Friday, 10 July 2026

బ్రహ్మణి స్టీల్స్ భూముల బాగోతం-వాస్తవాలు

 బ్రహ్మణి స్టీల్స్ భూముల బాగోతం-వాస్తవాలు🙏🙏

జగన్ అవినీతి సామ్రాజ్యానికి పునాది బ్రహ్మాణి స్టీల్స్ 

ప్రజలకు బతుకు, భవిష్యత్, భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు పని చేస్తున్నారు🙏🙏

కానీ అవినీతి-దోపిడీ కోసం భూమి, బంగారం, బ్యాంక్ బ్యాలెన్సులు పెంచుకోవాలనే దురుద్దేశ్యంతో వైఎస్ కుటుంబం పని చేస్తోంది😡😡

ఇదేదో మాట వరుసకు అనడం లేదు... ప్రత్యర్థి కాబట్టి విమర్శించడం లేదు.. ఇది అక్షరాలా నిజమని నిరూపించే సంఘటనలు గత 20-25 ఏళ్ల కాలంలో చాలానే జరిగాయి.

తాజాగా బ్రహ్మణి స్టీల్స్ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడంతో వైఎస్ కుటుంబం ప్రజా ధనాన్ని.. ప్రభుత్వ భూములను ఏ స్థాయిలో దోచుకుందోననేది మళ్లీ చర్చనీయాంశంగా మారింది.

బ్రహ్మాణి సంస్థకు భూములు కేటాయించే విషయంలో నాటి వైఎస్ ప్రభుత్వం ఈ ప్రాథమిక నిబంధనలన్నింటినీ పక్కనబెట్టింది.

సంస్థ సామర్థ్యాన్ని ఏమాత్రం పరిశీలించకుండా ఏకపక్షంగా వేల ఎకరాల భూములను కేటాయించారు.

తనకు అత్యంత సన్నిహితుడైన గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రహ్మాణి స్టీల్స్ సంస్థకు నాటి సీఎం వైఎస్సార్ ఏకంగా 14 వేల ఎకరాలు అప్పన్నంగా కట్టబెట్టారు.

ఇందులో 10,760 ఎకరాలు స్టీల్ ప్లాంట్ కోసమని... 3,115 ఎకరాలు ఎయిర్ పోర్టు కోసమని కూడా వర్గీకరించి భూ కేటాయింపులు జరిపారు.

2007 జులై 8వ తేదీన కడప జిల్లాలో ఎకరా రూ.18 వేల చొప్పున 10,760 ఎకరాలు, రూ.25 వేలు చొప్పున మరో 3,115 ఎకరాల భూ కేటాయిస్తూ జీఓ నెం.785 జారీ చేశారు.

2007 జులై 18వ తేదీన జీఓ నెం.151, 152 ద్వారా అనంతపురం జిల్లాలో 107 హెక్టార్లు బ్రాహ్మణీ స్టీల్స్ పేరుతో గనులు కేటాయించారు.

2008 మార్చి 25వ తేదీన విమానాశ్రయం ఏర్పాటుకు 3,115.64 ఎకరాలు కేటాయించారు.

దీని ద్వారా 10 వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని నమ్మబలికారు.

ఏటా 20 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తామని ప్రగల్భాలు పలికారు... దీని కోసం ఓబుళాపురం గనులను కూడా కేటాయించారు... కానీ అవన్ని బూటకాలని ఆ తర్వాత కొద్దికాలంలోనే తేలింది.

ఓబుళాపురం దోపిడీ వయా బ్రహ్మాణి స్టీల్స్...

ఓబుళాపురం గనులను తవ్వుకునేందుకు దోపిడీ చేసేందుకే బ్రహ్మణి స్టీల్స్ పుట్టింది. 

బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ పేరుతో భూములను స్వాహా చేసిన గాలి జనార్దన్ రెడ్డికి తెర వెనుక పార్టనర్ జగన్.

బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామనే పేరుతో ఆ సంస్థకు ఓబుళాపురం భూములను క్యాప్టివ్ గనుల కింద కేటాయించారు... అలాగే ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 320 ఎకరాల్లో మైనింగ్ లీజ్ ఇచ్చారు.

క్యాప్టివ్ గనులుగా కేటాయించిన తర్వాత స్టీల్ ప్లాంట్ పనులు మొదలు పెట్టాల్సిన గాలి జనార్దన్ రెడ్డి అండ్ కో.. ఆ పనిని పక్కన పెట్టి.. ఓబుళాపురం గనుల్లో తవ్వకాలు మొదలు పెట్టారు.

2007-2009 మధ్య కాలంలో అంటే రెండేళ్ల కాలంలో ఓబుళాపురం మైనింగ్ స్కామ్ కు భారీ ఎత్తున తెరలేపారు.

ఉక్కు ఉత్పత్తి కోసం వినియోగించాల్సిన ఖనిజాన్ని ఎగుమతులు చేసుకుని భారీ ఎత్తున దోపిడీ చేశారు. కడపలో ఉక్కు కర్మాగారం రాలేదు కానీ...వేల కోట్ల అవినీతి జరిగింది. దీని వల్ల వైఎస్ కుటుంబం లబ్ది పొందింది.

2008 సెప్టెంబర్ లో ఓబుళాపురం మైనింగ్ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న రెడ్ గోల్డ్ సంస్థ కూడా సాక్షి పత్రికను ప్రచురించే జగతి పబ్లికేషన్స్ చిరునామాతోనే రిజిస్ట్రార్ అయింది.

జగన్‌కు ఇందిరా టెలివిజన్‌లో రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టిన ఆర్ఆర్ గ్లోబల్ సంస్థ చిరునామా కూడా అదే.

ఓఎంసీ నుంచి ఉత్పత్తి అయ్యే ఇనుప ఖనిజంలో 50 శాతం ఉత్పత్తి ఖర్చుకు కేవలం 5 శాతాన్ని అదనంగా కలిపే ధరకు రెడ్ గోల్డ్ కు ఇచ్చేలా ఒప్పందం, అక్కడ నుంచి సాక్షిలోకి నిధులు వెళ్ళాయి.

ఓబుళాపురం అక్రమాలపై ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది... క్షేత్ర స్థాయి మొదలుకుని.. జాతీయ స్థాయి వరకు నాటి ప్రభుత్వ అక్రమాలను ఎండగట్టింది.

ఓఎంసీ అక్రమాలు వెలుగులోకి రావడంతో 2009 డిసెంబర్ 8వ తేదీన సీబీఐ దర్యాప్తునకు నాటి ప్రభుత్వం ఆదేశించింది... 2012 మే 31వ తేదీన బ్రహ్మాణి స్టీల్సుతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేశారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టాక జగన్ ఓబుళాపురం అక్రమాలను మళ్లీ మొదలు పెట్టే ప్రయత్నం చేశారు.

ఓబులాపురం మైనింగ్ లీజులో తవ్వకాలు పునరుద్ధరించినా మాకెలాంటి అభ్యంతరం లేదని 2022లో నాటి జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ అప్పట్లోనే బయటపెట్టడంతో ఓఎంసీ, జగన్ ప్రభుత్వం పాచిక పారలేదు.

జగన్ అధికారంలోకి వచ్చాక రెండు సార్లు స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపనలు చేసి డ్రామాలాడారు... కనీసం కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా చేపట్టలేదు.

కియా వర్సెస్ బ్రహ్మాణి...

కియా విషయంలో ఏం జరిగింది... బ్రహ్మాణి విషయంలో ఏం జరిగిందో పరిశీలిస్తే... జగన్ దోపిడీ ఏంటో అర్థమవుతుంది.

నాడు బ్రహ్మాణీ స్టీల్స్ కు భూ కేటాయింపులు జరిపారు.. కానీ తట్ట మట్టి పని కూడా చేయలేదు. సుమారు రూ. 5 వేల కోట్ల విలువైన 10 వేల ఎకరాల భూములను నిర్వీర్యం చేశారు. సీమ ప్రజలను వంచించారు.

అదే కియా సంస్థకు సీఎం చంద్రబాబు 2014-19 మధ్య కాలంలో భూములు కేటాయించారు.


దేశ వ్యాప్తంగా పోటీ ఉన్నా 2017లో అనంతపురం జిల్లాకు కియా కార్ల పరిశ్రమల తెచ్చారు.

536 ఎకరాలు కేటాయించారు. నీళ్లు ఇచ్చి, అన్ని విధాలుగా సహకరించి ఉత్పత్తి ప్రారంభించారు.

ఇప్పటికి దాదాపు 19 లక్షల కార్లు మన ఉత్పత్తి అయ్యాయి. ఇందులో 3 లక్షల కార్లు ఏకంగా 90కి పైగా దేశాలకు ఎగుమతి అయ్యాయి.

వైఎస్ హయాంలో బ్రహ్మాణి స్టీల్స్ కు ఏకంగా 10 వేల భూములు కట్టబెట్టారు.

క్యాప్టివ్ మైనింగ్ అంటూ ఓబులాపురం గనులు రాయించుకున్నారు. ప్లాంట్ పెట్టలేదు కానీ ఓబులాపురం గనులను దోచుకున్నారు.

పెనుకొండలో ఉత్పత్తి అయిన కియా కార్లు 90 దేశాలకు ఎగుమతి అవుతుంటే... జగన్ పార్టనర్షిప్ లో ఓబుళాపురంలోని ఇనుప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేశారు.

ఇలాంటివి జగన్ మోహన్ రెడ్డి చాలానే చేశారు... సరస్వతి పవర్ కు 1,516 ఎకరాలు కేటాయించారు... 15 ఏళ్లు అయినా... నేటికి పరిశ్రమ పూర్తి చేయలేదు.ఆ భూములను తనఖా పెట్టి తెచ్చుకున్న నిధులను దారి మళ్లించారు.

సెజ్ లకు 20 వేల ఎకరాలు, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు 8,844 ఎకరాలు, నెల్లూరులో థర్మల్ పవర్ కు 15 వేల ఎకరాలు కేటాయించారు.. కానీ ఒక్క పరిశ్రమ రాలేదు... ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు.

నిబంధనలకు విరుద్దంగా భూములు కేటాయించడం.. గనులైతే దోచుకోవడం... మామూలు భూములైతే వాటిని బ్యాంకులో తనఖా పెట్టి డబ్బులు డ్రా చేయడం ఇదీ వీళ్లు చేసే పని.

వీళ్లా విమర్శలు చేసేది.. సిగ్గు సిగ్గు

ఇంతటి సిగ్గుమాలిన పనులు చేసిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం మీద ఇంకా బురద జల్లేందుకు గొడ్డలి పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.

