Saturday 23 May 2020

నరేంద్ర! ఐ లవ్ యూ

నరేంద్ర! ఐ లవ్ యూ - II

ఈ రాత్రి హటాత్తుగా నరేంద్ర రేవల్లి బాగా గుర్తుకు వస్తున్నాడు.
ఆర్థిక శాస్త్రంలో మెళుకువల్ని నేను ప్రొఫెసర్ ఆర్ ఎస్ రావు దగ్గర నేర్చుకున్నాను. నేను నా గురువులుగా భావించే వారిలో ఆర్ ఎస్ రావు ఒకరు.
పొట్లూరి పుల్లయ్య గారూ (షేర్ సింగ్) ఆంధ్రజ్యోతిలో స్టాక్ మార్కెట్ ఫండమెంటల్స్ ను విశ్లేషించేవారు. నన్ను టెక్నికల్స్ ను విశ్లేషించమని వారు ప్రొత్సహించారు.
ఆర్థిక శాస్త్రంలో ముఖ్యంగా స్టాక్ మార్కెట్ మీద నాకున్న నైపుణ్యాన్ని టివీ ప్రేక్షకులకు తెలుపడానికి చాలా ఆసక్తి చూపినవాడు నరేంద్ర. తను నేను 2004-2006 మధ్య కాలంలో సి-టీవీలో రెండేళ్ళకు పైగా కలిసి పనిచేశాము. ప్రతి వారం నా డెస్క్ దగ్గరకు వచ్చి ఇంటర్ వ్యూ చేసేవాడు. అప్పటి అనేక వీడియోల్లో ఓ రెండు మాత్రం నా దగ్గర మిగిలాయి.
ఆ తరువాత హెచ్ ఐవీ-ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలోనూ నేను ఒక రిసోర్స్ పర్సన్ గా వున్నాను. దానికి కో-ఆర్డినేటర్ నరేంద్ర.
ఇప్పుడు నరేంద్ర మన మధ్యలేడు. కానీ అతని జ్ఞాపకాలు నాతో కొనసాగుతున్నాయి. నరేంద్ర! ఐ లవ్ యూ.

Thursday 21 May 2020

రావమ్మా గోదావరి రాయలసీమకు


రావమ్మా గోదావరి రాయలసీమకు
డానీ
22 మే 2020

కృష్ణానది నిర్వహణ బోర్డు KRMB  రోజు సమావేశం అయింది.
కృష్ణా జలాల్లో కేటాయించిన వాటికన్నా ఎక్కువ నీళ్ళు వాడుకుంటున్నారని  
తెలంగాణ మీద ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ
ఆరోపణలు చేసుకుంటున్నాయి.

కృష్ణానదిలో నీళ్ళు తక్కువ వినియోగం ఎక్కువ.
గోదావరినదిలో నీళ్లు ఎక్కువ వినియోగం తక్కువ.
కృష్ణానదిలో నీళ్ళు తక్కువ వివాదాలు ఎక్కువ !


అంతర్ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం 1956 Interstate River Water Disputes Act – 1956

కృష్ణానదీజలాల వివాదం 50 యేళ్ల క్రితమే మొదలయింది.

కృష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ

గోదావరి నది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా  - ఇప్పుడు తెలంగాణ, ఛత్తీస్ గడ్.  

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎస్ బచావత్  10 ఏప్రిల్ 1969 ట్రిబ్యూనల్.

The final report of Krishna Water Disputes Tribunal KWDT  was submitted to GoI on  27 May 1976.

The final report of the Godavari Water Disputes Tribunal GWDT was submitted to GoI on 7 July 1980

Krishna Waters Distribution
75% dependable yield 2060 TMC
Maharashtra 500 TMC
Karnataka 760 TMC
Andhrapradesh 800 TMC (plus 11 TMC)

Godavari Waters Distribution
75% dependable yield 3565 TMC
Andhrapradesh   1495 TMC
AP has harnessing 600 TMC
ఇప్పుడు ఉమ్మడి ఏపీ తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ గా మారాయి.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం – 2014 సెక్షన్ 85లో కృష్ణా జలాలను నిర్ధిష్టంగా పంపిణి చేశారు.

