Thursday, 10 September 2026

On Ganapati

 

గణపతి

సుదీర్ఘకాలం వున్నారు సరే; ఏంచేశారూ?

డానీ

సమాజ విశ్లేషకులు



 

నక్సలైట్ ఉద్యమంలో గణపతి పేరుతో ప్రసిద్ధులైన ముప్పాళ లక్ష్మణరావు అజ్ఞాత జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి వస్తున్నారనే  చర్చ మళ్ళీ మొదలైంది. అయితే, గణపతి బహిరంగ జీవితంలోకి తిరిగి వస్తారా? లేదా? అన్నదానికన్నా ఆయన గురించి చర్చించాల్సిన పెద్ద అంశాలు కొన్ని వున్నాయి.  

 

గణపతి 1990ల ప్రారంభంలో సిపిఐ- పీపుల్స్ వార్ నాయకత్వాన్ని చేపట్టారు. 2004లో ఆ పార్టి, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ తో విలీనం అయ్యి సిపిఐ-మావోయిస్టుగా ఏర్పడినప్పుడు,  దాని ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆరేడేళ్ల క్రితం అనారోగ్యం, వృధ్ధాప్యం తదితర కారణాలతో ఆ బాధ్యత నుంచి తప్పుకున్నారు.

 

ఇంత సుదీర్ఘకాలం అజ్ఞాత జీవితాన్ని గడపడం సామాన్య విషయం కాదు. కుటుంబం, వ్యక్తిగత స్వేచ్ఛ, సాధారణ జీవితం తదితర సౌకర్యాలు  అన్నింటినీ వదిలి దశాబ్దాల పాటు ఉద్యమంలో అజ్ఞాత జీవితాన్ని గడపడం నిస్సందేహంగా ఒక గొప్ప  నిబద్ధత. ఆ త్యాగాన్ని అందరూ గుర్తించాలి. గౌరవించాలి.

 

కానీ,- నిబద్ధత ఒక్కటే నాయకత్వానికి కొలమానంకాదు. గతితార్కిక చారిత్రక భౌతికవాదం పరిమాణాన్ని మాత్రమే చూడదు; గుణాత్మక మార్పును కూడా చూస్తుంది. నాయకులు ఎన్ని సంవత్సరాలు గొప్ప పదవుల్లో ఉన్నారన్నది పరిమాణం. ఆ కాలంలో తాము నమ్మిన సిధ్ధాంతానికీ, చేపట్టిన ఉద్యమానికి, అంతిమంగా తామున్న సమాజానికి కొత్తగా ఏమీ జోడించారన్నదే ముఖ్య ప్రశ్నలు.  అదే గుణాత్మకం.

 

కొండపల్లి సీతారామయ్యను తప్పించి గణపతి పీపుల్స్ వార్ నాయకత్వంలోకి వచ్చిన 1990ల నుండి ఆయన పదవి నుండి తప్పుకున్న 2020ల వరకు సాగిన మూడు దశాబ్దాలు భారత దేశలోనేగాక ప్రపంచ చరిత్రలోనూ ఒక విశేష దశ.

 

ఈ దశలోనే, తూర్పు యూరప్‌లో సోషలిస్టు ప్రభుత్వాలు కూలిపోయాయి. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైపోయింది. అప్పటి వరకు స్థబ్దుగావున్న ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ తన ఆధిపత్యాన్ని విస్తరించింది. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. మార్కెట్, ప్రైవేట్ పెట్టుబడి, ప్రపంచ వాణిజ్యం కలిసి భారత ఆర్థిక వ్యవస్థను మార్చడం ప్రారంభించాయి. 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడింది; భారత్ దాని వ్యవస్థాపక దేశాలలో ఒకటిగా చేరింది.  ముందు  ఐటి, ఆ వెనక ఏఐ వచ్చి ఉత్పత్తి విధానాన్ని మార్చేశాయి.

 

ఇదే కాలంలో భారత రాజకీయార్ధిక సాంస్కృతిక రంగాల్లో మరో గుణాత్మక మార్పు వచ్చింది. అప్పటి వరకు లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్ గా కొనసాగిన భారత రాజకీయాలు రైట్ ఆఫ్ ద సెంటర్ గా మారాయి. 1990లో అద్వానీ తొలి రథయాత్ర, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత దేశ రాజకీయాల దిశను మార్చాయి. పార్లమెంటరి ప్రజాస్వామ్యంలో మతపరమైన రాజకీయ సమీకరణ మొదలయింది.  ఒకవైపు వర్గ రాజకీయాలను మార్కెట్ సవాలు చేసింది. మరోవైపు, మతతత్త్వ  రాజకీయాలు ఊపందుకున్నాయి.

