Thursday, 16 July 2026

హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మిస్తున్నాం

అమరావతికి లక్ష్మీ కటాక్షం

ABN , Publish Date - Jul 17 , 2026 | 03:57 AM

‘రాజధాని అమరావతికి జగన్నాథుడు వ చ్చాడు. ఆయన వెంటే లక్ష్మీదేవి కూడా వస్తుంది. అంటే అమరావతికి జగన్నాథుడి తోడుగా లక్ష్మీ కటాక్షం లభించబోతోంది.

అమరావతికి లక్ష్మీ కటాక్షం

అమరావతి ప్రజల రాజధాని.. దేవతల రాజధాని.. అందుకే పూరీ జగన్నాథుని రథయాత్ర ఇక్కడకు వచ్చింది. శ్రీవారి ఆలయం చెంతనే రథయాత్ర ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉంది.

ఒకవైపు కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇంకొంచెం ముందుకు వెళితే క్వాంటం వ్యాలీ... సాంకేతిక విజ్ఞానంతో అభివృద్ధి, ఆధ్యాత్మికతతో విలువలు, సంస్కృతి వృద్ధి చెందుతాయి. ఈ నవనగరం సాంకేతికత, ఆధ్మాత్మికతకు వేదికగా ఉండబోతోంది.

- సీఎం చంద్రబాబు

గుంటూరు(రాజధాని), జూలై 16(ఆంధ్రజ్యోతి): ‘రాజధాని అమరావతికి జగన్నాథుడు వ చ్చాడు. ఆయన వెంటే లక్ష్మీదేవి కూడా వస్తుంది. అంటే అమరావతికి జగన్నాథుడి తోడుగా లక్ష్మీ కటాక్షం లభించబోతోంది. ఇక మన రాజధానికి తిరుగులేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని పరిధి వెంకటపాలెంలో గురువారం నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ఆయన పాల్గొన్నారు. రథాన్ని లాగేముందు పూరీలో జగన్నాథ స్వామికి చేసే ప్రత్యేక పూజలు ఇక్కడా నిర్వహించారు. రాజధాని నగర బృహత్‌ ప్రణాళికతో కూడిన చిత్రపటాన్ని తలపై పెట్టుకొని విశ్వనగరిగా అమరావతి ఎదగాలని సీఎం కోరుకున్నారు. సంప్రదాయ వస్త్రాల్లో హాజరైన చంద్రబాబు రథం ముందు భాగంలో బంగారు చీపురుతో ఊడ్చారు. అనంతరం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఆశీనులైన రథాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, మంత్రి పి. నారాయణ, ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి తాడుతో లాగి రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ‘అమరావతిని హిందూ ధర్మానికి సాక్ష్యంగా నిర్మిస్తున్నాం. ఈ స్థల మహాత్మ్యంతో అమరావతిని ఎవరూ కదిలించలేరు. ఇటు కృష్ణమ్మ, అటు స్వామివారి ఆలయం అమరావతికి శాశ్వత దీవెనలు అందిస్తున్నారు.


అమరావతి రాష్ట్ర ఖ్యాతిని పెంచేదిగా, తెలుగు యువతకు ఉపాధినిచ్చే కల్పవల్లిగా వర్ధిల్లుతుంది’ అని పేర్కొన్నారు. సమాజంలో విలువలు పడిపోతున్న సమయంలో, మానవ సంబంధాలు తగ్గిపోతున్న తరుణంలో ఎన్నో సమస్యలకు ఆధ్యాత్మికత ఒక్కటే సరైన పరిష్కార మార్గమని చెప్పారు. ప్రజల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేందుకు టీటీడీతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 5వేల దేవాలయాలను నిర్మిస్తున్నామన్నారు. ఉమ్మడి కుటుంబాలే భారతదేశ సంపద అని చెప్పారు.


