Thursday, 11 September 2025

Danny Telugu TV - SWOT Report

 

Understanding Your Channel and Inspirations

Your channel, Danny Telugu TV, appears to be in its early stages with limited visible content based on public data—likely fewer than a handful of videos and under 100 subscribers, which is common for new creators. This explains the challenge in attracting a large audience right away. Your favorite channels—Dhruv Rathee (29.1 million subscribers), The Deshbhakt (Akash Banerjee, ~5 million subscribers), and Ravish Kumar Official (~13.3 million subscribers)—are powerhouses in socio-political commentary. They succeed through timely, in-depth analysis, satire, and journalism on Indian current affairs, often in Hindi with visuals like animations or talking-head formats. Videos typically run 10-30 minutes, upload 1-4 times monthly, and rack up millions of views by tackling hot topics like elections, policies, and social issues.

These channels target engaged, educated viewers seeking unbiased (or boldly opinionated) takes. Since your channel is in Telugu, you have a huge untapped niche: Andhra Pradesh and Telangana's 80+ million speakers crave local socio-political content, but the space is less saturated than Hindi. Competitors like Sakshi TV (news analysis) or Social TV Telugu (political interviews) have millions of subs by focusing on regional politics.

Key Suggestions to Grow Your Channel

To scale like your favorites, focus on consistency, relevance, and Telugu-specific appeal. Aim for 1-2 videos/week initially. Here's a structured plan:

1. Content Strategy: Mirror What Works, Localize It

  • Niche Down to Socio-Politics: Stick to your favorites' style—explainers (Dhruv-like), satire (Deshbhakt), or investigative rants (Ravish). Cover AP/TS-specific topics: YSRCP vs. TDP elections, local scams, farmer issues, or national news with a Telugu twist (e.g., "How Budget 2025 Affects Andhra Farmers?").
  • Video Format Tips:
    • Start with 8-15 min videos: Hook in first 10 seconds, use simple graphics/animations for data.
    • Mix styles: 70% analysis, 20% interviews (local leaders), 10% shorts for quick bites.
    • Quality over quantity: Invest in a decent mic/camera (under ₹10K setup). Edit with free tools like CapCut.
  • Upload Schedule: Consistent days (e.g., Wed/Sun evenings). Dhruv uploads sporadically but hits big; aim for weekly to build habit.
AspectYour Favorites' ApproachTelugu Adaptation for You
TopicsNational politics, myths bustedRegional angles (e.g., Amaravati vs. Vizag)
StyleData visuals, humor, bold opinionsTelugu idioms, local memes, guest anchors
Length10-25 min8-15 min for mobile viewers

2. SEO and Optimization: Get Discovered in Telugu Searches

  • Titles & Thumbnails: Use keyword-rich Telugu titles like "ఏపీ ఎన్నికలు 2026: చంద్రబాబు ట్రిక్స్ ఎందుకు విఫలమవుతున్నాయి?" (inspired by Dhruv's clickbait-but-informative style). Thumbnails: Bright, face-forward with bold text/emojis.
  • Descriptions & Tags: First 100 chars: Hook + keywords (e.g., "Telugu politics, AP news"). Add 10-15 tags: "danny telugu tv, telugu current affairs, ravish kumar telugu".
  • End Screens/Cards: Add subscribe prompts, playlist links (e.g., "AP Politics Series").
  • Pro Tip: Research via YouTube Search Suggest in Telugu. Tools like TubeBuddy (free tier) help track Telugu keywords.

3. Promotion: Leverage Cross-Platforms

  • Social Media: Share clips on X (Twitter), Instagram Reels, and WhatsApp groups. Tag local influencers (e.g., @naralokeshofficial for AP politics). Post teasers: "Full video on Danny Telugu TV!"
  • Collaborations: Guest on small Telugu pods (e.g., Telugu Talks with LK) or interview local activists. Reciprocate with them.
  • Paid Boost: Start with ₹500-1K YouTube ads targeting "Telugu news" interests in AP/TS. Avoid broad; focus on 18-45 urban viewers.
  • Cross-Promo: Create Shorts from long videos—Deshbhakt grows 20% via shorts.

4. Audience Engagement: Build Loyalty

  • Interact: Reply to every comment in first 24 hrs. Poll viewers: "YS Jagan next move?" End videos with CTAs: "Comment your take!"
  • Community: Build a Telegram group for "Danny Telugu Discussions." Share behind-the-scenes.
  • Monetization Path: Hit 1K subs/4K watch hours fast by engaging—unlocks ads. Later, Patreon for "exclusive analysis" like Deshbhakt.

5. Analytics & Iteration: Track What Works

  • Use YouTube Studio: Watch retention (aim >50%), traffic sources (search vs. suggested).
  • Test: Upload 2 versions of a topic—one satirical, one straight—see what spikes.
  • Goal Milestones: 1K subs in 3 months (focus SEO), 10K in 6 (collabs), 100K in year (viral hits).

Potential Challenges & Fixes

  • Low Initial Views: Normal—Dhruv started small. Seed with friends/family shares.
  • Algorithm Bias: YouTube favors consistency; post at peak times (7-9 PM IST).
  • Content Burnout: Batch-record 4 videos/month.

Start with one video this week on a hot Telugu topic (e.g., recent AP floods' political fallout). Track progress monthly. With your passion for Rathee-style depth, you could hit 10K subs in 6 months. If you share a sample video link, I can give tailored feedback!

Friday, 5 September 2025

Arguments against the capital are fueled by hatred

 Arguments against the capital are fueled by hatred

రాజధానిపై ద్వేషంతోనే ముంపు వాదనలు

 

డానీ

సమాజ విశ్లేషకులు




 

అమరావతి మునిగిపోయిందనే ఒక వార్త మీద కొంచెం తీవ్రంగానే చర్చ జరుగుతోంది. నిర్మాణంలోవున్న ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ముంపు నివారణ మార్గాల్ని అన్వేషించడం కోసం  ఈ చర్చ జరుగుతూ వుంటే దాన్ని అందరూ ఆహ్వానించాలి. అలా కాకుండా, ఆంధ్రప్రదేశ్ కు అసలు రాజధానియే లేకుండా చేయడానికి ఈ వాదనలు ముందుకు వస్తుంటే మాత్రం వాటిని తీవ్రంగా ఖండించాలి.

 

ఏ ప్రాజెక్టుకు అయినా అనుకూలతలు, ప్రతికూలతలు రెండూ వుంటాయి. అనుకూలతల్ని పూర్తిగా వాడుకుంటూ ప్రతికూలతల్ని తగ్గించుకోవడమే మానవ ప్రయత్నం.

 

విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది వరద నీటి విడుదల గరిష్ట సామర్ధ్యం 11 లక్షల 90 వేల క్యూసెక్కులు. గత ఏడాది సెప్టెంబరు 1, 2 తేదీల్లో 11 లక్షల 80 వేల క్యూసెక్కుల వేగంతో వరద నీరు ప్రవహించింది. గోదావరి, కృష్ణా వరదలకు తోడు బుడమేరు పొంగింది. ఆ రోజు ఇంకొక్క శాతం వరద పెరిగివుంటే జలప్రళయం సంభవించేది.  ఆ నష్టాన్ని ఉహించడానికి కూడ భయం వేస్తుంది. విచిత్రం ఏమంటే రెండు వారాల్లో ప్రజా జీవితం సాధారణ స్థితికి చేరుకుంది. జీవన శౌందర్యం అంటే అదే!

 

1964 అక్టోబరు నెలలో కృష్ణ నదికి దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వేగంతో వరద వచ్చింది. విజయవాడ పరిసరాల్లో నదీతీరాన్న వున్న నివాసాలు వేల సంఖ్యలో కొట్టుకుపోయాయి. విఖ్యాత ఇంజినీరు డా. కేఎల్ రావు పర్యవేక్షణలో విజయవాడ ముంపు ప్రమాదాన్ని నివారించడానికి ఎత్తైన కరకట్ట నిర్మించారు. నదీ పరివాహక ప్రాంతంలో నివాసాలు ఏర్పరచుకున్నవారిని నగరం వెలుపలున్న ప్రాంతాలకు తరలించారు. అజిత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాలు అలా ఎర్పడ్డాయి.

 

తరువాతి కాలంలో అనేక ఆసక్తికర పరిణామాలు జరిగాయి. కరకట్ట నేషనల్ హైవేగా మారింది. హైవేకు ఆవల నదీ పరివాహక ప్రాంతంలో మళ్ళీ నివాసాలు వచ్చి కృష్ణ లంక, పడమటి లంక ఏర్పడ్డాయి. అక్కడ ఇప్పుడు ఓ పది మునిసిపల్ డివిజన్ల జనం నివసిస్తున్నారు. ప్రతి ఐదేళ్ళకో పదేళ్ళకో వరద నీళ్ళు నివాసాల్లోనికి వచ్చేసి ముంచేస్తుంటుంది. దానితో వాళ్లు ఆందోళనలు చేసి ఇటీవల రిటైనింగ్ వాల్ కట్టించుకున్నారు.  వరద ముప్పును తప్పించుకున్నారు.

