Wednesday, 15 July 2026

Bombard the Brains - మెదళ్ల మీద మిస్సైళ్ళు -

 ఈరోజు నా వ్యాసం *మెదళ్ళ మీద మిస్సైళ్ళు* ను ప్రచురించిన తెలుగుప్రభకు ధన్యవాదాలు.

 

*మెదళ్ల మీద మిస్సైళ్ళు*

*దేశభద్రతా? ప్రజాస్వామ్యమా?*

*డానీ*

*సమాజరాజకీయ విశ్లేషకులు*

డానీ

 


యుద్ధం అంటే ఒకప్పుడు మనకు గుర్తుకొచ్చేది సరిహద్దులు. తుపాకులు, ట్యాంకులు, యుద్ధ విమానాలు. గెలుపు అంటే భూభాగాన్ని ఆక్రమించడం. ఓటమి అంటే సైన్యాన్ని వెనక్కి నెట్టడం. కానీ ఇరవై ఒకటో శతాబ్దంలో యుద్ధ స్వరూపం మారిపోయింది. నేడు యుద్ధం కేవలం నేల మీద కాదు; మనసుల మీద, సమాచారంపై, ప్రజాభిప్రాయంపై కూడా జరుగుతోందని ప్రపంచవ్యాప్తంగా భద్రతా నిపుణులు చెబుతున్నారు.

 

ఇరాన్ యుధ్ధం ఆరంభం కావడానికి ఒకరోజు ముందు ఇజ్రాయిల్ వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోదీ, భారత యూదులకు భారతదేశం మదర్ ల్యాండ్, ఇజ్రాయిల్ ఫాదర్ ల్యాండ్ అన్నారు. మానవేతిహాసంలో ఇదొక గొప్ప ఆవిష్కరణగా సంఘపరివారకులు తన్మయంతో పొంగిపోయారు. ఇటీవల ఇండోనేషియా వెళ్ళిన ప్రధాని రెండు దేశాల మధ్య అనుబంధాన్ని తేదీల్లో చెప్పారు.  26 అనేది భారత రిపబ్లిక్ దినోత్సవం, 17 అనేది ఇండోనేషియా ప్రస్తుత అధ్యక్షుడు  ప్రబొవో సుబియంతో  పుట్టినరోజు. 2+6 అయినా, 1+7 అయినా సమాధానం 8 అని గుర్తుచేసి అక్కడి సభికుల్ని హాశ్చర్య చకితుల్ని చేశారు. గణిత శాస్త్రంలో ఇదొక సరికొత్త ఆవిష్కరణ అంటూ సంఘీయులు తెగ ముసిపోతున్నారు.

 

ప్రధాని సామర్ధ్యాన్ని పొగుడుతూ వచ్చే సోషల్ మీడియా పోస్టులు  చర్చలు దేశప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని (విల్ పవర్)  పెంచుతాయని  బిజెపి మద్దతుదారులు నమ్ముతుంటారు. అలా కాకుండా, ఇలాంటి లెఖ్ఖలు నాలుగో తరగతి పిల్లలు కూడా చెపుతారు అని తీసిపడేస్తే దేశప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నట్టు భావించి వాళ్ల మనోభావాలు తీవ్రంగా ద్ఫెబ్బతింటాయి. అది అక్కడితో ఆగదు. దేశ ప్రధానిని చులకన చేసి దేశప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీయడం దేశద్రోహంతో సమానమైన నేరం అనేది వారి అభిప్రాయం. అంచేత ప్రధానిని విమర్శించి, దేశప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసేవారిని దేశద్రోహులుగా  పరిగణించి శిక్షించాలి అనే మాట ఇటీవల ప్రభుత్వ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది.

 

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉపా చట్టాన్ని ప్రయోగిస్తారా? విమర్శిస్తే దేశద్రోహం అంటారా? అని ప్రజాస్వామికవాదులు సమంజసంగానే అడుగుతున్నారు. దేశంలో 1950ల నాటి రాజ్యాంగం దాని ఆదర్శాలు ఇప్పటికీ అమల్లో వున్నాయని చాలామంది  అనుకుంటుంటారు.  ఎలిమెంటరీ స్కూళ్ళలో రాజ్యాంగ ఆదర్శాల గురించి అలానే బోధిస్తారు.

 

ఇప్పుడు రాజ్యాంగ ఆదర్శాల అర్ధాలు మారిపోతున్నాయి. రాజ్యాంగంలోని పదాలు మారలేదు. కానీ వాటి అధికారిక వ్యాఖ్యానాలు, అమలు విధానం, భద్రత పేరుతో ఏర్పడుతున్న కొత్త చట్టపరమైన అర్థాలు మారుతున్నాయి. మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక పాత అర్ధాలు చాలా వేగంగా మారిపొతున్నాయనీ బహుకొద్ది మంది మాత్రమే గుర్తిస్తున్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసేవాడు మంచోడా? చెడ్డోడా? అనేది తప్పితే గొప్ప రాజ్యాంగం, చెడ్డ రాజ్యంగం అంటూ ఏమీ వుండదు అని బిఆర్ అంబేడ్కర్ అంతటి వాడే ఒక దశలో అని వున్నాడు. ప్రస్తుతం రాజ్యాంగం ప్రజాస్వామిక  ఆదర్శాలు గిట్టని వాళ్ళ చేతుల్లో వుంది.

 

హైదరాబాద్ లో 2014లో జరిగిన IPS అధికారుల పాసింగ్-అవుట్ పరేడ్‌లో జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారుడు దోవల్ మొదటిసారి సిధ్ధాంతానికి ఒక ప్రవేశిక రాసి చదివారు. యుధ్ధాలు మూడు రకాలు.  మొదటివి; దేశ సరిహద్దుల్లో శతృదేశ సైనికులతో జరుగుతాయి. రెండవవి, దేశం లోపల ఉద్రవాదులు, తీవ్రవాదుల ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతాయి. ఇది అక్కడితో ఆగదు. ఆధునిక యుద్ధంలో పౌర సమాజమే యుద్ధభూమిగా మారవచ్చని వారొక వినూత్న సిధ్ధాంతాన్ని రచించారు. 2026లో రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం కాన్వొకేషన్లో ఆయన మరోసారి, "The objective of every war is to break the willpower of a country" అని అన్నారు.