ఇస్కాన్‌ సేవలకు ప్రశంసలు

ఆధ్యాత్మక విలువలు, నిస్వార్థ సేవలో ఇస్కాన్‌, అక్షయపాత్ర సేవలు ప్రశంసనీయమని సీఎం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా, 16 రాష్ట్రాల్లో, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 25వేల ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో భోజనాలు ఏర్పాటు చేస్తోందని వివరించారు. అక్షయపాత్ర ద్వారా 25 ఏళ్లుగా 500 కోట్ల మందికి ఆహారం అందించారని కొనియాడారు. అక్షయపాత్రకే అన్న క్యాంటీన్ల నిర్వహణ అప్పగించామని, వాటిని అద్భుతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. అమరావతి, పోలవరం పూర్తి చేయాలన్న తన సంకల్పాన్ని నెరవేర్చాలని జగన్నాథుడిని సీఎం వేడుకున్నారు.

Updated Date - Jul 17 , 2026 | 06:38 AM

https://www.andhrajyothy.com/2026/andhra-pradesh/cm-chandrababu-participates-in-jagannath-rath-yatra-at-amaravati-highlights-spiritual-vision-for-capital-1542391.html

Wednesday, 15 July 2026

Bombard the Brains - మెదళ్ల మీద మిస్సైళ్ళు -

 ఈరోజు నా వ్యాసం *మెదళ్ళ మీద మిస్సైళ్ళు* ను ప్రచురించిన తెలుగుప్రభకు ధన్యవాదాలు.

 

*మెదళ్ల మీద మిస్సైళ్ళు*

*దేశభద్రతా? ప్రజాస్వామ్యమా?*

*డానీ*

*సమాజరాజకీయ విశ్లేషకులు*

డానీ

 


యుద్ధం అంటే ఒకప్పుడు మనకు గుర్తుకొచ్చేది సరిహద్దులు. తుపాకులు, ట్యాంకులు, యుద్ధ విమానాలు. గెలుపు అంటే భూభాగాన్ని ఆక్రమించడం. ఓటమి అంటే సైన్యాన్ని వెనక్కి నెట్టడం. కానీ ఇరవై ఒకటో శతాబ్దంలో యుద్ధ స్వరూపం మారిపోయింది. నేడు యుద్ధం కేవలం నేల మీద కాదు; మనసుల మీద, సమాచారంపై, ప్రజాభిప్రాయంపై కూడా జరుగుతోందని ప్రపంచవ్యాప్తంగా భద్రతా నిపుణులు చెబుతున్నారు.

 

ఇరాన్ యుధ్ధం ఆరంభం కావడానికి ఒకరోజు ముందు ఇజ్రాయిల్ వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోదీ, భారత యూదులకు భారతదేశం మదర్ ల్యాండ్, ఇజ్రాయిల్ ఫాదర్ ల్యాండ్ అన్నారు. మానవేతిహాసంలో ఇదొక గొప్ప ఆవిష్కరణగా సంఘపరివారకులు తన్మయంతో పొంగిపోయారు. ఇటీవల ఇండోనేషియా వెళ్ళిన ప్రధాని రెండు దేశాల మధ్య అనుబంధాన్ని తేదీల్లో చెప్పారు.  26 అనేది భారత రిపబ్లిక్ దినోత్సవం, 17 అనేది ఇండోనేషియా ప్రస్తుత అధ్యక్షుడు  ప్రబొవో సుబియంతో  పుట్టినరోజు. 2+6 అయినా, 1+7 అయినా సమాధానం 8 అని గుర్తుచేసి అక్కడి సభికుల్ని హాశ్చర్య చకితుల్ని చేశారు. గణిత శాస్త్రంలో ఇదొక సరికొత్త ఆవిష్కరణ అంటూ సంఘీయులు తెగ ముసిపోతున్నారు.

 

ప్రధాని సామర్ధ్యాన్ని పొగుడుతూ వచ్చే సోషల్ మీడియా పోస్టులు  చర్చలు దేశప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని (విల్ పవర్)  పెంచుతాయని  బిజెపి మద్దతుదారులు నమ్ముతుంటారు. అలా కాకుండా, ఇలాంటి లెఖ్ఖలు నాలుగో తరగతి పిల్లలు కూడా చెపుతారు అని తీసిపడేస్తే దేశప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నట్టు భావించి వాళ్ల మనోభావాలు తీవ్రంగా ద్ఫెబ్బతింటాయి. అది అక్కడితో ఆగదు. దేశ ప్రధానిని చులకన చేసి దేశప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీయడం దేశద్రోహంతో సమానమైన నేరం అనేది వారి అభిప్రాయం. అంచేత ప్రధానిని విమర్శించి, దేశప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసేవారిని దేశద్రోహులుగా  పరిగణించి శిక్షించాలి అనే మాట ఇటీవల ప్రభుత్వ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది.