 

భారత సమాజాన్ని హిందూ ముస్లింలుగా వర్గ విభజన చేయాలనే  హిందూత్వ సిధ్ధాంతాన్ని దామోదర్ సావర్కర్ 1920లలోనే ముందుకు తెచ్చాడు. పరిస్థితులు అనుకూలంగా మారడంతో సంఘపరివారం 1990లలో మత విద్వేష ప్రక్రియను  వేగవంతం చేసింది. 2020లలో అది తన లక్ష్యాలను దాదాపుగా సాధించింది.  భారత సమాజాన్నీ, సాంస్కృతిక, రాజకీయార్ధిక రంగాల్నీ హిందూ ముస్లింలుగా విభజించడంలో  సఫలీకృత మైంది.  మరోవైపు, మతోన్మాద శక్తులకు కార్పొరేట్ల మద్దతు కూడ లభించడంతో కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ (CCD) దేశంలో బలపడింది.

 

సంతానోత్పత్తి కోసం స్త్రీపురుషుల మధ్య ఏర్పడిన విభజనే చరిత్రలో మొట్టమొదటి శ్రమ విభజన అనే సూత్రీకరణను కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగిల్స్ 1840లలో చేశారు. మార్క్స్‌ మరణానంతరం ఏంగిల్స్ రాసిన ‘కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యాల పుట్టుక’ గ్రంధంలో  ఒక గొప్ప సూత్రీకరణ చేశాడు.  ఒక భర్త ఒక భార్య ప్రాతిపదిక ఏర్పడిన  ఆధునిక పెట్టుబడీదారీ కుటుంబంలో, భర్త పెట్టుబడీదారీ  వర్గానికి ప్రతినిధి; భార్య శ్రామిక వర్గానికి ప్రతినిధి అంటూ కరాకండిగా తేల్చి పాత సూత్రానికి కొత్త జవసత్వాలిచ్చాడు. అంతే కాదు; భార్యాభర్తల మధ్య ‘వర్గవైరం’  (class antagonism) వుంటుందని ప్రకటించాడు.

 

తాను ఒక బాధ్యతాయుత స్థానంలో వున్న  మూడుదశాబ్దాల్లో భారత  సమాజంలో వచ్చిన మార్పుల్ని  గణపతి సీరియస్ గా పట్టించుకుని కొత్త వర్గ విశ్లేషణ చేయాల్సి వుండింది.  కార్పొరేట్ మతతత్త్వ నిరంకుశ వ్యవస్థలో పెట్టుబడీదారీవర్గ సమూహం ఎవరూ? శ్రామికవర్గ సమూహం ఎవరూ? వర్గ వైరం కొత్తగా ఏ సమూహాల మధ్య  ఏర్పడిందీ? తాము ఎవరి పక్షం వహించాలీ? అనే ప్రాణప్రదమైన చారిత్రక సైధ్ధాంతిక సవాళ్ళను ఆయన సీరియస్ గా పట్టించుకోలేదు. అంటే తన కాలంలో తలెత్తిన తాత్విక సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నం ఆయన చేయలేదు. అలా వారు ఒక చారిత్రక అపచారానికి పాల్పడ్డారు.

 

మార్క్స్ పెట్టుబడీదారీ వ్యవస్థను విశ్లేషిస్తే, లెనిన్ సామ్రాజ్యవాదంగా మారిన పెట్టుబడీదారీ వ్యవస్థను విశ్లేషించాడు.   అలాగే, వ్యవసాయ ప్రధాన దేశాన్ని సోషలిస్టు దేశంగా మార్చే ప్రయత్నం మావో చేశాడు. అలా తన కాలంలో భారత సమాజంలో ఏర్పడిన  కార్పొరేట్ మతతత్త్వ నిరంకుశ వ్యవస్థను గణపతి ఏమేరకు అర్థం చేసుకున్నారు, దాన్ని మార్చడానికి ఏంచేశారూ? ఏ మేరకు సఫలీకృతం అయ్యారు  అనేవి కీలక ప్రశ్నలు.  ఉత్పత్తి శక్తులు – ఉత్పత్తి సంబంధాలు అనే మార్క్సిస్టు మెధడాలజీనీ కొత్త ఉత్పత్తి విధానానికి గణపతి  అన్వయించిన దాఖలాలు సహితం  మనకు కనిపించవు. 