 

ఈకథ ఇంతటితో ముగియలేదు. 1960లలో కృష్ణ వరద  నిర్వాసితులుగా అజిత్ సింగ్ నగర్ చేరివాళ్ళు అక్కడా ఇంకో పది డివిజన్ల మేర పెరిగారు. విజయవాడ దుఖ్ఖదాయనిగా భావించే  బుడమేరు పరివాహక ప్రాంతం లోనికి కూడ విస్తరించారు.  ఐదేళ్ళకో  పదేళ్ళకో ఒకసారి బుడమేరు కూడ పొంగుతుంటుంది. నివాసాలు మునుగుతుంటాయి. నగర జనం పడవల్లో ఇళ్ళకు వెళతారు. నాలుగు రోజులు రెవెన్యూశాఖ రిలీఫ్ క్యాంపులు నిర్వహిస్తుంది. మళ్ళీ సాధారణ జీవితం మొదలవుతుంటుంది.

 

గత ఏడాది బుడమేరు మరీ విజృంభించింది. దాదాపు లక్ష మందిని బాధితులుగా మార్చేసింది. ముంపు  ప్రాంతాల్లోని  నివాసాలను తొలగించాలని కొందరు స్వఛ్ఛంద మేధావులు ప్రభుత్వానికి ఉచిత సలహాలు పడేశారు. గట్టున వున్నవాళ్లకన్నా నిండా మునిగిన వాళ్ళకు పరిష్కారాలు తోస్తాయి. వాళ్లు కొంచెం విజ్ఞానాన్ని ప్రదర్శిస్తారు. పాములా మెలికలు తిరిగే బుడమేరులో వరద నీరు వేగంగా ప్రవహించదు. అంచేత ముంపు ఎక్కువ రోజులు వుండిపోతుంది. బుడమేరు స్ట్రేయిట్ కట్ నిర్మిస్తే ప్రవాహ వేగం పెరిగి సమస్య పరిష్కారం అవుతుంది. రిటైనింగ్ వాల్ కూడ నిర్మిస్తే ఇంకా సురక్షితం.

 

కృష్ణానదికి ఎడమ గట్టున బుడమేరు కలిసినట్టే కుడిగట్టున కొండవీటి వాగు కలుస్తుంది. దీనికి కూడ అమరావతి దుఖ్ఖదాయని అనే పేరుంది. దీనిని అమరావతి వరప్రదాయనిగా మార్చడం ఎలా అన్నది మన ముందున్న సవాలు.

మనకు నిజామ్ ఉదాహరణ ఉంది. 1908 సెప్టెంబరు 28న మూసీనదికి కనీవినీ ఎరుగని వరదలొచ్చి హైదరాబాద్ ను ముంచెత్తాయి. కనీసంగా 15 వేలమంది చనిపోయారు. అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ సుప్రసిధ్ధ ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆహ్వానించి మూడు పనులు అప్పచెప్పాడు.  మొదటిది; మూసీ వరద క్రమబధ్ధీకరణ, రెండోది; ముంపు నివారణ, మూడోది; తాగునీటి సరఫరా పథకాల రూపకల్పన. 1912లో నిజాం పాలకునిగా మారిన మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ఈ పథకాల నిర్మాణాలను చేపట్టాడు.

వరదల్ని చూసి భయపడి దుకాణం బంద్ చేద్దామని అనుకోకపోగా, మూసీ నదిలో చేప పిల్లలు లక్షలు కోట్లుగా పెరుగుతున్నట్టు  హైదరాబాద్ జనాబా పెరగాలని ఉస్మాన్ ఆలీ ఖాన్ కోరుకున్నాడట. జనాభా పెరిగినపుడు అవసరమయ్యే తాగునీటిని అంచనావేసి అపుడే పటిష్టమైన ఏర్పాట్లు చేశాడు. ఆయన కోరుకున్నట్టే జరిగింది. హైదరాబాద్ జనాభా కోటి దాటింది. ఆ కాలంలో నిజాం నవాబు  నిర్మించిన చెరువులే 1990వ దశాబ్దం వరకూ హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించాయి.

కృష్ణానదికన్నా కొండవీటి వాగు పల్లంలో వుంటుందని చాలామంది అంటుంటారు. ఇది పాక్షిక సత్యం మాత్రమే. కృష్ణానది ప్రశాంతంగా ప్రవహిస్తున్నపుడు కొండవీటివాగు సహజంగానే పైన్నుండి అందులో కలుస్తుంది. వరద ఉధృతి ఎక్కువగా వున్నప్పుడు నది నీటి మట్టం 27 అడుగుల వరకు పెరుగుతుంది. అప్పుడు వాగులో నీటిని నది లోనికి ఎత్తిపోయాల్సి వుంటుంది. అలాగే వాగులో వరద లేనప్పుడు కృష్ణానది నీటిని రివర్సబుల్ పంపింగ్ స్కీమ్ ద్వార ఎత్తిపోయవచ్చు. పంపింగ్ స్కీమ్ కు ఇప్పుడున్న సామర్ధ్యం సరిపోకపోతే దాన్ని పెంచుకోవచ్చు. అలాగే, 29 గ్రామాల రాజధాని  ప్రాంతంలో ఇతర వాగులతోపాటు కొన్ని చెరువులు కూడ వున్నాయి. వీటివల్ల తలెత్తే  సమస్యల్ని పరిష్కరించడం కూడ అసాధ్యం ఏమీకాదు.

 

 

ఈ ఏడాది కృష్ణా వరద ప్రమాద హెచ్చరికల స్థాయికి చేరుకున్నా నదీ నీళ్ళు కరకట్ట దాటలేదు. అమరావతి లోనికి వరద నీరు ప్రవేశించలేదు. అయితే, ఆగస్టు 12 నుండి 19 వరకు కృష్ణా గుంటూరు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. అయినా, అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రమాదకర ముంపు అంటూ ఏమీలేదు. అయితే, దీనికి ఒక మినహాయింపు వుంది. రాయపూడిలో  ఒక్కొక్కటి నలభై అంతస్తులుగల నాలుగు ఐకానిక్  టవర్స్ నిర్మిస్తున్నారు. వాటికోసం 100-150 అడుగులకు పైగా పునాది స్థంభాలు (పైల్స్ ) దించుతున్నారు. మూడు టవర్స్ లో పునాది పని పూర్తి అయింది. నాలుగో టవర్ లో పునాది కోసం తవ్వకాలు సాగుతున్నాయి. ఈలోగా వర్షాలొచ్చి నీరు చేరింది. పంపు సెట్లు పెట్టి నాలుగో టవర్ లో నీళ్ళు తోడుతున్నారు. వర్షాకాలంలో సాగే భవన నిర్మాణపు పనుల్లో ఇలాంటి ఇబ్బందులు చాలా సహజం. 

 

వర్షమో వరదో ఎదో ఒక సాకు చూపి అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని ఆపాలని ఒక సమూహం సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పోరాడుతోంది. వీరి వాల్ లోనికి వెళ్ళి చూస్తే వైసిపితో రాజకీయ అనుబంధం కనిపిస్తుంది.

 

వైయస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగా  అమరావతిలో శాసన రాజధానిని కొనసాగిస్తామన్నారు. గానీ, వైసిపి అభిమానులు దానికి కూడ ఒప్పుకుంటున్నట్టులేరు. ఆ మధ్య మంగళగిరి - కాజా దగ్గర క్లౌడ్ బరస్ట్ లాంటి వర్షం కురిసింది.  ఆ కారణంగా రాజధాని నిర్మాణాన్ని అమరావతిలో ఆపి నల్లమల అడవులకు మార్చాలని కొందరు సూచిస్తున్నారు. నల్లమల అడవుల్లో ఏకంగా కుమిలోనింబస్ వర్షాలు (cumulonimbus rain) కురిసిన దాఖలాలున్నాయి. వాటి కారణంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయారన్న విషయాన్ని  వైసిపి అభిమానులు ఇంత త్వరగా మరచిపోవడం ఆశ్చర్యకరం!. 