 

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉపా చట్టాన్ని ప్రయోగిస్తారా? విమర్శిస్తే దేశద్రోహం అంటారా? అని ప్రజాస్వామికవాదులు సమంజసంగానే అడుగుతున్నారు. దేశంలో 1950ల నాటి రాజ్యాంగం దాని ఆదర్శాలు ఇప్పటికీ అమల్లో వున్నాయని చాలామంది  అనుకుంటుంటారు.  ఎలిమెంటరీ స్కూళ్ళలో రాజ్యాంగ ఆదర్శాల గురించి అలానే బోధిస్తారు.

 

ఇప్పుడు రాజ్యాంగ ఆదర్శాల అర్ధాలు మారిపోతున్నాయి. రాజ్యాంగంలోని పదాలు మారలేదు. కానీ వాటి అధికారిక వ్యాఖ్యానాలు, అమలు విధానం, భద్రత పేరుతో ఏర్పడుతున్న కొత్త చట్టపరమైన అర్థాలు మారుతున్నాయి. మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక పాత అర్ధాలు చాలా వేగంగా మారిపొతున్నాయనీ బహుకొద్ది మంది మాత్రమే గుర్తిస్తున్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసేవాడు మంచోడా? చెడ్డోడా? అనేది తప్పితే గొప్ప రాజ్యాంగం, చెడ్డ రాజ్యంగం అంటూ ఏమీ వుండదు అని బిఆర్ అంబేడ్కర్ అంతటి వాడే ఒక దశలో అని వున్నాడు. ప్రస్తుతం రాజ్యాంగం ప్రజాస్వామిక  ఆదర్శాలు గిట్టని వాళ్ళ చేతుల్లో వుంది.

 

హైదరాబాద్ లో 2014లో జరిగిన IPS అధికారుల పాసింగ్-అవుట్ పరేడ్‌లో జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారుడు దోవల్ మొదటిసారి సిధ్ధాంతానికి ఒక ప్రవేశిక రాసి చదివారు. యుధ్ధాలు మూడు రకాలు.  మొదటివి; దేశ సరిహద్దుల్లో శతృదేశ సైనికులతో జరుగుతాయి. రెండవవి, దేశం లోపల ఉద్రవాదులు, తీవ్రవాదుల ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతాయి. ఇది అక్కడితో ఆగదు. ఆధునిక యుద్ధంలో పౌర సమాజమే యుద్ధభూమిగా మారవచ్చని వారొక వినూత్న సిధ్ధాంతాన్ని రచించారు. 2026లో రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం కాన్వొకేషన్లో ఆయన మరోసారి, "The objective of every war is to break the willpower of a country" అని అన్నారు.

 

యుధ్ధంలో గెలవాలంటే ముందు శతృదేశ ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని అలెగ్జాండరో మరొకరో ఎక్కడో అన్నారట. దాని అర్ధం ఏమంటే, శత్రు దేశ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే యుధ్ధాన్ని సగం గెలిచేసినట్టే.

 

అజిత్ దొవ్వాల్ ఈ తర్కాన్ని తిరగేసి చెపుతారు.  సిధ్ధాంత ప్రకారం ఆధునిక ప్రపంచంలో యుద్ధం మూడు రంగాల్లో జరుగుతుంది. మొదటిది సరిహద్దులో శత్రు సైన్యాలతో జరిగే సాంప్రదాయిక యుద్ధం. రెండవది దేశంలోపల తీవ్రవాదం, ఉగ్రవాదం, అంతర్గత భద్రతకు సంబంధించిన యుద్ధం. మూడవది అత్యంత సంక్లిష్టమైనది—మేధో లేదా కాగ్నిటివ్ యుద్ధం. ఈ యుద్ధంలో లక్ష్యం భూభాగాన్ని ఆక్రమించడం కాదు; ఒక దేశ ప్రజల మనోధైర్యాన్ని, విశ్వాసాన్ని, సామాజిక ఐక్యతను దెబ్బతీయడం.