ఆంధ్రప్రదేశ్ కు 64  శాతం 512 / TMCs
తెలంగాణకు 36 శాతం             288 / TMCs

 కృష్ణానదిలో లభ్యమయ్యే నీటిలో చివరి చుక్క వరకు 1976లో పంచేశారు.
ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రాజెక్టు కట్టే అవకాశమేలేదు.
కట్టినా దానికి నికరజలాల కేటాయింపులేదు.

1977లో మద్రాసు మహానగరం దాహార్తిని తీర్చడానికి కృష్ణా పరివాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు
చెరో 5 టిఎంసీలు = 15 టిఎంసీలు.
శ్రీశైలం రిజర్వాయర్ - పూండి రిజర్వాయర్. 406 కి.మీ.
1983 ఎన్టీఆర్ – ఎంజిఆర్ – ఇందిరాగాంధి.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్స్. 11, 500 క్యుసెక్కులు. 15 + 15 టిఎంసీలు.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్స్ – బనకచర్ల

తెలుగుగంగ,
గాలేరు-నగరి,
శ్రీశైలం కుడిగట్టు కాలువ
ప్రతి ఏటా 102 టీఎంసీలు.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్స్
కర్నూలు జిల్లా  నందికొట్కూరు – ఆత్మకూరు పట్టణాల మధ్య ప్రధాన రహదారికి 4 కి.మీ.

స్పిల్ లెవల్ 841 అడుగులు MSL
Minimum Draw Down Level (MDDL) of 854 ft. MSL  3,000 cu/sec
Full Reservoir Level FRL 890 ft. MSL 40, 000 cu/sec

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్స్ - బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ 16.5 కి.మీ.
అక్కడి నుండి మూడు మార్గాలు.


వరద రోజులు తగ్గిపోవడంతో తక్కువ కాలంలో నిర్ణిత జలాలను విడుదల చేయాలంటే డిశ్చార్చి కెపాసిటీని పెంచక తప్పదు.

రెగ్యులేటర్ డిశ్చార్చి కెపాసిటీని 44 వేల క్యుసెక్కులకు పెంచుతూ 
అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 2005 సెప్టెంబరు 13 AP GO MS 170ని విడుదల చేశారు.
అది అప్పుడూ పెద్ద దుమారాన్ని రేపింది. వైయస్ కేబినెట్ లో వున్న టిఆర్ఎస్ మంత్రులు కొందరు ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాజీనామాలు చేశారు.
ఇప్పుడు మళ్ళీ వరద రోజులు తగ్గిపోయాయి.
డిశ్చార్జి కెపాసిటీని మళ్ళీ పెంచాల్సిన సందర్భం వచ్చింది.

హెడ్‌ రెగ్యులేటర్‌  నీటి విడుదల సామర్థ్యాన్ని 80 వేల కుసెక్కులకు పెంచుతూ 2020 మే 5  ఏపీ ప్రభుత్వం AP GO MS No. 203ను జారీ చేసింది.

సహజంగానే తెలంగాణలో వివాదం మొదలయింది.
తెలంగాణ ప్రభుత్వం KRMB కు పిర్యాదు చేసింది.
ఆమ్ధ్రప్రదేశ్ కూడ KRMBకు ప్ర్యాదు చేసింది.

అతిక్రమణలు రెండువైపులా వున్నాయి.

కేసిఆర్ సంయమనంతో వ్యవహరించారు.
గోదావరిలోవున్న అదనపు జలాలను ఇరు రాష్ట్రాలు ఉపయోగించుకోవచన్నారు.

తెలంగాణలో ప్రతిపక్ష బిజేపి పోతిరెడ్డిపాడు అంశం మీద తీవ్రంగా స్పందించింది.
వ్యవహారాన్ని కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి తీసుకునిపోయింది.

