలు అనుభవిస్తూ వుంటారని.

ఎర్రచందనం వృక్షాలు ప్రపంచంలో  నల్లమల అడవులు విస్తరించిన నాలుగు జిల్లాలకే ప్రత్యేకం అయినా వాటి ఉపయోగాలు గురించి పదేళ్ల క్రితం వరకు మన రాష్ట్రంలో ఎవరికీ తెలీదు. ఎర్రచందనానికి సంబంధించి ఇటీవల బయటపడిన రెండు ప్రధాన ఉపయోగాల్లో మొదటిది దీని పొడిని అణువిద్యుత్ కేంద్రాల్లో వినియోగిస్తున్నారనేది. రెండో ప్రయోజనం అంతకన్నా ఆసక్తికరమైనది. ఎర్రచందనం పొడికి లైంగిక పటుత్వాన్ని పెంచే గుణం (Aphrodisiac) వుందనేది. దీనికి శాస్త్రీయ ప్రతిపత్తి వుందో లేదోగానీ, జపాన్ లో మాత్రం నమ్మకం బలంగావుంది. లైంగిక ఆసక్తి అతితక్కువగల దేశంగా జపాన్ ను పేర్కొంటూ గార్డీయన్, వాషింగ్ టన్ పోస్ట్ పత్రికలు రెండేళ్లక్రితం  రెండు సంచలన కథనాలు ప్రచురించాయి. ఎర్రచందనం కోసం జపాన్ చూపుతున్న ఆసక్తిని  గమనిస్తే కథనాలు నిజమే అనిపిస్తాయి. స్మగ్లర్ల ద్వార దొంగమార్గంలోకొన్నా, ప్రభుత్వం ద్వార రాజమార్గంలో కొన్నా ఎర్రచందనం ప్రధాన దిగుమతిదారుడు మాత్రం  జపానే.

ఇప్పుడు ఎర్రచందనం నిల్వలకు మరో ప్రాధాన్యం వచ్చింది. రాష్ట్రంలో  హైదరాబాద్ ను మించిన రాజధాని నగరాన్ని కట్టాలని చంద్రబాబు కన్న కలల మీద  నరేంద్ర మోదీ చల్లటి మంచునీళ్ళు చల్లారు. చంద్రబాబు ఇప్పుడు రాజధాని ఆశలన్నీ ఎర్రచందనం మీదే పెట్టుకున్నారు! జపాన్, చైనాలకు ఎర్రచందనాన్నీ అమ్మి రాజధాని నిర్మాణానికి  నిధుల్ని సమీకరించుకునే పనిలో వారున్నారు. ఏపీ రాజధాని నిర్మాణంలో తమకూ అవకాశం ఇవ్వాలని జపాన్ కూడా సింగపూర్ తో పోటీ పడుతోంది. అలా నల్లమల టూ జపాన్, జపాన్ టూ అమరావతి అంటూ ఒక రక్తచందనపు దారి ఏర్పడిందిగిరాకీ పెరగడంతోఏపీ రాజధాని నిర్మాణం ఎర్రచందనం కూలీల చావుకు వచ్చింది. అమరావతిలో భూమిపూజ జరగడానికి ముందే శేషాచలంలోనరబలి జరిగిపోయింది!.

ఉత్తర తమిళనాడులోని  వేలూరు, ధర్మపురం, విల్లుపురం, సేలం, తిరువణ్ణామలై జిల్లాలు వెనుకబడిన ప్రాంతాలు. ఎర్రచందనం స్మగ్లర్లు సాధారణంగా జిల్లాల కూలీలనే నల్లమల అడవుల్లో చెట్లు  నరకడానికి  తీసుకుని వస్తుంటారుసేలం జిల్లాలో కొండప్రాంతమైన యేర్కాడ్ వుడ్ కట్టర్లు కాఫీతోటల్లో  సిల్వర్ ఓక్ చెట్లను నరకే వృత్తిని శతాబ్దాలుగా కొనసాగిస్తున్నారువేగంగా చెట్లు నరకడంవాటి బెరడు తొలగించడంబరువైన దుంగల్ని భజాలకు ఎత్తుకుని కొండలు, గుట్టలు ఎక్కడం వగయిరా పనుల్లో  వీరు నిపుణులు. పనుల్లో మాలవైమక్కళ్ అనే గిరిజన తెగ వాళ్లది అగ్రస్థానం. యేర్కాడ్ లో వాళ్లకు  ఘనపు అడుక్కి 30 రూపాయల కూలీ వస్తుంది. ఎర్రచందనం చెట్లు నరకడానికి కూలీ పది రెట్లు ఇస్తామని స్మగ్లర్ల బ్రోకర్లు వాళ్లకు ఆశ చూపుతారు. పది రోజులు కష్టపడితే 30 వేల రూపాయలు చేతికి వస్తాయనీ, దానితో కొన్ని అప్పుల బాధలు తీరుతాయని వీళ్లలో కొందరు ఆశపడతారు.
"వాళ్ళు ఎర్రచందనం దొంగలు కాకుంటే  గడ్డి కోసుకోవటానికి ఏమైనా తమిళనాడు నుంచి శేషాచలం అడవులకు వచ్చారా?"  అని అటవిశాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎగతాళి చేశారువాళ్ళు కూలీ డబ్బులకోసం ఎర్రచందనం చెట్లు నరకడానికే వస్తారు. అనుమతి లేకుండా అడవిలో  చెట్టును నరికినా నేరమే. ఎర్రచందనం చెట్టును నరికినా నేరమే. విషయం కూలీలకు కూడా తెలుసుఅయినా, బ్రోకర్లు చూపించే ఆశను కాదనలేని పేదరికం వాళ్లది. నేరంలో  వాళ్ళు నిస్సందేహంగా పాత్ర ధారులు. అయితే నేరానికి వాళ్ళు సూత్రధారులు మాత్రం  కాదు. ప్రధాన లబ్దిదారులు అంతకన్నా కాదుసూత్రధారులు, ప్రధాన లబ్దిదారులు నిజానికీ అధికారవర్గం నీడలోనే వుంటారు. లేదా అధికారవర్గమే ప్రధాన లబ్దిదారులు, సూత్రధారుల నీడల్లో వుంటుంది