 

మన దేశప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేవారు స్వదేశీయులు అయినాసరే వాళ్ళు  మన దేశ శత్రువులు.  వాళ్లను దేశద్రోహులు అనాలి అనేది వారి సిధ్ధాంతం. దేశద్రోహులు అంటే సరిపోదు దేశద్రోహులుగా పరిగణించి శిక్షించాలి. అలా వారు 2014 నుండి దశలవారీగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక (ఉపా) చట్టానికి కొత్త కొత్త అర్ధాలు చెపుతూ వస్తున్నారు.

 

సమాజంలో, ప్రజల మధ్య, విద్యాసంస్థల్లో, మీడియాలో, డిజిటల్ వేదికల్లో కూడా యుధ్ధాలు జరుగుతాయి. నాలుగవతరం యుధ్ధాల్లో పౌరసమాజమే యుధ్ధరంగంగా మారిపోవచ్చు (Civil Society itself becomes the battleground.) అని వారు ఒక కొత్త హెచ్చరిక చేశారు. దానికి వారు 4GW అని అందమైన పేరు పెట్టారు.

 

ఆపరేషన్ కగార్ తో చత్తీస్ గడ్, మహారాష్ట్ర,  ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టుల్ని తుడిచి పెట్టేసినట్టు కేంద్ర హోంమంత్రి ప్రకటించ్సారు. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఉద్యమాలు తలెత్తకుండా మొగ్గలోనే తుంచేయాలంటే పౌరసమాజం మీద కూడ యుధ్ధం చేయక తప్పదనేది అజిత్ దోవల్ సిధ్ధాంతం.

 

ఈ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవడం సరికాదు. నేటి ప్రపంచంలో సైబర్ దాడులు, విదేశీ ప్రభావ కార్యకలాపాలు, దుష్ప్రచారం, డీప్‌ఫేక్‌లు, తీవ్రవాద ప్రచారం వంటి సవాళ్లు వాస్తవమే. అందువల్ల దేశభద్రత బలంగా ఉండాల్సిన అవసరం అనివార్యం. దీనిపై సందేహం లేదు.

 

అయితే ప్రజాస్వామ్యం ముందున్న అసలు ప్రశ్న ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. మేధోయుద్ధం అనే భావన పరిధిపరిమితుల్ని ఎలా నిర్వచించాలీ? చట్టబద్ధమైన విమర్శ, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు, పరిశోధనాత్మక జర్నలిజం, విశ్వవిద్యాలయాల్లో జరిగే మేధో చర్చలు—వీటిని కూడా దేశభద్రత కళ్ళజోళ్ళతో చూడడం మొదలెడితే  ప్రజాస్వామ్య వ్యవస్థపై దాని ప్రభావం ఏమిటి?

 

భారత రాజ్యాంగం ఈ ప్రశ్నకు ఒక సమతుల్య దారి చూపుతుంది. ఆర్టికల్ 19(1)(a) ప్రతి పౌరుడికి భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తుంది. అదే సమయంలో ఆర్టికల్ 19(2) దేశ సార్వభౌమత్వం, రాష్ట్ర భద్రత, ప్రజా శాంతి వంటి కారణాల దృష్ట్యా సహేతుక పరిమితులను గుర్తుచేస్తుంది. ఈ రెండు నిబంధనలు పరస్పర విరుద్ధాలు కావు; అవి ప్రజాస్వామ్య సమతుల్యతకు రెండు ఆధారస్తంభాలు.

 

ఇక్కడే ప్రభుత్వాలపై అత్యంత పెద్ద బాధ్యత ఉంటుంది. జాతీయ భద్రత పేరిట రూపొందించిన చట్టాలు నిజమైన ఉగ్రవాదం, హింసాత్మక కుట్రలు, విదేశీ శత్రు కార్యకలాపాలను అరికట్టడానికి ఉపయోగించాల్సిందే. అదే సమయంలో చట్టబద్ధమైన విమర్శ, స్వతంత్ర మీడియా, శాంతియుత అసమ్మతి, రాజ్యాంగబద్ధమైన రాజకీయ భిన్నాభిప్రాయాలను వాటితో కలిపి చూడకూడదు.