ఏపిలో ప్రతిపక్ష చంద్రబాబు పోతిరెడ్డిపాడు విస్తరణకు సమర్థించనూ లేదు వ్యతిరేకించనూ లేదు. పోతిరెడ్డిపాడు సృష్టికర్త టిడిపి యే అని చెప్పుకొచ్చారు.
పోతిరెడ్డిపాడు విస్తరణ అంశాన్ని మాత్రం మాట్లాడలేదు.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్  NGT పోతిరెడ్డిపాడు విస్తరణ పథకానికి స్టే ఇచ్చింది.


గోదావరిలో దాదాపు 3 వేల కుసెక్కులకు పైగా  నీళ్ళున్నాయి.

1.     ప్రాణహిత నది తెలంగాణలో  కాళేశ్వరం వద్ద గోదావరి ప్రధాన పాయతో కలుస్తుంది. Kaleshwaram is a village in Mahadevpur Mandal in Bhoopalpally          district in the Indian state of Telangana.

2.    The Ichchampalli project location is downstream of the point where Indravati River joins Godavari river in Karimnagar district  of Telangana. The Indravati joins the Godavari river near Bhadrakali village in Bijapur district of Chhattisgarh.

3.    శబరి నది ఆంధ్రప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా కూనవరం దగ్గర గోదావరిలో కలుస్తుంది. స్తుంది.  

ఈ మూడు  పాయింట్లలో ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌లో
3000 - 3100 వేల టిఎంసిల నీటి లభ్యత వుంటుంది.

The Kaleshwaram Lift Irrigation Project was opened by Telangana Governor E. S. L. Narasimhan and Chief minister K. Chandrashekar Rao On 21 June 2019

Union Government
Godavari, Krishna and Kaveri -  three rivers linkage project.  
Draft Detailed Project Report (DDPR)
247 TMC from Godavari

Rattan Lal Kataria, Union Minister of State for Jal Shakti & Social Justice and Empowerment announced in a written reply in Rajya Sabha on February 10, 2020.   

The cost of the project has been estimated as Rs 60,361 crore at the financial year 2018-19 price level by National Water Development Agency (NWDA).

The minister said that the project to connect the rivers includes three links —
a.    Godavari (Inchampalli/Janampet)-Krishna (Nagarjunasagar),
b.    Krishna (Nagarjunasagar)-Pennar (Somasila) and
c.    Pennar (Somasila)-Cauvery (Grand Anicut).
According to the draft DPR, around 247 TMC of water can be diverted from Godavari river to Nagarjunsagar dam through lifting and further south for meeting the demands of Krishna, Pennar and Cauvery basins.

In 2019 Nitin Gadkari, the then Water Resources Minister had said that Godavari-Kaveri river linking project would resolve the water disputes of Andhra Pradesh, Telangana, Karnataka and Tamil Nadu.

The project will make use of 1,100 tmc ft water of Godavari which is currently being wasted by going directly into the Bay of Bangal.

కేంద్ర ప్రభుత్వ జోక్యంతో గోదావరి నీళ్ళను ఇతర రాష్ట్రాలు కొట్టుకుపోవడానికి ముందే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు సమిష్టిగా రాయలసీమ సమస్యను పరిష్కరించాలి.

Tuesday 12 May 2020

లోకం మారలేదు. చాలా బాధగా వుంది.

లోకం మారలేదు. చాలా బాధగా వుంది.

తొమ్మిదో ఏట నుండి నేను వింటున్న కథ ఇది. రెండవ ఖలీఫా హజ్రత్ ఉమర్ కాలం నాటి కథ. పేదవాళ్ళకు బాగా పరిచయం వున్న కథ. ఇది నా జీవితంలోని కథ. ఇంట్లో అన్నం నిండుకుందని మాకు నేరుగా చెప్పలేక మా అమ్మ ఈ కథను తరచూ చెప్పేది. ఆకలంత సహజంగా అన్నం అంత అవసరంగా  నా జీవితం లోనికి కథలు వచ్చాయని మూడున్నర  దశాబ్దాల క్రితం కాళీపట్నం  రామారావుగారికి చెప్పాను. ఓ వ్యాసంలోనూ రాశాను.  రెండు రోజుల క్రితం సాజీ గోపాల్ చేసిన ఇంటర్వ్యూలోనూ ఈ కథను ప్రస్తావించాను.