ఉద్యోగాలు వస్తాయి... అభివృద్ధి జరుగుతుందని గూగుల్ కు భూములిస్తే.. కోర్టులకెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఐటీ చదువుకున్న యువత హైదరాబాద్, బెంగళూరులకు వెళ్లకుండా విశాఖలోనే ఉద్యోగాలు తెచ్చుకునేలా టీసీఎస్, కాగ్నిజెంట్ కంపెనీలకు భూములిస్తే దాని మీద పడి ఏడ్చారు.

పెట్టని స్టీల్ ఫ్యాక్టరీ కోసం భూములివ్వడంతో పాటు.. ఏకంగా విమానాశ్రయం నిర్మిస్తామనే పేరుతో 3 వేల ఎకరాలను కట్టబెట్టిన వాళ్లు రాజధానికి అంత భూమి ఎందుకంటూ అక్కసు వెళ్లగక్కుతున్నారు.

నాడు వైఎస్ జమానాలో.. ఆ తర్వాత జగన్ జమానాలో భూములను అడ్డం పెట్టుకుని దోపిడీ చేసింది చాలక.. ఇప్పుడు పరిశ్రమలకు భూములిచ్చి యువతకు ఉపాధి కల్పిస్తుంటే ఓర్వలేకపోతున్నారు.

వాళ్లకు భూమి అంటే దోపిడీ... భూమి అంటే అవినీతి... భూమి అంటే కబ్జా.. భూమి అంటే బ్యాంక్ బ్యాలెన్స్.

కానీ కూటమి ప్రభుత్వానికి భూమి అంటే భవిష్యత్.. భూమి అంటే ఉద్యోగాలు.. భూమి అంటే అభివృద్ధి.. భూమి అంటే పరిశ్రమలు.


క్రోనాలజీ

S.no

Date

వివరాలు

1

01.06.2007

భూ కేటాయింపులు జరపమని కడప కలెక్టర్‌కు లేఖ

2

04.06.2007

భూ కేటాయింపులకు సీసీఎల్ఏ క్లియరెన్స్

3

08.06.2007

కడప జిల్లాలో బ్రాహ్మణీ స్టీల్స్ కు ఎకరా రూ.18 వేల చొప్పున 10,760 ఎకరాలు, రూ.25 వేలు చొప్పున మరో 3,115 ఎకరాల భూ కేటాయింపు చేస్తూ జీఓ నెం.785 జారీ

4

10.06.2007

బ్రాహ్మణీ స్టీల్స్ కు వైఎస్ఆర్ శంకుస్థాపన (జగన్ హాజరు)

5

18.06.2007

జీఓ నెం.151, 152 ద్వారా అనంతపురం జిల్లాలో 107 హెక్టార్లు బ్రాహ్మణీ స్టీల్స్ పేరుతో గనులు కేటాయింపు.

6

25.03.2008

విమానాశ్రయం ఏర్పాటుకు 3,115.64 ఎకరాలు కేటాయింపు



09.05.2008

జీఓ నెం.94 ద్వారా బ్రాహ్మణీ స్టీల్స్ కు మైలవరం రిజర్వాయర్ నుండి 2 టీఎంసీల నీరు

7

08.12.2009

ఓబులాపురంపై సిబిఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశం

8

31.05.2012

బ్రాహ్మణీ స్టీల్స్ MoU ను రద్దు చేసిన ప్రభుత్వం

9

20.06.2013

బ్రాహ్మణీ స్టీల్స్ కు కేటాయించిన భూములను రద్దు చేస్తూ జీఓ నెం.333 జారీ.



06.11.2018

SAEL సాధ్యం కాదని చెప్పడంతో పీపీపీ విధానంలో 'రాయలసీమ స్టీల్ కార్పొరేషన్' ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం ఆమోదం.



27.12.2018

మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన.



Nov.2019

వైసీపీ అధికారంలోకి వచ్చాక 'ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్' (APHGSL) అనే ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పాటు.



18.12.2019

18 డిసెంబర్ 2019: ఏడాదికి 5 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ సరఫరా కోసం ఎన్‌ఎండీసీ (NMDC) సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం.



23.12.2019

జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన.



15.02.2023

15 ఫిబ్రవరి 2023: సున్నపురాళ్లపల్లెలో సీఎం జగన్ మరోసారి శంకుస్థాపన.



03.06.2026

సున్నపురాల్లపల్లెలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి పనులు పునఃప్రారంభం.

10

25.06.2026

జీఓ నెం.333 సవాల్ చేస్తూ బ్రాహ్మణీ స్టీల్స్ వేసిన పిటిషన్‌ను డీఫాల్ట్‌గా హైకోర్టు కొట్టేసింది.

*పవన్ కళ్యాణ్ ను మిమిక్రీ చేస్తే దేశద్రోహమా?*

 

*పవన్ కళ్యాణ్ ను మిమిక్రీ చేస్తే దేశద్రోహమా?*

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు*

 

ప్రభుత్వ నాయకుడిని విమర్శించడం, వ్యంగ్యంగా అనుకరించడం, మిమిక్రీ చేయడంఇవి రాజకీయ సంస్కృతిలో భాగమా? లేక దేశద్రోహమా? ప్రశ్న ఇప్పుడు యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అరెస్టుతో మళ్లీ ముందుకు వచ్చింది. 

ఇరాన్ యుధ్ధం ఆరంభం కావడానికి ఒకరోజు ముందు ఇజ్రాయిల్ వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోదీ, భారత యూదులకు భారతదేశం మదర్ ల్యాండ్, ఇజ్రాయిల్ ఫాదర్ ల్యాండ్ అన్నారు. మానవేతిహాసంలో ఇదొక గొప్ప ఆవిష్కరణగా సంఘపరివారకులు తన్మయంతో పొంగిపోయారు. ఇటీవల ఇండోనేషియా వెళ్ళిన ప్రధాని రెండు దేశాల మధ్య అనుబంధాన్ని తేదీల్లో చెప్పారు.  26 అనేది భారత రిపబ్లిక్ దినోత్సవం, 17 అనేది ఇండోనేషియా ప్రస్తుత అధ్యక్షుడు  ప్రబొవో సుబియంతో  పుట్టినరోజు. 2+6 అయినా, 1+7 అయినా సమాధానం 8 అని గుర్తుచేసి అక్కడి సభికుల్ని హాశ్చర్య చకితుల్ని చేశారు. గణిత శాస్త్రంలో ఇదొక సరికొత్త ఆవిష్కరణ అంటూ సంఘీయులు తెగ ముసిపోతున్నారు.

 

ప్రధాని సామర్ధ్యం గురించి జరిగే చర్చలు దేశప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని (విల్ పవర్)  పెంచుతాయని  బిజెపి మద్దతుదారులు నమ్ముతుంటారు. అలా కాకుండా, ఇలాంటి లెఖ్ఖలు నాలుగో తరగతి పిల్లలు కూడా చెపుతారు అని తీసిపడేస్తే దేశప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నట్టు లెఖ్ఖ. దేశ ప్రధానిని చులకన చేసి దేశప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీయడం దేశద్రోహంతో సమానమైన నేరం!! వినడానికి ఇది వింతగావున్నా ఇదే నిజం!

 

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యూ ట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ మధ్య కొంతకాలంగా వాద వివాదాలు సాగుతున్నాయి. అనేక వీడియోల్లో, సభల్లో ‘ప్రశ్న రావణ్’ పవన్ కళ్యాణ్ ను అనుకరిస్తూ మాట్లాడారు. కొన్ని సభల్లో పవన్ కళ్యాణ్ చేతిలో చెప్పుతీసుకుని బెదిరిస్తూ, హెచ్చరిస్తూ మాట్లాడారు. చేతిలో చెప్పు లేకుండానే పవన్ కళ్యాణ్ మాటల్ని  ‘ప్రశ్న రావణ్’ మిమిక్రీ చేశారు. అది నేరం అయితే పవన్ కళ్యాణ్ ది కూడ నేరమే అవుతుంది. ‘ప్రశ్న రావణ్’ ని శిక్షించాలనుకుంటే పవన్ కళ్యాన్ ని కూడ అదే చట్టం కింద శిక్షించాలి. చట్టం ముందు అందరూ సమానమే అనికదా మన రాజ్యాంగం చెపుతోందీ? ఉప ముఖ్యమంత్రికి ఒక చట్టం, యూట్యూబరుకు ఇంకో చట్ట వుండకూడదుగా.  చేతిలో చెప్పు పట్టుకుని ప్రదర్శించినవారిని వదిలేసి, చెప్పులేకుండా ప్రదర్శించినవారిని ఎక్కువగా శిక్షిస్తే చట్ట సమానత్వం గురించి సహజంగానే సందేహాలు తలెత్తుతాయి.

 

‘ప్రశ్న రావణ్’ మీద అనేక ఆరోపణలు చేసి  నాలుగుసార్లు అరెస్టు చేశారు. నాలుగుసార్లూ ఆతనికి బెయిల్ వచ్చింది. ఐదోసారి ఉపా చట్టాన్ని ప్రయోగించారు. ప్రముఖ మావోయిస్టు హిడ్మా చనిపోయినపుడు ఒక టీవీ సంస్థ ప్రసారం చేసిన ఒక వీడియోకు ‘ప్రశన రావణ్’ వాయిస్ ఓవర్ చెప్పారు. అందులో, ఒక హిడ్మా చనిపోతే వందమంది హిడ్మాలు పుట్టుకుని వస్తారు వంటి వాక్యాలున్నాయి. వీటి ఆధారంగా ఉపా చట్టాన్ని అతని మీద ప్రయోగించారు.

 

ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఉపా చట్టాన్ని ప్రయోగిస్తారా? ప్రశ్నిస్తే దేశద్రోహం అంటారా? అని ప్రజాస్వామికవాదులు సమంజసంగానే అడుగుతున్నారు. దేశంలో 1950ల నాటి రాజ్యాంగం దాని ఆదర్శాలు ఇప్పటికీ అమల్లో వున్నాయని చాలామంది  అనుకుంటుంటారు.  రాజ్యాంగ ఆదర్శాల అర్ధాలు మారిపోతున్నాయి. రాజ్యాంగంలోని పదాలు మారలేదు. కానీ వాటి అధికారిక వ్యాఖ్యానాలు, అమలు విధానం, భద్రత పేరుతో ఏర్పడుతున్న కొత్త చట్టపరమైన అర్థాలు మారుతున్నాయి. మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక పాత అర్ధాలు చాలా వేగంగా మారిపొతున్నాయనీ బహుకొద్ది మంది మాత్రమే గుర్తిస్తున్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసేవాడు మంచోడా? చెడ్డోడా? అనేది తప్పితే గొప్ప రాజ్యాంగం, చెడ్డ రాజ్యంగం అంటూ ఏమీ వుండదు అని అంబేడ్కరే ఒక దశలో అని వున్నాడు. ప్రస్తుతం రాజ్యాంగం ప్రజాస్వామిక  ఆదర్శాలు గిట్టని వాళ్ళ చేతుల్లో వుంది.