 

ప్రపంచంలోని ఇతర ప్రజాస్వామ్యాలు కూడా ఇదే సవాలును ఎదుర్కొంటున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ—అన్ని దేశాల్లో తీవ్రవాద వ్యతిరేక చట్టాలు ఉన్నాయి. కానీ అదే సమయంలో న్యాయస్థానాలు, స్వతంత్ర మీడియా, పౌరసమాజం ఈ చట్టాల వినియోగంపై నిరంతర పర్యవేక్షణ చేస్తుంటాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దేశభద్రతకు ఉన్న విలువ ఎంతుంటుందో స్వేచ్ఛకు కూడా అంతే విలువ ఉండాలి.

 

మేధో యుద్ధం నిజంగా జరుగుతుంటే  ప్రజాస్వామ్యానికి అది అతిపెద్ద బలంగా కూడ మారుతుంది.  ప్రశ్నించే పౌరులు, స్వతంత్ర విశ్వవిద్యాలయాలు, బాధ్యతాయుతమైన మీడియా, నిష్పాక్షిక న్యాయవ్యవస్థ —ఇవే ప్రజాస్వామ్యానికి రక్షణ కవచాలు. భయంతో మౌనం ఏర్పడితే ప్రజాస్వామ్యం బలపడదు.  దేశభద్రత అవసరమే. కానీ దేశభద్రతను కాపాడే అత్యంత శక్తివంతమైన ఆయుధం కేవలం క్షిపణులు కావు. ప్రజల విశ్వాసం. రాజ్యాంగంపై నమ్మకం. చట్టం ముందు సమానత్వం. భావ ప్రకటనా స్వేచ్ఛపై గౌరవం. ఈ మూడు విలువలు బలంగా ఉన్నప్పుడే ఏ దేశమైనా నిజంగా సురక్షితంగా ఉంటుంది.

 

చివరికి ప్రశ్న ఒక్కటే—

 

శత్రువుల మిస్సైళ్ల నుంచి దేశాన్ని కాపాడటం ఎంత అవసరమో, మన పౌరుల మెదళ్లలోని స్వేచ్ఛను కూడా అంతే జాగ్రత్తగా కాపాడుతున్నామా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సింది ఒక్క ప్రభుత్వం కాదు; సమాజం మొత్తం. ఎందుకంటే దేశభద్రత, ప్రజాస్వామ్యం—ఇవి రెండూ పరస్పర ప్రత్యర్థులు కావు. ఒకటి లేకుండా మరొకటి సంపూర్ణం కాదు.

 

పెట్రోలు ధరలు పెరుగుతున్నాయనిగానీ, రూపాయి విలువ పడిపోతున్నదనిగానీ, అమెరికా వంగమంటే ఇండియా పాకుతున్నదనిగానీ ఎవరయినా అంటే, అది ఒక అభిప్రాయం. దానిని దేశద్రోహ కుట్ర అనేస్తే మొత్తం ప్రజాస్వామ్య భవనమే కూలిపోతుంది.

 

14 అక్టోబరు 2026

ప్రచురణ తెలుగుప్రభ 15 అక్టోబరు 2026

Friday, 10 July 2026

*పవన్ కళ్యాణ్ ను మిమిక్రీ చేస్తే దేశద్రోహమా?*

 

*పవన్ కళ్యాణ్ ను మిమిక్రీ చేస్తే దేశద్రోహమా?*

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు*

 

ప్రభుత్వ నాయకుడిని విమర్శించడం, వ్యంగ్యంగా అనుకరించడం, మిమిక్రీ చేయడంఇవి రాజకీయ సంస్కృతిలో భాగమా? లేక దేశద్రోహమా? ప్రశ్న ఇప్పుడు యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అరెస్టుతో మళ్లీ ముందుకు వచ్చింది. 