ఇప్పుడు నిజంగా జరుగుతోంది. లోకం మారలేదు. చాలా బాధగా వుంది. దుఖఃం ముంచుకు వస్తోంది. 

Wednesday 6 May 2020

From Markaz to Palghar Lynching


From Markaz to Palghar Lynching
మర్కజ్ నుండి పాల్ఘార్ వరకు

డానీ

            కరోనా వైరస్ జాతి, కుల, మతాల్ని చూడదని భారత ప్రధాని నరేంద్ర మోదీజీ ఏప్రిల్ 19న గుర్తు చేశారు. కరోనా సొకినవారిని  ‘బాధితులు’ అనరాదనీ వారిని ‘కరోనా సోకినవారు‘ ‘చికిత్సలో ఉన్నవారు’ అని మాత్రమే పేర్కొనాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. కరోనా వ్యాప్తి విషయంలో “మతాలు, ప్రాంతాల” ముద్రలు రుద్దకూడదని కూడ హెచ్చరించింది. అంతకు ముందే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి కూడ ఇలాంటి హెచ్చరికలే చేశాయి. కానీ అప్పటికే భారత దేశంలో కరోనాకు మతతత్వం గట్టిగా సోకేసింది.  అంతకు ముందే దేశంలో కొనసాగుతుండిన ఆర్ధిక మందగమనం కరోనా వైరస్ వ్యాప్తితో ఆర్థిక మాద్యంగా మారినట్టు అంతకు ముందే దేశంలో కొనసాగుతున్న ఇస్లామో ఫోబియా కరోనా వైరస్ కాలంలో మరింతగా విజృంభించింది.

            కరోనా మతతత్వానికి ఆజ్యంపోసింది సాక్షాత్తు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ. ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి మధ్యలోనే కరోనా ప్రమాదాన్ని గురించి హెచ్చరించింది. మార్చి 11న కోవిడ్-19ను విశ్వమారిగా ప్రకటించింది. కోవిడ్ కేసులు నమోదవుతున్నప్పటికీ దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ లేదని ప్రకటించి దేశ ప్రజలకు మార్చి 13న ఒక తప్పుడు సంకేతాన్ని ఇచ్చారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవాల్ మార్చి 29న  ఢిల్లీ నిజాముద్దీన్ లోని తబ్లిఘీ జమాత్ అంతర్జాతీయ కార్యాలయం (మర్కజ్)ను ఖాళీ చేయించిన తరువాత లవ్ అగర్వాల్ కొత్త వివాదానికి తెరలేపారు.  వారు ప్రతిరోజూ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కరోనా సోకిన వారి వివరాలు చెప్పే సమయంలో మర్కజ్ తో లింకులున్న కేసుల్ని ప్రత్యేకంగా పేర్కొనడం మొదలెట్టారు. ఇది వైద్య ఆరోగ్య నైతిక ప్రమాణాలకు వ్యతిరేకం మాత్రమేకాదు చట్ట విరుధ్ధం కూడ.

            ఆ మాత్రం ఉప్పు అందితే చాలు సామాజిక మాధ్యమాల ట్రోలర్స్ (Trollers) రెచ్చిపోతారు. ఇది సత్యానంతర (Post-truth) కాలం కనుక వాస్తవాలకన్నా నకిలీ వార్తలే ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంటాయి. వాస్తవవాస్తవాలతో  సంబంధం లేకుండ చేతికి అందిన పది రాళ్లను వేగంగా విసరడమే దినచర్యగా మార్చుకున్న సామాజిక మాధ్యమాల వీరులకు చేతినిండా పని దొరికింది. నకిలీ వీడియోలు, సంబంధంలేని వీడియోలు, మార్పులు చేసిన (doctored) వీడియోలు, అసందర్భ ఆడియోలు రంగప్రవేశం చేసి వైరల్ గా మారి వాతావరణాన్ని మతోన్మాదంతో కలుషితం చేసేశాయి.
                       