 

యుధ్ధంలో గెలవాలంటే ముందు శతృదేశ ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని అలెగ్జాండరో మరొకరో ఎక్కడో అన్నారట. దాని అర్ధం ఏమంటే, శత్రు దేశ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే యుధ్ధాన్ని సగం గెలిచేసినట్టే.

 

అజిత్ దొవ్వాల్ ఈ తర్కాన్ని తిరగేసి చెపుతారు.  సిధ్ధాంత ప్రకారం ఆధునిక ప్రపంచంలో యుద్ధం మూడు రంగాల్లో జరుగుతుంది. మొదటిది సరిహద్దులో శత్రు సైన్యాలతో జరిగే సాంప్రదాయిక యుద్ధం. రెండవది దేశంలోపల తీవ్రవాదం, ఉగ్రవాదం, అంతర్గత భద్రతకు సంబంధించిన యుద్ధం. మూడవది అత్యంత సంక్లిష్టమైనది—మేధో లేదా కాగ్నిటివ్ యుద్ధం. ఈ యుద్ధంలో లక్ష్యం భూభాగాన్ని ఆక్రమించడం కాదు; ఒక దేశ ప్రజల మనోధైర్యాన్ని, విశ్వాసాన్ని, సామాజిక ఐక్యతను దెబ్బతీయడం.

 

మన దేశప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేవారు స్వదేశీయులు అయినాసరే వాళ్ళు  మన దేశ శత్రువులు.  వాళ్లను దేశద్రోహులు అనాలి అనేది వారి సిధ్ధాంతం. దేశద్రోహులు అంటే సరిపోదు దేశద్రోహులుగా పరిగణించి శిక్షించాలి. అలా వారు 2014 నుండి దశలవారీగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక (ఉపా) చట్టానికి కొత్త కొత్త అర్ధాలు చెపుతూ వస్తున్నారు.

 

సమాజంలో, ప్రజల మధ్య, విద్యాసంస్థల్లో, మీడియాలో, డిజిటల్ వేదికల్లో కూడా యుధ్ధాలు జరుగుతాయి. నాలుగవతరం యుధ్ధాల్లో పౌరసమాజమే యుధ్ధరంగంగా మారిపోవచ్చు (Civil Society itself becomes the battleground.) అని వారు ఒక కొత్త హెచ్చరిక చేశారు. దానికి వారు 4GW అని అందమైన పేరు పెట్టారు.

 

ఆపరేషన్ కగార్ తో చత్తీస్ గడ్, మహారాష్ట్ర,  ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టుల్ని తుడిచి పెట్టేసినట్టు కేంద్ర హోంమంత్రి ప్రకటించ్సారు. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఉద్యమాలు తలెత్తకుండా మొగ్గలోనే తుంచేయాలంటే పౌరసమాజం మీద కూడ యుధ్ధం చేయక తప్పదనేది అజిత్ దోవల్ సిధ్ధాంతం.

 

ఈ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవడం సరికాదు. నేటి ప్రపంచంలో సైబర్ దాడులు, విదేశీ ప్రభావ కార్యకలాపాలు, దుష్ప్రచారం, డీప్‌ఫేక్‌లు, తీవ్రవాద ప్రచారం వంటి సవాళ్లు వాస్తవమే. అందువల్ల దేశభద్రత బలంగా ఉండాల్సిన అవసరం అనివార్యం. దీనిపై సందేహం లేదు.

 

అయితే ప్రజాస్వామ్యం ముందున్న అసలు ప్రశ్న ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. మేధోయుద్ధం అనే భావన పరిధిపరిమితుల్ని ఎలా నిర్వచించాలీ? చట్టబద్ధమైన విమర్శ, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు, పరిశోధనాత్మక జర్నలిజం, విశ్వవిద్యాలయాల్లో జరిగే మేధో చర్చలు—వీటిని కూడా దేశభద్రత కళ్ళజోళ్ళతో చూడడం మొదలెడితే  ప్రజాస్వామ్య వ్యవస్థపై దాని ప్రభావం ఏమిటి?

 

భారత రాజ్యాంగం ఈ ప్రశ్నకు ఒక సమతుల్య దారి చూపుతుంది. ఆర్టికల్ 19(1)(a) ప్రతి పౌరుడికి భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తుంది. అదే సమయంలో ఆర్టికల్ 19(2) దేశ సార్వభౌమత్వం, రాష్ట్ర భద్రత, ప్రజా శాంతి వంటి కారణాల దృష్ట్యా సహేతుక పరిమితులను గుర్తుచేస్తుంది. ఈ రెండు నిబంధనలు పరస్పర విరుద్ధాలు కావు; అవి ప్రజాస్వామ్య సమతుల్యతకు రెండు ఆధారస్తంభాలు.

 

ఇక్కడే ప్రభుత్వాలపై అత్యంత పెద్ద బాధ్యత ఉంటుంది. జాతీయ భద్రత పేరిట రూపొందించిన చట్టాలు నిజమైన ఉగ్రవాదం, హింసాత్మక కుట్రలు, విదేశీ శత్రు కార్యకలాపాలను అరికట్టడానికి ఉపయోగించాల్సిందే. అదే సమయంలో చట్టబద్ధమైన విమర్శ, స్వతంత్ర మీడియా, శాంతియుత అసమ్మతి, రాజ్యాంగబద్ధమైన రాజకీయ భిన్నాభిప్రాయాలను వాటితో కలిపి చూడకూడదు.

 

ప్రపంచంలోని ఇతర ప్రజాస్వామ్యాలు కూడా ఇదే సవాలును ఎదుర్కొంటున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ—అన్ని దేశాల్లో తీవ్రవాద వ్యతిరేక చట్టాలు ఉన్నాయి. కానీ అదే సమయంలో న్యాయస్థానాలు, స్వతంత్ర మీడియా, పౌరసమాజం ఈ చట్టాల వినియోగంపై నిరంతర పర్యవేక్షణ చేస్తుంటాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దేశభద్రతకు ఉన్న విలువ ఎంతుంటుందో స్వేచ్ఛకు కూడా అంతే విలువ ఉండాలి.