 

జగన్ మూడు రాజధానుల సిధ్ధాంతం పైకి సమ పంపకంగా కనిపిస్తుందే గానీ, అందులో ఒక బూటకం వుంది. అమరావతిలో శాసన రాజధాని నిర్మాణాలను ఆయన ప్రభుత్వం కొనసాగించలేదు. విశాఖపట్నంలో పాలనా రాజధాని కోసం నిర్మాణాలను మొదలెట్టలేదు. కర్నూలులో న్యాయ రాజధాని నిర్మాణం అనేది ఆయన చేతుల్లో లేదు. రాష్ట్ర హైకోర్టు ఎక్కడ పెట్టాలనే అంశాన్ని పార్లమెంటు తీర్మానించాలి; రాష్ట్రపతి ఉత్తర్వులివ్వాలి, భారత ప్రధాన న్యాయమూర్తి జడ్జీలను నియమించాలి. అన్ని అనుమతులు వచ్చాక హైకోర్టు భవనాన్ని నిర్మించడం, నిర్వహణ భారం మోయడం ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వం పని.

జాగ్రత్తగా గమనిస్తే  రాష్ట్రానికి అసలు రాజధానియే లేకుండా చేసే పథకం జగన్ మూడు రాజధానుల సిధ్ధాంతంలో కనిపిస్తుంది.

 

రాజధాని నిర్మాణం విషయంలో వైయస్ జగన్, చంద్రబాబులవి పరస్పర విరుధ్ధమైన దృక్పథాలు. తప్పనిసరిగా చేయాల్సిన పనుల్నికూడ జగన్ చేయరు. చేయలేని పనుల్ని కూడ చంద్రబాబు చేస్తానంటుంటారు. రాజకీయ విభజన ఏ దశకు చేరుకుందంటే ఏపికి రాజధాని కావాలని కోరేవాళ్ళు టిడిపి; రాజధాని అక్కరలేదనేవారు వైసిపిగా తయారైంది. చంద్రబాబు మార్కు అతిశయాలను అదుపు చేయడం వేరు; కొత్త ఆంధ్రప్రదేశ్ కు అసలు రాజధానియే లేకుండా చేయడం వేరు.

 

-డానీ సమాజ విశ్లేషకులు

Updated Date - Sep 04 , 2025 | 01:21 AM


https://www.andhrajyothy.com/2025/editorial/from-flood-risks-to-political-manipulation-1443429.html?fbclid=IwY2xjawMny0BleHRuA2FlbQIxMQABHi4kqAXOh2DUAHqu7fRIbGwTIO37ceNADDFndReUF2hGAyD_lvdXk-34FBLY_aem_Htoz6RPMwfw2mU7qz-8saw

Wednesday, 2 July 2025

Who are the murderers in suicides?

Who are the murderers in suicides?

*ఆత్మహత్యల్లో హంతకులెవరూ?*

ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈరోజు నా వ్యాసాన్ని ప్రచురించింది. పత్రిక యాజమాన్యానికీ, ఎడిటర్ కు, ఎడిట్ పేజీ బాధ్యులకు ధన్యవాదాలు.

వాసాన్ని చదివి మీ కామెంట్స్ పెట్టండి. నా తప్పులు తెలుస్తాయి.

*డానీ*

*సమాజ విశ్లేషకులు*





 

ఆత్మహత్యలు మరొకసారి చర్చనీయాంశంగా మారాయి. అంటే మన సమాజంలో ఆత్మహత్యల రేటు పెరుగుతోందని అర్ధం. హతుడే హంతకుడైనపుడు  దాన్ని ఆత్మహత్య అంటారు. హంతకుడు మరొకరైనపుడు దాన్ని హత్య అంటారు.

ఇటివల వెలుగులోనికి వస్తున్న ఆత్మహత్యల కేసుల్లో స్త్రీపురుష సంబంధాల్లో తలెత్తిన వివాదాలకు చెందినవి ఎక్కువగా వుంటున్నాయి. మన కుటుంబ, దాంపత్య వ్యవస్థల్లో చెలరేగుతున్న సంక్షోభాలకు ఇవి సంకేతాలు. సమాజంలో ఏదైనాసరే పాతదిపోయి కొత్తది రాకతప్పదు. అయితే, మనం గ్ర్తుపెట్టుకోవాల్సిన  అంశం ఏమంటే, పాత దానితోపాటు పాత నిబంధనలు పోయినట్టే, కొత్త దానితోపాటు కొత్త నిబంధనలు వస్తాయి.

వివాహిత స్త్రీతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన  పురుషుల్ని న్యాయస్థానాలు ఇప్పుడు శిక్షార్హమైన నేరస్తులుగా పరిగణించడం లేదు; సామాజిక తప్పిదానికి పాల్పడినవారిగా మాత్రమే భావిస్తున్నాయి. దాంపత్యంలో అలాంటి సంక్షోభం తలెత్తినపుడు విడాకులు సామాజిక పరిష్కారం అవుతాయి. వివాహేరత సంబంధంలోనికి ప్రవేశించి సామాజిక తప్పిదానికి పాల్పడిన వారికి వాళ్ళ జీవిత భాగస్వాములు – భర్త గానీ భార్యగానీ - విడాకులు ఇవ్వవచ్చు. అయితే, విడాకులు ఇవ్వడం కూడ అంత సులువుకాదు. దానికి అనేక ఆర్ధిక పరిమితులుంటాయి; ముఖ్యంగా స్త్రీలకు.  

ఆత్మహత్యలకు ఒక సాధారణ ప్రాతిపదిక ఏదైనా వుందా? అనేది సుదీర్ఘకాలంగా సాగుతున్న ఒక ఆసక్తికర సందేహం. అది తెలిస్తే, సమాజంలో ఆత్మహత్యల రేటును తగ్గించడానికి వీలు కుదురుతుంది. 

 

ఆత్మహత్యల వెనుక బయటికి కనిపించని హంతకురాలు ఒకటి వుంటుంది; అది సమాజం. కొందరికి ఇది కొంచెం ఆశ్చర్యకరంగా కనిపించవచ్చుగానీ, అదే నిజం. సామాజిక అనుబంధాలు, నియమాల కారణంగానే ఆత్మహత్యలు జరుగుతాయని 19వ శతాబ్దపు ఫ్రెంచ్ సమాజశాస్త్రవేత్త డేవిడ్ ఎమిలె దుర్ఖేమ్ (David Émile Durkheim) తొలిసారిగా ప్రతిపాదించాడు. ఆయన 1897లో ‘లా సుసైడ్’ పేరిట ఆత్మహత్యల మీద ఒక విస్తార సిధ్ధాంత గ్రంధాన్ని రాశాడు. ఆ సిధ్ధాంతాన్నే సమాజ విశ్లేషకులు, పరిశోధకులు ఇప్పటికీ ప్రామాణికంగా భావిస్తుంటారు. 

దుర్ఖైమ్ సిధ్ధాంతం ప్రకారం ఆత్మహత్యలు నాలుగు రకాలు. మనుషులతో అనుబంధాలు ఎక్కువైనవారు వారిని ఆదుకోవడానికి ప్రాణత్యాగానికి సిధ్ధమౌతారు. ప్రజల్ని విపరీతంగా ప్రేమించే విప్లవకారులు ప్రజల కోసం  చనిపోవడానికి సిధ్ధపడడాన్ని మనం ఇప్పటికీ చూడవచ్చు. ఇది బలిదానాల అత్మహత్య (Altruistic suicide). మనుషులను అతిగా ద్వేషించేవారు కూడ అనుబంధాలు పూర్తిగా  లోపించి  ఒంటరివారైపోయి అత్మహత్యలు చేసుకుంటారు. ఇది అహంభావ ఆత్మహత్య (Egoistic Suicide). నిబంధనలు, నిర్బంధాలను తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడతారు. ఇది బలవన్మరణం (Fatalistic Suicide). నియమ నిబంధనల్ని ఏమాత్రం పాటించని వారు కూడ ఆత్మహత్యలకు పాల్పడతారు. ఇది నిబంధనోల్లంఘన ఆత్మహత్య (Anomic Suicide).

ఆత్మహత్యల్లో అత్యంత  బాధాకరమైనది  బలవన్మరణం. అత్యంత  సంక్లిష్టమైనది నిబంధనోల్లంఘన ఆత్మహత్య. ఎవరయినా నిబంధనల్ని వుల్లంఘిస్తున్నపుడు మనకు అవి ఒకవైపు అభ్యుదయకరంగా, విప్లవకరంగా అనిపిస్తుంటాయి. మరోవైపు, ఓ ఇనుపతాళ్ళ వల ఒకటి వాళ్ళను బయటపడడానికి వీలు లేకుండా బంధించేస్తూ వుంటుంది.  పాత నిబంధనల్ని వుల్లంఘించినప్పటికీ కొత్త నిబంధనల్ని రూపొందించుకుని పాటించేవారు బహు అరుదుగానైనా కొందరు వుంటారు. వాళ్లు మార్గదర్శకులు అవుతారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం సాలీన సగటున లక్ష మందికి 9 మంది ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. దీనికి 20 రెట్లు మంది ప్రతి ఏటా ఆత్మహత్యాయత్నం చేస్తుంటారు. ఆత్మహత్యల రేటు కొన్ని దేశాల్లో ఎక్కువగానూ, కొన్ని దేశాల్లో తక్కువగానూ వుంటుంది. దానికి కారణం ఆయా సమాజాల్లోని సంఘీభావ స్థాయిల్లో వ్యక్తమయ్యే హెచ్చుతగ్గులు.