          ప్రపంచాన్ని కరోన వైరస్ కమ్ముకుంటున్న వేళ మర్కజ్ ఆమిర్ (అధినేత) మౌలనా ముహమ్మద్ సాద్ కాంధ్లావి  మార్చి13-15 తేదీల్లో  ఒక అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో వివిధ దేశాల ప్రతినిధులు అనేకులు పాల్గొన్నారు. మర్కజ్ లో జరిగిన ఈ సమావేశానికి అవసరమైన అన్ని అనుమతుల్నీ ముందుగానే తీసుకున్నారు. తీరా విదేశీ ప్రతినిధులు భారతదేశం చేరుకుని మర్కజ్ లో సమావేశం ఆరంభమయ్యాక ఢిల్లీ ప్రభుత్వం కరోనా వ్యాప్తి నిరోధానికి రాజధాని నగరంలో అనేక నిషేధాజ్ఞాల్ని ప్రకటించింది. సాంకేతికంగా తమ తప్పు ఏమీలేదని మర్కజ్ భావించవచ్చు. కానీ, ప్రపంచం రోగగ్రస్తంగా మారుతున్నప్పుడు బాధ్యతగల ధార్మిక సంస్థలకు సామాజిక బాధ్యత, నైతిక బాధ్యత కూడ ముఖ్యమే.

దేశంలోనికి విదేశీ పర్యాటకుల రాకపోకల వ్యవహారం మొత్తం కేంద్ర హోంశాఖ కనుసన్నల్లో వుంటుంది. ఢిల్లీ పోలీసు వ్యవస్థ కూడ కేంద్ర హోంశాఖ ఆధీనంలోనే వుంటుంది. మర్కజ్ గోడను ఆనుకునే నిజాముద్దీన్ పోలీసు స్టేషన్ వుంటుంది. అయినా ఈ సమావేశాన్ని పోలీసులు అస్సలు పట్టించుకోలేదు. అమాయికత్వంతోనో, అజ్ఞానంతోనో, తగిన సమాచారంలేకనో, అతివిశ్వాసంతోనో, మూఢత్వంతోనో మౌలనా ముహమ్మద్ సాద్ ఒక తప్పుచేశారు. సయ్యద్ అహమద్ ఉల్ హుస్సైనీ సయీదుల్ ఖాదరి వంటి ముస్లిం స్కాలర్లు చెప్పినట్టు మౌలానా ముహమ్మద్ సాద్ చర్య “నేరపూరిత అజ్ఞానం” (Criminal Ignorance) అయితే; రాజ్ దీప్ సర్దేశాయి వంటి సీనియర్ జర్నలిస్టులు చెపుతున్నట్టు తబ్లీఘీల సమావేశాన్ని నిరోధించడంలో ఢిల్లీ పోలీసుల వైఫల్యం కూడ “నేరపూరితమైన నిర్లక్ష్యం” (criminal negligence). రెండు వైపులా తప్పు జరిగినప్పుడు ఒక వైపు జరిగిన తప్పునే ఎత్తి చూపడాన్ని ఏమనాలీ? ఇది మతతత్వంకాక మరేమిటీ?

 

