Saturday 29 July 2023

మంటల్లో మినీ ఇండియా!

 Danny Speech

Talking Points
Round Table Conference
27 July 2023 Thursday
From 3 p.m.
Media Plus, Auditorium
Abids, Hyderabad
10 -12 Mnts
మంటల్లో మినీ ఇండియా!
అస్సలాము అలైకుమ్!
జైభీమ్ !
జై మీమ్ !
లాల్ సలామ్!
మిత్రులారా !
INTRO
1. వర్తమాన భారత దేశంలో అత్యంత సంక్లిష్టమైన సమస్య మణిపూర్ మంటలు.
2. కుకీలను చూసి ఇది ఆదివాసి, గిరిజన సమస్యగా కొందరు చూస్తున్నారు.
3. కుకీలు కొండల్లో, మైతీలు లోయల్లో నివసిస్తున్నారు కనుక దీనిని మరి కొందరు కొడవాసులు, లోయ వాసుల సమస్యగా చూస్తున్నారు.
4. కుకీల్లో అత్యధికులు క్రైస్తవులు కనుక దీని కొందరు మత సమస్యగా చూస్తున్నారు.
5. మైతీలు మెజారిటీ, కుకీలు మైనారిటీ కనుక దీన్ని మైనార్టిలమెజారిటీల పోరుగా కొందరు చూస్తున్నారు.
6. అక్కడ ఖనిజ నిక్షేపాలు అపారంగా వుండడం మూలంగా ఇది కార్పొరేట్ల సంపద పెంపు వ్యవహారంగా మరి కొందరు చూస్తున్నారు.
7. విభిన్నమైన సాంస్కృతిక జీవనం గల కుకీలను వేధించడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని ముందుకు తెచ్చిందంటున్నవారూ వున్నారు.
8. ప్రజల్లో అపఖ్యాతిపాలయిన ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మైతీలను కుకీల మీదికి ఉసి గొల్పుతున్నాడనే వాదనా వుంది.
9. విభిన్నమైన సాంస్కృతిక జీవనం గల కుకీలను వేధించడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని ముందుకు తెచ్చిందంటున్నవారూ వున్నారు.
10. మణిపూర్ సమీపంలోనే మైన్మార్, లావోస్, థాయిలాండ్ కలిసే గోల్డెన్ ట్రయాంగిల్ (Golden Triangle) వుంటుంది కనుక డ్రగ్ మాఫియా కోణం వుందని ఇంకొందరంటున్నారు.
11. ప్రస్తుతం మణిపూర్ లో శాంతిభద్రతల నిర్వహణ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంది. శాంతిభద్రతల నిర్వహణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హొంమంత్రి అమిత్ షాలు అంత సమర్ధులుకారని తేలిందని ఇంకొందరు అంటున్నారు.
12. ఈ పది అంశాల్లో ఏ ఒక్కటీ అబధ్ధంకాదు. ఇంతకు మించిన అనేక కోణాలు ఇప్పుడు మణిపూర్ మంటల్లో వున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మణిపూర్ లో వున్నాయి.
13. మణిపూర్ ఇప్పుడు మినీ ఇండియా.
PART – I PROTO
14. దేశంలో ఫాసిస్టు పాలన మొదలయిందని నాలుగేళ్ల క్రితం ఎవరయినా అంటే చాలామంది అంగీకరించేవారుకాదు.
15. ఇవ్వాళ దేశంలో ఫాసిస్టు పాలన సాగుతోందని మణిపూర్ ఆదివాసి మహిళలు కూడ అంటున్నారు.
16. కుకీ గిరిజన మహిళ డాక్టర్ ముడూసా వీడియోను ఇప్పుడు అందరూ చూసి వుంటారు. నాగరీకులం అని గొప్పలు చెప్పుకునే మైదానవాసులకన్నా గొప్ప చైతన్యం ఈరోజు ఆదివాసుల్లో కనిపిస్తున్నది.
17. 1984 చివర్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధి హత్య తరువాత ఢిల్లీ పరిసరాల్లో శిక్కుల మీద ఊచకోత సాగింది. ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు రికార్డు స్థాయిలో మెజారిటీ దక్కింది.
18. ఒక మైనారిటీ సమూహాన్ని వేధిస్తుంటే మెజారిటీ ఓటు బ్యాంకు ధృవీకరణ జరుగుతుందనే ఒక కొత్త పోల్ మేనేజ్మెంట్ సూత్రం ముందుకు వచ్చింది.