 

మేధో యుద్ధం నిజంగా జరుగుతుంటే  ప్రజాస్వామ్యానికి అది అతిపెద్ద బలంగా కూడ మారుతుంది.  ప్రశ్నించే పౌరులు, స్వతంత్ర విశ్వవిద్యాలయాలు, బాధ్యతాయుతమైన మీడియా, నిష్పాక్షిక న్యాయవ్యవస్థ —ఇవే ప్రజాస్వామ్యానికి రక్షణ కవచాలు. భయంతో మౌనం ఏర్పడితే ప్రజాస్వామ్యం బలపడదు.  దేశభద్రత అవసరమే. కానీ దేశభద్రతను కాపాడే అత్యంత శక్తివంతమైన ఆయుధం కేవలం క్షిపణులు కావు. ప్రజల విశ్వాసం. రాజ్యాంగంపై నమ్మకం. చట్టం ముందు సమానత్వం. భావ ప్రకటనా స్వేచ్ఛపై గౌరవం. ఈ మూడు విలువలు బలంగా ఉన్నప్పుడే ఏ దేశమైనా నిజంగా సురక్షితంగా ఉంటుంది.

 

చివరికి ప్రశ్న ఒక్కటే—

 

శత్రువుల మిస్సైళ్ల నుంచి దేశాన్ని కాపాడటం ఎంత అవసరమో, మన పౌరుల మెదళ్లలోని స్వేచ్ఛను కూడా అంతే జాగ్రత్తగా కాపాడుతున్నామా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సింది ఒక్క ప్రభుత్వం కాదు; సమాజం మొత్తం. ఎందుకంటే దేశభద్రత, ప్రజాస్వామ్యం—ఇవి రెండూ పరస్పర ప్రత్యర్థులు కావు. ఒకటి లేకుండా మరొకటి సంపూర్ణం కాదు.

 

పెట్రోలు ధరలు పెరుగుతున్నాయనిగానీ, రూపాయి విలువ పడిపోతున్నదనిగానీ, అమెరికా వంగమంటే ఇండియా పాకుతున్నదనిగానీ ఎవరయినా అంటే, అది ఒక అభిప్రాయం. దానిని దేశద్రోహ కుట్ర అనేస్తే మొత్తం ప్రజాస్వామ్య భవనమే కూలిపోతుంది.

 

14 అక్టోబరు 2026

ప్రచురణ తెలుగుప్రభ 15 అక్టోబరు 2026

Friday, 10 July 2026

*పవన్ కళ్యాణ్ ను మిమిక్రీ చేస్తే దేశద్రోహమా?*

 

*పవన్ కళ్యాణ్ ను మిమిక్రీ చేస్తే దేశద్రోహమా?*

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు*

 

ప్రభుత్వ నాయకుడిని విమర్శించడం, వ్యంగ్యంగా అనుకరించడం, మిమిక్రీ చేయడంఇవి రాజకీయ సంస్కృతిలో భాగమా? లేక దేశద్రోహమా? ప్రశ్న ఇప్పుడు యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అరెస్టుతో మళ్లీ ముందుకు వచ్చింది. 

ఇరాన్ యుధ్ధం ఆరంభం కావడానికి ఒకరోజు ముందు ఇజ్రాయిల్ వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోదీ, భారత యూదులకు భారతదేశం మదర్ ల్యాండ్, ఇజ్రాయిల్ ఫాదర్ ల్యాండ్ అన్నారు. మానవేతిహాసంలో ఇదొక గొప్ప ఆవిష్కరణగా సంఘపరివారకులు తన్మయంతో పొంగిపోయారు. ఇటీవల ఇండోనేషియా వెళ్ళిన ప్రధాని రెండు దేశాల మధ్య అనుబంధాన్ని తేదీల్లో చెప్పారు.  26 అనేది భారత రిపబ్లిక్ దినోత్సవం, 17 అనేది ఇండోనేషియా ప్రస్తుత అధ్యక్షుడు  ప్రబొవో సుబియంతో  పుట్టినరోజు. 2+6 అయినా, 1+7 అయినా సమాధానం 8 అని గుర్తుచేసి అక్కడి సభికుల్ని హాశ్చర్య చకితుల్ని చేశారు. గణిత శాస్త్రంలో ఇదొక సరికొత్త ఆవిష్కరణ అంటూ సంఘీయులు తెగ ముసిపోతున్నారు.

 

ప్రధాని సామర్ధ్యం గురించి జరిగే చర్చలు దేశప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని (విల్ పవర్)  పెంచుతాయని  బిజెపి మద్దతుదారులు నమ్ముతుంటారు. అలా కాకుండా, ఇలాంటి లెఖ్ఖలు నాలుగో తరగతి పిల్లలు కూడా చెపుతారు అని తీసిపడేస్తే దేశప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నట్టు లెఖ్ఖ. దేశ ప్రధానిని చులకన చేసి దేశప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీయడం దేశద్రోహంతో సమానమైన నేరం!! వినడానికి ఇది వింతగావున్నా ఇదే నిజం!

 

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యూ ట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ మధ్య కొంతకాలంగా వాద వివాదాలు సాగుతున్నాయి. అనేక వీడియోల్లో, సభల్లో ‘ప్రశ్న రావణ్’ పవన్ కళ్యాణ్ ను అనుకరిస్తూ మాట్లాడారు. కొన్ని సభల్లో పవన్ కళ్యాణ్ చేతిలో చెప్పుతీసుకుని బెదిరిస్తూ, హెచ్చరిస్తూ మాట్లాడారు. చేతిలో చెప్పు లేకుండానే పవన్ కళ్యాణ్ మాటల్ని  ‘ప్రశ్న రావణ్’ మిమిక్రీ చేశారు. అది నేరం అయితే పవన్ కళ్యాణ్ ది కూడ నేరమే అవుతుంది. ‘ప్రశ్న రావణ్’ ని శిక్షించాలనుకుంటే పవన్ కళ్యాన్ ని కూడ అదే చట్టం కింద శిక్షించాలి. చట్టం ముందు అందరూ సమానమే అనికదా మన రాజ్యాంగం చెపుతోందీ? ఉప ముఖ్యమంత్రికి ఒక చట్టం, యూట్యూబరుకు ఇంకో చట్ట వుండకూడదుగా.  చేతిలో చెప్పు పట్టుకుని ప్రదర్శించినవారిని వదిలేసి, చెప్పులేకుండా ప్రదర్శించినవారిని ఎక్కువగా శిక్షిస్తే చట్ట సమానత్వం గురించి సహజంగానే సందేహాలు తలెత్తుతాయి.