            ఏప్రిల్ 6న లవ్ అగర్వాల్ ప్రకటించిన గంణాంకాల ప్రకారం దేశంలో కరోనా సోకినవారు 4,281 మంది అయితే వారిలో మర్కజ్ లింకు వున్న వారు 1,445 మంది. అంటే 33.75 శాతం. ఏప్రిల్ 18 గణాంకాల ప్రకారం కరోనా సోకినవారు 14,378 మంది అయితే మర్కజ్ లింకు 4,291. అంటే మర్కజ్ శాతం 33.75 నుండి 29.84 కు తగ్గింది.  ఇక్కడ లవ్ అగర్వాల్ తెలివిగా దాటవేసిన విషయం ఒకటుంది. 29 శాతం  ఒక మత సంస్థకు చెందిన వారని ప్రకటించారుగానీ మిగిలిన 71 శాతం ఏ మత సంస్థకు చెందినవారో వారు ప్రకటించలేదు. వారు చెప్పక పోయినా ఆ సమూహాన్ని ఊహించడం పెద్ద కష్టం ఏమీకాదు. ఆ తరువాత మర్కజ్ లెఖ్ఖలు చెప్పడం వారు మానేశారు. అది కూడ ఒక తెలివే. ఇతర లింకుల్లో కరోనా సోకినవారి వివరాలు బయటికి వచ్చే కొద్దీ మర్కజ్ లింకు శాతం తగ్గుతూ వుంటుంది.

 

            ముస్లిం సమాజంలో సున్నీ, షియా, సూఫీ, నూర్ భాషా, ఆష్రాఫ్, అజ్లాఫ్, అర్జాల్  వంటి కొన్ని  తెగలు వుంటాయి. ఆ పైన ఓ పది  జమాత్ లు వుంటాయి. అలాంటి జమాతుల్లో తబ్లిఘీ ఒకటి. అసలు ఏ జమాత్ లోనూ వుండనివారు కూడ అనేకులు వుంటారు.  మొత్తం భారత ముస్లిం సమాజంలో తబ్లిఘీ అనేది ఒక చిన్న భాగం మాత్రమే అని చెప్పడానికే ఈ వివరణ. 

 

            అసదుద్దీన్ ఒవైసీ వంటి ముస్లిం రాజకీయ  ప్రతినిధులు మొదలుకొని ముస్లిం ఆలోచనాపరులు, మౌల్వీలు, ముఫ్తీలు  అనేకులు  కరోనా వ్యాప్తి నిరోధానికి స్వీయసమాజానికి అనేక సూచనలు చేశారు. వైద్యులతో సహకరించాలనీ, క్వారంటైన్, ఐసోలేషన్, ఫిజికల్ డిస్టాన్స్ సురక్షిత దూరం  నియమాలు పాటించాలనీ శుక్రవారం ప్రత్యేక ప్రార్ధనలు, రంజాన్ మాస నమాజులు, ఇఫ్తార్లు, తరావ్హీలు ఇంట్లోనే సాగించాలనీ అక్కడా భౌతిక దూరాన్ని పాటించాలని ముస్లిం ధార్మిక సంస్థలు ఫత్వాలు జారీ చేశాయి. ఇస్లాం పవిత్ర స్థలాలైన మక్కా, మదీనా మసీదుల్లోనూ భక్తులు గుమిగూడడాన్ని నిషేధించారు. ఈ వాస్తవాలు ప్రధాన స్రవంతి మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ వైరల్ కాలేదు!. కొద్దిమంది చేసిన తప్పుకు దేశంలోని 20 కోట్ల మంది ముస్లింలను శిక్షించాల్సిందే అన్నట్టుగా మూకోన్మాదం చెలరేగిపోయింది.

 

            భారత ముస్లిం సమాజంలో  అత్యధికులు వృత్తిదారులు, చిరువ్యాపారులు, స్వయం ఉపాధిదారులు. లాక్ డౌన్ కాలంలో ‘సోషల్ డిస్టాన్స్’ అనేది వీళ్ళ మీద సోషల్ బాయ్ కాట్ గా మారింది. రైతుబజార్లలో ముస్లిం దుకాణదారుల వద్ద కూరగాయలు ఎవరూ కొనడంలేదు. వీధుల్లో  ముస్లిం  తోపుడుబండ్ల వారి వద్ద పండ్లు కొనడంలేదు. డెలివరీ బాయ్స్ ముస్లింలు అయితే ఫ్లాట్ యజమానులు తిప్పి పంపించేస్తున్నారు. అద్దెకు వుంటున్న ముస్లింలను ఇళ్ళు క్హాలీ చేయమంటున్నారు. రేపు లాక్ డౌన్ ముగిసిన తరువాత ముస్లింల షో రూములు సహితం ఈ ఆర్థిక వెలివేతకు  గురికాబోతున్నాయి. కష్టమర్ల మెప్పుకోలు కోసం ప్రైవేటు వాణిజ్య సంస్థలు ముస్లింలను రిక్రూట్ చేసుకోకపోవచ్చు. వున్న ముస్లిం సిబ్బందిని తొలగించవచ్చు. దేశంలో మొత్తం ముస్లింల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతున్నది!.