గత ఎన్నికల్లో గెలవడానికి  ఏపి శాసనసభ అభ్యర్ధులు 15 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చెసినట్టు సాక్షాత్తు ప్రధాన ఎన్నికల అధికారి బ్రహ్మ  చెప్పి పది రోజులు కూడా కాలేదు. యంఎల్ అభ్యర్ధులే మేరకు ఖర్చుపెట్టి వుంటే యంపీ అభ్యర్ధులు మేరకు ఖర్చుపెట్టి వుంటారో ఊహించుకోమని సిఇసి సెలవిచ్చారు. అభ్యర్ధులకు డబ్బులన్నీ ఇసక క్వారీల్లోంచో, కాంట్రాక్టుల్లోంచో, గనుల్లోంచో, ఎర్రచందనం దుంగల్లోంచో వచ్చి వుండాలిగా.

నిజానికి శేషాచలం అడవుల్లో పోలీసు కాల్పుల్లో చనిపోయిన 20 మంది అలా నేరం చేయడానికి వచ్చినవాళ్ళు కూడా కాదు. బస్సులో ప్రయాణిస్తున్నవాళ్ళను పోలీసులు  దారిలో  ఆపి ఎత్తుకుపోతుండగా చూసినవాళ్ళున్నారు. అంటే నేరం చేసినందుకుకాక నేరం చేయబోతున్నారనే అనుమానంతోనే వాళ్లను పోలీసులు చంపేశారు అనుకోవాలి.

పేదలను బుజ్జగిస్తూ  ధనికుల ఉమ్మడి ప్రయోజనాలను కాపాడడమే ప్రభుత్వాల పని. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సామాన్య ప్రజలకు చేసే వాగ్దానాలన్నీ ఎలాగైనా గెలవాలనే ఆతృతలో చేసేవేతప్ప ఆచరించడానికి చేసేవికావు.   మరోవైపు  ఆశించిన మేరకు పనిచేయని ప్రభుత్వాల మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. దాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వాధినేతలు సహజంగానే పోలీసులతో ఒక రక్షణా కవచాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కొందరైతే  అధికారాన్ని చేపట్టగానే ముందుచూపుతో పోలీసులకు భారీ ప్రోత్సాహకాలు అందిస్తారుకాలం గడిచేకొద్దీ, ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగేకొద్దీ, ప్రభుత్వాధినేతలు  పోలీసుల మీద ఆధారపడడం కూడా అంతకు రెట్టింపు  స్థాయిలో పెరుగుతూ వుంటుంది.  

గత ఎన్నికల్లో జయాపజయాలను నిర్ణయించిన అంశం రైతు రుణమాఫి. తొలిసంతకం  పెడతానంటూ అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు ఏడాది గడుస్తున్నా పని మాత్రం పూర్తిచేయలేదు. రుణమాఫీ పొందని రైతులు వందల సంఖ్యలో  హైదరాబాద్ చేరుకుని సచివాలయంలో ప్రణాళీకా సంఘం ఉపాధ్యక్షుని ఛాంబరును ముట్టడించినంత పని చేశారుఇది జరిగిన రెండు రోజుల్లోనే శేషాచలం ఎన్ కౌంటర్ జరగడం ఒక యాధృఛ్ఛికం కావచ్చు; కాకపోనూవచ్చు.

గీత దాటిన పేదవాళ్ళను అక్కడికక్కడే అధికారికంగా చంపవచ్చు అనే మధ్యయుగాల  శిక్షాస్మృతిని రాష్ట్ర ప్రభుత్వం అనధికారికంగా ప్రవేశపెట్టింది.   శేషాచలం ఎన్ కౌంటర్ " అంతం కాదు ఆరంభమే" అని  అటవీ మంత్రి అంటున్నారు. నిజానికి చంద్రబాబు తొలివిడత పాలన అనగానే రైతులకు కాల్దారి కాల్పులు, వామపక్షాలకు బషీర్ బాగ్ కాల్పులు, విప్లవకారులకు కొయ్యూరు ఎన్ కౌంటర్ గుర్తుకు వస్తాయివారి మలివిడత పాలనలో  పోలీసు కాల్పులు శేషాచలం తో మొదలయ్యాయి. కాల్దారీలో ఇద్దరు రైతులు చనిపోతే, శేషాచలంలో  చెట్లు నరికే కూలీలు ఇరవైమంది చనిపోయారుమలివిడత  ఆరంభమే స్థాయిలో వుంటే ముగింపు స్థాయిలో వుంటుందో వూహించడానికే భయంగా వుంది. పోలీసు కాల్పులు, ఎదురుకాల్పులు ప్రభుత్వ కార్యక్రమంగా మారినపుడు  ప్రజలు కూడా వాళ్ళ కార్యక్రమాన్ని రూపొందించుకుంటారు. యుధ్ధము ముగియలేదు; ఇప్పుడే ఆరంభము అయినది !!

(రచయిత సీనియర్ పాత్రికేయుడు, సమాజ విశ్లేషకుడు)

మొబైల్ నెం. 9010757776
10 April 2015

ప్రచురణ : సాక్షి దినపత్రిక
16-4-2015
http://epaper.sakshi.com/apnews/Andhrapradesh-Main/16042015/Details.aspx?id=2727698&boxid=25589940