 

‘ప్రశ్న రావణ్’ మీద అనేక ఆరోపణలు చేసి  నాలుగుసార్లు అరెస్టు చేశారు. నాలుగుసార్లూ ఆతనికి బెయిల్ వచ్చింది. ఐదోసారి ఉపా చట్టాన్ని ప్రయోగించారు. ప్రముఖ మావోయిస్టు హిడ్మా చనిపోయినపుడు ఒక టీవీ సంస్థ ప్రసారం చేసిన ఒక వీడియోకు ‘ప్రశన రావణ్’ వాయిస్ ఓవర్ చెప్పారు. అందులో, ఒక హిడ్మా చనిపోతే వందమంది హిడ్మాలు పుట్టుకుని వస్తారు వంటి వాక్యాలున్నాయి. వీటి ఆధారంగా ఉపా చట్టాన్ని అతని మీద ప్రయోగించారు.

 

ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఉపా చట్టాన్ని ప్రయోగిస్తారా? ప్రశ్నిస్తే దేశద్రోహం అంటారా? అని ప్రజాస్వామికవాదులు సమంజసంగానే అడుగుతున్నారు. దేశంలో 1950ల నాటి రాజ్యాంగం దాని ఆదర్శాలు ఇప్పటికీ అమల్లో వున్నాయని చాలామంది  అనుకుంటుంటారు.  రాజ్యాంగ ఆదర్శాల అర్ధాలు మారిపోతున్నాయి. రాజ్యాంగంలోని పదాలు మారలేదు. కానీ వాటి అధికారిక వ్యాఖ్యానాలు, అమలు విధానం, భద్రత పేరుతో ఏర్పడుతున్న కొత్త చట్టపరమైన అర్థాలు మారుతున్నాయి. మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక పాత అర్ధాలు చాలా వేగంగా మారిపొతున్నాయనీ బహుకొద్ది మంది మాత్రమే గుర్తిస్తున్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసేవాడు మంచోడా? చెడ్డోడా? అనేది తప్పితే గొప్ప రాజ్యాంగం, చెడ్డ రాజ్యంగం అంటూ ఏమీ వుండదు అని అంబేడ్కరే ఒక దశలో అని వున్నాడు. ప్రస్తుతం రాజ్యాంగం ప్రజాస్వామిక  ఆదర్శాలు గిట్టని వాళ్ళ చేతుల్లో వుంది.

 

అలెగ్జాండర్ కాలం నుండి ఇప్పటి వరకు యుధ్ధాల్లో పాటించే మొదటి లక్ష్యం ఏమిటీ?; శత్రు దేశప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం. శత్రు దేశ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే యుధ్ధాన్ని సగం గెలిచేసినట్టే. మన జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారుడు అజిత్ దొవ్వాల్ ఈ తర్కాన్ని తిరగేసి చెపుతారు. మన దేశప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేవారు స్వదేశీయులు అయినాసరే వాళ్ళు  మన దేశ శత్రువులు, దేశద్రోహులు అనేది వారి సిధ్ధాంతం. అలా వారు 2014 నుండి దశలవారీగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక (ఉపా) చట్టానికి కొత్త కొత్త అర్ధాలు చెపుతూ వస్తున్నారు.

 

హైదరాబాద్ లో 2014లో జరిగిన IPS అధికారుల పాసింగ్-అవుట్ పరేడ్‌లో దోవల్ ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేశారు. యుధ్ధాలు ఇక సరిహద్దుల్లో మాత్రమే జరగవు. అలాగే, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో మాత్రమే జరగవు. సమాజంలో, ప్రజల మధ్య, విద్యాసంస్థల్లో, మీడియాలో, డిజిటల్ వేదికల్లో కూడా యుధ్ధాలు జరుగుతాయి. నాలుగవతరం యుధ్ధాల్లో పౌరసమాజమే యుధ్ధరంగంగా మారిపోవచ్చు (Civil Society itself becomes the battleground.) అని వారు ఒక కొత్త హెచ్చరిక చేశారు. దానికి వారు 4GW అని అందమైన పేరు పెట్టారు.

 

ఆపరేషన్ కగార్ తో చత్తీస్ గడ్, మహారాష్ట్ర,  ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టుల్ని తుడిచి పెట్టేసినట్టు కేంద్ర హోంమంత్రి ప్రకటించ్సారు. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఉద్యమాలు తలెత్తకుండా మొగ్గలోనే తుంచేయాలంటే పౌరసమాజం మీద యుధ్ధం చేయక తప్పదనేది అజిత్ దోవల్ సిధ్ధాంతం.

 

పెట్రోలు ధరలు పెరుగుతున్నాయనిగానీ, రూపాయి విలువ పడిపోతున్నదనిగానీ, అమెరికా వంగమంటే ఇండియా పాకుతున్నదనిగానీ ఎవరయినా అంటే, అది ఇక ముందు ఒక అభిప్రాయంకాదు. దేశప్రజల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం.  ప్రయత్నం కూడ కాదు అది ఒక దేశద్రోహ కుట్ర అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశద్రోహమా? లేక ప్రజాస్వామ్య బాధ్యతా? ప్రశ్నకు ఇచ్చే సమాధానమే రేపటి భారత ప్రజాస్వామ్య స్వరూపాన్ని నిర్ణయిస్తుంది.

 

10 అక్టోబరు 2026

Tuesday, 7 July 2026

60 Years of Cultural Revlution - Did National Question Solved?

సాంస్కృతిక విప్లవానికి 60 యేళ్ళు!! అయినా!!'  

డానీ

సమాజ, రాజకీయ విశ్లేషకులు

 

          చైనాలో మహత్తరంగా భావించే సాంస్కృతిక విప్లవం జరిగి ఇది 60వ సంవత్సరం.  ఆ విప్లవాన్ని మావో స్వయంగా ఆరంభించాడు, నాయకత్వం వహించాడు. దీని ఉత్తేజంతోనే భారతదేశంలో నక్సలైట్ ఉద్యమం ఆరంభమయింది.  60 ఏళ్ళ తరువాత, ఇప్పుడయినా సరే మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏమంటే ఈ విప్లవం కనీసం చైనాలో అయినా సాంస్కృతిక సమస్యల్ని ఏమేరకు పరిష్కరించిందీ అనీ.

