Thursday 14 March 2024

Gurujada Apparao

 *గురజాడ గురించి మరికొంత* 


 గురజాడ  అప్పారావు బ్రాహ్మణ సమాజం గురించి మాత్రమే  రాశాడు అని పెదవి విరిచేవాళ్ళూ, అసంతృప్తి వ్యక్తం చేసేవాళ్ళూ వున్నారు. ఒక రచనను సామాజిక కోణంలో చూసే విధానం అది కాదు.  


నవలలో  ఒక్క కార్మిక పాత్ర కూడ లేకుండ మొత్తం కథనాన్ని ముంబాయి కంబల్లా హిల్స్  ఆల్టా మౌంట్ రోడ్ లోని 27 అంతస్తుల ముఖేశ్ అంబానీ నివాస గృహం 'అంటీలియా'లోనే నడపవచ్చు. అంతమాత్రాన దాన్ని కార్పొరేట్ కథ అనలేం. అనకూడదు. ఒక్క కార్మిక పాత్ర కూడ లేకుండ కార్మిక దృక్పథంతో రచన చేయవచ్చు. అలాగే, మొత్తం కార్మిక పాత్రలతోనే కార్మిక వ్యతిరేక రచన చేయవచ్చు. 


కథను రచయిత ఏ దృక్పథం తో రాశాడు అన్నది ముఖ్యం. స్థలం, కాలం, సందర్భం, పాత్రలు అనేవి కథాంశానికి (టాపిక్) సంబంధించిన అంశాలు. వాటి మీద రచయిత దృక్పథం ఏమిటీ అనేదే వస్తువు.


గురజాడ అప్పారావు ప్రధానంగా బ్రాహ్మణ పాత్రలతో, నాటి బ్రాహ్మణ కుటుంబ వాతావరణంలో రచనలు చేశాడు. కానీ, కన్యాశుల్కాన్నీ, బాల్యవివాహాలని విమర్శించాడు; వితంతు పునర్వివాహాలను సమర్ధించాడు.  అది అతని దృక్పథం. సాంప్రదాయ విద్య నేర్చినవారు చేసే మోసాలగురించి అప్పటికే సమాజంలో ఒక అవగాహన వుంది. ఆధునిక ఆంగ్ల విద్య నేర్చుకున్న గిరీశం వంటివారు చేయబోయే మోసాలనూ గురజాడ పసికట్టాడు. అందుకే ఆ కాలానికి ఆధునికుడు అయ్యాడు. 


 ఆహారం నిద్ర లానే సంభోగం కూడ ఒక కీలక శరీరధర్మం.  ఒక స్త్రీ ఒక పురుషుడు జీవితకాల భాగస్వాములుగా మారి, దాంపత్య వ్యవస్థలో ప్రవేశించి, ఇనుప తలుపుల్ని శాశ్వితంగా మూసివేసిన  తరువాత   మాత్రమే సంభోగ అవసరాలు తీర్చుకోవాలనే కఠిన నిబంధన వున్నప్పుడు సమాజంలో  సరుకు సంభోగాన్నీ సరఫరా చేయడానికి వాణిజ్య వేశ్య (public prostitution) వ్యవస్థ పుట్టుకు వస్తుంది.    ఇదొక అనివార్య ఏర్పాటు. 


 కార్ల్ మార్క్స్ - ఫ్రెడరిక్ ఏంగిల్స్  ఇద్దరూ ఇంచుమించు  ఇలాంటి అభిప్రాయాన్నే కమ్యూనిస్టు ప్రణాళికలోని 'శ్రామికులు - కమ్యూనిస్టులు'   అనే అధ్యాయంలో  చెప్పారు. గురజాడ కూడ ఈ హేతువునే పాటించాడనిపిస్తోంది.  


బాల్య వివాహాలు, బాల్య వితంతువులు, వితంతు పునర్వివాహాలు, కన్యాశుల్కం వగయిరా అంశాల మీద  ఒక నాటకాన్ని రాస్తున్నప్పుడు ఒక వేశ్యపాత్ర కేంద్రబిందువుగా వుండాలని గురజాడ  భావించాడు. ‘కన్యాశుల్కం నాటకంలో స్త్రీపురుష సంబంధాలు’ అనే అంశం మీద ఒక విస్తృత పరిశోధనా గ్రంధం రాయవచ్చు. 


 ఇటువైపు పాతివ్రత్యం, ఏకపత్నీవ్రతం వున్నంత వరకు అటువైపు వాణిజ్య వేశ్యావ్యవస్థ వుంటుంది. గురజాడ ఒక్కడేకాదు; కుటుంబ వ్యవస్థలోని లోపాలను  చిత్రించాలనుకున్న అంతర్జాతీయ స్థాయి  రచయితలు  అనేకులు వేశ్య పాత్రల్ని కేంద్ర బిందువుగా మార్చుకున్నారు. వేశ్య పాత్రలు ముసుగులు, తొడుగులు పెట్టుకోవు. సూటిగా స్పష్టంగా మాట్లాడుతాయి. సమాజం మీద ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల మీద వాళ్ళు చేసే వ్యాఖ్యానాలే ప్రామాణికమైనవి. 