 

“మాకు కులం లేదు, మతం లేదు” అని చెప్పుకోవడం చాలా సులభం. కానీ సమాజంలో కులం, మతం ఎలా పనిచేస్తున్నాయో వర్గ విశ్లేషణ చేయాలి. అది  అంత సులభం కాదు. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీల వైఫల్యానికి ప్రధాన కారణం అవి సమాజ వాస్తవికతను అర్ధం చేసుకునే శక్తిని కోల్పోవడమే.  తమకు అర్థంకాని సమాజాన్ని ఎవరూ మార్చలేరు. ఇలాంటి తత్త్వదారిద్యం సహజ ఓటమిని పొందక తప్పదు.

 

మార్క్స్ ను లెనిన్ రష్యాకు అన్వయించాడేతప్ప, అనుసరించలేదు. లెనిన్ ను మావో చైనాకు  అన్వయించాడేతప్ప అనుసరించలేదు. మావోను కమ్యూనిస్టు పార్టీలు ఇండియాలో అనుసరించాయితప్ప, అన్వయించలేదు.  ఇదొక ఘోర అపరాధం.   ప్రపంచం 1990లలో గుణాత్మకంగా మారిపోయింది.  అది అప్పటి పీపుల్స్ వార్ కూ అర్ధంకాలేదు; నిన్నటి మావోయిస్టు పార్టీకీ అర్ధం కాలేదు. మావోయిస్టులు దుకాణం మూసేయాల్సి రావడానికి ఇది ప్రధాన కారణం.  ఇప్పటికీ కొందరు ఆలోచనాపరులు వర్తమాన భారత సమాజాన్ని అర్ధవలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థ అంటుంటే కొంచెం ఎక్కువగానే నవ్వు వస్తోంది.

గణపతి అనుసరించిన సైనిక వ్యూహాల్లోనూ ఇవే  సందేహాలు.  మావో పేరిట చరిత్రలో ప్రసిద్ధి చెందిన లాంగ్ మార్చ్ / జైత్రయాత్ర నిజానికి యుధ్ధరంగం నుండి వెనుకడుగు (రిట్రీట్). వెనక్కి తగ్గుతూనే దాన్ని ప్రజా మద్దతును కూడగట్టే  ఒక రాజకీయ వ్యూహంగా మలచగలిగాడు మావో. అందుకు భిన్నంగా గణపతి, పార్టి శ్రేణుల్ని విశాల సమాజానికి దూరం చేసి, తనకున్న సాయుధ దళాల్ని ఛత్తీస్ గడ్ అబుజ్ మడ్ లో మోహరించి పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్నీ వ్యతిరేకిస్తూ సాయుధపోరాటమే ఏకైకమార్గం అన్న మావోయిస్టు పార్టి మొదటి రంగాన్ని పూర్తిగా వదిలేసింది; రెండో రంగంలో విషాదకరంగా ఓడిపోయింది.

 

గణపతి నిబద్ధతను ప్రశంసించవచ్చు. ఆయన త్యాగాన్ని గుర్తించవచ్చు. ఒక సాయుధ ఉద్యమాన్ని దశాబ్దాల పాటు నడిపిన ఆయన సామర్థ్యాన్ని కూడా గుర్తించవచ్చు. అయితే నాణేనికి మరోవైపున కూడ చూడాలి.   

 

కొండపల్లి సీతారామయ్య తప్పులు చేయని రాజకీయ సిధ్ధాంత వేత్త అని చెప్పడం సరికాకపోవచ్చు. ఆయన చేసిన తప్పులు ఆయనకు వున్నాయి. కానీ, దాదాపు బూడిదగా మారిపోయిందనుకున్న నక్సలైట్ ఉద్యమానికి 1970లలో  ఫీనిక్స్ పక్షిలా తిరిగి ప్రాణం పోసి ఏపుగా పెంచిన ఘనత కొండపల్లిదే అనడంలో సందేహం లేదు. కొండపల్లి ఏపుగా పెంచిన ద్రాక్షతోటను కాల్చి బూడిదగా మార్చిన రికార్డు ఇప్పుడు గణపతి పేరున నమోదయ్యింది.