 

అలెగ్జాండర్ కాలం నుండి ఇప్పటి వరకు యుధ్ధాల్లో పాటించే మొదటి లక్ష్యం ఏమిటీ?; శత్రు దేశప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం. శత్రు దేశ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే యుధ్ధాన్ని సగం గెలిచేసినట్టే. మన జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారుడు అజిత్ దొవ్వాల్ ఈ తర్కాన్ని తిరగేసి చెపుతారు. మన దేశప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేవారు స్వదేశీయులు అయినాసరే వాళ్ళు  మన దేశ శత్రువులు, దేశద్రోహులు అనేది వారి సిధ్ధాంతం. అలా వారు 2014 నుండి దశలవారీగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక (ఉపా) చట్టానికి కొత్త కొత్త అర్ధాలు చెపుతూ వస్తున్నారు.

 

హైదరాబాద్ లో 2014లో జరిగిన IPS అధికారుల పాసింగ్-అవుట్ పరేడ్‌లో దోవల్ ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేశారు. యుధ్ధాలు ఇక సరిహద్దుల్లో మాత్రమే జరగవు. అలాగే, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో మాత్రమే జరగవు. సమాజంలో, ప్రజల మధ్య, విద్యాసంస్థల్లో, మీడియాలో, డిజిటల్ వేదికల్లో కూడా యుధ్ధాలు జరుగుతాయి. నాలుగవతరం యుధ్ధాల్లో పౌరసమాజమే యుధ్ధరంగంగా మారిపోవచ్చు (Civil Society itself becomes the battleground.) అని వారు ఒక కొత్త హెచ్చరిక చేశారు. దానికి వారు 4GW అని అందమైన పేరు పెట్టారు.

 

ఆపరేషన్ కగార్ తో చత్తీస్ గడ్, మహారాష్ట్ర,  ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టుల్ని తుడిచి పెట్టేసినట్టు కేంద్ర హోంమంత్రి ప్రకటించ్సారు. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఉద్యమాలు తలెత్తకుండా మొగ్గలోనే తుంచేయాలంటే పౌరసమాజం మీద యుధ్ధం చేయక తప్పదనేది అజిత్ దోవల్ సిధ్ధాంతం.

 

పెట్రోలు ధరలు పెరుగుతున్నాయనిగానీ, రూపాయి విలువ పడిపోతున్నదనిగానీ, అమెరికా వంగమంటే ఇండియా పాకుతున్నదనిగానీ ఎవరయినా అంటే, అది ఇక ముందు ఒక అభిప్రాయంకాదు. దేశప్రజల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం.  ప్రయత్నం కూడ కాదు అది ఒక దేశద్రోహ కుట్ర అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశద్రోహమా? లేక ప్రజాస్వామ్య బాధ్యతా? ప్రశ్నకు ఇచ్చే సమాధానమే రేపటి భారత ప్రజాస్వామ్య స్వరూపాన్ని నిర్ణయిస్తుంది.

 

10 అక్టోబరు 2026

Tuesday, 7 July 2026

60 Years of Cultural Revlution - Did National Question Solved?

సాంస్కృతిక విప్లవానికి 60 యేళ్ళు!! అయినా!!'  

డానీ

సమాజ, రాజకీయ విశ్లేషకులు

 

          చైనాలో మహత్తరంగా భావించే సాంస్కృతిక విప్లవం జరిగి ఇది 60వ సంవత్సరం.  ఆ విప్లవాన్ని మావో స్వయంగా ఆరంభించాడు, నాయకత్వం వహించాడు. దీని ఉత్తేజంతోనే భారతదేశంలో నక్సలైట్ ఉద్యమం ఆరంభమయింది.  60 ఏళ్ళ తరువాత, ఇప్పుడయినా సరే మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏమంటే ఈ విప్లవం కనీసం చైనాలో అయినా సాంస్కృతిక సమస్యల్ని ఏమేరకు పరిష్కరించిందీ అనీ.

 

పెట్టుబడీదారీ వ్యవస్థను కమ్యూనిస్టులు చాలా అద్భుతంగా విమర్శిస్తారు.  ఈనాటి మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థను కూడ వాళ్లు చాలా వివరంగా, చాలా లోతుగా విమర్శిస్తారు. ఈ విషయంలో వారికి సాటి మరొకరు వుండరు.  అయితే, ఈ వ్యవస్థను రద్దు చేసి దాని స్థానంలో కొత్తగా ఎలాంటి వ్యవస్థను రూపొందించాలీ? అనే ప్రశ్నకు వారి దగ్గర స్పష్టమైన సమాధానం వుండదు. ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్టులు పాతవ్యవస్థల్ని నిర్మూలించగలరుగానీ, కొత్త వ్యవస్థను నిర్మించలేరు అనేమాట తరచూ వినపడుతూ వుంటుంది.

 

          1917లో రష్యాలో సోషలిస్టు విప్లవం ద్వారానూ, 1949లో చైనాలో నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానూ సోషలిస్టు వ్యవస్థలు ఏర్పడినట్టు చెప్పే సాహిత్యం చాలా వుంది. ఆ రెండు దేశాల్లో ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీల పాలనే కొనసాగుతున్నప్పటికీ ఆదర్శ సోషలిస్టు సమాజాలు కొనసాగుతున్న దాఖలాలు లేవు. అక్కడ పెట్టిబడీదారీ వంటి సమాజాలే కొనసాగుతున్నాయి.

 

          మనుషులు ఆర్ధిక జీవితాన్ని మాత్రమే గడపరు. కులం మతం తెగ, లింగం, ప్రాంతం, భాష, సంస్కృతి మొదలయినవి కూడా మనుషుల జీవితాల్లో వుంటాయి. అవి ఆయా సమూహాల అస్తిత్వాలతోపాటూ  ఆలోచనలనూ ప్రభావితం చేస్తుంటాయి. తమవైన అనేకానేక కొత్త ప్రశ్నలను రేపుతుంటాయి.  కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించేవాళ్ళు వీటికి సంతృప్తికరమైన సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించాలి. వాళ్ళు ఆపని చేయలేదు; చేయడమూలేదు. .

 

          వర్గ ఘర్షణ అంటే ఆర్ధిక దోపిడికి సంబంధించింది మాత్రమే అనీ మిగిలినవన్నీ ఉపరితల అంశాలని ఉపదేశించే కమ్యూనిస్టులు మనకు  తరచూ తారసిల్లుతుంటారు. మిగిలిన వ్యవస్థల్లో వర్గపోరాటం వుండదని వీరు బల్లగుద్ది చెపుతుంటారు. నిజం అదికాదు. వర్గం సర్వాంతర్యామి. అన్ని వ్యవస్థల్లోనూ, సమస్త చారిత్రక దశల్లోనూ వర్గం వుంటుంది, వర్గపోరాటం వుంటుంది.

 

మార్క్స్-ఏంగిల్స్ 1846లోనే సంతానోత్పత్తి వ్యవస్థలో భార్యాభర్త మధ్య శ్రమ విభజన వుందని గమనించారు. ఈ విశ్లేషణను 1884లో ఏంగిల్స్ ఇంకా ముందుకు సాగించాడు.  దాంపత్యంలో వర్గ వైరుధ్యం, వర్గ ద్వేషం, వర్గ అణిచివేత (1. Class Opposition 2. Antogonism 3. Class Oppression) అనే మూడు అంశాలు వున్నట్టు తేల్చాడు. ఇది 150 సంవత్సరాల క్రితపు మార్క్సిస్టు సమాజశాస్త్ర పరిజ్ఞానం. ఆనాడే దాంపత్య వ్యవస్థలో ఇన్ని వర్గ వైషమ్యాలు వున్నట్టు మార్క్సిస్టు మహోపాధ్యాయులు గుర్తించినపుడు, ఈనాటి మతవ్యవస్థలో ఇంకెన్ని వర్గ వైషమ్యాలను మార్క్సిస్టులు గుర్తించాలీ?  పైగా, మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థలో వుంటూ!!

 

ఆర్ధిక నిర్ణాయకవాదం వంటి బండ నిర్వచనాల నుండి బయటపడడానికి కొండపల్లి సీతారామయ్య వంటివాళ్ళు కొంత ప్రయత్నం చేశారు. స్త్రీల అణిచివేత గురించి ఒక సందర్భంలో మాట్లాడుతూ సోషలిస్టు సమాజం ఏర్పడ్డాక మాత్రమే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుందనడం సరికాదు అని మందలించారు. అలాగే, ఎజెండాలో తమ సమస్య లేదంటూ స్త్రీలు కమ్యూనిస్టు పార్టీలకు దూరంగా వుండరాదని కూడా హితవు చెప్పారు. ఇది అంతకు ముందువారికన్నా మెరుగైన భావనగా కనిపిస్తున్నప్పటికీ సంతృప్తికరమైన సమాధానం మాత్రంకాదు. సోషలిస్టు సమాజాల్లో స్త్రీపురుష సంబంధాలు, వైరుధ్యాలు ఎలా వుంటాయో కూడ విడమరచి చెప్పాలి.

 

          సరిగ్గా ఇలాంటి అసంతృప్తి కుల, మత, తెగ పీడితుల్లోనూ వుంటుంది. వుంటున్నది. పెట్టుబడీదారీ వ్యవస్థలో ప్రధాన పీడితులు కార్మికులు అయినట్టే,  మతోన్మాద పెట్టుబడీదారీ వ్యవస్థలో  ప్రధాన పీడితులు  మైనారిటీ మత సమూహాలవుతాయి. ముస్లింలు, క్రైస్తవులు, శిక్కులు, బౌధ్ధులు ఈ కోవలోనికి వస్తారు. వీళ్ళు సోషలిస్టు సమాజాల్లో భిన్న మతాలమధ్య సంబంధాలు, వైరుధ్యాలు ఎలా వుంటాయాని తరచూ ప్రశ్నిస్తూ వుంటారు. ఉద్యమ నిర్మాణాల్లో వుండేవారు వీటికి సమాధానాలు చెప్పాలి. వర్గసమాజం రద్దయినపుడు మతం కూడ రద్దవుతుంది గనుక, అప్పుడు మత అణిచివేత కూడ రద్దవుతుంది కనుక అప్పటి దాక  మైనారిటీ మత సమూహాలు  ఓపిగ్గా ఎదురు చూడాలనే ఉచిత సలహాలు ఇచ్చేవారూ లేకపోలేదు.