Wednesday 13 March 2024

Leon Trotsky, Vladimir Lenin, and Joseph Stalin

 Leon Trotsky, Vladimir Lenin, and Joseph Stalin were three prominent figures in the history of the Soviet Union, each playing significant roles in shaping its trajectory. While they were all Bolshevik leaders and played crucial roles in the Russian Revolution and the establishment of the Soviet state, they had different ideologies, leadership styles, and approaches to governance. Here are some major differences between them:

Ideological Differences:

Trotsky: Trotsky was an advocate of "permanent revolution," which argued for the spread of socialist revolutions beyond national borders. He believed that the success of socialism in Russia depended on the success of revolutions in advanced capitalist countries.

Lenin: Lenin's ideology, as encapsulated in his theory of Marxism-Leninism, emphasized the need for a vanguard party to lead the proletariat in seizing power. He believed in the possibility of building socialism in a single country, even if it was relatively backward economically.

Stalin: Stalin's ideology, known as "Stalinism," focused on the concept of "socialism in one country," which prioritized the development of socialism within the borders of the Soviet Union. This approach emphasized centralized state control and rapid industrialization.

Leadership Styles:


Trotsky: Trotsky was known for his charismatic leadership style and oratorical skills. He was a dynamic and persuasive speaker who could inspire crowds and mobilize support for his ideas.

Lenin: Lenin was a strategic thinker and a skilled organizer. He was known for his pragmatism and his ability to adapt Marxist theory to the specific conditions of Russia.

Stalin: Stalin was characterized by his ruthless and authoritarian leadership style. He consolidated power through purges and the elimination of rivals within the party, creating a cult of personality around himself.

Role in the Revolution:


Trotsky: Trotsky played a crucial role in organizing and leading the Red Army during the Russian Civil War, which secured the Bolshevik victory and established Soviet power. He also played a key role in the October Revolution.

Lenin: Lenin was the founder and leader of the Bolshevik Party, and he played a central role in orchestrating the October Revolution. His leadership during the Civil War and in the early years of Soviet rule was instrumental in shaping the course of the new regime.

Stalin: Stalin initially played a more behind-the-scenes role in the Revolution, but he rose to prominence in the party hierarchy after Lenin's death. He outmaneuvered his rivals, including Trotsky, to become the undisputed leader of the Soviet Union.

Attitudes Toward Internationalism:


Trotsky: Trotsky believed in the international spread of socialist revolution and advocated for a global proletarian uprising against capitalism.

Lenin: Lenin also supported internationalism and provided support to communist movements in other countries. However, he also believed in the importance of consolidating socialism within the Soviet Union.

Stalin: Stalin's policies were more focused on building socialism within the Soviet Union and maintaining control over Eastern European countries through the establishment of satellite states.

These are some of the key differences between Trotsky, Lenin, and Stalin. While they were all instrumental in the establishment of the Soviet Union, their differing ideologies and leadership styles ultimately led to significant conflicts and power struggles within the Bolshevik Party and the broader Soviet state.


Tuesday 5 March 2024

Outcry of a Donkey – Intro

Outcry of a Donkey  – Intro

గాడిద ఆత్మఘోష  - పరిచయం 




          జంతువులను  పాత్రలుగా చేసి ప్రతీకాత్మకంగా  కథలు రాయడం కొత్తేమీకాదు. నీతి చంద్రిక నుండే మనకు ఈ సాంప్రదాయం వుంది. మన జానపద సాహిత్యంలోనూ ఈ శైలి వుంది.  అరేబియన్ నైట్స్ లో ఇది మరోదశకు చేరుకుంది.  వీటిని మొదట  ‘అలీఫ్ లైలా’ ధారావాహికంగా మా అమ్మమ్మ ఫాతిమున్నీసా ద్వార విన్నాను. తరువాత సర్ రిచర్డ్ ఫ్రాన్సిస్ బర్టన్ (1821-1890)  పుస్తకాలు "One Thousand and One Nights." ద్వార చదివాను. ఇందులో నాకు నచ్చిన అంశం ఏమంటే కథానాయకి   షెహరాజాదే (Scheherazade) ప్రతిరోజూ ప్రతి కథనూ ఆసక్తికరంగా చెప్పి తీరాలి. లేకుంటే మరునాడు  రాజు షహర్యార్ (Shahryār) ఆమెను నిర్దాక్షిణ్యాంగా చంపించేస్తాడు. చావోబతుకో తేల్చుకోవాల్సిన సందర్భం వస్తేనే ఇంత మంచి కథలు పుడతాయేమో అనే ఒక వైల్డ్ ఆలోచన వచ్చేస్తుంది. 