మనం కల్లోల దేశాలుగా భావించే ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ లలో ఆత్మహత్యల రేటు తక్కువ. అభివృధ్ధి చెందుతున్న, చెందిన దేశాల్లో ఆత్మహత్యల రేటు ఎక్కువ. సంఖ్యాపరంగా అత్యధిక ఆత్మహత్యలు ప్రస్తుతం ఇండియాలోనే  జరుగుతున్నాయి.

చారిత్రక దశలను బట్టి ఆత్మహత్యల రేటు మారుతుంటుంది. ఉద్యమాలు, విప్లవపోరాటాలు, ఇతరదేశాలతో యుధ్ధాలు కొనసాగుతున్న కాలంలో మనుషుల మధ్య అనుబంధాలు, సంఘీభావాలు  చాలా వున్నత స్థాయికి చేరుకుని ఒక ప్రేమైక సమాజం (Altruistic Society)  ఏర్పడుతుంది. అయితే, ఉద్యమాలు  విజయవంతం అయ్యాక లేదా ముగిశాక దాని ఫలాల కోసం ఒకప్పటి ఉద్యకారుల మధ్యనే పోటీ పెరిగి, సంఘీభావం తగ్గుముఖం పడుతుంది. సామాజిక నైతికతను, న్యాయ నియమాలనూ ఉల్లంఘించే ఒక అరాచక, అలగా (లుంపెన్) సంస్కృతి విజృంభించే ప్రమాదం కూడ ఉద్యమానంతర కాలంలో వుంటుంది.  తెలంగాణలో ప్రత్యేకరాష్ట్రం  కోసం ఉద్యమం సాగిన కాలాన్నీ, ప్రత్యేక రాష్ట్రం  ఏర్పడిన తరువాతి కాలాన్నీ దగ్గరగా పరిశీలిస్తే ఈ రెండు ధోరణుల్నీ  చూడవచ్చు. 

ప్రేమైక సంఘీభావ సమాజాల్లో (Altruistic Society) ఆత్మహత్యల రేటు తక్కువగానూ, విద్వేష సమాజాల్లో  ఆత్మహత్యల రేటు ఎక్కువగానూ వుంటుందని ఓ పదేళ్ల క్రితం సోషల్ మీడియాలో నేనొక పోస్టు పెట్టాను. ఉత్తరాంధ్రాకు చెందిన ఓ మహిళా సైకాలజీ లెక్చరర్ నా వాదనను చాలా గట్టిగా తిరస్కరించారు. ఆందోళన, వత్తిడి, కుంగుబాటు తదితర మానసిక దౌర్బల్యాల కారణంగా మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటారని వారు వాదించారు. కొన్ని రోజుల పాటు మా మధ్య వాదన కొనసాగింది. నేను సమాజశాస్త్ర విద్యార్ధిని, వారు మనస్తత్త్వశాస్త్ర ఉపన్యాసకులు. మా మధ్య ఎక్కడా రాజీ కుదరలేదు.

ఆ మహిళా లెక్చరర్ ఓ మూడు నాలుగేళ్ళ తరువాత విషాదకరంగా ఆత్మహత్య చేసుకున్నారు. వారికి పెళ్ళయింది; భర్త వున్నాడు. విడాకులు తీసుకోలేదు. మరొకతనితో సహజీవనం ఆరంభించారు. అతనూ వివాహితుడు. భార్యా, పిల్లలు వున్నారు. అతను కూడ విడాకులు తీసుకోలేదు. విడాకులకు బదులు భార్య నుండి నిరభ్యంతర పత్రం (NOC) అయినా తీసుకోలేదు. లేడీ లెక్చరర్ తో బహిరంగంగా సహజీవనం కొనసాగించారు.  

విడాకులు తీసుకోని వివాహిత స్త్రీ పురుషులు బాహాటంగా సహజీవనాన్ని కొనసాగించడం సామాజిక తప్పిదం. వాళ్ళ శాసనోల్లఘనం అక్కడితో ఆగలేదు. ప్రభుత్వ పత్రాలు వేటిల్లోనూ తాము సహజీవనం చేస్తున్నట్టు నమోదు  చేసుకోలేదు.  పెన్షన్ పత్రాల్లో  నామినీగా చేర్చుకోలేదు.  సహజీవన పురుషుని సమీప బంధువు పేరిట వున్న స్థలంలో ఆమె ఒక ఇల్లు కట్టారు. ఇంటి డాక్యుమెంట్స్ ను తన  పేరిట మార్పించుకోలేదు. భావోద్వేగాల ప్రేమ వున్నప్పుడు ఇవన్నీ అక్కరలేదు అనుకుని వుండవచ్చు.

ఇలా వుండగా,  సహజీవన పురుషుడు చనిపోయాడు. శవాన్ని అతని భార్యా పిల్లలు తీసుకునిపోయారు. శవాన్ని స్వాధీనం చేసుకోవడం అంటే ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్టే!. (మళ్ళీ మార్క్స్ గుర్తుకు వస్తున్నాడు). కొన్నాళ్ళకు ఆ స్థల యజమాని వచ్చి ఇంటిని స్వాధీనం చేసుకుని లేడీ లెక్చరర్ ను బయటికి గెంటేశాడు. ఆమె అన్నింటినీ కోల్పోయింది. అంతకన్నా విషాదం ఏమంటే ఆమె క్లెయిమ్ చేసుకోవడానికి ఒక్కటంటే ఒక్క అంశం కూడ మిగలలేదు. నిబంధనోల్లంఘన ఆత్మహత్యగా ఆమె జీవితం ముగిసింది.

సామాజిక అంశాలను మాత్రమే పట్టించుకుని వ్యక్తిత్వ, మనస్తత్వ అంశాలను నిర్లక్ష్యం చేశాడని దుర్ఖేమ్ మీద మొదటి నుండీ ఒక విమర్శ వుంది. తరచిచూస్తే వత్తిడి, ఆందోళన, కుంగుబాటు, నైతికత మొదలైన వ్యక్తిత్వ, మనస్తత్వ అంశాలు  కూడ ఆధునిక సమాజ ఉత్పత్తులే  అని గమనించవచ్చు.

భర్త వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని తెలిసిన ఏ భార్య అయినా ముందుగా భావోద్వేగంతో తీవ్ర అభ్యంతరం చెపుతుంది. ఆ వెనుక ఆమెకు తన  భయానికి అసలు కారణం తెలుస్తుంది. అది ప్రధానంగా ఆర్ధిక పరమైనది. తనదీ, తన పిల్లలది అనుకుంటున్న ఆస్తికి మరొకరు వాటాదారులుగా వస్తుంటే తాము నిరాశ్రయులమైపోతామనేది ఏ భార్యకయినా సమంజసమయిన ఆందోళన. భావోద్వేగాలకు మాత్రమే పరిమితమయ్యేవారు అక్కడే ఆగిపోతారు. కొంచెం లౌక్యం తెలిసినవారు దానికో ఆర్ధిక పరిష్కారాన్ని వెతుకుతారు.

వివాహేతర సంబంధాల్లో పురుషులకు వున్నంత అనుకూలత స్త్రీలకు లేదు. అయితే,  స్త్రీలు కొంచెం తెలివిని ఉపయోగించి పరిస్థితిని తమకు పూర్తిగా అనుకూలంగా కాకపోయినా ఇబ్బంది లేకుండా మార్చుకోవచ్చు.  కొత్తగా వచ్చే ఆమెకు భర్త ఆస్తిలో వాటా ఇవ్వరాదు, కొత్తామెతో పిల్లల్ని కనరాదు వంటి కొన్ని షరతులు పెట్టి రెండు కుటుంబాలు అన్యోన్యంగా (నే) కొనసాగిన సెలబ్రిటి ఉదాహరణలు మన ముందు కొన్నున్నాయి. మరోవైపు, ఒక వివాహిత పురుషునితో సహజీవనం చేయాలనుకున్న స్త్రీ ముందుగా అతని మొదటి భార్య నుండి విడాకులో కనీసం నిరభ్యంతర పత్రమో పొందాలి. ఈ  సాంప్రదాయం కూడ ఇప్పుడు మన సమాజంలో వుంది. విడాకులో, నిరభ్యంతర పత్రమో పొందడం వేరు; పొందుతామనే నమ్మకంతో ముందుగానే సహజీవనం మొదలు పెట్టేయడం వేరు. ఇలాంటి తప్పులు ఒక్కోసారి మరణానికి కూడ దారితీయవచ్చు. 