 

08 సెప్టెంబరు 2026

మొదలైనచోటే ముగిసిన వివాదం! భయపడొద్దు! - లా విద్యార్థులకు సుప్రీం కోర్టు హామి

 భయపడొద్దు! - విద్యార్థులకు సుప్రీం కోర్టు హామి!

డానీ

సమాజ విశ్లేషకులు 



హైదరాబాద్ లోని నల్సార్ లా యూనివర్శిటీ విద్యార్ధుల వివాదం ఇప్పుడు ఆరంభమయిన  చోటే ముగిసింది.  అది సుప్రీంకోర్టులోనే ఆరంభం అయింది; అది సుప్రీంకోర్టులోనే ముగిసింది.   లా విద్యార్ఢులు, టీచింగ్ సిబ్బంది మీద క్రమ శిక్షణ చర్యలు తీసుకునే అధికారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు లేదని భారత ఉన్నత న్యాయస్థానం సెప్టెంబరు 3న అంతిమ తీర్పు చెప్పింది. 


ఈఏడాది సెప్టెంబరురు నెలలో జరగాల్సిన లా యూనివర్శిటీ కాన్వోకేషన్ కు భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ సూర్యకాంతను ఆహ్వానించారు. ప్రధానఅ న్యామ్యమూర్తి చేతుల మీదుగా పట్టాలు తీసుకోవడం న్యాయశాస్త్ర విద్యార్ధులకు గొప్ప అవకాశం, అదృష్టం. కానీ నల్సార్ యూనివర్శిటీ విద్యార్ఢులు దానికి అభ్యంతరం చెప్పారు. జస్టిస్ సూర్యకాంతకు  రాజ్యాంగ  ప్రధాన విలువల మీద గౌరవం లేదనీ, అలాంటివారి చేతుల మీదుగా తాము   పట్టాలు తీసుకోము అన్నారు.  యూనివర్శిటీ బోధనా సిబ్బందిలో కొందరు విద్యార్ధుల పక్షాన నిలిచారు. విద్యార్ధుల నిరసనలకు స్పందించిన యూనివర్శిటీ  జస్టిస్ సూర్యకాత ను ఆహ్వానించే అంశాన్ని విరమించుకుంది.   


చీఫ్  జస్టిస్ ఆఫ్ ఇండియా  కు వ్యతిరేకంగా విద్యార్ధులు నిరసనలు తెలపడాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బిసిఐ ) తీవ్రంగా స్పందించింది. ఈ ఏడాది నల్సార్  యూనివర్శిటీ నుండి   పట్టభద్రులైన వారిని దేశంలో ఏ బార్ అసోసియేయన్ లోనూ  నమోదు చేసుకోరాదని  బిసిఐ అధ్యక్షులు మానన్ కుమార్ మిశ్రా ఆగస్టు 13న ఒక తీవ్రమైన ఉత్తర్వులు జారీచేశారు.


నన్ కుమార్ మిశ్రా బిజెపి కి సన్నిహితులు. బిసిఐ  అధ్యక్ష పదవిలో  పదేళ్ళుగా నిరాఘాటంగా కొనసాగుతున్నారు. రెండేళ్ల క్రితం బిహార్  నుండి బిజెపి అభ్యర్ధిగా రాజ్యసభకు కూడ ఎన్నికయ్యారు. జస్టిస్ సూర్యకాంత  మీద కూడ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా వుంటున్నారనే  విమర్శలు వున్నాయి.  వారి పరువును రక్షించడానికే  మానన్ కుమార్ మిశ్రా వినూత్న ఉత్తర్వులు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. 


న్యాయశాస్త్రంలో పట్టభద్రులు అయినవారిని లాయర్లు అంటారు. పట్టభద్రులు అయ్యాక బిసిఐ  నిర్వహించే ఒక అర్హత పరీక్షను పాసైన వారిని అడ్వకేట్లు అంటారు. ఆడ్వకేట్లు మాత్రమే బిసిఐ  పరిధిలోనికి వస్తారు.  


లాయర్ల జీవితాలను నాశనం చేసే అధికారం బిసిఐకి లేదని తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. సుప్రీం కోర్టు బార్ కౌన్సిల్ తో సహా, దేశంలోని ప్రజాస్వామికవాదులు  అనేకులు మానన్ కుమార్ మిశ్రా వ్యవహారశైలి మీద తీవ్రంగా స్పందించారు. నిరసనలు పెల్లుబకడంతో  బిసిఐ  తన ఉత్తర్వుల్ని ఉపసంహరించుకుంది. అయినప్పటికీ ఆ వివాదం ముగియకుండ మరికొన్ని ఆసక్తికర మలుపులు తిరిగింది. 