 

            లౌకికవాదం ఇతరులకు ఒక ఆప్షన్ మాత్రమే. అది ముస్లింలకు ప్రాణావసరం. మూకోన్మాదం క్రమంగా లౌకికవాదాన్ని మింగేస్తుంది. ఇప్పుడు మతసామరస్యవాదులుగా కొనసాగుతున్నవారి అంతరాంతరాలలో కొనసాగుతున్న మతతత్వాన్ని మూకోన్మాదం వెలికి తీస్తుంది. పోలీసు, న్యాయవ్యవస్థల్లోనూ ఇంకిపోయిన మతోన్మాదం మూకోన్మాదులతో ఉదారంగా వ్యవహరిస్తుంది. వాళ్ళను శిక్షించకుండ వదిలేసి, లీగల్ ఇంప్యూనిటీని ఇస్తుంది. మూకోన్మాదాన్ని మొగ్గలోనే తుంచివేయాలి.  లేకపోతే కొందరికి అదొక వ్యసనంగా మారిపోతుంది. ఈరోజు ముస్లింల మీద మూకోన్మాద దాడులు  చేస్తున్నవాళ్ళురేపు హిందువుల మీద కూడ దాడులు చేస్తారు. ఈరోజు ఆకుపచ్చ రంగు మీద కసిగా వున్నవాళ్ళు రేపు కాషాయ రంగును సహితం వదలరు. ఈ పరిణామాలు అప్పుడే అనేక చోట్ల పొడచూపుతున్నాయి.  మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో సాధువుల మీద సాగిన మూకోన్మాద హత్య దీనికి తాజా ఉదాహరణ. రెండు రోజుల తరువాత ఉత్తర ప్రదేశ్ బులంద్ షహర్ జిల్లాలో ఓ శివాలంయంలో ఇద్దరు సాధువుల్ని ఒకడు హత్య చేశాడు.

 

          సూరత్ కు చెందిన గురుశ్రీ మహంత్ రాంగిరిజీ ఏప్రిల్ 16న చనిపోయారు. వారి అంత్యక్రియల్లో పాల్గొనడానికి మహారాష్ట్రలోని జునా ఆఖారా కు చెందిన ఇద్దరు సాధువులు చిక్నే మహరాజ్  కల్పవృక్షగిరి, మహరాజ్ సుశీల్ గిరి కారులో సూరత్ కు బయలు దేరారు. అవయవాల అమ్మకం కోసం పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు తిరుగుతున్నాయని పాల్ఘార్ జిల్లాలో కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. లాక్ డౌన్ కాలంలో రాత్రి 10 గంటలకు పాల్ఘార్ జిల్లా గడ్చించాలే గ్రామం మీదుగా పోతున్న ఆ ఇద్దరు సాధువుల  కారును స్థానికులు అడ్డుకున్నారు. పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వచ్చారనే అనుమానంతో వాళ్ళ మీద కర్రలతో దాడి చేశారు. సంఘటనా స్థలంలో వున్న పోలీసులు సహితం ఉన్మాదులకు సహకరించినట్టు వీడియోలు వచ్చాయి.  ఈ మూకోన్మాద దాడిలో ఇద్దరు సాధువులతోపాటూ కారు డ్రైవరు కూడ చనిపోయాడు.  