 

పెట్టుబడీదారీ వ్యవస్థను కమ్యూనిస్టులు చాలా అద్భుతంగా విమర్శిస్తారు.  ఈనాటి మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థను కూడ వాళ్లు చాలా వివరంగా, చాలా లోతుగా విమర్శిస్తారు. ఈ విషయంలో వారికి సాటి మరొకరు వుండరు.  అయితే, ఈ వ్యవస్థను రద్దు చేసి దాని స్థానంలో కొత్తగా ఎలాంటి వ్యవస్థను రూపొందించాలీ? అనే ప్రశ్నకు వారి దగ్గర స్పష్టమైన సమాధానం వుండదు. ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్టులు పాతవ్యవస్థల్ని నిర్మూలించగలరుగానీ, కొత్త వ్యవస్థను నిర్మించలేరు అనేమాట తరచూ వినపడుతూ వుంటుంది.

 

          1917లో రష్యాలో సోషలిస్టు విప్లవం ద్వారానూ, 1949లో చైనాలో నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానూ సోషలిస్టు వ్యవస్థలు ఏర్పడినట్టు చెప్పే సాహిత్యం చాలా వుంది. ఆ రెండు దేశాల్లో ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీల పాలనే కొనసాగుతున్నప్పటికీ ఆదర్శ సోషలిస్టు సమాజాలు కొనసాగుతున్న దాఖలాలు లేవు. అక్కడ పెట్టిబడీదారీ వంటి సమాజాలే కొనసాగుతున్నాయి.

 

          మనుషులు ఆర్ధిక జీవితాన్ని మాత్రమే గడపరు. కులం మతం తెగ, లింగం, ప్రాంతం, భాష, సంస్కృతి మొదలయినవి కూడా మనుషుల జీవితాల్లో వుంటాయి. అవి ఆయా సమూహాల అస్తిత్వాలతోపాటూ  ఆలోచనలనూ ప్రభావితం చేస్తుంటాయి. తమవైన అనేకానేక కొత్త ప్రశ్నలను రేపుతుంటాయి.  కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించేవాళ్ళు వీటికి సంతృప్తికరమైన సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించాలి. వాళ్ళు ఆపని చేయలేదు; చేయడమూలేదు. .

 

          వర్గ ఘర్షణ అంటే ఆర్ధిక దోపిడికి సంబంధించింది మాత్రమే అనీ మిగిలినవన్నీ ఉపరితల అంశాలని ఉపదేశించే కమ్యూనిస్టులు మనకు  తరచూ తారసిల్లుతుంటారు. మిగిలిన వ్యవస్థల్లో వర్గపోరాటం వుండదని వీరు బల్లగుద్ది చెపుతుంటారు. నిజం అదికాదు. వర్గం సర్వాంతర్యామి. అన్ని వ్యవస్థల్లోనూ, సమస్త చారిత్రక దశల్లోనూ వర్గం వుంటుంది, వర్గపోరాటం వుంటుంది.

 

మార్క్స్-ఏంగిల్స్ 1846లోనే సంతానోత్పత్తి వ్యవస్థలో భార్యాభర్త మధ్య శ్రమ విభజన వుందని గమనించారు. ఈ విశ్లేషణను 1884లో ఏంగిల్స్ ఇంకా ముందుకు సాగించాడు.  దాంపత్యంలో వర్గ వైరుధ్యం, వర్గ ద్వేషం, వర్గ అణిచివేత (1. Class Opposition 2. Antogonism 3. Class Oppression) అనే మూడు అంశాలు వున్నట్టు తేల్చాడు. ఇది 150 సంవత్సరాల క్రితపు మార్క్సిస్టు సమాజశాస్త్ర పరిజ్ఞానం. ఆనాడే దాంపత్య వ్యవస్థలో ఇన్ని వర్గ వైషమ్యాలు వున్నట్టు మార్క్సిస్టు మహోపాధ్యాయులు గుర్తించినపుడు, ఈనాటి మతవ్యవస్థలో ఇంకెన్ని వర్గ వైషమ్యాలను మార్క్సిస్టులు గుర్తించాలీ?  పైగా, మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థలో వుంటూ!!

 

ఆర్ధిక నిర్ణాయకవాదం వంటి బండ నిర్వచనాల నుండి బయటపడడానికి కొండపల్లి సీతారామయ్య వంటివాళ్ళు కొంత ప్రయత్నం చేశారు. స్త్రీల అణిచివేత గురించి ఒక సందర్భంలో మాట్లాడుతూ సోషలిస్టు సమాజం ఏర్పడ్డాక మాత్రమే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుందనడం సరికాదు అని మందలించారు. అలాగే, ఎజెండాలో తమ సమస్య లేదంటూ స్త్రీలు కమ్యూనిస్టు పార్టీలకు దూరంగా వుండరాదని కూడా హితవు చెప్పారు. ఇది అంతకు ముందువారికన్నా మెరుగైన భావనగా కనిపిస్తున్నప్పటికీ సంతృప్తికరమైన సమాధానం మాత్రంకాదు. సోషలిస్టు సమాజాల్లో స్త్రీపురుష సంబంధాలు, వైరుధ్యాలు ఎలా వుంటాయో కూడ విడమరచి చెప్పాలి.