నల్సార్ యూనివర్శిటీ పూర్వవిద్యార్ధులు మిహిరా సూద్, అభిషేక్ తివారీ బిసిఐ అసమంజస తీరుపైన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీనియర్ అడ్వకేట్ పరమేశ్వర్ లా విద్యార్ధుల కేసును వాదించారు. ఈ కేసు సిజెఐI  జస్టిస్ సూర్యకాంతతో కూడిన ధర్మాసనానికి వెళ్ళింది. ఇక్కడే  ఈకేసు కొత్త మలుపు తిరిగింది. 


ఇది నల్సార్ యూనివర్శీటీ కేసు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ, ఈ కేసు అసలు సుప్రీంకోర్టులోనే ఆరంభం అయ్యి, తిరిగి సుప్రీం కోర్టుకే వచ్చింది. 


 ఈఏడాది మే నెలలో ఒక కేసు విషయమై సుప్రీం కోర్టుకు వచ్చిన సమాచార హక్కు కార్యకర్తల మీద సిజెఐ విసుక్కున్నారు. బొద్దింకలంటూ వారిని కసురుకున్నారు. వారి విసుర్లనే ఆత్మగౌరవంగా భావించి మొద్దింకల ఉద్యమం మొదలయ్యింది. 


ఢిల్లీ జంతర్ మంతర్ లో జరిగిన నిరసనలు 23 రోజులు సాగిన విషయం అందరికీ తెలుసు. ఆ ఉద్యమం మీద కేంద్ర  ప్రభుత్వ పెద్దలకు ఒక  లెఖ్ఖ వుంది.  అదేమంటే,   నిరాహార దీక్షలోవున్న  సోనమ్ వాంగ్చుక్ ను హాస్పిటల్ కు తరలించి, నిరసనకారుల మీద లాఠీలతో విరుచుకు పడితే విద్యార్ధులు పలాయనం చిత్తగిస్తారు. ఉద్యమం ఒక ముగింపుకు రావాలి. విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాల్సిన పనికూడ వుండేదికాదు. 


ఆ మరునాడు  విచిత్రంగా బొద్దింకల ఉద్యమానికి జస్టిస్ సూర్యకాంత   తనకు తెలియకుండానే పరోక్షంగా కొత్త ప్రాణం పోశారు. అంతకు ముందు రోజు విద్యార్ధుల మీద తీవ్రంగా లాఠీ చార్జి జరిగింది. లాఠీ  అంటే వెదురు కర్ర ముక్క.  ఆ కర్రకు మేకులు దించి కొట్టారు. సాంప్రదాయ నిర్వచనం ప్రకారం అది లాఠీ చార్జి కాదు; మేకులు దించడం. ఆపైన తుపాకుల్లో పిల్లెట్లు పెట్టి కాల్పులు జరిపారు. అలనాటి జలియన్ వాలా బాగ్ దురంతంలో  బ్రిటీష్ వలస పాలకులు కూడ ఒక విచారణ కమిటీ చేశారు. కాల్పులకు ఆదేశాలు ఇచ్చిన   డయ్యర్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. 


నిజానికి ఇలాంటి దురంతాలు జరిగినప్పుడు భారత ఉన్నత న్యాయస్థానం తనంతట తానుగా, సుమోటోగా స్పందించ వచ్చు. అలా జరగలేదు. పైగా, పోలీసుల వ్యవహార శైలి మీద స్పందించాలని కొందరు అడ్వకేట్లు  న్యాయస్థానాన్ని ఆశ్రయించి  లాఠీ చార్జీకి సంబంధించిన వీడియోలను పరిశీలించమన్నప్పుడు  CJI  అసహనాన్ని వ్యక్తం చేశారు.  తన  సమయాన్ని వృధా  చేయవద్దని  మందలించారు. ఈ వార్త వైరల్ అయ్యింది.  జెన్ -జీకి జరుగుతున్న ఆన్యాయాన్ని ప్రశ్నించడానికి దానికి ముందున్న తరాలు జెన్ -వై , జెన్-ఎక్స్   కూడ నిరసనలకు మద్దతుగా వచ్చాయి. అప్పుడుగానీ కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా రాజీనామా చేయించక తప్పలేదు.   వున్నత న్యాయమూర్తులకు పదవి విరమణానంతరం నామినేటెడ్ పదవులు ఇవ్వరాదు అన్న డిమాండును  బొద్దింకల ఉద్యమం  ముందుకు తెచ్చింది. ఎవరిని ఉద్దేశించి ఈ డిమాండు పుట్టిందెఓ తెలియని వారుండరు.  ఇన్ని మెలికలు తిరిగిన నల్సార్ కేసు చివరకు అదే సిజేఐ  ధర్మాసనానికే  వచ్చింది.