 

          సోషలిస్టు సమాజంలో మతం? కమ్యూనిస్టు సమాజంలో మతం? వంటి సందేహాలకు సమంజసమైన సమాధానం చెప్పకపోతే ఇప్పటి మత మైనారిటీ సమూహాలు, ఆదివాసులు మరో కోణంలో వాళ్ళ పరిశోధనలు సాగిస్తారు. రష్యా, చైనాల్లో సోషలిస్టు సమాజాలు ఏర్పడిన తరువాత మత మైనారిటీలు, ఆదివాసి తెగల పరిస్థితి ఏమిటీ? ఎవరయినా అధ్యయనం చేశారా?

 

          కార్ల్ మార్క్స్ – ఏంగిల్స్ ప్రధానంగా జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్ దేశాల్లో జీవించారు. అవి యూరోపియన్ జాతిరాజ్యాలు. అక్కడ ఇతర జాతుల సమస్య అంతగా వుండదు. రష్యా సంగతి వేరు. అత్యంత విశాలమైన దేశం. అనేక జాతులు, భాషలు, సంస్కృతులు వున్నాయి. అక్కడ ఈ సమస్యను ఎలా పరిష్కరించారు అనేది ఎవరికయినా ఆసక్తికర అంశం.

 

రష్యాలో అక్టోబరు విప్లవం విజయవంతం కావడానికి ముందే లెనిన్, స్టాలిన్ కూడ జాతుల సమస్త మీద సైధ్ధాంతిక గ్రంధాలు రాశారు. అవి చాలా ఆదర్శవంతంగా వుంటాయి. జాతులకు విడిపోయే హక్కుతోసహా స్వయం నిరంయాధికారం  వుండాలని వాళ్ళు అప్పట్లో ప్రతిపాదించారు. వాళ్ళ హయాంలో సోవియట్ రష్యా సంయుక్త రాష్ట్రాలు  ఎర్పడ్డాక ఆ పుస్తకాల్లో చేసిన ప్రతిపాదనల్ని వాళ్ళు పాటించారా? రెండురకాల సమాధానాలు వస్తాయి. ఒక దశలో ఆదర్శంగా వుండడానికి ప్రయత్నించనట్టూ, ఇంకో దశలో కఠినంగా వ్యవహరించినట్టూ మనకు అర్ధం అవుతుంది. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుధ్ధకాలంలో  దేశ సమగ్రత, భద్రతా నెపాలతో రష్యన్ కమ్యూనిస్టు పాలకులు సరిహద్దుల్లోని ఆదిమజాతులు, మత మైనారిటీల మీద అనేక ఆంక్షలు విధించినట్టు ఇప్పుడు వెలుగులోనికి వస్తున్నాయి.

 

చైనాలో  సాంస్కృతిక వాతావరణం అందుకు భిన్నంగా ఏమీ కనిపించడంలేదు. మనకు ఇప్పుడు అందుబాటులో వున్న సమాచారం ప్రకారం సాంస్కృతిక విప్లవ కాలంలో అనేక ప్రాంతాల్లో మఠాలు, ఆలయాలు, మసీదులు, చర్చిల్ని మూసివేశారు. కొన్నింటిని ధ్వంసం చేశారు. టిబెటన్ బౌద్ధ వారసత్వం, ఉయ్‌ఘూర్ ముస్లిం సంస్కృతి, మంగోలియన్ సాంస్కృతిక సంప్రదాయాలు తీవ్ర ఒత్తిడిని అణిచివేతని ఎదుర్కొన్నాయని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో, హాన్ సమాజంలోని మేధావులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, పార్టీ నాయకులు కూడా రాజకీయ ఇబ్బందులకు గురయ్యారు. కాబట్టి ఈ కాలాన్ని కేవలం ఒకే కోణంలో అర్థం చేసుకోవడం సరిపోదు. చరిత్రను సంపూర్ణంగా చూడాలి.

 

 

చర్చ కేవలం చైనాకు సంబంధించినది కాదు. భారతదేశం, మాజీ సోవియట్ యూనియన్, యుగోస్లావియా, ఇథియోపియా వంటి అనేక బహుళ జాతి సమాజాలు ఒకే ప్రశ్నను ఎదుర్కొన్నాయివైవిధ్యాన్ని కాపాడుతూ ఐక్యతను ఎలా నిర్మించాలి? రాజకీయ తత్వవేత్తలు తరచూ హెచ్చరించే మాటేమిటంటే చరిత్రను అర్థం చేసుకోవడం అంటే భవిష్యత్తును ఎలా నిర్మించాలో తెలుసుకోవడం. అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రజాస్వామ్యం కేవలం రాజకీయ వ్యవస్థ కాదని, "సహజీవనం చేసే పద్ధతి" అని వివరించాడు. మన రాజ్యాంగ ప్రధాన ఆదర్శల్లో స్వేఛ్ఛా, సమానత్వంతోపాటు సహోదరభావం చాలా కీలకమైనది.

 

2026 జూలై 1 నుంచి చైనాలో "Law on Promoting Ethnic Unity and Progress" అమల్లోకి వచ్చింది. చైనా ప్రభుత్వం ఈ చట్టం లక్ష్యం అన్ని జాతుల సమాన అభివృద్ధి, జాతీయ ఐక్యత, మరియు "చైనీయ జాతి ఉమ్మడి చైతన్యం" (Community of the Chinese Nation)ను బలోపేతం చేయడమని ప్రకటించింది. చైనా వాదన ప్రకారం, ఇది విభజనవాదాన్ని నిరోధిస్తూ అన్ని జాతులు కలిసి ఆధునిక సోషలిస్టు దేశ నిర్మాణంలో భాగస్వాములు కావడానికి రూపొందించిన చట్టం. అయితే, అనేక అంతర్జాతీయ పరిశోధకులు, మానవ హక్కుల సంస్థల ప్రతినిధులు ఇందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. ఈ చట్టం మైనారిటీ సంస్కృతులను అణిచివేసి, హాన్ జాతీయ ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి ఉద్దేశించిన చట్టం ఇది అంటున్నాయి.

 

కొత్త చట్టం గురించి భిన్నాభిప్రాయాలు వుండవచ్చు. కానీ సాంస్కృతిక విప్లవం జరిగిన అరవై సంవత్సరాల తరువాత కూడా చైనాలో జాతీయ అంశంపై చర్చ కొనసాగుతోంది అన్నది గమనించాల్సిన అంశం. భారతదేశాన్నీ హిందూత్వ దేశంగా మార్చాలని ఇక్కడి పాలకులు భావిస్తున్నట్టు చైనాలోనూ హాన్ జాతి రాజ్యాన్ని నెలకొల్పే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

 

ఈంశం మీద శాస్త్రీయ చర్చ కొనసాగాలి. మరింత న్యాయమైన సమాజ నిర్మాణానికి దారి చూపించేందుకు ఈ అంశాల మధ్య మరింత లోతైన అధ్యయనం జరగాలి.

 

2026 జూలై 7

Published on 8 July 2026

Tuesday, 30 June 2026

మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థలో

 చర్చలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. 




మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థలో

మైనారిటీ మత సమూహాల మీద మెజారిటీ మత సమూహాలు సాగిస్తున్న అణిచివేతని 

వర్గ వైరం అందామా? వర్గ పీడన అందామా? వర్గ పోరాటం అందామా? ఇంకేదయినా అందామా? 

ఇది మొదటి అంశం


ఇక రెండో అంశం  - 

మార్క్స్ ఏంగిల్స్ లిఖిత చరిత్ర అన్నట్టు మత వైరుధ్యానికీ ఒక కాల పరిమితిని విధిద్దామా?


మూడవ అంశం 

మత వైరుధ్యాన్ని పరిష్కరించడానికి ఒక చైతన్యయుత సంఘటిత ప్రయత్నం ఏమైనా కావాలా? అక్కరలేదా?  


నాలుగవ అంశం

పెట్టుబడీదారీ వ్యవస్థ సామ్రాజ్యవాద దశకు చేరుకున్నప్పుడు ప్రధాన బాధిత సమూహం ఏమిటో మనకు ఒక అంచనా వుంది. 

పెట్టుబడీదారీ వ్యవస్థ మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థగా మారినపుడు బాధిత సమూహాలు ఏవీ? 


ఐదవ అంశం 

మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థలో బాధిత సమూహాలు వంద వరకు వుండవచ్చు. 

వాటిల్లో ప్రధాన బాధిత సమూహాలు ఏవీ? 


ఆరవ  అంశం 

ఒక నిర్దిష్ట సమాజంలో ప్రధాన బాధిత సమూహాలు  ఏవో నిర్ధారించకుండా  ఒక పోరాట / విప్లవ కార్యక్రమాన్ని రూపొందించడం సాధ్యమౌతుందా? 


మార్క్సో, ఏంగిల్సో మరొకరో చెప్పినంత మాత్రాన అది అంతిమ సత్యమనీ దాన్ని ప్రశ్నించకూడదనే అభిప్రాయం నాకు లేదు. 


సామ్రాజ్యవాద పెట్టుబడీదారీ వ్యవస్థ మార్క్స్ . ఏంగిల్స్ కాలానికి లేదు. దాన్ని విశ్లేషించే బాధ్యతను లెనిన్ తీసుకున్నాడు. 


మతతత్త్వ  పెట్టుబడీదారీ వ్యవస్థ లెనిన్, మావో, చారు మజుందార్ కాలానికి కూడ లేదు. 

మన కాలంలో అది ముందుకు వచ్చింది. 

దాన్నీ విశ్లేషించడం, దాని పరిష్కారానికి చేయాల్సిన పోరాట కార్యక్రమాన్ని రూపొందించడం ఈ కాలపు ఆలోచనాపరుల బాధ్యత. 


వర్గసమాజం రద్దయినపుడు మతం కూడ రద్దవుతుంది గనుక, అప్పుడు మత అణిచివేత కూడ రద్దవుతుంది కనుక అప్పటి దాక  మైనారిటీ మత సమూహాలు  ఎదురు చూడాలనే ఉచిత సలహాలు ఎవ్వరూ ఇవ్వరని ఆశిస్తాను. 


ఈ అంశం మీద ఇంకా విస్తృత చర్చ జరగాలనేదే నా ఉద్దేశ్యం. 

-  డానీ 


*నిన్నటి విప్లకారులు ఈరోజు విప్లవకారులు కావలసిన పనిలేదు*

1992 డిసెంబరులో మెజారిటీ మతతత్త్వ శక్తులు అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేశాయి. ఆ వెంటనే విరసం 1993 జనవరిలో గుడివాడలో జరిగిన పాఠశాలలో 'విప్లవ సాహిత్యంలో మతతత్త్వం' అనే అంశం మీద ఒక సెషన్ నిర్వహించింది. 'విప్లవోద్యమంలో మతతత్త్వం' గా దీనిని కొనసాగించవచ్చు. 