 

          సరిగ్గా ఇలాంటి అసంతృప్తి కుల, మత, తెగ పీడితుల్లోనూ వుంటుంది. వుంటున్నది. పెట్టుబడీదారీ వ్యవస్థలో ప్రధాన పీడితులు కార్మికులు అయినట్టే,  మతోన్మాద పెట్టుబడీదారీ వ్యవస్థలో  ప్రధాన పీడితులు  మైనారిటీ మత సమూహాలవుతాయి. ముస్లింలు, క్రైస్తవులు, శిక్కులు, బౌధ్ధులు ఈ కోవలోనికి వస్తారు. వీళ్ళు సోషలిస్టు సమాజాల్లో భిన్న మతాలమధ్య సంబంధాలు, వైరుధ్యాలు ఎలా వుంటాయాని తరచూ ప్రశ్నిస్తూ వుంటారు. ఉద్యమ నిర్మాణాల్లో వుండేవారు వీటికి సమాధానాలు చెప్పాలి. వర్గసమాజం రద్దయినపుడు మతం కూడ రద్దవుతుంది గనుక, అప్పుడు మత అణిచివేత కూడ రద్దవుతుంది కనుక అప్పటి దాక  మైనారిటీ మత సమూహాలు  ఓపిగ్గా ఎదురు చూడాలనే ఉచిత సలహాలు ఇచ్చేవారూ లేకపోలేదు.

 

          సోషలిస్టు సమాజంలో మతం? కమ్యూనిస్టు సమాజంలో మతం? వంటి సందేహాలకు సమంజసమైన సమాధానం చెప్పకపోతే ఇప్పటి మత మైనారిటీ సమూహాలు, ఆదివాసులు మరో కోణంలో వాళ్ళ పరిశోధనలు సాగిస్తారు. రష్యా, చైనాల్లో సోషలిస్టు సమాజాలు ఏర్పడిన తరువాత మత మైనారిటీలు, ఆదివాసి తెగల పరిస్థితి ఏమిటీ? ఎవరయినా అధ్యయనం చేశారా?

 

          కార్ల్ మార్క్స్ – ఏంగిల్స్ ప్రధానంగా జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్ దేశాల్లో జీవించారు. అవి యూరోపియన్ జాతిరాజ్యాలు. అక్కడ ఇతర జాతుల సమస్య అంతగా వుండదు. రష్యా సంగతి వేరు. అత్యంత విశాలమైన దేశం. అనేక జాతులు, భాషలు, సంస్కృతులు వున్నాయి. అక్కడ ఈ సమస్యను ఎలా పరిష్కరించారు అనేది ఎవరికయినా ఆసక్తికర అంశం.

 

రష్యాలో అక్టోబరు విప్లవం విజయవంతం కావడానికి ముందే లెనిన్, స్టాలిన్ కూడ జాతుల సమస్త మీద సైధ్ధాంతిక గ్రంధాలు రాశారు. అవి చాలా ఆదర్శవంతంగా వుంటాయి. జాతులకు విడిపోయే హక్కుతోసహా స్వయం నిరంయాధికారం  వుండాలని వాళ్ళు అప్పట్లో ప్రతిపాదించారు. వాళ్ళ హయాంలో సోవియట్ రష్యా సంయుక్త రాష్ట్రాలు  ఎర్పడ్డాక ఆ పుస్తకాల్లో చేసిన ప్రతిపాదనల్ని వాళ్ళు పాటించారా? రెండురకాల సమాధానాలు వస్తాయి. ఒక దశలో ఆదర్శంగా వుండడానికి ప్రయత్నించనట్టూ, ఇంకో దశలో కఠినంగా వ్యవహరించినట్టూ మనకు అర్ధం అవుతుంది. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుధ్ధకాలంలో  దేశ సమగ్రత, భద్రతా నెపాలతో రష్యన్ కమ్యూనిస్టు పాలకులు సరిహద్దుల్లోని ఆదిమజాతులు, మత మైనారిటీల మీద అనేక ఆంక్షలు విధించినట్టు ఇప్పుడు వెలుగులోనికి వస్తున్నాయి.

 

చైనాలో  సాంస్కృతిక వాతావరణం అందుకు భిన్నంగా ఏమీ కనిపించడంలేదు. మనకు ఇప్పుడు అందుబాటులో వున్న సమాచారం ప్రకారం సాంస్కృతిక విప్లవ కాలంలో అనేక ప్రాంతాల్లో మఠాలు, ఆలయాలు, మసీదులు, చర్చిల్ని మూసివేశారు. కొన్నింటిని ధ్వంసం చేశారు. టిబెటన్ బౌద్ధ వారసత్వం, ఉయ్‌ఘూర్ ముస్లిం సంస్కృతి, మంగోలియన్ సాంస్కృతిక సంప్రదాయాలు తీవ్ర ఒత్తిడిని అణిచివేతని ఎదుర్కొన్నాయని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో, హాన్ సమాజంలోని మేధావులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, పార్టీ నాయకులు కూడా రాజకీయ ఇబ్బందులకు గురయ్యారు. కాబట్టి ఈ కాలాన్ని కేవలం ఒకే కోణంలో అర్థం చేసుకోవడం సరిపోదు. చరిత్రను సంపూర్ణంగా చూడాలి.

 

 

చర్చ కేవలం చైనాకు సంబంధించినది కాదు. భారతదేశం, మాజీ సోవియట్ యూనియన్, యుగోస్లావియా, ఇథియోపియా వంటి అనేక బహుళ జాతి సమాజాలు ఒకే ప్రశ్నను ఎదుర్కొన్నాయివైవిధ్యాన్ని కాపాడుతూ ఐక్యతను ఎలా నిర్మించాలి? రాజకీయ తత్వవేత్తలు తరచూ హెచ్చరించే మాటేమిటంటే చరిత్రను అర్థం చేసుకోవడం అంటే భవిష్యత్తును ఎలా నిర్మించాలో తెలుసుకోవడం. అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రజాస్వామ్యం కేవలం రాజకీయ వ్యవస్థ కాదని, "సహజీవనం చేసే పద్ధతి" అని వివరించాడు. మన రాజ్యాంగ ప్రధాన ఆదర్శల్లో స్వేఛ్ఛా, సమానత్వంతోపాటు సహోదరభావం చాలా కీలకమైనది.