సాంఘీక, రాజకీయ, నైతిక  అంశాల మీద విమర్శలు, వాఖ్యానాలు చేయడం  కోసం మార్మికతను వాడే ప్రక్రియను లాటిన్ అమెరికన్ సాహితీవేత్తలు గొప్పగా అభివృధ్ధి చేశారు.  జార్జ్ బోర్జెస్ (Jorge Francisco Isidoro Luis Borges Acevedo 1899 –1986), గేబ్రియల్ గార్షియా మార్క్వెజ్ (Gabriel José de la Concordia García Márquez 1927 –2014) వీరిలో ప్రసిధ్ధులు. వీరి శిష్యుడిగా ముందుకొచ్చిన పౌలో కొయెల్హో  (Paulo Coelho de Souza ) మీద కూడ అరేబిమన్ నైట్స్ ప్రభావం కనిపిస్తుంది. 

          సామాజిక వాస్తవికత, పోరాట వాస్తవికత, విప్లవ వాస్తవికతలు ఒక దశలో గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చాయి. మరోవైపు, అవి మాత్రమే ఏకైక వస్తుశిల్పాలు  అనుకునే అతివ్యాప్తి దోషంవల్ల సాహిత్య సృజనకు బోలెడు నష్టం కూడ జరిగింది. సాహిత్యంలో వైవిధ్యం లేకుండాపోయింది. వైవిధ్యంలేని సాహిత్యం చప్పబడిపోతుంది. చప్పబడిపోయిన సాహిత్యం ఫెయిల్ అయిన సినిమా లాంటిది. ఫెయిల్ అయిన సినిమాను ఓటిటిలో ఉచితంగా వేసినా  ఎవరూ చూడరు. 

          జాక్ లండన్  రచనా శైలి మాత్రమేగాక అతను జీవించిన విధానం  కూడ నాకు చాలా ఇష్టం.  జాక్   'ఐరన్ హీల్' గొప్ప డెస్టోపియన్ నవల. అందులో అణువణువునా అతని మేధస్సు కనిపిస్తుంది. అయితే, దానికన్నా అతని  'కాల్ ఆఫ్ ద వైల్డ్', ‘వైట్ ఫాంగ్’  నాకు మరీ ఇష్టం. కుక్కను, తోడేళ్లను పెట్టి కథను నడిపించిన తీరు, అనుక్షణం కొనసాగించిన సామాజిక, రాజకీయ వ్యాఖ్యానాలు అద్భుతం అనిపిస్తాయి. అన్నింటికి మించి జాక్ లండన్ కాల్పానిక సృజనాత్మకత సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది.   

పందులు, కుక్కలు, గుర్రాలు, గాడిదల్ని  ప్రధాన పాత్రలుగా  పెట్టి జార్జ్ ఆర్వెల్ 'యానిమల్ ఫార్మ్' రాశాడు. జేవీ స్టాలిన్ భక్తులకు ఇది నచ్చకపోవచ్చు. శిల్పపరంగా ప్రపంచ సాహిత్యంలో ఇంతగొప్ప పొలిటికల్ సెటైర్ మరెవ్వరయినా రాశారేమో నాకు తెలీదు. నేను ప్రపంచ సాహిత్యం మొత్తం చదివినవాడిని కానని ఇందుమూలముగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. 

          పదిహేను వందల కిలో మీటర్లు ప్రవహించే గోదావరినది వశిష్టా గోదావరిగా చీలి సముద్రంలో కలిసే చోట పుట్టాను. రోజూ గోదావరిని చూస్తూ పెరిగాను.  హాస్యం, వెటకారం, ఎద్దేవ, అధిక్షేపణ, వ్యంగ్యం నరసాపురోళ్ళ జన్మహక్కు. 

ఐదేళ్ల క్రితం తోడేళ్ళు, మేక పిల్లల్ని పెట్టి నేను  'మదరసా మేక పిల్ల' పేరుతో ఒక డెస్టోపియన్ కథ రాశాను. డెస్టోపియన్ అంటే మనం కోరుకోని సమాజం, మనం వద్దనుకునే సమాజం, మనం భరించలేని సమాజం, మనం నడుం బిగించి నాశనం చెయ్యాల్సిన సమాజం. 