గతంలో రెండుసార్లు జరిగిన పొరపాట్లను జస్టిస్ సూర్యకాంత ఈసారి చేయదలచలేదు. విద్యార్ధులకూ తనకూ  మధ్య  జరుగుతున్న వ్యవహారంలో తలదూర్చడానికి బిసీఐ ఎవరూ? అని గట్టిగా అడిగారు. తొలిరోజే   మానన్ కుమార్ మిశ్రాకు చాలా పెద్ద షాకిచ్చారు. అంతేకాదు,  నిరసన వ్యక్తం చేసే ప్రజాస్వామిక హక్కు విద్యార్ధులకు వుందని గట్టిగా సమర్ధించారు. తాను కూడ కాలేజీ రీజుల్లో నిరసనల్లో పాల్గొనేవాడినని గుర్తు చేసుకున్నారు. . ఇప్పుడు అంతమ తీర్పులో - అడ్వాకేట్లు కాకముందు విద్యార్ధుల వ్యవహారాల్లో తలదూర్చే అధికారం బిసిఐ  కు లేదని తీర్పు ప్రకటించారు.  లా విద్యార్ధులు, బోధనా సిబ్బందికి వుండే ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడాలన్నారు. 

  మానన్ కుమార్ మిశ్రాకే కాదు;  బొద్దింకల నిరసనోద్యమం విషయంలో  ఢిల్లీ పెద్దల మెప్పు కోసం దిగజారుడు పనులు చేసిన వారందరికీ నల్సార్ లా విద్యార్ధుల నిరసన  కేసు తీర్పు ఒక చెంప దెబ్బ! కాకుంటే చెప్పుదెబ్బ!


03-09-2026

మొదలైనచోటే ముగిసిన వివాదం!

భయపడొద్దు! - లా విద్యార్థులకు సుప్రీం కోర్టు హామి



ఈరోజు నా వ్యాసాన్ని  ప్రచురించిన ఆంధ్రజ్యోతికి ధనవాదాలు. 

https://www.andhrajyothy.com/2026/editorial/nalsar-students-protest-supreme-court-judgment-bar-council-of-india-disciplinary-powers-1557103.html

Friday, 4 September 2026

Notes on Vandemataram Song

 వందే మాతరం గేయం :  వలస వ్యతిరేకత నుండి మత విద్వేషం వరకు 


వందేమాతరం నినాదం వందేమాతరం ఉద్యమం వందేమాతరం గీతం ఒకటికావు. 

మాతృదేశాన్ని  ప్రతి ఒక్కరూ గౌరవించాలి. వందేమాతరం అనాలి. మా తుఝే సలాం అనాలి. తల్లీ నీకు వందనం అనాలి. 

హిందూ దేవతలైన కాళిక దుర్గాలే మాతృ భూమి.   ప్రతిపౌరుడు   ఆ దేవతల్ని పూజించాలంటే  విబేధాలు వస్తాయి. 

భారత ముస్లింల జన్మభూమి కర్మభూమి పుణ్యభూమి కూడ భారత దేశమే.

మక్కా, మదీనా, బైతుల్ ముఖద్దస్ (al aqsa mosque) లను ముస్లింలు పుణ్య క్షేత్రాలుగా భావిస్తారు.  అంతమాత్రాన ఆ మూడు పుణ్యక్షేత్రాలున్న సౌదీ అరేబియా, ఇజ్రాయేల్ దేశాలను, పాలస్తీనాను కూడ  ముస్లింలు పుణ్య భూములు అనుకోవు. ఫాదర్ లాండ్ , మదర్ లాండ్ అనుకోరు. 


బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా 1905లో చెలరేగిన వందేమాతరం ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ముస్లింలు ఎవరూ? 


When and how Rabindranatha Tagore changed his stance on Vandemataram song and became critical of it?