19. శిక్కులు పంజాబ్, ఢిల్లీ ప్రాంతాలకే పరిమితమయిన మైనారిటీలు. దేశం మొత్తంగా విస్తరించివున్న మత మైనారిటీలయిన ముస్లింలకు ఆ రోజు నుండే ముప్పు మొదలయింది.
20. అలాగే కీలవేణ్మణి, కారంచేడు సంఘటనలు దళితులకు పొంచివున్న ముప్పును చాటి చెప్పాయి.
21. 1980ల నాటి అస్సాం అశాంతి మన దేశంలో మైదాన ప్రాంతానికీ, అడవీ ప్రాంతానికి మధ్య ఒక వైరం వుందని చెప్పింది.
22. భూగోళం మీద అత్యంత అణిచివేతకు గురవుతున్న సమూహాలు రెండు, మొదటిది; ముస్లిం సమూహం; రెండోది ఆదివాసి సమూహం.
23. ఆదివాసుల నివాస ప్రాంతాల్లో అత్యంత విలువైన ఖనిజ నిక్షేపాలున్నాయి. ముస్లిం దేశాల భూముల్లో చమురు నిల్వలున్నాయి.
24. ఈ రెండు నిక్షేపాలు జాతీయ, అంతర్జాతీయ మెగా కార్పోరేట్లకు కావాలి. మనదేశ ప్రభుత్వంతో సహా అనేక దేశాల ప్రభుత్వాలు ఇప్పుడు కార్పోరేట్ల కోసం ఊడిగం చేస్తున్నాయి. జాతి సంపదను వాళ్లకు కట్ట బెడుతున్నాయి.
25. గతంలోనూ మనకు నియంతలున్నారు. వారికీ ఇప్పటి వారికీ చాలా తేడావుంది. గత నియంతలు ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడం కోసమైనా సంక్షేమ పథకాల ద్వార ప్రజలకు మేలు తలపట్టి ఆ తరువాత తమ మద్దతుదారులైన కార్పొరేట్లకు మేళ్ళు చేసిపెట్టేవారు.
26. ఇప్పటి నియంతలు వేరు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టి కార్పొరేట్ల సేవలో తరిస్తున్నారు. అవ్సరమైతే కార్పొరేట్ల పక్షాన నిలబడి జాతుల ప్రక్షాళన చేయడానికి కూడ వెనుకాడడం లేదు.
27. కొందరు నమ్ముతున్నట్టు ఇది క్రోనీ కేపిటలిజం కాదు; క్రోనీ లెజిస్లేచరి. ప్రాయోజిత శాసన వ్యవస్థ; ప్రాయోజిత కార్వనిర్వాహక వ్యవస్థ, ప్రాయోజిత న్యాయ వ్యవస్థ. ప్రాయోజిత మీడియా వ్యవస్థ.
28. నరేంద్రమోదీ - అమిత్ షాల పాలన ముస్లింలను వేధిస్తున్నదన్నది చాలా స్పష్టం.
29. ముస్లిం, క్రైస్తవ తదితర మైనారిటీ సమూహాలను వేధిస్తుంటే హిందూ సమూహాలు మొత్తంగా కాకపోయినా అందులో సగమైనా సంబరపడి తమకు ఓట్లు వేస్తాయని సంఘపరివారం గట్టిగా నమ్ముతున్నది. ప్రతి ఎన్నికల్లోనూ అలాంటి ఎత్తుగడల్నే అది అనుసరిస్తున్నది.
Part – 2 CONTEXT
30. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని ముందుకు తెచ్చింది ముస్లింలను వేధిస్తున్నట్టు సంకేతాలివ్వడానికే అని దాదాపు అందరికీ తెలుసు. అదిప్పుడు ఆదివాసులకు అంటుకుంది.
31. ఉమ్మడి పౌరస్మృతి ఒక ఆదర్శమేగానీ ఆచరణ సాధ్యంకాదు. అత్యంత వైవిధ్యపూరిత సాంస్కృతిక సాంప్రదాయాలున్న భారత దేశంలో అస్సలు ఆచరణ సాధ్యంకాదు.
32. భాగవతంలో భూమిని చాపలా చుట్టి సముద్రంలోనికి తీసుకుపోయిన హిరణ్యాక్షుని కథ వుంటుంది. మన మెగా కార్పొరేట్లు ఆదానీ, అంబానీలు అలాంటివాళ్ళు. ఇప్పటికే వాళ్ళు సముద్రాన్ని మింగేశారు.