 

2026 జూలై 1 నుంచి చైనాలో "Law on Promoting Ethnic Unity and Progress" అమల్లోకి వచ్చింది. చైనా ప్రభుత్వం ఈ చట్టం లక్ష్యం అన్ని జాతుల సమాన అభివృద్ధి, జాతీయ ఐక్యత, మరియు "చైనీయ జాతి ఉమ్మడి చైతన్యం" (Community of the Chinese Nation)ను బలోపేతం చేయడమని ప్రకటించింది. చైనా వాదన ప్రకారం, ఇది విభజనవాదాన్ని నిరోధిస్తూ అన్ని జాతులు కలిసి ఆధునిక సోషలిస్టు దేశ నిర్మాణంలో భాగస్వాములు కావడానికి రూపొందించిన చట్టం. అయితే, అనేక అంతర్జాతీయ పరిశోధకులు, మానవ హక్కుల సంస్థల ప్రతినిధులు ఇందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. ఈ చట్టం మైనారిటీ సంస్కృతులను అణిచివేసి, హాన్ జాతీయ ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి ఉద్దేశించిన చట్టం ఇది అంటున్నాయి.

 

కొత్త చట్టం గురించి భిన్నాభిప్రాయాలు వుండవచ్చు. కానీ సాంస్కృతిక విప్లవం జరిగిన అరవై సంవత్సరాల తరువాత కూడా చైనాలో జాతీయ అంశంపై చర్చ కొనసాగుతోంది అన్నది గమనించాల్సిన అంశం. భారతదేశాన్నీ హిందూత్వ దేశంగా మార్చాలని ఇక్కడి పాలకులు భావిస్తున్నట్టు చైనాలోనూ హాన్ జాతి రాజ్యాన్ని నెలకొల్పే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

 

ఈంశం మీద శాస్త్రీయ చర్చ కొనసాగాలి. మరింత న్యాయమైన సమాజ నిర్మాణానికి దారి చూపించేందుకు ఈ అంశాల మధ్య మరింత లోతైన అధ్యయనం జరగాలి.

 

2026 జూలై 7

Published on 8 July 2026

Tuesday, 30 June 2026

మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థలో

 చర్చలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. 




మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థలో

మైనారిటీ మత సమూహాల మీద మెజారిటీ మత సమూహాలు సాగిస్తున్న అణిచివేతని 

వర్గ వైరం అందామా? వర్గ పీడన అందామా? వర్గ పోరాటం అందామా? ఇంకేదయినా అందామా? 

ఇది మొదటి అంశం


ఇక రెండో అంశం  - 

మార్క్స్ ఏంగిల్స్ లిఖిత చరిత్ర అన్నట్టు మత వైరుధ్యానికీ ఒక కాల పరిమితిని విధిద్దామా?


మూడవ అంశం 

మత వైరుధ్యాన్ని పరిష్కరించడానికి ఒక చైతన్యయుత సంఘటిత ప్రయత్నం ఏమైనా కావాలా? అక్కరలేదా?  


నాలుగవ అంశం

పెట్టుబడీదారీ వ్యవస్థ సామ్రాజ్యవాద దశకు చేరుకున్నప్పుడు ప్రధాన బాధిత సమూహం ఏమిటో మనకు ఒక అంచనా వుంది. 

పెట్టుబడీదారీ వ్యవస్థ మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థగా మారినపుడు బాధిత సమూహాలు ఏవీ? 


ఐదవ అంశం 

మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థలో బాధిత సమూహాలు వంద వరకు వుండవచ్చు. 

వాటిల్లో ప్రధాన బాధిత సమూహాలు ఏవీ? 


ఆరవ  అంశం 

ఒక నిర్దిష్ట సమాజంలో ప్రధాన బాధిత సమూహాలు  ఏవో నిర్ధారించకుండా  ఒక పోరాట / విప్లవ కార్యక్రమాన్ని రూపొందించడం సాధ్యమౌతుందా? 


మార్క్సో, ఏంగిల్సో మరొకరో చెప్పినంత మాత్రాన అది అంతిమ సత్యమనీ దాన్ని ప్రశ్నించకూడదనే అభిప్రాయం నాకు లేదు. 


సామ్రాజ్యవాద పెట్టుబడీదారీ వ్యవస్థ మార్క్స్ . ఏంగిల్స్ కాలానికి లేదు. దాన్ని విశ్లేషించే బాధ్యతను లెనిన్ తీసుకున్నాడు. 


మతతత్త్వ  పెట్టుబడీదారీ వ్యవస్థ లెనిన్, మావో, చారు మజుందార్ కాలానికి కూడ లేదు. 

మన కాలంలో అది ముందుకు వచ్చింది. 

దాన్నీ విశ్లేషించడం, దాని పరిష్కారానికి చేయాల్సిన పోరాట కార్యక్రమాన్ని రూపొందించడం ఈ కాలపు ఆలోచనాపరుల బాధ్యత. 


వర్గసమాజం రద్దయినపుడు మతం కూడ రద్దవుతుంది గనుక, అప్పుడు మత అణిచివేత కూడ రద్దవుతుంది కనుక అప్పటి దాక  మైనారిటీ మత సమూహాలు  ఎదురు చూడాలనే ఉచిత సలహాలు ఎవ్వరూ ఇవ్వరని ఆశిస్తాను. 


ఈ అంశం మీద ఇంకా విస్తృత చర్చ జరగాలనేదే నా ఉద్దేశ్యం. 

-  డానీ 


*నిన్నటి విప్లకారులు ఈరోజు విప్లవకారులు కావలసిన పనిలేదు*

1992 డిసెంబరులో మెజారిటీ మతతత్త్వ శక్తులు అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేశాయి. ఆ వెంటనే విరసం 1993 జనవరిలో గుడివాడలో జరిగిన పాఠశాలలో 'విప్లవ సాహిత్యంలో మతతత్త్వం' అనే అంశం మీద ఒక సెషన్ నిర్వహించింది. 'విప్లవోద్యమంలో మతతత్త్వం' గా దీనిని కొనసాగించవచ్చు. 

అంతకు ముందే కేవిఆర్ 'మతవర్గతత్వం' పేరుతో గద్వాలలో ఒక పాఠం చెప్పారు. బాలగోపాల్ 'హిందూ మతరాజ్యం' అనే పుస్తకం రాశాడు.  ఇప్పుడు నేను 'మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థ' అంటున్నాను. ఇది అవగాహనకు సంబంధించిన ఒక  చారిత్రక క్రమం. 