అంతకు ముందే కేవిఆర్ 'మతవర్గతత్వం' పేరుతో గద్వాలలో ఒక పాఠం చెప్పారు. బాలగోపాల్ 'హిందూ మతరాజ్యం' అనే పుస్తకం రాశాడు.  ఇప్పుడు నేను 'మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థ' అంటున్నాను. ఇది అవగాహనకు సంబంధించిన ఒక  చారిత్రక క్రమం. 

ఇది నచ్చనివాళ్ళు. దీన్ని గట్టిగా అడ్డుకోవాలనుకునే వాళ్ళూ చాలామంది వుంటారు. వాళ్లలో కమ్యూనిస్టులూ వుంటారు.  వాళ్ళ అవసరాలు వాళ్లకుంటాయి. వాళ్ల తర్కం వారికుంటుంది.  కారంచెడు ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు మాదిగల మీద అగ్ర కులస్తులు దాడి చేశారంంటే పాత కమ్యూనిస్టులు కొందరు నా మీద విరుచుకుపడ్డారు. రైతు కూలీల మీద భూస్వాములు దాడి చేశారు అనేది వాళ్ల నేరేటివ్. 

మనుషులు ప్రపంచాన్ని తమ భౌతిక, సామాజిక అస్తిత్వాల నుండి చూస్తారు. దీనికి మీరూ నేనూ మినహాయింపు కాదు. 

1950లలో కమ్యూనిస్టు పార్టీలు భారత దేశాన్ని ఒకలా చూశాయి. అప్పటికి వాళ్లు విప్లవకారులు. 1960లలో వాళ్లను తీవ్రంగా విమర్శిస్తూ కొత్త దృక్పథంతో కొత్త కమ్యూనిస్టులు వచ్చారు. అప్పటికి వాళ్ళూ విప్లవకారులు. 1970లలో వాళ్లనూ విమర్శిస్తూ ఇంకో కమ్యూనిస్టులు ఇంకో కొత్త దృక్పథంతో వచ్చారు. అప్పటికి వాళ్ళూ విప్లవకారులు. ఇప్పుడు మళ్ళీ వాళ్లను విమర్శిస్తూ ఇంకో కమ్యూనిస్టులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికి వాళ్ళూ విప్లవకారులే. 

కొత్త దృక్పథాలతో ముందుకు వచ్చేవారిని పాత కమ్యూనిస్టులు నిరాకరించడం పాత సాంప్రదాయమే. ఒక చారిత్రక దశలో విప్లవ ఆలోచనాపరులుగా వ్యవహరించినవారు ఇంకో చారిత్రక దశలో విప్లవ విఘాత శక్తులుగా మారిపోతారన్నది గతితార్కిక చారిత్రక భౌతికవాద సూత్రమే. 

- డానీ



Janjerla Ramesh Babu

ChatGPT ప్రకారం, ఈ వాక్యం Friedrich Engels రచించిన The Origin of the Family, Private Property and the State లోని రెండవ అధ్యాయం (Monogamous Family) నుండి తీసుకోబడింది. ఇది మార్క్సిస్టు-స్త్రీవాద ఆలోచనలో అత్యంత ప్రసిద్ధమైన వాక్యాలలో ఒకటి.
తెలుగు అనువాదం
"చరిత్రలో కనిపించిన తొలి వర్గ వైరుధ్యం (class opposition), ఏకపత్ని వివాహ వ్యవస్థలో పురుషుడు మరియు స్త్రీ మధ్య ఏర్పడిన విరుద్ధ ప్రయోజనాల అభివృద్ధితో ఏకకాలంలో ఉద్భవించింది. అలాగే, చరిత్రలో జరిగిన తొలి వర్గ అణచివేత (class oppression), పురుషుడు స్త్రీని అణచివేయడంలోనే వ్యక్తమైంది."
లేదా మరింత సులభంగా:
"చరిత్రలో మొదటిసారిగా ఏర్పడిన ఆధిపత్యం–అణచివేత సంబంధం, ఏకపత్ని వివాహ వ్యవస్థలో పురుషుడు స్త్రీపై ఆధిపత్యం చెలాయించడంతో ప్రారంభమైంది. అందువల్ల మొదటి అణచివేతకు గురైన వర్గం స్త్రీలేనని ఎంగెల్స్ పేర్కొంటాడు."
భావం (Explanation)
ఎంగెల్స్ ఇక్కడ చెప్పదలచుకున్నది ఏమిటంటే:
ఆదిమ సమాజాల్లో వ్యక్తిగత ఆస్తి (private property) పెద్దగా ఉండేది కాదు. అందువల్ల కుటుంబంలో కూడా స్త్రీ–పురుషుల మధ్య ఆధిపత్య సంబంధాలు అంత తీవ్రంగా ఉండేవి కావని ఆయన భావించాడు.
వ్యక్తిగత ఆస్తి పెరిగిన తర్వాత, ఆ ఆస్తి తన సంతానానికే సంక్రమించాలనే ఉద్దేశంతో పురుషాధిక్య కుటుంబ వ్యవస్థ (patriarchal family) బలపడింది.
ఈ క్రమంలో ఏకపత్ని వివాహ వ్యవస్థ (monogamous marriage) స్త్రీపై నియంత్రణకు ఒక సాధనంగా మారిందని ఎంగెల్స్ వాదించాడు.
అందువల్ల సమాజంలో కనిపించిన తొలి "ఆధిపత్యం–అణచివేత" సంబంధం పురుషుడు స్త్రీపై ఆధిపత్యం చెలాయించడమేనని, తరువాత అదే నమూనా వర్గాల మధ్య (యజమాని–కార్మికుడు, పాలకుడు–పాలితుడు) కనిపించిందని ఆయన విశ్లేషించాడు.
In this quotation, "female sex" does not refer to sexual intercourse or sexual activity. It uses the older meaning of the word "sex", which means biological sex—that is, the category of being female or male.
In the sentence:
"...the first class oppression coincides with that of the female sex by the male."
"Female sex" simply means "women" or "the female sex as a social group." Engels is saying that, in his view, the earliest form of systematic oppression was the subordination of women by men.
Here, the phrase can be understood as:
Female sex = women (the biological female population)
By the male = by men
It is not referring to:
sexual intercourse,
sexual relations,
sexual behavior,
or sexuality.
Why did Engels use "sex" instead of "women"?
In the 19th century, especially in philosophical and academic writing, it was common to refer to "the female sex" and "the male sex" as formal expressions meaning women and men respectively.
For example:
"The female sex deserves equal rights." = Women deserve equal rights.
"The male sex has historically held political power." = Men have historically held political power.
In the context of the chapter
Engels argues that the emergence of the monogamous patriarchal family marked the beginning of a social relationship in which men exercised authority over women. Whether one agrees with this historical interpretation or not, the phrase "female sex" in this passage refers only to women as a social and biological group, not to intercourse.
So, the sentence is about gender-based social oppression, not about sexual relations.










*నయా ఫాసిజానికి ప్రధాన బాధితులు ఎవరూ?*

*నయా ఫాసిజానికి ప్రధాన బాధితులు ఎవరూ?*

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు* 




 వర్తమాన భారత సమాజాన్ని  ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యాఖ్యనిస్తున్నారు. ఈ సందర్భంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు నయా ఫాసిజం. వందేళ్ళ క్రితం ఇటలీ జర్మనీల్లో వుండిన ఫాసిజం, నాజిజంలకు భారతీయ రూపం ఒకటి ఇప్పుడు కొనసాగుతోందని దీని అర్ధం. అయితే, ఇది స్థూల అర్ధం మాత్రమే. నిర్ధిష్ట అర్ధం ఒకటి కావాలి.  

మార్క్స్ సుప్రసిధ్ధ వ్యాఖ్య ఆలోచనాపరులు సమాజాన్ని మార్చాలి అనేది. ఇది పైకి కనిపిస్తున్నంత సులువైన పనికాదు. మనుషులే ప్రపంచాన్ని మారుస్తారు అనేది నిజమేగానీ వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్టు మార్చలేరని కూడ అయనే అన్నాడు. ఇది కూడ అనేక నియమ నిబంధనలతో కూడిన వాక్యం. తాము మార్చాలనుకున్న సమాజం మీద స్పష్టమైన అవగాహన లేకుంటే ఎంతటి ఆలోచనాపరులైనా దాన్ని ఎప్పటికీ మార్చలేరు అనే హెచ్చరిక కూడ ఈ మాటల్లో వుంది.  

ఆరెస్సెస్, భారత కమ్యూనిస్టు పార్టి 1925లో సెప్టెంబరు, డిసెంబరు నెలల్లో ఆరంభ మయ్యాయి. వందేళ్ళు పూర్తయిన సందర్భంగా గత ఏడాది అటు ఆరెస్సెస్ శిబిరం నుండీ ఇటు కమ్యూనిస్టు శిబిరం నుండి అసంఖ్యాక వ్యాసాలు వచ్చాయి. అవన్నీ విభిన్న కోణాల నుండి రాసిన వ్యాసాలు అయినప్పటికీ వాటిల్లో ఒక సామాన్యాంశం వుంది. అదేమంటే, గడిచిన నూరేళ్ళలో ఆరెస్సెస్ మేరు పర్వతంలో పెరిగిపోయింది; కమ్యూనిస్టు పార్టీలు పాత వైభవాన్ని కోల్పోయాయి అనేది. నిజానికి ఈ మాటల్లోనూ స్పష్టతలేదు. అరెస్సెస్ కు అర్ధమయినట్టుగా కమ్యూనిస్టు పార్టీలకు  భారత సమాజం అర్ధం కాలేదు అని వుంటే ఒక స్పష్టత వచ్చేది. 