33. ముంద్రా పోర్టు, కృష్ణపట్నం పోర్టు, కరైకాల్ పోర్టు, హాజిరా పోర్టు, ధామ్రాపోర్టు, దహెజ్ పోర్టు, గంగవరం పోర్టు, వైజాగ్ టెర్మినల్, మార్మగోవా టెర్మినల్, విఝింజమ్ పోర్టు, కట్టుపల్లిపోర్టు, కమరజర పోస్టు, టునా టెర్మినల్, అగర్దన షిప్ యార్డ్ అండ్ టెర్మినల్, దిఘి పోర్ట్ ఆదానీ గ్రూపు ఆధీనంలోనే వున్నాయి.
34. ముంబాయి, అహ్మదాబాద్, లక్నో, మంగలూరు, జైపూరు, గువాహటి, త్రివేండ్రపురం, ఎయిర్ పోర్టులు ఆదానీ గ్రూపువే.
35. జమ్మూ- కశ్మీర్ కు రాష్ట్ర హోదా, ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక హోదాలను రద్దు చేసినపుడు దాన్ని చాలామంది ముస్లింల వేధింపుగా మాత్రమే చూశారు.
36. ఆ రాష్ట్రంలో ముస్లిమేతరులు వుండరా? కొండలు, లోయలుగల రాష్ట్రంలో గిరిజన, ఆదివాసి తెగలు వుండవా? వాళ్లంతా బాధితులు కదా? అనే ఆలోచన చాలా మందికి రాలేదు.
37. అసమాన సమాజంలో సంక్షేమ పథకాలను రూపొందించే సమయంలో ‘సానుకూల వివక్షను’ (positive discrimination) పాటించాల్సి వుంటుంది.
38. ఎక్కువగా వెనుకబడినవారికి సమానవాటా ఇచ్చినా సరిపోదు; ఎక్కువవాటా ఇవ్వాల్సి వుంటుంది. ఇక్కడ అలాజరగడం లేదు. ఇప్పటికే ఎక్కువ వాటా పొందినవారికి మరింత ఎక్కువ వాటా ఇస్తున్నారు. EWS రిజర్వేషన్ అలాంటిదే.
39. ఫాసిజం ఇటలీలో, నాజిజం జర్మనీలో మైనార్టి మత సమూహాలను వేధించాయని మనకు తెలుసు. కానీ అక్కడ కూడ మెజారిటీలయిన క్రైస్తవుల్లోని కార్పొరేట్లు మాత్రమే బాగుపడ్డారుగానీ సామాన్య క్రైస్తవులు సహితం చాలా అగచాట్ల పాలయ్యారు. మనకు ఇప్పుడు ఇక్కడ అదే పునరావృతం అవుతున్నది.
40. మోదీజీ ప్రధాని పదవిని చేపట్టాక గత ఏడాది చివరి వరకు 4 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పబ్లిక్ రంగ సంస్థల్ని అమ్మేశారు. గడిచిన 8 నెలల్లో అమ్మినవి దీనికి అదనం.
41. దేశంలో ముస్లిం జనాభ 20 కోట్లు. జనాభాలో ముస్లింలు 15 శాతం. ప్రభుత్వరంగ సంస్థల్లో వాళ్ళు 3,4 శాతం కూడ వుండరు.
42. ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేటు సంస్థలకు అమ్మేస్తే ఆ మూడు శాతం ముస్లింలు నష్టపోయేమాట నిజమేగానీ, మిగిలిన 97 శాతం మంది హిందువులు కూడ నష్టపోతారన్నది అంతకన్నా వాస్తవం.
43. సముద్రం ఆకాశం రెండింటినీ మింగేశాక వాళ్ళకు ఇప్పుడు లోయలు కొండలు కావాలి. ఇప్పుడు మన కార్పొరేట్లు అడవి మీద విరుచుకు పడ్డారు. ఈ విడత ఇది మణిపూర్ తో మొదలయింది.
44. మైదానంలో వాడుతున్న మెజారిటీ మైనారిటీ ఫార్మూలానే అడవిలోనూ వాడుతున్నారు. మణిపూర్ లో మెజారిటీ మెయితీ తెగను మైనారిటీ కుకీ తెగల మీదికి ఎగదోస్తున్నారు.