మహారాష్ట్రలో ప్రధాన ప్రతిపక్షంగా వున్న బిజేపి ఈ సంఘటనను హిందువుల మీద ముస్లింలు చేసిన దాడిగా చిత్రించడానికి ప్రయత్నించింది. ట్రోలింగ్ వీరులు సోషల్ మీడియాలో అలాంటి ప్రచారాన్ని ఉధృతం చేశారు. లాక్ డౌన్ లో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ‘‘మహారాష్ట్రలో ఇద్దరు సాధువులను కొందరు విచక్షణరహితంగా కొట్టి చంపేసినా ఇప్పటి వరకూ లిబరల్స్ ఎవరూ కనీసం నోరు మెదపలేదు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఏమయ్యాతి? మన మానవహక్కుల వీరులు ఎందుకు ఆక్రోశం వ్యక్తం చేయడం లేదు’’  అని  బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా  వెటకారంగా  ట్వీట్ చేశారు.  సరిగ్గా ఇలాంటి అవకాశాల కోసమే ఎదురుచూసే రిపబ్లిక్ టివీ అధినేత అర్ణబ్ గోస్వామి ఏప్రిల్ 20న  అలవాటు ప్రకారం (కిలో గుంటూరు కారం బొక్కి) ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్ధావ్ థాక్రే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీల మీద విమర్శల వర్షం కురిపించారు. “ఇద్దరు హిందూ సాధువుల్ని బహిరంగంగా హత్య చేశారు. ఈ దేశంలో 80 శాతంకన్నా ఎక్కువ జనాభా హిందువులది. సనాతనులది. ఈ దేశంలో హిందువుగా పుట్టడం ఒక నేరంగా మారిపోయిందా?  దీన్ని నా దేశం అంగీకరించదు. ఇది నాదేశం”. మహారాష్ట్రలోని “సోనియా –సేనా ప్రభుత్వం నాలుగురోజులు ఈ ఘోరాన్ని దేశ ప్రజలకు తెలియకుండా ఎందుకు దాచివుంచిందీ?” అని గర్జించారు.

ఈ కేసులో పాల్ఘార్ పోలీసులు 101 మందిని అరెస్టు చేశారు. విధినిర్వహణలో  ఉదాసీనంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్ధావ్ థాక్రే, హోం మంత్రి  అనిల్ దేశ్ ముఖ్  విడివిడిగా నిందితుల జాబితాను విడుదల చేశారు. నిందితులందరూ హిందూ సమాజానికి చెందినవారేననీ వారిలో ముస్లింలు ఒక్కరూ లేరని స్పష్టం చేశారు.  

మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్ సంఘటనల్లో మతకోణం లేదని పోలీసులు ప్రకటించబట్టి వాతావరణం చల్లబడిందిగానీ లేకుంటే లాక్ డౌన్ లోనూ మతకల్లోలాలు చెలరేగేంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.  థ్యాంక్ గాండ్!

విచిత్రం ఏమంటే, మీడియాలో మర్కజ్ వివాదాన్ని రెచ్చగొట్టింది అర్ణబ్ గోస్వామి యే. రిపబ్లిక్ టివి మార్చి 31 రాత్రి ‘ద డిబేట్’ కార్యక్రమంలో ‘మర్కజ్ కోవిడ్ స్ప్రెడ్’  హాష్ టాగ్ తో చర్చను నడిపింది.  మర్కజ్ “ఉద్దేశ పూర్వకంగా”, “బాహాటంగా”, “ప్రణాళికా బధ్ధంగా”  దేశంలో కరోనా వ్యాప్తికి “కుట్ర” చేసి “దేశద్రోహం”కు పాల్పడిందని ఆర్నాబ్ గోస్వామి ఆరోపించారు. ఇలాంటి కార్యక్రమాలు దేశంలో మూకోన్మాదాన్ని రెచ్చగొడతాయనీ, దానికి ముస్లింలే కాకుండా హిందువులు సహితం బలవుతారని అర్ణబ్ గోస్వామి అప్పుడు ఊహించి వుండరు. 

(రచయిత సీనియర్ జర్నలిస్టు, సమాజ విశ్లేషకులు. మొబైల్ 9010757776)

రచన : 25 ఏప్రిల్ 2020
ప్రచురణ :