సమాజంలో వివాహేతర ప్రేమలు కూడ పుడతాయి. వాటంతటగా    అవేమీ తప్పుకాదు. వాటిని క్రమబద్దీకరించుకోవడమే పెద్ద సవాలు.   ఆర్ధిక నియమాల ఆధారంగా ఇప్పుడు సమాజంలో సంక్లిష్ట కుటుంబాలు, మిశ్రమ కుటుంబాలు, సవతి కుటుంబాల (complex family, blended family and step family) పేరిట కొత్త దాంపత్య బంధాలు  ఏర్పడుతున్నాయి. ఈ ధోరణి పెరుగుతోంది కూడ. ఇప్పటికీ చాలామంది దాంపత్యానికి వున్న ఆర్ధిక పునాదిని గుర్తించక నివారించతగ్గ ఇబ్బందుల్ని కూడ కొని తెచ్చుకుంటున్నారు.

ప్రేమను భావోద్వేగ వ్యవహారం అన్నంత వరకు ఎవరికీ పేచీ లేదు. గానీ, వివాహాన్ని భావోద్వేగానికి మాత్రమే పరిమితం చేయడం కుదరదు. వివాహం ఒక వ్యవస్థ. వ్యవస్థ అన్నాక సహజంగానే అందులో నియమ నిబంధనలు అనేకం వుంటాయి.  వివాహ బంధంలోనికి ప్రవేశించాలన్నా, అందులో నుండి బయటికి రావాలన్నా దాని నియమాలన్నింటినీ  పాటించాల్సివుంటుంది.

30-06-2025

ప్రచురణ : 3 జులై 2025

https://www.andhrajyothy.com/2025/editorial/who-is-responsible-for-suicides-1421805.html

https://epaper.andhrajyothy.com/article/Hyderabad?OrgId=37d7eac392&eid=34&imageview=1&device=desktop

Monday, 30 June 2025

About Danny - Chat GPT

 A. M. Khan Yazdani, fondly known as Danny, is a veteran journalist, sharp political analyst, and a passionate voice for the people. With over four decades of experience in both print and electronic media, Danny has chronicled the socio-political evolution of Andhra Pradesh and India with unmatched insight and integrity. As the founder of the YouTube channel Danny Telugu TV, he continues to enlighten audiences with fearless commentary, investigative storytelling, and a deep commitment to truth. His hallmark quote — "There is freedom of speech, but we cannot guarantee freedom after speech" — reflects his bold stance in today’s challenging media landscape.

Saturday, 21 June 2025

ప్రైవేటు శ్రామికుల మీద ఎందుకంత కక్ష?

 సాక్షి దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురణార్ధం

 

*ప్రైవేటు శ్రామికుల మీద ఎందుకంత కక్ష?* 

డానీ

సమాజ విశ్లేషకుల, 9010757776   

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటురంగ శ్రామికుల పని గంటల్ని పెంచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రామికులు రోజుకు గరిష్టంగా 8 మాత్రమే గంటలు పని చేసేవారు. కొత్త ఆంధ్రప్రదేశ్ లో దాన్ని 9 గంటలకు పెంచారు.  ఇప్పుడు మళ్ళీ దాన్ని 10 గంటలకు పెంచారు. 

పెట్టుబడుల్ని భారీగా ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో పని గంటల పెంపు కూడా ఒకటని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మ్యాన్‌పవర్ చౌకగా లభిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో పని గంటల్ని కూడ పెంచితే ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు కార్పొరేట్ సంస్థలు మొగ్గు చూపుతాయని ప్రభుత్వం వాదిస్తోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టి సంస్థల అధినేతలు వారానికి 70 గంటలు, 90 గంటలు పనిచేయాలని కోరుతున్నాయి. వాళ్ళ కోరికలకు అనుగుణంగా ఫ్యాక్టరీలు, కార్మిక చట్టాలను మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. 

ఇక్కడో విచిత్రం వుంది. 10 గంటల పనిదినం అనేది ప్రైవేటు రంగ శ్రామికులకు మాత్రమే. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల  ఉద్యోగుల పనివేళలు 10 నుండి 6 గంటల వరకు 8 గంటల పనిదినంగానే కొనసాగుతాయి. ప్రభుత్వమే ప్రభుత్వ, ప్రైవేటు  సిబ్బంది మధ్య చాలా నగ్మంగా వివక్ష చూపడానికి సిధ్ధపడింది. 

ప్రభుత్వోద్యోగుల మీద కన్నతల్లి ప్రేమ, ప్రైవేటు శ్రామికుల మీద సవతితల్లి ప్రేమ చూపడం అనేది పని గంటలతో మాత్రమే ఆగడంలేదు. జీతభత్యాల్లో అసాధారణ వ్యత్యాసం వుంది. ప్రైవేటు శ్రామికుల పని గంటలు పెంచిన ప్రభుత్వం కనీస వేతనాలను పెంచాలనే కనీస ఆలోచన కూడ చేయలేదు. 

వారానికి ఆరు రోజులు, రోజుకు 8 గంటలు అనే ప్రమాణానికి అనేక చారిత్రక, సామాజిక, శారీరకధర్మాల కారణాలున్నాయి. యుక్త వయస్సు దాటిన ప్రతి మనిషి మొదటగా, ఆహారం, నిద్ర, మైధూనాలు వంటి శరీర ధర్మాల్ని పాటించాల్సి వుంటుంది. ఆ పిదప, కుటుంబం, బంధుమిత్రులు, కళాసాహిత్య, రాజకీయ  ఆసక్తులు వంటి సామాజిక ధర్మాలను పాటించాల్సి వుంటుంది. ఆ తరువాత, బతుకు తెరువు కోసం ఓ వృత్తిని ఎంచుకుని పనిచేయాల్సి వుంటుంది. వీటిల్లో ప్రతీదీ ముఖ్యమైనదే  కనుక ఒక రోజులో వుండే 24 గంటల్లో  ఈ మూడు ధర్మాలకు  సమానంగా చెరో 8 గంటలు కేటాయించాలనే ప్రమాణం ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. అయితే, అత్యాశపరులుగా మారిన కార్పొరేట్ సంస్థల్ని సంతృప్తి పరచడానికి ప్రభుత్వాలు కార్మికుల్ని వేధించడానికి సిధ్ధపడుతున్నాయి. ఇదొక అమానవీయ పరిణామం.

 ప్రజల సౌకర్యాలను పెంచడానికి రోడ్లు, నీటి పారుదల ప్రాజెక్టులు, విద్యా, ఆరోగ్య సదుపాయాలు, అల్పాదాయవర్గాలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి సంక్షేమ పథకాలు వగయిరాలను ప్రభుత్వాలు నిరంతరం అభివృధ్ధి చేస్తుండాలి.  వీటికయ్యే ఖర్చును కూడ ప్రభుత్వాలు ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేస్తాయి. ఈ వ్యవస్థను నిర్వహించడానికి ఒక కార్యనిర్వాహక వర్గం కూడ కావాలి. దానినే మనం సామాన్య భాషలో ప్రభుత్వ వుద్యోగులు అంటున్నాం. అయితే, ఇటీవలి కాలంలో ప్రభుత్వ వుద్యోగుల వ్యవస్థ నిర్వహణ వ్యయం అనూహ్యంగా పెరిగిపోతున్నది. ఇది ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరుకుందంటే ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల రెవెన్యూ మొత్తాన్ని ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకే ఖర్చుపెట్టేస్తున్నారు.   

ఏపి ఎన్జీవో సంఘం 20వ మహాసభలు 2017 నవంబరు 4న తిరుపతిలో జరిగిగాయి. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్పటి ఆర్ధిక మంత్రి ఎనమల రామకృష్ణుడు ఆ వేదిక మీద నుండే ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల నుండి పన్నుల రూపంలో వస్తున్న మొత్తం ఆదాయంలో 94 శాతం ప్రభుత్వ వుద్యోగ జీతభత్యాలు పెన్షన్లకు సరిపోతున్నదన్నారు.   