45. మణిపూర్ లో జాతి ప్రక్షాళన (Ethnic Cleansing) జరుగుతున్నదనీ, ముఖ్యమంత్రి బైరేన్ సింగ్ కుకీల వ్యతిరేకి అనీ, పోలీసులు ప్రభుత్వాధికారులు బాహాటంగా మెయితీ అల్లరి మూకలకు సహకరిస్తున్నారని సాక్షాత్తు బిజెపి శాసన సభ్యుడు పావోలియన్ లాల్ హావ్ కిప్ (Paolienlal Haokip) మీడియా ముందు ఆరోపిస్తున్నారు.
46. అల్లరి మూకలు మణిపూర్ లో పోలీసు స్టేషన్ల నుండి ఆరు వేల ఆయుధాలు ఎత్తుకుని పోయారట. అల్లరి మూకలంటే అక్కడ మెయితీలు అనే అర్ధం. పావోలియన్ లాల్ హావ్ కిప్ ఆరోపణల్ని బట్టి పోలీసులే ఆయుధాలు అందజేశారని అనుకోవాలి.
47. కార్పొరేట్ల అటవీ ప్రాంత ఆక్రమణ మణిపూర్ తో ఆగదని దేశంలోని ఆదివాసులందరికీ తెలిసిపోయింది. నాగాలండ్ మొత్తం కుకీలకు సంఘీభావాన్ని తెలుపుతోంది.
48. అడవి భూముల మీద ఆదివాసులకు వుండే ప్రత్యేక హక్కుల్ని రద్దు చేయడానికే ఉమ్మడి పౌరస్మృతిని తెస్తున్నారని కూడ ఆదివాసులు పసికట్టారు.
49. ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకంగా ఝార్ఖండ్ లో ఒక ఉద్యమం ఆరంభమయ్యి క్రమంగా అటు ఈశాన్య రాష్ట్రాలకు, ఇటు ఛతీస్ ఘడ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు విస్తరిస్తోంది.
50. సామాజిక వివక్ష కొనసాగుతున్న కారణంగా విద్యా, ఉద్యోగరంగాల్లో తమకు రాజ్యాంగపరంగా లభించిన రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఉమ్మడి పౌరస్మృతిని ప్రయోగిస్తారని ఎస్సి, బిసిలకు సహితం అనుమానం కలుగుతోంది.
51. గోల్డెన్ ట్రయాంగిల్ (Golden Triangle) డ్రగ్స్ తయారీ - స్మగ్లింగ్ కు ప్రపంచ కేంద్రం. టన్నులకొద్దీ హెరాయిన్ డ్రగ్స్ పట్టివేత కేసులో గుజరాత్ లోని ముంద్రా పోర్టు పేరు 2021లో చాలా కాలం వార్తల్లో నిలిచింది.
52. మణిపూర్ లో మే 3 న అల్లర్లు మొదలయ్యాయి. ఆ మరునాడు కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 355 ద్వార మణిపూర్ లో శాంతిభద్రతల విభాగాన్ని తన ఆధీనంలోనికి తీసుకుంది. ఇంటర్నేట్ సదుపాయాలను పూర్తిగా రద్దు చేసింది.
53. సుప్రీం కోర్టు ప్రత్యక్ష్య జోక్యం తరువాత మాత్రమే మణిపూర్ లో జులై 20 నుండి ఇంటర్నేట్ సదుపాలను పాక్షికంగా పునరుధ్ధరించారు.
54. అప్పుడు మాత్రమే మే నెల 4న ఆ రాష్ట్రంలో జరిగిన ఒక ఘోర సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోనికి వచ్చింది.
55. ముగ్గురు కుకీ మహిళల్ని ఇళ్ళ నుండి లాక్కొని వచ్చి వివస్త్రల్ని చేసి వందలాది మంది చూస్తుండగా వీధుల వెంట ఈడ్చుకుంటూ వెళ్ళి బహిరంగంగా అత్యాచారం చేసిన సంఘటన ఆ వీడియోలో వుంది.
56. బయటికి వచ్చింది ఒక్క వీడియోనే. ఇలాంటి కొన్ని వందల అత్యాచారాలు అక్కడ జరిగినట్టు సోషల్ మీడియా ద్వార తెలుస్తోంది.
57. దీనిబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో గడిచిన 80-82 రోజులుగా మణిపూర్ లో కుకీ జాతి హననం జరుగుతోందని మనం భావించవచ్చు.
Part – III – Epilogue
58. ఇప్పుడు మణిపూర్ మంటల సెగ పార్లమెంటుకు తాకింది.