ఆరెస్సెస్ కు భారత సమాజం అర్ధం అయింది గాబట్టి అది దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. కమ్యూనిస్టు పార్టీలకు భారత సమాజం అర్ధం కాలేదు గాబట్టి అవి దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోలేపోయాయి. “రష్యాలో వర్షం పడితే ఇండియాలో కమ్యూనిస్టులు గొడుగులు పడతారు” అని ఓ నలభై ఏళ్ళ క్రితం ఆరెస్సెస్ నాయకులు ఎద్దేవ చేసేవారు. ఇందులో కొంత నిజం లేకపోలేదు. భారత కమ్యూనిస్టు పార్టీలు దేశీయ పోరాటాలు, విప్లవాల గురించి స్వతంత్రంగా ఆలోచించిన సందర్భాలు తక్కువ. టెస్టు పుస్తాకాలను వదిలేసి గైడ్ పుస్తకాలను అతిగా నమ్మే విద్యార్ధులు కొందరుంటారు.   వాళ్ళలా  భారత కమ్యూనిస్టు పార్టీలు  అయితే రష్యా గైడ్లు, లేకుంటే చైనా గైడ్లు కొనుక్కొని వందేళ్ళు గడిపేశారు. మధ్యలో ఒకళ్ళిద్దరు భారత నేల మీద నిలబడి కొంచెం క్రియాశీలకంగా ఆలోచనలు చేసేందుకు ప్రయత్నించిన మాట కూడ వాస్తవం. అయితే, వాళ్ళ ఆలోచనలు మౌలిక మార్పుల దిశగా సాగలేదన్నది కూడ అంతే వాస్తవం. 

భారతదేశంలో ప్రస్తుతం మూడు డజన్లకు పైగా కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. వీటి మధ్య అనేక సైద్ధాంతిక, రాజకీయ, వ్యూహాత్మక భేదాలు ఉన్నాయి. కొన్ని పార్టీలు పూర్తిగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికల మార్గాన్ని అనుసరిస్తున్నాయి. మరికొన్ని పార్టీలు ఎన్నికల రాజకీయాలతో పాటు సాయుధ పోరాటాన్ని కూడా అనుసరించాలని భావిస్తున్నాయి. ఇంకొన్ని పార్టీలు పూర్తిగా సాయుధ విప్లవానికే కట్టుబడి ఉన్నాయి.

ఇంతటి వైవిధ్యం ఉన్నప్పటికీ, వీటన్నింటినీ కలిపే ఒక సామాన్య అంశం ఉంది. దాదాపు అన్ని కమ్యూనిస్టు పార్టీల రాజకీయ కార్యక్రమంలో 'నూతన ప్రజాస్వామిక విప్లవం' (New Democratic Revolution) ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. అయితే ఆ విప్లవాన్ని ఏ వ్యూహంతో, ఏ సామాజిక శక్తుల ఆధారంగా, ఏ రాజకీయ రూపంలో విజయవంతం చేయాలనే విషయంలో తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నాయి.

'నూతన ప్రజాస్వామిక విప్లవం' అనే భావనను మావో జెడాంగ్ చైనా విప్లవ అనుభవాల నుండి రూపొందించాడు. ముఖ్యంగా చైనా అంతర్యుద్ధ కాలంలో, ‘స్వయం ప్రకటిత దేశభక్తులు’ అనే కువోమింటాంగ్ దళాల నిరంతర సైనిక దాడులు, లాంగ్ మార్చ్ అనుభవాలు, జపాన్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల నేపథ్యంలో ఆయన ఈ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు. 1940లో 'On New Democracy' అనే పుస్తకంలో దానిని సమగ్రంగా ప్రతిపాదించాడు.

ఇందులో, మావో చెప్పిన అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య సమాజమైన చైనాను నేరుగా సోషలిస్టు రాజ్యంగా మార్చడం సాధ్యం కాదని; ముందుగా కార్మికులు, రైతులు, చిన్న బూర్జువా వర్గం, జాతీయ బూర్జువా వర్గం వంటి సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక విప్లవ శక్తుల ఉమ్మడి రాజకీయ అధికారాన్ని — "అన్ని విప్లవవర్గాల ఉమ్మడి నియంతృత్వం" (Joint Dictatorship of All Revolutionary Classes) — స్థాపించాల్సి ఉంటుందని ఆయన స్పష్టంగా పేర్కొన్నాడు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భారతదేశంలోని అనేక కమ్యూనిస్టు పార్టీలు ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ అనే లక్ష్యాన్ని తమ కార్యక్రమాలలో పదేపదే ప్రస్తావించినప్పటికీ, మావో ప్రతిపాదించిన ఈ విప్లవ వర్గాల ‘ఉమ్మడి నియంతృత్వం’ అనే కీలక రాజకీయ నిర్మాణం మీద పెద్దగా చర్చించలేదు. దాని సామాజిక-రాజకీయ అర్థాన్ని అభివృద్ధి చేయలేదు. ఫలితంగా, ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ అనేది అనేక పార్టీల వద్ద ఒక రాజకీయ నినాదంగా మాత్రమే మిగిలిపోయింది. దానిని అమలు చేసే మధ్యంతర రాజ్య నిర్మాణం, వర్గ కూటమి, అధికార నిర్మాణం వంటి అంశాల్ని ఇప్పటికీ  తగిన స్థాయిలో సిద్ధాంతీకరించలేదు.

ఇప్పుడు భారతదేశంలో నాటి చైనా పరిస్థితులు లేవు.  మావో ఊహకు కూడ అందనట్టుగా దేశంలో మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థ ఏర్పడింది. ఇందులో విప్లవకర వర్గాల్ని గుర్తించడం కమ్యూనిస్టు పార్టీల తొలి బాధ్యత. ఈ బాధ్యతను నెరవేర్చిన కమ్యూనిస్టు పార్టి ఒక్కటీ మనకు కన్పించడంలేదు. కొన్ని పార్టీలు వందేళ్ళ క్రితపు  విప్లవకర వర్గాల జాబితాను ఇప్పటికీ  నమ్ముతున్నాయి. మరొకొన్ని పార్టీలు నలభై ఏళ్ళ క్రితపు విప్లవకర వర్గాల జాబితాను పట్టుకుని తిరుగుతున్నాయి. 2014 తరువాత నెలకొన్న కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్పు బాధితులెవరనే జాబితానొకదాన్ని ఇప్పుడు మనం సిధ్ధం చేయాలి.

ఏ సమాజంలో అయినా బాధితుల జాబితా చాలా పెద్దదిగానే వుంటుంది. కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్పుకు బాధితుల జాబితా కూడా పెద్దదిగానే వుంటుంది. వంద వరకు వున్నా ఆశ్చర్యం ఏమీలేదు.  వీటిల్లో ప్రధాన బాధితులు ఎవరూ అన్నది గుర్తించడం ప్రాణప్రద అంశం. ప్రధాన బాధిత సమూహాలను గుర్తించకుండా వంద సమూహాల  జాబితాను తయారు చేసినా ప్రయోజనం వుండదు.

సాంప్రదాయంగా కమ్యూనిస్టులు చెప్పే ప్రధాన బాధిత సమూహాల్లో వ్యవసాయ కూలీలు, ఫ్యాక్టరీ కార్మికులు వుంటారు. 1990లలో చెలరేగిన అస్తిత్వ ఉద్యమాలు ఆదివాసులు, దళితులు, బహుజనులు, మైనారిటీలు, మహిళల్ని ప్రధాన బాధిత సమూహాలుగా పేర్కొంటాయి. ఇవేమీ తప్పుడు జాబితాలు కాదు. ఆయా కాలాల్లో అవి సరైన జాబితాలే. 2024 నాటి కొత్త జాబితా ఏదీ? అందులో ప్రధాన బాధితులు ఎవరూ? అన్నది ఇప్పటి అసలైన ప్రశ్న.

సమాజంలో ప్రధాన బాధితులు  మనకు అర్ధం కానపుడు, పాలకులు ఎవర్ని తమ ప్రధాన శత్రువులుగా భావిస్తున్నారో అర్ధం చేసుకుంటే సరిపోతుంది. అలా గమనిస్తే కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ రెండు సమూహాలను బాహాటంగా తమకు అడ్డంకిగా భావిస్తున్నాయి. కార్పొరేట్లకు అడవులు, ఖనిజాలు, భూమి కావలసినపుడు ఆదివాసులు తిరగబడుతున్నారు. ముస్లింలను అన్యులుగా చూపిస్తేనే ఎన్నికల్లో హిందూ సమాజం నుండి గెలుపుకు అవసరమైన ఓట్లు పడి అధికారాన్ని నిలబెడుతున్నాయి.  రాజకీయార్ధిక రంగాల్లో ముస్లింలు, ఆదివాసుల్ని ప్రత్యర్ధులుగా చూపించే వ్యూహాల మీదనే కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ బలపడుతున్నది.  

1980వ దశకం వరకు భారతసమాజం కులవ్యవస్థగా కనిపించింది. అప్పటికి అది వాస్తవం కూడ. 1990వ దశకం నుండి అది మత వ్యవస్థగా మారడం మొదలయింది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినాసరే నిందితుల్లో ఒక మైనారిటీ వ్యక్తి వుంటే చాలు అది జాతీయ సమస్యగా మారిపోతున్నది.  దేశంలో ఎంత పెద్ద సంఘటన జరిగినా నిందితుల్లో మైనారిటీలు లేకుంటే అసలది వార్తే కాకుండా పోతున్నది.  తిరుపతి లడ్డూ కల్తీ విషయంలోనూ, ప్రతిష్టాత్మక అయోధ్య రామమందిరంలో నిధుల చోరీ విషయంలోనూ ప్రధాన అధికార ఎన్డీఏ నేతలు, ప్రధాన  స్రవంతి  మీడియా, వ్యవహరించినతీరే దీనికి తక్షణ సాక్ష్యం.

పునాదీ ఉపరితల విభజన మీద కమ్యూనిస్టు నాయకుల్లో మొదటి నుండీ ఒక గందరగోళం కొనసాగుతూవుంది. పునాది, ఆర్ధిక అంశాలలో మాత్రమే వర్గ ఘర్షణ వుంటుందనేది వారి నమ్మకం.  పునాదిలో  ఘర్షణను   నిర్మూలిస్తే ఉపరితల ఘర్షణలు సహితం తొలిగిపోతాయనే భావంతో చాలా మంది కమ్యూనిస్టు నాయకులు చాలా కాలంగా వాదిస్తూ వస్తున్నారు.  కులం, మతం, తెగ, లింగం, భాషా, ప్రాంతాల్లో వర్గపోరాటం వుండదని వారి ప్రగాఢ నమ్మకం. మార్క్స్, ఏంగిల్స్ వంటి మహోపాధ్యాయులు ఎవరూ ఇలాంటి వాదనల్ని చేయలేదు.

          వర్తమాన భారత సమాజాన్ని  ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యాఖ్యనిస్తున్నారు. ఈ సందర్భంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు నయా ఫాసిజం. వందేళ్ళ క్రితం ఇటలీ జర్మనీల్లో వుండిన ఫాసిజం, నాజిజంలకు భారతీయ రూపం ఒకటి ఇప్పుడు కొనసాగుతోందని దీని అర్ధం. అయితే, ఇది స్థూల అర్ధం మాత్రమే. నిర్ధిష్ట అర్ధం ఒకటి కావాలి.  