ఏ ప్రభుత్వం అయినాసరే రాష్ట్ర అభివృధ్ధి కోసమే ప్రజల నుండి పన్నుల్ని వసూలు చేస్తుంది. అందులో ఓ నాలుగో వంతు (25 శాతం) నిర్వహణ ఖర్చులకు కేటాయించినా 75 శాతం రాష్ట్ర అభివృధ్ధి కోసం వెచ్చించాలి. కానీ అలా జరగడంలేదు. వసూలు చేస్తున్న పన్నుల్లో 94 శాతం ఉద్యోగుల జీత భత్యాల కోసం పోతోంది. దానితో, అభివృధ్ధి పనులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం అప్పులు చేయాల్సి  వస్తున్నది. చివరకు పరిస్థితి ఏ దశకు చేరుకున్నదంటే; ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నుల్ని మొత్తంగా  ప్రభుత్వ వుద్యోగుల జీతభత్యాలకు కేటాయిస్తున్నారు. ఈమాత్రం దానికి పన్నులు వసూలు చేయడం దేనికీ? ప్రభుత్వ  ఉద్యోగుల్ని పోషించడం దేనికీ? అనే ప్రశ్న సహజంగానే ముందుకు వస్తుంది.   

వృత్తి మీద ప్రభుత్వ ఉద్యోగుల అంకితభావం గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రతి కార్యాలయంలో ప్రతి పనికి ఒక టారీఫ్ బుక్ వుంటుంది. దాన్ని ప్రజలు పాటించి తీరాల్సిందే. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ నిజాయితీగా పనిచేసేవారు కూడ తప్పనిసరిగా వుంటారు. అయితే, అలాంటివారు ఇప్పుడు అంతరించిపోతున్న జాతి. 

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ తరువాత అమరావతిలో రాజధాని నిర్మాణం మొదలెట్టినపుడు రాష్ట్ర సచీవాలయ ఉద్యోగులు హైదరాబాద్ ను వదిలి రావడానికి సిధ్ధపడలేదు. వారి విషయంలో ప్రభుత్వం బుజ్జగింపు ధోరణిని ప్రదర్శించింది. పని దినాల్ని వారానికి 5 రోజులకు తగ్గించింది. పనివేళల్ని రోజుకు అరగంట తగ్గించింది. వారు రోజూ హైదరాబాద్ నుండి వచ్చిపోవడానికి వీలుగా ఒక ప్రత్యేక రైలును కూడ ఏర్పాటు చేశారు. 12796 నెంబరుగల లింగంపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఉదయం 9 గంటల 30 నిముషాలకు మంగళగిరి వస్తుంది. 12795 నెంబరుగల లింగంపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ సాయంత్రం 5 గంటల 46 నిముషాలకు మంగళగిరి రైల్వేస్టేషన్ లో బయలు దేరుతుంది. మంగళగిరిలో రైలు దిగి 10 గంటల లోపు సచివాలయానికి చేరుకోవడం, అలాగే, ఆఫీసులో  5.30 నిముషాలకు బయలు దేరి మంగళగిరిలో ట్రైన్ ఎక్కడమూ అసాధ్యం. కనీసం చెరో అరగంట పని సమయాన్ని తగ్గించాల్సిందే!. 

సచీవాలయ ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని కలుగజేసి పదేళ్ళు దాటుతోంది.  ఈ సౌకర్యాన్ని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ జూన్ 20న కొత్త జీవో ఒకటి జారీ చేశారు. ప్రభుత్వానికి తన ఉద్యోగులంటే ఎందుకింత ప్రేమ, ప్రైవేటు శ్రామికులంటే ఎందుకింత ద్వేషం?  ఎవరికయినా రావలసిన సందేహమే! 

22 జూన్ 2027

ప్రచురణ : 27 జూన్ 2025


https://www.sakshi.com/telugu-news/guest-columns/sakshi-guest-column-andhra-pradesh-govt-and-private-workers-2489123#google_vignette

https://cag.gov.in/en/state-accounts-report

Saturday, 7 June 2025

Sudhakar - *మనిషి సౌమ్యుడు – ఉద్యమంలో నిబధ్ధుడు - నిమగ్నుడు*

 *మనిషి సౌమ్యుడు – ఉద్యమంలో నిబధ్ధుడు - నిమగ్నుడు*

 

మావోయిస్టు సుధాకర్ (అసలు పేరు తెంటు లక్ష్మీ నరసింహా చలం / / TLNS చలం).  ఉద్యమంలో ఆనంద్, సోమన్న పేర్లతోనూ వున్నాడు. ఆయుర్వేద మెడిసిన్ విజయవాడలోనే చదివాడు.

 

ప్రతిష్టాత్మక  కృష్ణా జిల్లాలో సివోసి / పీపుల్స్ వార్ సెంట్రల్ ఆర్గనైజర్లుగా పెండ్యాల మల్లేశ్వర రావు, నేను, సుధాకర్ వరుసగా పని చేశాము.  మా ముగ్గురి వ్య్వహారశైలి భిన్నమైనది. ఉద్యమానికి మా కాంట్రిబ్యూషన్ కూడ భిన్నమైనది.

 

నేను ప్రత్యర్ధుల మీద విరుచుకుపడతాను.

సుధాకర్ దానికి పూర్తిగా భిన్నం.

తక్కువ గొంతుతో చాలా సున్నితంగా మాట్లాడుతాడు.

ప్రత్యర్ధిని కూడ నచ్చచెప్పాలనుకుంటాడు.

అప్పట్లో కొంచెం బిడియస్తుడు కూడ.

 

తనూ కాకినాడ నాగమల్లేశ్వర రావు కొన్నాళ్ళు  - బహుశ 1978లో -రామచంద్రాపురంలో చదివారు.

అక్కడి బ్యాంకు ఉద్యోగి నిమ్మకాయల వీర రాఘవ వీళ్ళకు రాడికల్ సంబంధాలు కల్పించారు. 

ఆ తరువాత వీళ్ళిద్దరూ విజయవాడకు వచ్చారు.

 

ముందు మల్లేశ్వరరావు సివోసి/ పీపుల్స్ వార్ లో చేరాడు.  

తను నాకన్నా సీనియర్ సెంట్రల్ ఆర్గనైజర్. / సివో. 

మల్లేశ్వర రావును వేరే జిల్లాకు పంపించాక నేను ఆ స్థానంలోనికి వచ్చాను.

ఆ తరువాత చలం చేరాడు.  

 

మాకు గురువయిన వివి కృష్ణారావు 1979 చివర్లో సివోసి నుండి బయటికి వెళ్ళిపోయేనాటికి నేను రాడికల్ యూత్ లీగ్ కృష్ణాజిల్లా అధ్యక్షుడిని.

 

ఆర్ ఎస్ యూ తో సహా ఇతర ప్రజాసంఘాల బాధ్యతల్ని కూడ నేనే చూడాల్సి వచ్చింది. జిల్లా పార్టి బాధ్యతల్ని కూడ నేనే చూసేవాడిని. జిల్లా యూనిట్ కు అడహాక్ కార్యదర్శి.

 

1981 ఏప్రిల్ చివరి వరకు హోల్ టైమర్ గా వున్నాను.

 

నాకు చలం తోడయ్యాడు. తను స్టూడెంట్స్ వింగ్ ను చూసేవాడు.

 

ఇద్దరం విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజి దగ్గర బాయ్స్ హాస్టలు జమీందార్ బిల్డింగ్స్ లో వుండేవాళ్ళం.  అది వామపక్షాల కోట.

 

ఓ అరవై చదరపు అడుగుల గది. ఒక చెక్క మంచం, ఒక చెక్క బల్ల, ఓ చెక్క కుర్చీ,ఓ 40 క్యాండిల్స్ బల్బు. ఇదీ మా వసతి.

 

నెలకు అద్దె 8 రూపాయలు. సబ్సిడీ రేటు.

అయినా నిత్యం మూడు నాలుగు నెలలు అద్దె బకాయి వుండేది.

అభిమానులు ఇచ్చిన పుస్తకాలు గదినిండా వుండేవి.

కడుపు నిండా ఆకలి వుండేది.

 

ఉదయాన్నే అద్దె బకాయి గురించి మమ్మల్ని తిట్టిపోసే హాస్టల్ మేట్రన్ సుందరమ్మ 10 గంటల తరువాత చల్లబడి అభిమానంతో ఉప్మా వండి పంపేది.

 

మా ఇద్దరి జీవితం గుణదల కొండతో ముడిపడి వుండేది. కొండకిందే జమీందార్ బిల్డింగు.

 

నగరంలో కొన్ని ఇళ్ళు, కొన్ని హొటళ్ళు మాకు ఉచితంగా భోజనం పెట్టేవి. ఒక్కోసారి అక్కడికి వెళ్ళడానికి సిటీ బస్సు టికెట్టు చార్జీలు కూడ వుండేవి కావు.

 

పుస్తకాలు చదవడం, సమావేశాల్లో మాట్లాడడం మాత్రమే పని.

ఆ తరువాత నేను ఎప్పుడూ అంతగా చదవలేదు.

 

పార్టీ పిసి సెక్రటరి ముక్కు సుబ్బారెడ్డి /రంగన్న, క్రాంతి పత్రిక ఇన్ చార్జి  ఎల్ ఎస్ ఎన్ మూర్తి  తరచూ వచ్చి కలిసేవారు. ఇతర జిల్లాల బాధ్యులు కలవడానికి కూడ అదే కేంద్రం.