బంకించంద్ర  బ్రిటీష్ ఉద్యోగి. 1857లో హిందూ ముస్లింలు కలిసి భారత  ప్రధమ స్వాతంత్ర్యోద్యమాన్ని సాగించిన 25 ఏళ్ల తరువాత ఆనందమఠ్ నవలను ప్రచురించాడు. 

ఆయన అప్పుడు అధికారంలోవున్న బ్రిటీష వలస పాలనను వ్యతిరేకించలేదు. బ్రిటీష్  పాలన ఆరంభానికి ముందు ముస్లింనవాబుల పాలన కాలంలో  బెంగాల్ లో సాగిన సన్యాసుల తిరుగుబాటును కథాంశంగా తీసుకున్నాడు. ఈ నవలలో హిందూ సన్యాసులు proyogonists;  ముస్లిం పాలకులు antogonists. 

1857 లో భారత హిందూ ముస్లింల మధ్య ఏర్పడిన ఐక్యతను చూసి బ్రిటీష్ పాలకులు భయపడ్డారు. ఆ రెండు మత శిబిరాలను విడదీయాలనుకున్నారు. 

బంకించంద్ర నవల ఆ పనిచేసి పెట్టింది.  

1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా సాగిన వందేమాతరం వుద్యమంలో ఈ విభజన పనిచేసింది. దానితోనే రబీంద్రనాథ్ టాగోర్ ఈ గీతం మీద తన పూర్వ ఆలోచనల్ని మార్చుకున్నాడు. ఆయన ఏకేశ్వరోపాశకుడు కావడం కూడ దీనికి కారణం. . 

బంకించంద్ర వ్యూహానికి ఆధునిక రూపమే 1923లో దామోదర్ వినాయక్ సావర్కర్ ప్రవేశ పెట్టిన  Hindutva సిధ్ధాంతం. 


1. Who was Bankim Chandra Chatterjee and what was his job?
Bankim Chandra Chatterjee (also spelled Chattopadhyay) was a highly influential Bengali novelist, poet, essayist, and journalist. Often referred to as Sahitya Samrat (Emperor of Literature), he played a pioneering role in the 19th-century Bengal Renaissance and deeply rooted early Indian nationalism through his literature. [1, 2, 3]
In the British colonial administration, he served as a high-ranking civil servant. He was appointed as a Deputy Magistrate and Deputy Collector. He held this executive position for over 32 years (from 1858 until his retirement in 1891), often managing various administrative sub-divisions across Bengal while secretly penning his famous revolutionary works during his spare time. [1, 2, 3, 4]
2. Who was the Governor-General / Viceroy during his service?
Because Bankim Chandra served the government for more than three decades (1858–1891), he lived and worked under multiple heads of the colonial administration. [1]
  • When he first entered government service in 1858, Lord Canning was the Governor-General (who also became India's very first Viceroy that same year following the Government of India Act 1858).
  • When he retired in 1891, Lord Lansdowne was serving as the Viceroy of India.
3. When did he write the song Vande Mataram?
He wrote the lyrics to the patriotic song Vande Mataram on November 7, 1875. He initially wrote it as a standalone poem before deciding to incorporate it into his structural fiction work years later. [1, 2]
4. When did he publish Anandamath and what period did its story represent?
  • Publication Year: He published the novel Anandamath in 1882.
  • Historical Period Represented: The plot of the story is set in the late 18th century (the 1770s). It vividly portrays the devastating Great Bengal Famine of 1770 and the subsequent armed Sannyasi Rebellion, where a group of ascetic monks and common multitudes rose up to fight the oppressive tax systems of the British East India Company. [1, 2, 3, 4, 5, 6]
5. Who was the Governor-General / Viceroy then?
When Anandamath was published in 1882, Lord Ripon was the Viceroy and Governor-General of India (serving from 1880 to 1884). He is historically remembered for introducing the local self-government acts in India.