ఇది నచ్చనివాళ్ళు. దీన్ని గట్టిగా అడ్డుకోవాలనుకునే వాళ్ళూ చాలామంది వుంటారు. వాళ్లలో కమ్యూనిస్టులూ వుంటారు.  వాళ్ళ అవసరాలు వాళ్లకుంటాయి. వాళ్ల తర్కం వారికుంటుంది.  కారంచెడు ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు మాదిగల మీద అగ్ర కులస్తులు దాడి చేశారంంటే పాత కమ్యూనిస్టులు కొందరు నా మీద విరుచుకుపడ్డారు. రైతు కూలీల మీద భూస్వాములు దాడి చేశారు అనేది వాళ్ల నేరేటివ్. 

మనుషులు ప్రపంచాన్ని తమ భౌతిక, సామాజిక అస్తిత్వాల నుండి చూస్తారు. దీనికి మీరూ నేనూ మినహాయింపు కాదు. 

1950లలో కమ్యూనిస్టు పార్టీలు భారత దేశాన్ని ఒకలా చూశాయి. అప్పటికి వాళ్లు విప్లవకారులు. 1960లలో వాళ్లను తీవ్రంగా విమర్శిస్తూ కొత్త దృక్పథంతో కొత్త కమ్యూనిస్టులు వచ్చారు. అప్పటికి వాళ్ళూ విప్లవకారులు. 1970లలో వాళ్లనూ విమర్శిస్తూ ఇంకో కమ్యూనిస్టులు ఇంకో కొత్త దృక్పథంతో వచ్చారు. అప్పటికి వాళ్ళూ విప్లవకారులు. ఇప్పుడు మళ్ళీ వాళ్లను విమర్శిస్తూ ఇంకో కమ్యూనిస్టులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికి వాళ్ళూ విప్లవకారులే. 

కొత్త దృక్పథాలతో ముందుకు వచ్చేవారిని పాత కమ్యూనిస్టులు నిరాకరించడం పాత సాంప్రదాయమే. ఒక చారిత్రక దశలో విప్లవ ఆలోచనాపరులుగా వ్యవహరించినవారు ఇంకో చారిత్రక దశలో విప్లవ విఘాత శక్తులుగా మారిపోతారన్నది గతితార్కిక చారిత్రక భౌతికవాద సూత్రమే. 

- డానీ



Janjerla Ramesh Babu

ChatGPT ప్రకారం, ఈ వాక్యం Friedrich Engels రచించిన The Origin of the Family, Private Property and the State లోని రెండవ అధ్యాయం (Monogamous Family) నుండి తీసుకోబడింది. ఇది మార్క్సిస్టు-స్త్రీవాద ఆలోచనలో అత్యంత ప్రసిద్ధమైన వాక్యాలలో ఒకటి.
తెలుగు అనువాదం
"చరిత్రలో కనిపించిన తొలి వర్గ వైరుధ్యం (class opposition), ఏకపత్ని వివాహ వ్యవస్థలో పురుషుడు మరియు స్త్రీ మధ్య ఏర్పడిన విరుద్ధ ప్రయోజనాల అభివృద్ధితో ఏకకాలంలో ఉద్భవించింది. అలాగే, చరిత్రలో జరిగిన తొలి వర్గ అణచివేత (class oppression), పురుషుడు స్త్రీని అణచివేయడంలోనే వ్యక్తమైంది."
లేదా మరింత సులభంగా:
"చరిత్రలో మొదటిసారిగా ఏర్పడిన ఆధిపత్యం–అణచివేత సంబంధం, ఏకపత్ని వివాహ వ్యవస్థలో పురుషుడు స్త్రీపై ఆధిపత్యం చెలాయించడంతో ప్రారంభమైంది. అందువల్ల మొదటి అణచివేతకు గురైన వర్గం స్త్రీలేనని ఎంగెల్స్ పేర్కొంటాడు."
భావం (Explanation)
ఎంగెల్స్ ఇక్కడ చెప్పదలచుకున్నది ఏమిటంటే:
ఆదిమ సమాజాల్లో వ్యక్తిగత ఆస్తి (private property) పెద్దగా ఉండేది కాదు. అందువల్ల కుటుంబంలో కూడా స్త్రీ–పురుషుల మధ్య ఆధిపత్య సంబంధాలు అంత తీవ్రంగా ఉండేవి కావని ఆయన భావించాడు.
వ్యక్తిగత ఆస్తి పెరిగిన తర్వాత, ఆ ఆస్తి తన సంతానానికే సంక్రమించాలనే ఉద్దేశంతో పురుషాధిక్య కుటుంబ వ్యవస్థ (patriarchal family) బలపడింది.
ఈ క్రమంలో ఏకపత్ని వివాహ వ్యవస్థ (monogamous marriage) స్త్రీపై నియంత్రణకు ఒక సాధనంగా మారిందని ఎంగెల్స్ వాదించాడు.
అందువల్ల సమాజంలో కనిపించిన తొలి "ఆధిపత్యం–అణచివేత" సంబంధం పురుషుడు స్త్రీపై ఆధిపత్యం చెలాయించడమేనని, తరువాత అదే నమూనా వర్గాల మధ్య (యజమాని–కార్మికుడు, పాలకుడు–పాలితుడు) కనిపించిందని ఆయన విశ్లేషించాడు.
In this quotation, "female sex" does not refer to sexual intercourse or sexual activity. It uses the older meaning of the word "sex", which means biological sex—that is, the category of being female or male.
In the sentence:
"...the first class oppression coincides with that of the female sex by the male."
"Female sex" simply means "women" or "the female sex as a social group." Engels is saying that, in his view, the earliest form of systematic oppression was the subordination of women by men.
Here, the phrase can be understood as:
Female sex = women (the biological female population)
By the male = by men
It is not referring to:
sexual intercourse,
sexual relations,
sexual behavior,
or sexuality.
Why did Engels use "sex" instead of "women"?
In the 19th century, especially in philosophical and academic writing, it was common to refer to "the female sex" and "the male sex" as formal expressions meaning women and men respectively.
For example:
"The female sex deserves equal rights." = Women deserve equal rights.
"The male sex has historically held political power." = Men have historically held political power.
In the context of the chapter
Engels argues that the emergence of the monogamous patriarchal family marked the beginning of a social relationship in which men exercised authority over women. Whether one agrees with this historical interpretation or not, the phrase "female sex" in this passage refers only to women as a social and biological group, not to intercourse.
So, the sentence is about gender-based social oppression, not about sexual relations.