మార్క్స్ సుప్రసిధ్ధ వ్యాఖ్య ఆలోచనాపరులు సమాజాన్ని మార్చాలి అనేది. ఇది పైకి కనిపిస్తున్నంత సులువైన పనికాదు. మనుషులే ప్రపంచాన్ని మారుస్తారు అనేది నిజమేగానీ వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్టు మార్చలేరని కూడ అయనే అన్నాడు. ఇది కూడ అనేక నియమ నిబంధనలతో కూడిన వాక్యం. తాము మార్చాలనుకున్న సమాజం మీద స్పష్టమైన అవగాహన లేకుంటే ఎంతటి ఆలోచనాపరులైనా దాన్ని ఎప్పటికీ మార్చలేరు అనే హెచ్చరిక కూడ ఈ మాటల్లో వుంది.  

ఆరెస్సెస్, భారత కమ్యూనిస్టు పార్టి 1925లో సెప్టెంబరు, డిసెంబరు నెలల్లో ఆరంభ మయ్యాయి. వందేళ్ళు పూర్తయిన సందర్భంగా గత ఏడాది అటు ఆరెస్సెస్ శిబిరం నుండీ ఇటు కమ్యూనిస్టు శిబిరం నుండి అసంఖ్యాక వ్యాసాలు వచ్చాయి. అవన్నీ విభిన్న కోణాల నుండి రాసిన వ్యాసాలు అయినప్పటికీ వాటిల్లో ఒక సామాన్యాంశం వుంది. అదేమంటే, గడిచిన నూరేళ్ళలో ఆరెస్సెస్ మేరు పర్వతంలో పెరిగిపోయింది; కమ్యూనిస్టు పార్టీలు పాత వైభవాన్ని కోల్పోయాయి అనేది. నిజానికి ఈ మాటల్లోనూ స్పష్టతలేదు. అరెస్సెస్ కు అర్ధమయినట్టుగా కమ్యూనిస్టు పార్టీలకు  భారత సమాజం అర్ధం కాలేదు అని వుంటే ఒక స్పష్టత వచ్చేది. 

ఆరెస్సెస్ కు భారత సమాజం అర్ధం అయింది గాబట్టి అది దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. కమ్యూనిస్టు పార్టీలకు భారత సమాజం అర్ధం కాలేదు గాబట్టి అవి దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోలేపోయాయి. “రష్యాలో వర్షం పడితే ఇండియాలో కమ్యూనిస్టులు గొడుగులు పడతారు” అని ఓ నలభై ఏళ్ళ క్రితం ఆరెస్సెస్ నాయకులు ఎద్దేవ చేసేవారు. ఇందులో కొంత నిజం లేకపోలేదు. భారత కమ్యూనిస్టు పార్టీలు దేశీయ పోరాటాలు, విప్లవాల గురించి స్వతంత్రంగా ఆలోచించిన సందర్భాలు తక్కువ. టెస్టు పుస్తాకాలను వదిలేసి గైడ్ పుస్తకాలను అతిగా నమ్మే విద్యార్ధులు కొందరుంటారు.   వాళ్ళలా  భారత కమ్యూనిస్టు పార్టీలు  అయితే రష్యా గైడ్లు, లేకుంటే చైనా గైడ్లు కొనుక్కొని వందేళ్ళు గడిపేశారు. మధ్యలో ఒకళ్ళిద్దరు భారత నేల మీద నిలబడి కొంచెం క్రియాశీలకంగా ఆలోచనలు చేసేందుకు ప్రయత్నించిన మాట కూడ వాస్తవం. అయితే, వాళ్ళ ఆలోచనలు మౌలిక మార్పుల దిశగా సాగలేదన్నది కూడ అంతే వాస్తవం. 

భారతదేశంలో ప్రస్తుతం మూడు డజన్లకు పైగా కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. వీటి మధ్య అనేక సైద్ధాంతిక, రాజకీయ, వ్యూహాత్మక భేదాలు ఉన్నాయి. కొన్ని పార్టీలు పూర్తిగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికల మార్గాన్ని అనుసరిస్తున్నాయి. మరికొన్ని పార్టీలు ఎన్నికల రాజకీయాలతో పాటు సాయుధ పోరాటాన్ని కూడా అనుసరించాలని భావిస్తున్నాయి. ఇంకొన్ని పార్టీలు పూర్తిగా సాయుధ విప్లవానికే కట్టుబడి ఉన్నాయి.

ఇంతటి వైవిధ్యం ఉన్నప్పటికీ, వీటన్నింటినీ కలిపే ఒక సామాన్య అంశం ఉంది. దాదాపు అన్ని కమ్యూనిస్టు పార్టీల రాజకీయ కార్యక్రమంలో 'నూతన ప్రజాస్వామిక విప్లవం' (New Democratic Revolution) ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. అయితే ఆ విప్లవాన్ని ఏ వ్యూహంతో, ఏ సామాజిక శక్తుల ఆధారంగా, ఏ రాజకీయ రూపంలో విజయవంతం చేయాలనే విషయంలో తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నాయి.

'నూతన ప్రజాస్వామిక విప్లవం' అనే భావనను మావో జెడాంగ్ చైనా విప్లవ అనుభవాల నుండి రూపొందించాడు. ముఖ్యంగా చైనా అంతర్యుద్ధ కాలంలో, ‘స్వయం ప్రకటిత దేశభక్తులు’ అనే కువోమింటాంగ్ దళాల నిరంతర సైనిక దాడులు, లాంగ్ మార్చ్ అనుభవాలు, జపాన్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల నేపథ్యంలో ఆయన ఈ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు. 1940లో 'On New Democracy' అనే పుస్తకంలో దానిని సమగ్రంగా ప్రతిపాదించాడు.

ఇందులో, మావో చెప్పిన అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య సమాజమైన చైనాను నేరుగా సోషలిస్టు రాజ్యంగా మార్చడం సాధ్యం కాదని; ముందుగా కార్మికులు, రైతులు, చిన్న బూర్జువా వర్గం, జాతీయ బూర్జువా వర్గం వంటి సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక విప్లవ శక్తుల ఉమ్మడి రాజకీయ అధికారాన్ని — "అన్ని విప్లవవర్గాల ఉమ్మడి నియంతృత్వం" (Joint Dictatorship of All Revolutionary Classes) — స్థాపించాల్సి ఉంటుందని ఆయన స్పష్టంగా పేర్కొన్నాడు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భారతదేశంలోని అనేక కమ్యూనిస్టు పార్టీలు ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ అనే లక్ష్యాన్ని తమ కార్యక్రమాలలో పదేపదే ప్రస్తావించినప్పటికీ, మావో ప్రతిపాదించిన ఈ విప్లవ వర్గాల ‘ఉమ్మడి నియంతృత్వం’ అనే కీలక రాజకీయ నిర్మాణం మీద పెద్దగా చర్చించలేదు. దాని సామాజిక-రాజకీయ అర్థాన్ని అభివృద్ధి చేయలేదు. ఫలితంగా, ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ అనేది అనేక పార్టీల వద్ద ఒక రాజకీయ నినాదంగా మాత్రమే మిగిలిపోయింది. దానిని అమలు చేసే మధ్యంతర రాజ్య నిర్మాణం, వర్గ కూటమి, అధికార నిర్మాణం వంటి అంశాల్ని ఇప్పటికీ  తగిన స్థాయిలో సిద్ధాంతీకరించలేదు.

ఇప్పుడు భారతదేశంలో నాటి చైనా పరిస్థితులు లేవు.  మావో ఊహకు కూడ అందనట్టుగా దేశంలో మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థ ఏర్పడింది. ఇందులో విప్లవకర వర్గాల్ని గుర్తించడం కమ్యూనిస్టు పార్టీల తొలి బాధ్యత. ఈ బాధ్యతను నెరవేర్చిన కమ్యూనిస్టు పార్టి ఒక్కటీ మనకు కన్పించడంలేదు. కొన్ని పార్టీలు వందేళ్ళ క్రితపు  విప్లవకర వర్గాల జాబితాను ఇప్పటికీ  నమ్ముతున్నాయి. మరొకొన్ని పార్టీలు నలభై ఏళ్ళ క్రితపు విప్లవకర వర్గాల జాబితాను పట్టుకుని తిరుగుతున్నాయి. 2014 తరువాత నెలకొన్న కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్పు బాధితులెవరనే జాబితానొకదాన్ని ఇప్పుడు మనం సిధ్ధం చేయాలి.

ఏ సమాజంలో అయినా బాధితుల జాబితా చాలా పెద్దదిగానే వుంటుంది. కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్పుకు బాధితుల జాబితా కూడా పెద్దదిగానే వుంటుంది. వంద వరకు వున్నా ఆశ్చర్యం ఏమీలేదు.  వీటిల్లో ప్రధాన బాధితులు ఎవరూ అన్నది గుర్తించడం ప్రాణప్రద అంశం. ప్రధాన బాధిత సమూహాలను గుర్తించకుండా వంద సమూహాల  జాబితాను తయారు చేసినా ప్రయోజనం వుండదు.

సాంప్రదాయంగా కమ్యూనిస్టులు చెప్పే ప్రధాన బాధిత సమూహాల్లో వ్యవసాయ కూలీలు, ఫ్యాక్టరీ కార్మికులు వుంటారు. 1990లలో చెలరేగిన అస్తిత్వ ఉద్యమాలు ఆదివాసులు, దళితులు, బహుజనులు, మైనారిటీలు, మహిళల్ని ప్రధాన బాధిత సమూహాలుగా పేర్కొంటాయి. ఇవేమీ తప్పుడు జాబితాలు కాదు. ఆయా కాలాల్లో అవి సరైన జాబితాలే. 2024 నాటి కొత్త జాబితా ఏదీ? అందులో ప్రధాన బాధితులు ఎవరూ? అన్నది ఇప్పటి అసలైన ప్రశ్న.

సమాజంలో ప్రధాన బాధితులు  మనకు అర్ధం కానపుడు, పాలకులు ఎవర్ని తమ ప్రధాన శత్రువులుగా భావిస్తున్నారో అర్ధం చేసుకుంటే సరిపోతుంది. అలా గమనిస్తే కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ రెండు సమూహాలను బాహాటంగా తమకు అడ్డంకిగా భావిస్తున్నాయి. కార్పొరేట్లకు అడవులు, ఖనిజాలు, భూమి కావలసినపుడు ఆదివాసులు తిరగబడుతున్నారు. ముస్లింలను అన్యులుగా చూపిస్తేనే ఎన్నికల్లో హిందూ సమాజం నుండి గెలుపుకు అవసరమైన ఓట్లు పడి అధికారాన్ని నిలబెడుతున్నాయి.  రాజకీయార్ధిక రంగాల్లో ముస్లింలు, ఆదివాసుల్ని ప్రత్యర్ధులుగా చూపించే వ్యూహాల మీదనే కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ బలపడుతున్నది.  