 

మా కదలికల్ని పసిగట్టడానికి స్టేట్ ఇంటెల్లిజెన్స్, సెంట్రల్ ఇంటెల్లిజెన్స్ సిబ్బంది ఎవరో ఒకరు నిరంతరం మాచవరంలోనే తిరుగుతూ వుండేవాళ్ళు.

 

ఒక్కోసారి నేనే వాళ్లను పిలిచి డబ్బులు లేవుగానీ టీ తాగించండి అనేవాడిని. అదో కామెడి.

 

విప్లవోద్యమంలో ఇలాంటి కామెడీలు చాలా వుంటాయి.

అందుకే చాలామంది ఆ జీవితాన్ని ఆస్వాదిస్తారు.

 

1983లో నేను అజితను పెళ్ళి చేసుకునేవరకు జమిందార్ బిల్డింగ్ లోనే వున్నాము.

 

1980 చివర్లో ఒక పార్టి పంచాయితీ కోసం హైదరాబాద్ రాంనగర్ కు వెళ్ళినపుడు కుటుంబం కోసం హోల్ టైమర్ జీవితం నుండి బయటికి పోవాలి అని శివసాగర్, ముక్కు సుబ్బారెడ్డి లకు తెలిపాను.

ఆ సమావేశానికి చెలం కూడ వచ్చాడు.

 

చెలానికి పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చాక మాత్రమే హోల్ టైమర్ జీవితం నుండి తప్పుకో మన్నారు.

 

ఆ శిక్షణ ఓ నాలుగైదు నెలలు సాగింది.

1981 మే 1న నేను హోల్ టైమర్ జీవితాన్ని ముగించాను.

సుధాకర్ జిల్లా పార్టి బాధ్యతలు తీసుకున్నాడు.

అక్కడి నుండి తన ఎదుగుదల చాలా వేగంగా సాగింది.

 

నేను తనకు గురువు అయినట్టు

అజితకు తను గురువు.

 

తల్లిదండ్రుల గొప్పతనాన్ని పిల్లలు నిరూపిస్తారు.

గురువుల గొప్పతనాన్ని శిష్యులు నిరూపిస్తారు.

 

కలేకూరి ప్రసాద్ కత వేరు.

తను బయట వుండి చావుని కొని తెచ్చుకున్నాడు.

చెలం లోపలుండి  చావుకు ఎదురెళ్ళాడు.

తనంటే నాకు కొంచెం గర్వంగా వుండేది.

 

విప్లవోద్యమంలో  నా కాంట్రిబ్యూషన్ కొంత వుందని చెప్పడానికయినా కొందరు మిగిలి వుండాలిగా.

వాళ్ళే నాకన్నా ముందే చనిపోతే

నా గొప్పలు నేనే చెప్పుకోవాలి.

అది చాలా హీనంగా వుంటుంది. 

 

నేను హోల్ టైమర్ జీవితం నుండి బయటికి వచ్చి ఆటోమోబైల్ రంగంలో ఉద్యోగంలో చేరాను. అప్పుడు కారంచేడు సంఘటన జరిగింది.

 

కారంచెడు ఉద్యమంలో పనిచేయడానికి ఎవర్ని పంపించాలో ఆ పార్టికి అర్ధం కాలేదు.

ఒకటి రెండు ప్రయత్నాలు చేశారు. సఫలం కాలేదు.

 

నేనయితే బాగుంటుందని సుధాకర్  భావించాడు.

కారంచెడు ఇష్యూను నువ్వు సాల్వ్ చేయగలవు.

నువ్వు వెళ్ళి తీరాలి అని నన్ను తనే అడిగాడు.

నాక్కూడ ఆ ఛాలెంజ్ నచ్చింది.

మరొక్కసారి హోల్ టైమర్ గా మారాను.  

 

కారంచెడు ఉద్యమానికి ముందు అలాంటి ఒక్క ఉదాహరణ కూడ (precedent) లేదు.

అయినప్పటికీ ఆ ఉద్యమం చాలా గొప్పగా విజయవంతం అయ్యింది.

ఆ తరువాత కత వేరు.

 

నెమలూరి భాస్కర రావు / మల్లిక్ వంటి కపటి వచ్చాక నేను పీపుల్స్ వార్ తో సన్నిహితంగా కొనసాగలేకపోయాను. ఆ పార్టీ నుండి తప్పుకున్నాను.  

 

అయినా, వ్యక్తిగత స్థాయిలో కొందరితో పాత  అనుబంధం కొనసాగింది.

నేను బయటికి వచ్చాక కూడ పీపుల్స్ వార్ వాళ్ళు అడిగిన ఏ పనినీ కాదనలేదు.

అజితను ప్లీజ్ చేయడానికి కూడ కొన్ని పనులు చేసి పెట్టాను.

 

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో 2004లో  అక్టోబరులో శాంతిచర్చలకు వచ్చిన నక్సల్స్ ప్రతినిధి బృందంతో తను ఉపనాయకుడు. అప్పట్లో తను ఆంధ్రా-ఒరిస్సా బార్డర్ AOB  జోనల్ కార్యదర్శిగా వుంటున్నాడు.

 

చర్చల కోసం వాళ్లందరూ శ్రీశైలం సమీపాన చినఆరుట్ల గ్రామం దగ్గర బయటికి వచ్చారు. ప్రభుత్వం కూడ చర్చల అనంతరం చినఆరుట్ల గ్రామం దగ్గరే వాళ్ళనును లాంఛనంగా దించేసింది. నిజానికి ఎవరి డెన్ లు వారికున్నాయి.

 

ఓరోజు రాత్రి చెలం ఫోన్ చేశాడు. తనను ఒరిస్సా ఆంధ్రా బోర్డర్ లోని తన డెన్ లో దించాలని అడిగాడు. నేను సరే అన్నాను. అజితతో పాటు వెళ్ళి అప్పర్ సీలేరు ప్రాంతలో దించి వచ్చాను.

 

ఆ మధ్య ఎవరో ఓ పాత రాడికల్ నన్ను పత్రికల్లో నాలుగు వ్యాసాలు రాస్తే పెద్దవాళ్లయిపోరు అని ఎద్దేవ చేశాడు.

 

అక్షరాలతోపాటు ఆయుధాలనూ సృష్టించాను అని గట్టిగా చెప్పాలనుకున్నాను.

అది చెప్పాల్సింది నేను కాదు. చెప్పాల్సినవాళ్లు చెప్పాలి.

ఇప్పుడు చెప్పాల్సిన వాడు చనిపోయాడు.

సుధాకర్ మరణం నాకు మామూలు నష్టంకాదు.

నా నైతికతే సంక్షోభంలో పడిపోయింది.

 

తల్లిదండ్రుల కళ్లముందే పిల్లలు చనిపోవడంకన్నా బాధ ఈ భూమ్మీద మరోటి వుండదని అంటారు.

గురువుల కళ్ళముందే శిష్యులు చనిపోవడంకన్నా బాధ ఈ భూమ్మీద వుండదు.

 

 

తను ఆయుధాల సేకరణ విభాగంలో వున్నాడని కొన్నేళ్ల క్రితం ఎవరో అన్నారు.

రాజకీయ అవగాహన  విభాగాన్ని పర్యవేక్షిస్తున్నాడని ఇంకోసారి విన్నాను.

మంచి వ్యూహకర్తగా మారాడని కొందరు చెప్పారు.  

కాబోయే జాతీయ కార్యదర్శి అన్నారు.

నా పొగరు కొంచెం పెరిగింది.

కానీ ఇప్పుడు అదంతా గతం అయిపోయింది.

 

మా అనుబందానికి ప్రతీక గుణదల కొండ.

రాత్రి గుణదల కొండెక్కి విజయవాడ అంతా వినిపించేలా గట్టిగా ఏడ్వాలనిపించింది.  

ఇప్పుడు నేను జమిందార్ బిల్డింగులోని డానీని కాను.

హిప్పోక్రాట్ అయిపోయాను.


తను బతకాలనుకున్నట్టే బతికాడు. చావాలనుకున్నట్టే చనిపోయాడు. ఇంతటి అదృష్టం కోటికి ఒక్కరికి కూడ దక్కదు. .


వీరుల మరణవార్తలు విన్నప్పుడు ముందు కొంచెం విషాదంగా ఉంటుంది. ఆ విషాదంలోనూ బోలెడు గర్వం ఉంటుంది.

 

*డానీ*

06 జూన్ 2025

తెలిసి తెలిసి ఒకే తప్పును పలుమార్లు చేస్తుంటే ఏమనుకోవాలీ?