ఇరాన్ యుధ్ధం ఆరంభం కావడానికి ఒకరోజు ముందు ఇజ్రాయిల్ వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోదీ, భారత యూదులకు భారతదేశం మదర్ ల్యాండ్, ఇజ్రాయిల్ ఫాదర్ ల్యాండ్ అన్నారు. మానవేతిహాసంలో ఇదొక గొప్ప ఆవిష్కరణగా సంఘపరివారకులు తన్మయంతో పొంగిపోయారు. ఇటీవల ఇండోనేషియా వెళ్ళిన ప్రధాని రెండు దేశాల మధ్య అనుబంధాన్ని తేదీల్లో చెప్పారు.  26 అనేది భారత రిపబ్లిక్ దినోత్సవం, 17 అనేది ఇండోనేషియా ప్రస్తుత అధ్యక్షుడు  ప్రబొవో సుబియంతో  పుట్టినరోజు. 2+6 అయినా, 1+7 అయినా సమాధానం 8 అని గుర్తుచేసి అక్కడి సభికుల్ని హాశ్చర్య చకితుల్ని చేశారు. గణిత శాస్త్రంలో ఇదొక సరికొత్త ఆవిష్కరణ అంటూ సంఘీయులు తెగ ముసిపోతున్నారు.

 

ప్రధాని సామర్ధ్యం గురించి జరిగే చర్చలు దేశప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని (విల్ పవర్)  పెంచుతాయని  బిజెపి మద్దతుదారులు నమ్ముతుంటారు. అలా కాకుండా, ఇలాంటి లెఖ్ఖలు నాలుగో తరగతి పిల్లలు కూడా చెపుతారు అని తీసిపడేస్తే దేశప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నట్టు లెఖ్ఖ. దేశ ప్రధానిని చులకన చేసి దేశప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీయడం దేశద్రోహంతో సమానమైన నేరం!! వినడానికి ఇది వింతగావున్నా ఇదే నిజం!

 

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యూ ట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ మధ్య కొంతకాలంగా వాద వివాదాలు సాగుతున్నాయి. అనేక వీడియోల్లో, సభల్లో ‘ప్రశ్న రావణ్’ పవన్ కళ్యాణ్ ను అనుకరిస్తూ మాట్లాడారు. కొన్ని సభల్లో పవన్ కళ్యాణ్ చేతిలో చెప్పుతీసుకుని బెదిరిస్తూ, హెచ్చరిస్తూ మాట్లాడారు. చేతిలో చెప్పు లేకుండానే పవన్ కళ్యాణ్ మాటల్ని  ‘ప్రశ్న రావణ్’ మిమిక్రీ చేశారు. అది నేరం అయితే పవన్ కళ్యాణ్ ది కూడ నేరమే అవుతుంది. ‘ప్రశ్న రావణ్’ ని శిక్షించాలనుకుంటే పవన్ కళ్యాన్ ని కూడ అదే చట్టం కింద శిక్షించాలి. చట్టం ముందు అందరూ సమానమే అనికదా మన రాజ్యాంగం చెపుతోందీ? ఉప ముఖ్యమంత్రికి ఒక చట్టం, యూట్యూబరుకు ఇంకో చట్ట వుండకూడదుగా.  చేతిలో చెప్పు పట్టుకుని ప్రదర్శించినవారిని వదిలేసి, చెప్పులేకుండా ప్రదర్శించినవారిని ఎక్కువగా శిక్షిస్తే చట్ట సమానత్వం గురించి సహజంగానే సందేహాలు తలెత్తుతాయి.

 

‘ప్రశ్న రావణ్’ మీద అనేక ఆరోపణలు చేసి  నాలుగుసార్లు అరెస్టు చేశారు. నాలుగుసార్లూ ఆతనికి బెయిల్ వచ్చింది. ఐదోసారి ఉపా చట్టాన్ని ప్రయోగించారు. ప్రముఖ మావోయిస్టు హిడ్మా చనిపోయినపుడు ఒక టీవీ సంస్థ ప్రసారం చేసిన ఒక వీడియోకు ‘ప్రశన రావణ్’ వాయిస్ ఓవర్ చెప్పారు. అందులో, ఒక హిడ్మా చనిపోతే వందమంది హిడ్మాలు పుట్టుకుని వస్తారు వంటి వాక్యాలున్నాయి. వీటి ఆధారంగా ఉపా చట్టాన్ని అతని మీద ప్రయోగించారు.