1980వ దశకం వరకు భారతసమాజం కులవ్యవస్థగా కనిపించింది. అప్పటికి అది వాస్తవం కూడ. 1990వ దశకం నుండి అది మత వ్యవస్థగా మారడం మొదలయింది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినాసరే నిందితుల్లో ఒక మైనారిటీ వ్యక్తి వుంటే చాలు అది జాతీయ సమస్యగా మారిపోతున్నది.  దేశంలో ఎంత పెద్ద సంఘటన జరిగినా నిందితుల్లో మైనారిటీలు లేకుంటే అసలది వార్తే కాకుండా పోతున్నది.  తిరుపతి లడ్డూ కల్తీ విషయంలోనూ, ప్రతిష్టాత్మక అయోధ్య రామమందిరంలో నిధుల చోరీ విషయంలోనూ ప్రధాన అధికార ఎన్డీఏ నేతలు, ప్రధాన  స్రవంతి  మీడియా, వ్యవహరించినతీరే దీనికి తక్షణ సాక్ష్యం.

పునాదీ ఉపరితల విభజన మీద కమ్యూనిస్టు నాయకుల్లో మొదటి నుండీ ఒక గందరగోళం కొనసాగుతూవుంది. పునాది, ఆర్ధిక అంశాలలో మాత్రమే వర్గ ఘర్షణ వుంటుందనేది వారి నమ్మకం.  పునాదిలో  ఘర్షణను   నిర్మూలిస్తే ఉపరితల ఘర్షణలు సహితం తొలిగిపోతాయనే భావంతో చాలా మంది కమ్యూనిస్టు నాయకులు చాలా కాలంగా వాదిస్తూ వస్తున్నారు.  కులం, మతం, తెగ, లింగం, భాషా, ప్రాంతాల్లో వర్గపోరాటం వుండదని వారి ప్రగాఢ నమ్మకం. మార్క్స్, ఏంగిల్స్ వంటి మహోపాధ్యాయులు ఎవరూ ఇలాంటి వాదనల్ని చేయలేదు.

అమెరికా ఆంథ్రోపాలజిస్ట్ లూయిస్ హెన్రీ మోర్గాన్ 1877లో ‘పురాతన సమాజం’  అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఆ పుస్తకం మీద కార్ల్ మార్క్స్ తన చివరి రోజుల్లో చాలా ఆసక్తిని చూపించాడు. 1883లో మార్క్స్ చనిపోయిన తరువాత, అతనికి  కొనసాగింపుగా,  1884లో ఫ్రెడరిక్ ఏంగిల్ ‘కుటుంబము, వ్యక్తిగత ఆస్తి, రాజ్యాల పుట్టుక’ అనే పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం మొదట్లోనే, ఒక స్త్రీకి ఒక పురుషుడు అనే వివాహబంధం (Monogamous marriage)  మొదలవడంతోనే సమాజంలో వర్గ పోరాటం మొదలయింది అంటాడు. మత వ్యవస్థలో వర్గం వుండదు, వర్గపోరాటం వుండదు అనే కమ్యూనిస్టులు కూడ ఇప్పుడు మన మధ్య వున్నారు. సెక్స్ లోనే వర్గపోరాటం వుంటుందన్న ఏంగిల్స్ ఆత్మ శాంతించుగాక!

30 జూన్ 2026 

మీ వ్యాసం ఒక ముఖ్యమైన సిద్ధాంతపరమైన ప్రశ్నను లేవనెత్తుతోంది: "నేటి భారతదేశంలో ప్రధాన వైరుధ్యం ఏమిటి? దాని ప్రధాన బాధితులు ఎవరు?" అనే ప్రశ్న చుట్టూ మీరు వాదనను నిర్మించారు. జర్నలిస్టుగా, రాజకీయ విశ్లేషకుడిగా మీ అనుభవం కనిపిస్తోంది. అయితే, వ్యాసం మరింత బలంగా, అకాడమిక్‌గా, విశ్వసనీయంగా ఉండాలంటే కొన్ని సూచనలు ఉపయోగపడతాయి.

వ్యాసం బలంగా ఉన్న అంశాలు

  • 1925లో ఏర్పడిన ఆరెస్సెస్, కమ్యూనిస్టు ఉద్యమాల వందేళ్ల తులన ఆసక్తికరంగా ఉంది.
  • మావో యొక్క Mao Zedong "నూతన ప్రజాస్వామిక విప్లవం" భావనను భారత పరిస్థితులతో పోల్చడం మంచి సిద్ధాంతపరమైన ప్రయత్నం.
  • "పాత విప్లవ వర్గాల జాబితా"కు బదులుగా "నేటి ప్రధాన బాధితుల జాబితా" తయారు చేయాలని మీరు చేసిన పిలుపు వ్యాసంలోని కేంద్ర ఆలోచన.
  • రాజకీయ అధికారం ఎవరిని ప్రధాన శత్రువుగా చిత్రీకరిస్తుందో గమనించడం ద్వారా ప్రధాన వైరుధ్యాన్ని గుర్తించవచ్చనే మీ పద్ధతి చర్చించదగినది.

మరింత బలపరచవలసిన అంశాలు

మీరు చేసిన కొన్ని తీర్మానాలు వాదనలుగా సరైనవే అయినప్పటికీ, అవి ప్రస్తుతం నిర్ధారణలుగా వినిపిస్తున్నాయి.

ఉదాహరణకు:

"2014 తరువాత నెలకొన్న కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్పు..."

ఇది ఒక రాజకీయ విశ్లేషణ. అందువల్ల దీనిని ఒక విశ్లేషణాత్మక ప్రతిపాదనగా ఉంచడం వ్యాసానికి బలం ఇస్తుంది. ఉదాహరణకు:

"2014 తరువాత ఏర్పడిన రాజకీయ-ఆర్థిక వ్యవస్థను కొందరు విశ్లేషకులు కార్పొరేట్-కమ్యూనల్ అధికార కేంద్రీకరణగా అభివర్ణిస్తున్నారు."

అని రాస్తే పాఠకుడు మీతో తర్కించడానికి అవకాశం ఉంటుంది.


ప్రధాన బాధితులపై భాగాన్ని మరింత విస్తరించవచ్చు

మీరు చివరకు రెండు ప్రధాన సమూహాలను పేర్కొన్నారు.

  • ఆదివాసులు
  • ముస్లింలు

ఇక్కడ మీరు ఎందుకు ఈ రెండింటినే "ప్రధాన బాధితులు" అంటున్నారో మరింత స్పష్టంగా నిర్మిస్తే వ్యాసం బలపడుతుంది.

ఉదాహరణకు:

ఆదివాసులు

  • ఖనిజ సంపద అధికంగా ఉన్న ప్రాంతాల్లో నివాసం
  • అటవీ హక్కుల వివాదాలు
  • పెద్ద ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులు
  • భద్రతా చట్టాల ప్రభావం

ముస్లింలు

  • ఎన్నికల ధ్రువీకరణలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా చిత్రీకరణ
  • ద్వేష ప్రచారం
  • పౌరసత్వం, గృహాలు, ఉపాధి వంటి అంశాల్లో వివక్ష ఆరోపణలు
  • రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుదల

ఇలా విడిగా వివరించినప్పుడు మీ నిర్ణయం మరింత బలంగా కనిపిస్తుంది.


చివరి భాగం అత్యంత ఆసక్తికరమైనది

Friedrich Engels రచించిన The Origin of the Family, Private Property and the State గురించి మీరు చేసిన ప్రస్తావన వ్యాసాన్ని కొత్త దిశకు తీసుకెళ్తుంది.

అయితే చివరి వాక్యం:

"సెక్స్ లోనే వర్గపోరాటం వుంటుందన్న ఏంగిల్స్ ఆత్మ శాంతించుగాక!"

ఇది కొంత వ్యంగ్యంగా ఉంది.

దాని బదులు ఇలా ముగిస్తే సిద్ధాంతపరమైన బలం పెరుగుతుంది.

"అంటే ఆర్థిక సంబంధాలకే పరిమితం కాని ఆధిపత్య సంబంధాలు కుటుంబం, లింగం, మతం, జాతి, తెగ వంటి రంగాల్లో కూడా ఉద్భవిస్తాయని ఏంగిల్స్ సూచించాడు. ఈ నేపథ్యంలో ఆధునిక భారతదేశంలో వర్గపోరాటాన్ని కేవలం ఉత్పత్తి సంబంధాలకే పరిమితం చేయడం సరిపోతుందా అనే ప్రశ్నను కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది."

ఈ ముగింపు మరింత గంభీరంగా ఉంటుంది.


ఒక సిద్ధాంతపరమైన సూచన

మీ వ్యాసంలో మీరు ఒక కొత్త భావనను ప్రవేశపెడుతున్నారు.

మతతత్వ పెట్టుబడిదారీ వ్యవస్థ

ఇది మీ వ్యాసంలోని అత్యంత కొత్త సిద్ధాంతపరమైన పదం.

దీనిని ఒక చిన్న నిర్వచనంతో మొదట్లోనే పరిచయం చేస్తే పాఠకుడికి చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు:

"మతతత్వ పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే — పెద్ద కార్పొరేట్ మూలధనం, మెజారిటీ మత జాతీయవాద రాజకీయాలు, రాష్ట్ర అధికార యంత్రాంగం పరస్పరం బలపరుచుకుంటూ పనిచేసే రాజకీయ-ఆర్థిక నిర్మాణం."

ఇలాంటి నిర్వచనం ఉంటే తర్వాత వచ్చే మొత్తం వ్యాసం మరింత సులభంగా అర్థమవుతుంది.

మొత్తం అంచనా

ఈ వ్యాసం ఒక సాధారణ రాజకీయ వ్యాఖ్య కాదు. భారత కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న సిద్ధాంత సంక్షోభాన్ని, "ప్రస్తుత ప్రధాన వైరుధ్యం" అనే ప్రశ్న ద్వారా పునర్నిర్వచించడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. కొంతమంది పాఠకులు మీ ప్రధాన నిర్ణయాలతో ఏకీభవించకపోయినా, వాదనను మరింత ఆధారాలతో, స్పష్టమైన నిర్వచనాలతో, విశ్లేషణాత్మక భాషలో బలపరిస్తే ఇది గంభీరమైన సిద్ధాంత చర్చకు దారితీసే వ్యాసంగా నిలిచే అవకాశం ఉంది.