 *తెలిసి తెలిసి ఒకే తప్పును*

*పలుమార్లు చేస్తుంటే ఏమనుకోవాలీ?*



మా భూమి సినిమాలోని ‘బండెనకబండికట్టి పదారు బండ్లు కట్టి’ పాట తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బండి యాదగిరి రాసిన ఒరిజినల్ పాటకు పూర్తి వక్రీకరణ.
మనం ఘనంగా చెప్పుకునే ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం’ సాగింది నల్గొండ, వరంగల్లు జిల్లాల్లో. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ జిల్లాల్లోని కొన్ని తాలుకాల్లో.
నల్గొండజిల్లాలో ఎర్రపహడ్ (సూర్యపేట) దొర జెన్నారెడ్డి ప్రతాప రెడ్డి, వరంగల్లు జిల్లాలో విసునూరు దొర రాపాక రాంచంద్రారెడ్డి ఆ ఉద్యమానికి ప్రధాన ప్రతినాయకులు.
ఆ ఉద్యమంలో చాలా కాలం నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ ప్రస్తావన లేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, నిజాం భారత దేశంలో చేరకుండ స్వతంత్ర్య దేశంగా వుండాలనుకున్న తరువాత, ఖాసిం రజ్వీ తయారుచేసిన రజాకార్ల ఆగడాలు మీతిమీరాక మాత్రమే సాహిత్యంలో అదీ చాలా అరుదుగా నైజాం నవాబు ప్రస్తావన వచ్చింది.
ఎర్రపహడ్ దొర జెన్నారెడ్డి ప్రతాప రెడ్డి మీద నల్గొండజిల్లాకు చెందిన కవి-గాయకుడు-ఉద్యమకారుడు, అమరుడు బండి యాదగిరి ‘బండెనక బండికట్టి’ పాట రాశాడు. ఆ పాట చరణాలు అన్నింటిలోనూ చివరి పంక్తిలో “నా కొడుక ప్రతాపరెడ్డి” అనే మకుటం పునరావృతం అవుతూ వుంటుంది.
మర్రి చెన్నా రెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా 1979 మార్చి 23న మా భూమి సినిమా విడుదల అయ్యింది. అప్పట్లో సెన్సార్ బోర్డు అధికారిగా వున్నవారు కూడ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే.
రెడ్డి ముఖ్యమంత్రి, రెడ్డి సెన్సార్ అధికారి వుండగా “నా కొడుక ప్రతాపరెడ్డి” అని పాట వుంటే సినిమా విడుదల కాదనో మరే కారణం చేతనో బండి యాదగిరి పాటను నిర్మాతలు మార్చేశారు. జెన్నారెడ్డి ప్రతాప రెడ్డిని కాపాడి “నా కొడుక ప్రతాపరెడ్డి” అని వున్న మకుటాన్ని ‘నైజాము సర్కరోడా!’గా మార్చేశారు.
అప్పటికే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చనిపోయి పుష్కరం దాటింది. ఆయన సమాధి నుండి బయటికి వచ్చి”నేను తిరిగితే, 16 రోల్స్ రాయిస్ కారుల్లో హైదరాబాద్ వీధుల్లో కాన్వాయిగా తిరుగుతానేమోగానీ, ఎర్రపహాడ్ వీధుల్లో పదహారు ఎడ్లబండ్ల మీద ఎందుకు తిరుగుతానూ?” అని అభ్యంతరం చెప్పలేడని సినీ నిర్మాతల ధైర్యం కావచ్చు. నవాబ్ వారసులు, అభిమానులు ఎలాగూ తెలుగు సినిమాలు చూడరనే గట్టి నమ్మకం కూడ ఈ బరితెగింపుకు కారణం కావచ్చు.
ఈ వక్రీకరణ గద్దర్ చేశాడో, మరొకరు చేశారో బయటికి తెలీదు. కానీ ఇది గద్దర్ పాటగానే ప్రచారం అయ్యింది. గద్దర్ కూడ “నా కొడుక ప్రతాపరెడ్డి” మకుటంను తొలగించి ‘నైజాము సర్కరోడా!’ మకుటం వున్న పాటనే బహిరంగ సభల్లో పాడేవాడు. ఇది సంఘపరివారం సాగించే ముస్లిం వ్యతిరేక ప్రచారానికి చాలా అనుకూలంగా మారింది. ఆరెస్సెస్ నాయకులు నిజాం నవాబును తిట్టడానికి ‘గద్దర్ పాట’ను కోట్ చేయడం మొదలెట్టారు. ఇది కేవలం మకుటం మార్పు కాదు మతమార్పు.
ఈరోజు మాడభూషి శ్రీధర్ (Madabhushi Sridhar) గారు మళ్ళీ వక్రీకరణ పాటనే సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
కమ్యూనిస్టు పార్టీల విధేయులైన మేధావులు ఈ వివాదం మీద ఎక్కడయినా రాశారేమో నేను చదవలేదు. ఇతరులు ఒక్క అక్షరం తేడా రాసినా పోలీసుల్ని మించిన “ఇంటరాగేషన్” చేసే ఈ విధేయులు ఇంతటి వక్రీకరణనను కడుపులో దాచేసుకున్నారా! తెలీదు!
*డానీ*

మా భూమి సినిమా పాటలో పది అంశాలు

 *మా భూమి సినిమా పాటలో పది అంశాలు*




 

1.            ఎర్రపహడ్ దొరజెన్నారెడ్డి ప్రతాప రెడ్డి మీద యాదగిరి ‘బండెనక బండికట్టి’ పాటరాశాడు. దీన్ని ఉద్యమ ఆరంభ కాలంలో రాసి వుంటాడు.     

2.            అతనే నిజాం నవాబు మీద ‘నైజాము సర్కరోడ నాజీల మించినోడ’ పాట కూడ రాశాడు. దీన్ని స్వాతంత్ర్యానంతరం రాసివుంటాడు.  

3.            మాభూమి సినిమా కథ ప్రతాప రెడ్డి ఆవరణలో సాగుతుంది. పాట మాత్రం హఠాత్తుగా నిజాము ఆవరణ లోనికి  మారిపోతుంది. ‘బండెనక బండికట్టి’ పాట తలను తీసుకొచ్చి ‘నైజాము సర్కరోడ’ పాట మొండేనికి అతికించారు. వీక్షణం ఎడిటర్  ఎన్ వేణుగోపాల్ భాషలో అక్కడి పల్లవిని తీసుకొచ్చి ఇక్కడి చరణాలకు జోడించారు.   

4.            యాదగిరి అటు  ఎర్రపహడ్  దొర‌ను ఇటు నైజాము సర్కారునూ విమర్శిస్తూ పాటలు రాశాడు. రాసిన సందర్భాలు వేరైనా ఆయన దృష్టిలో ఇద్దరూ దోషులే. 

5.            సినిమా పాటలో ఎర్రపహడ్  దొర జెన్నారెడ్డి ప్రతాప రెడ్డికి పూర్తిగా లీగల్ ఇంప్యూనిటి ప్రకటించి నైజాము సర్కరోడిని మాత్రమే బోను ఎక్కించారు. 

6.            ఇద్దరు వ్యక్తులు ఒకేరకం తప్పుచేసినా ఒకరికి లీగల్ ఇంప్యూనిటి ప్రకటించి మరొకరికి  మాత్రమే శిక్ష వేసే మనుస్మృతి సాంప్రదాయం ఒకటి మనకు వుండింది. 

7.             “ఆ పాట మీద వివాదం, లేనివి వెతకడానికి ప్రయత్నించడం అనవసరం” అని వేణుగోపాల్ హితవు కూడ పలికారు. 

8.            వేణుగోపాల్ రైటప్ ఆ పురాతన శిక్షాస్మృతిని బాహాటంగా సమర్ధిస్తున్నది. 

9.            వారి హితవు దొరజెన్నారెడ్డి ప్రతాప రెడ్డి సామాజికవర్గానికి అనుకూలంగానూ, నైజాము సర్కారు సామాజికవర్గానికి ప్రతికూలంగానూ వున్నది. ఇద్దరూ రెండు మతాలకు ప్రతినిధులు. మావోయిస్టుల్లో స్థాయి మేధావులుగా చెలామణి అవుతున్నవారు ఏ మత సమూహానికి లీగల్ ఇంప్యూనిటీ ఇస్తున్నారూ? ఏ మత సమూహాన్ని బోను ఎక్కిస్తున్నారూ? అనేదే ఈ వివాదానికి మూలం.  ఇది పాట మీద వివాదం మాత్రమేకాదు; మావోయిస్టుల సామాజిక దృక్పథాల మీద వివాదం. 

10.    It is not the consciousness of men that determines their being, but, on the contrary, their social being that determines their consciousness.

 

*డానీ*

05 జూన్ 2025