The primary antagonists in Bankim Chandra Chattopadhyay's novel Anandamath are the forces of the British East India Company and the ruling Bengal administration. [1, 2, 3]
Antagonists in the Novel
  • The British East India Company: The main foreign power exploited local resources and fought against the ascetic rebel army (santans).
  • The Puppet Nawab's Administration: The regional rulers who levied heavy taxes under British pressure during the devastating agrarian crisis. [1, 2]
The Nawab at that Time
  • Historical Setting: The novel is set during the late 18th century against the backdrop of the Great Bengal Famine of 1770.
  • The Nawab: During this 1770 famine period, Bengal was under a system of dual government where the nominal Nawab was Saif ud-Daulah (who ruled from 1766 to 1770) followed briefly by Babur Ali Khan / Mubarak Ali Khan, while actual civil and revenue power (Diwani) was held by the British East India Company. [1, 2, 3, 4, 5]


  • The Constituent Assembly did not hold a formal, divided debate or vote on Vande Mataram; instead, President Dr. Rajendra Prasad issued a official statement on January 24, 1950, declaring the first two stanzas as the National Song with equal honor to the National Anthem. [1, 2]
    The Decision
    • The Outcome: Dr. Rajendra Prasad announced that Jana Gana Mana would be the National Anthem and Vande Mataram (first two stanzas) would be the National Song. [1, 2]
    • The Assembly's Reaction: The members accepted this declaration with cheers, and the assembly wrapped up without a formal motion or dissent on the floor. [1, 2]
    Proponents and Historical Consensus
    • Key Leaders: Figures like Jawaharlal Nehru, Mahatma Gandhi, Subhas Chandra Bose, and Rabindranath Tagore supported truncating the song.
    • The 1937 Compromise: The Congress Working Committee earlier decided to use only the first two stanzas to honor the freedom struggle's unifying power while avoiding later stanzas with explicit religious imagery. [1, 2, 3]
    Opponents and Concerns
    • Historical Opposition: The Muslim League during the pre-independence era objected to the song's later verses due to idolatrous or religious imagery that conflicted with monotheistic beliefs. [1, 2]
    • Modern Context: Contemporary groups, such as the All India Muslim Personal Law Board, continue to argue that mandating or reciting full verses outside the first two stanzas clashes with diverse religious faiths and constitutional


    • The prominent personalities of the 18th-century Sanyasi and Fakir Rebellion (1763–1800) against the British East India Company included key leaders from both Hindu ascetic and Muslim Sufi orders. [1, 2, 3]
      Major Leaders
      • Majnu Shah: A prominent Sufi saint of the Madariya order, he was the main leader of the Fakir Uprising, organizing armed bands in northern Bengal to raid Company factories and treasuries. [1, 2, 3, 4, 5, 6]
      • Pandit Bhabani Charan Pathak (Bhawani Pathak): A key Sanyasi leader from Buxar/Rangpur, he led armed groups of Hindu ascetics and peasants in joint resistance with Majnu Shah. [1, 2, 3, 4]
      • Devi Chaudhurani: A legendary woman leader who worked alongside Bhawani Pathak, symbolizing active female participation in early anti-British resistance. [1, 2, 3, 4]
      • Musa Shah: Majnu Shah’s brother, who assumed leadership and continued military operations after Majnu Shah's death. [1, 2, 3]
      • Chirag Ali Shah (Chirag Shah): Another vital leader of the Fakir resistance who coordinated attacks against British colonial outposts following operations by Majnu Shah and Musa Shah. [1, 2, 3]


      • While the actual historical event of the late 18th century was a combined Sanyasi-Fakir Rebellion where Hindu ascetics and Muslim mystics fought side-by-side against the British East India Company, Bankim Chandra chose to selectively focus on and fictionalize only the Hindu Sanyasis. [1, 2]
        The Key Differences Between History and the Novel
        • The Fictional Brotherhood: In Anandamath, Bankim Chandra created a fictional band of ascetic warriors called the Santans (Children of the Mother). He framed their struggle around Hindu religious imagery, portraying them as selfless devotees fighting a holy war to liberate Mother India. [1, 2, 3, 4]
        • The Omission of Fakirs: The Muslim Fakirs, who were crucial leaders and participants in the actual historical uprising (such as Majnu Shah), were omitted from the rebel alliance in the book. [1, 2, 3]
        • The Portrayal of Muslims: Instead of showing Hindu-Muslim unity against the British, the novel often positions the local Muslim Nawabs and their administration as corrupt and adversarial. The Santans initially rise up against the misrule of the Nawabs rather than targeting the British directly. [1]
        Historical Criticism
        Because of this creative liberty, many modern historians criticize Anandamath for its lack of historical accuracy regarding the cooperative nature of the revolt. While the novel remains a monumental piece of political literature that gifted India its national song, Vande Mataram, it replaced the shared, cross-religious history of the Sanyasi-Fakir Rebellion with an exclusively Hindu nationalist