 

ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఉపా చట్టాన్ని ప్రయోగిస్తారా? ప్రశ్నిస్తే దేశద్రోహం అంటారా? అని ప్రజాస్వామికవాదులు సమంజసంగానే అడుగుతున్నారు. దేశంలో 1950ల నాటి రాజ్యాంగం దాని ఆదర్శాలు ఇప్పటికీ అమల్లో వున్నాయని చాలామంది  అనుకుంటుంటారు.  రాజ్యాంగ ఆదర్శాల అర్ధాలు మారిపోతున్నాయి. రాజ్యాంగంలోని పదాలు మారలేదు. కానీ వాటి అధికారిక వ్యాఖ్యానాలు, అమలు విధానం, భద్రత పేరుతో ఏర్పడుతున్న కొత్త చట్టపరమైన అర్థాలు మారుతున్నాయి. మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక పాత అర్ధాలు చాలా వేగంగా మారిపొతున్నాయనీ బహుకొద్ది మంది మాత్రమే గుర్తిస్తున్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసేవాడు మంచోడా? చెడ్డోడా? అనేది తప్పితే గొప్ప రాజ్యాంగం, చెడ్డ రాజ్యంగం అంటూ ఏమీ వుండదు అని అంబేడ్కరే ఒక దశలో అని వున్నాడు. ప్రస్తుతం రాజ్యాంగం ప్రజాస్వామిక  ఆదర్శాలు గిట్టని వాళ్ళ చేతుల్లో వుంది.

 

అలెగ్జాండర్ కాలం నుండి ఇప్పటి వరకు యుధ్ధాల్లో పాటించే మొదటి లక్ష్యం ఏమిటీ?; శత్రు దేశప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం. శత్రు దేశ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే యుధ్ధాన్ని సగం గెలిచేసినట్టే. మన జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారుడు అజిత్ దొవ్వాల్ ఈ తర్కాన్ని తిరగేసి చెపుతారు. మన దేశప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేవారు స్వదేశీయులు అయినాసరే వాళ్ళు  మన దేశ శత్రువులు, దేశద్రోహులు అనేది వారి సిధ్ధాంతం. అలా వారు 2014 నుండి దశలవారీగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక (ఉపా) చట్టానికి కొత్త కొత్త అర్ధాలు చెపుతూ వస్తున్నారు.

 

హైదరాబాద్ లో 2014లో జరిగిన IPS అధికారుల పాసింగ్-అవుట్ పరేడ్‌లో దోవల్ ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేశారు. యుధ్ధాలు ఇక సరిహద్దుల్లో మాత్రమే జరగవు. అలాగే, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో మాత్రమే జరగవు. సమాజంలో, ప్రజల మధ్య, విద్యాసంస్థల్లో, మీడియాలో, డిజిటల్ వేదికల్లో కూడా యుధ్ధాలు జరుగుతాయి. నాలుగవతరం యుధ్ధాల్లో పౌరసమాజమే యుధ్ధరంగంగా మారిపోవచ్చు (Civil Society itself becomes the battleground.) అని వారు ఒక కొత్త హెచ్చరిక చేశారు. దానికి వారు 4GW అని అందమైన పేరు పెట్టారు.

 

ఆపరేషన్ కగార్ తో చత్తీస్ గడ్, మహారాష్ట్ర,  ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టుల్ని తుడిచి పెట్టేసినట్టు కేంద్ర హోంమంత్రి ప్రకటించ్సారు. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఉద్యమాలు తలెత్తకుండా మొగ్గలోనే తుంచేయాలంటే పౌరసమాజం మీద యుధ్ధం చేయక తప్పదనేది అజిత్ దోవల్ సిధ్ధాంతం.

 

పెట్రోలు ధరలు పెరుగుతున్నాయనిగానీ, రూపాయి విలువ పడిపోతున్నదనిగానీ, అమెరికా వంగమంటే ఇండియా పాకుతున్నదనిగానీ ఎవరయినా అంటే, అది ఇక ముందు ఒక అభిప్రాయంకాదు. దేశప్రజల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం.  ప్రయత్నం కూడ కాదు అది ఒక దేశద్రోహ కుట్ర అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశద్రోహమా? లేక ప్రజాస్వామ్య బాధ్యతా? ప్రశ్నకు ఇచ్చే సమాధానమే రేపటి భారత ప్రజాస్వామ్య స్వరూపాన్ని నిర్ణయిస్తుంది.

 

10 అక్టోబరు 2026