59. గత రెండున్నర నెలలుగా మణిపూర్ లో శాంతిభద్రతల పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే వుంది. అక్కడ జరుగుతున్న హననానికి నేరుగా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత.
60. ఇన్నాళ్ళూ మణిపూర్ మీద నోరు మెదపని ప్రధాని మోదీజీ ఆ వీడియో బయటికి వచ్చాక నోరు తెరిచారు. మణిపూర్ మీద 36 సెకన్లు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. పనిలో పనిగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్ గడ్, రాజస్థాన్ లలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించి మణిపూర్ సమస్యను రాజకీయ మలుపు తిప్పారు.
61. ప్రత్యర్ధుల మీద దాడి చేయడానికి సంఘపరివారానికి ఒక పురాతన ఫార్మూలా వుంది.
62. ముస్లింల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి వాళ్ళ మీద విదేశీయులు, చొరబాటుదార్లు, టెర్రరిస్టులు, పొరుగుదేశాల భక్తులు, వాళ్ళ ఆదేశాల ప్రకారం ఇక్కడ అల్లర్లు సృష్టిస్తున్నారు, జాతి వ్యతిరేకులు, భారత వ్యతిరేకులు వంటి నిందల్ని వేసేవారు.
63. ఇప్పుడు సరిగ్గా అవే నిందల్ని కుకీల మీద వేస్తున్నారు.
64. అయితే ఇప్పుడు ఒక తేడా వచ్చింది. దేశప్రజలు నరేంద్ర మోదిజీ, అమిత్ షాల మాటల్ని గతంలోలా నమ్ముతున్నట్టు కనిపించడం లేదు.
65. నరేంద్రమోదీ, అమిత్ షా ఇద్దరూ యాంటి నేషనల్స్! యాంటి ఇండియన్స్! అనే మాటలు కూడ ఇప్పుడు మణిపూర్ కుకీలు వాడుతున్నారు.
66. ప్రజలు ఇదివరకట్లా తమ మాటల్ని నమ్మడం లేదని నరేంద్ర మోదిజీ, అమిత్ షాలకు కూడ అర్ధం అయింది.
Sign OFF
67. మణిపూర్ శాంతి భద్రతల వ్యవహారం తమ చేతుల్లోనే వుండడంవల్ల అక్కడి పరిణామాలకు ప్రధాని, హోంత్రులే ప్రత్యక్ష బాధ్యులు.
68. ఇన్నాళ్ళుగా మణీపూర్ లో ఏం జరుగుతున్నదో వాళ్లకు తెలియకపోతే ఆ పదవులకు వారు అనర్హులు. తెలిసి కూడ కొనసాగనిచ్చారంటే ఇప్పుడు వినపడుతున్న కుట్ర సిధ్ధాంతం నిజమే అని నమ్మాల్సి వుంటుంది.
69. ఏది ఏమైనా, పార్లమెంటులో మణిపూర్ మీద మాట్లాడడానికి వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళ కలవరం స్పష్టంగానే కనిపిస్తున్నది.
70. చివరికి ఇప్పుడు వాళ్ళు భారత్, ఇండియా అనే పదాలను వినడానికి కూడ భయపడుతున్నారు.
71. ముస్సోలినీ, హిట్లర్ కూడ చివరి రోజుల్లో భయంతోనే బంకర్లలో బతికారు. ఇప్పుడు ఢిల్లీ సన్నివేశాలు అటు దిశగా సాగుతున్నట్టు కనిపిస్తున్నాయి.
72. మన పార్లమెంటరీ ప్రాతినిథ్య ప్రజాస్వామిక వ్యవస్థలో కొత్త అధ్యాయం అరంభం అవుతున్నదనడనికి ఇవి తొలి సంకేతాలు కావచ్చు!
73. ఇప్పుడు మనం బిజెపి ముక్త్ దక్షణ భారత్ లో వున్నాం.
74. 2024 లోక్ సభ ఎన్నికల తరువాత బిజెపి ముక్త్ సంపూర్ణ భారత్ ఏర్పడాలి అని ఆశిద్దాం.
75. ఇదే సరయిన అదను. లోక్ సభకు అన్ని పార్టీలను మరచిపొండి -Indian National Development Inclusive Alliance- INDIA కూటమిలోని సభ్య పార్టీలను గెలిపించండి.
డానీ
సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు.


No comments:

Post a Comment