ఈసారి వ్యంగ్య నవల రాయాలనుకుంటున్నాను. అందులో నేను చెప్పదలచిన  అనేక అంశాలకు గాడిద పాత్రయే  సరైనది అనిపిస్తున్నది. అలనాటి కిషన్ చందర్ గాడిదను నాయుకగా పెట్టి ఏకంగా మూడు నవలలు (ట్రయాలజీ) రాశాడు. గోగోల్, మపాసా, లూసన్ వంటి ముగ్గురు ప్రపంచ ప్రసిధ్ధ రచయితలు ‘పిచ్చివాని డైరీ ‘ అనే  ఒకే శీర్షికతో మూడు కథలు రాశారు. గాడిద ఆత్మకథ శీర్షికతో ఇతర భాషల్లోనూ కొన్ని నవలలు వచ్చాయి. మొరాకో రచయిత హసన్ ఔరిద్ (Hasan Aourid) రాసిన నవల అందులో ఒకటి. 

 ఇప్పుడు నేను మళ్ళీ  గాడిదను ప్రధాన పాత్రను చేసి రాస్తే ఎవరికయినా తప్పకుండా కిషన్ చందర్ గుర్తుకు వస్తాడు. నా నవల చదువుతున్నప్పుడు అంతటి పెద్దవాడు గుర్తుకు వస్తే అది నాకు గౌరవమేగానీ నామోషీ ఏమీ కాదు. ఒక విధంగా ఇది కిషన్ చందర్ కు నా నివాళి. అంచేత, గాడిదే నా హీరో. 

రాతలో పురుషాల గురించి చెపుతూ "వాడు ప్రధముండ, నువ్వు మధ్యముండ, నేను ఉత్తముండ" అన్నారుగా పరవస్తు చిన్నయ సూరిగారూ. నేను ఉత్తముండగా రాయదలిచాను. అనగా నేనే ఆ గాడిద కాదలిచాను!. ఇది ఫిక్స్. ఇంకొకళ్ళు మనల్ని గాడిద అనడానికి ముందే మనల్ని మనం గాడిద అనుకోవడం గొప్ప వివేకం కదా!.   

          ఈ నవల స్ట్రక్చరులో 15 అధ్యాయాలుంటాయి. 200 ప్లస్ పేజీల నవల మొత్తంగా రాసి పుస్తకంగా తేవాలా? ఎప్పటికప్పుడు ఏ పేజీకి ఆ పేజీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టేయాలా? అనే రెండు ఆలోచనలున్నాయి. సోషల్ మీడియాలో రెండు తొలి అధ్యాయాలు  పెట్టి తరువాత పుస్తకంగా ప్రచురించడం మంచిదనిపిస్తోంది. టీజర్లు అన్నమాట. 

          ఇప్పుడు జరుగుతున్న జమిలీ ఎన్నికల హడావిడిలో దీన్ని మొదలుపెట్టవచ్చా అనే సందేహమూ ఒకటి వున్నది. కుల పోరాటాలు, మత యుధ్ధాలుగా ఎన్నికలు  జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఏవో విప్లవాత్మక మార్పులు  వస్తాయని  నమ్మడం కష్టం. ఎవరు గెలుస్తారూ? ఎవరు ఓడుతారు అనే దానితో  పనిలేకుండానే సామాన్య గాడిదలకు గుప్పెడు గడ్డి కూడ దొరకనంత గడ్డు రోజులు రానున్నాయి. 

          కొన్ని నెలల క్రితం ఓ రైటర్స్ మీట్ లో ఓ రాత్రి మిత్రులతో పిచ్చాపాటిగా ఏవో  పాత విషయాలు చెపుతుంటే వేల్పూరి  సుజాత  ఆసక్తిగా విని నా ఆత్మకథ రాయాలని చెప్పింది. దానికి ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్ అన్నీ తనే చేస్తానంది. మా మధయ ఈ ఒప్పందం ఇలా వుండగా నా జీవితంలోనికి ఓ గాడిద ప్రవేశించింది. దీనికి కూడ సంపాదకురాలిగా వుంటానని తనే స్వఛ్ఛందంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. పుస్తకాలు వేసే ఆర్ధిక స్తోమత లేదు కనుక ప్రచురణకర్తలు కూడ త్వరలో ముందుకు వస్తారని నమ్ముతున్నాను. 

ఉష యస్ డానీ

 



Wednesday 28 February 2024

I could not read Urdu now.

 ఉర్దూ చదవలేకపోతున్నందుకు చాలా బాధగా వుంది.

 

ముస్లిం సమాజంలో పురుషులకన్నా స్త్రీలలోనే అక్షరాశ్యత ఎక్కువగా వుంటుంది. ముస్లిం ఆడపిల్లలకు  ఉర్దూ, అరబ్బి విధిగా నేర్పుతారు. మానాన్న కన్నా మా అమ్మ ఎక్కువగా చదువుకుంది.

 

ఎలిమెంటరీ స్కూల్ లో తెలుగు మీడియంలో చదువుకునే రోజుల్లో సాయంత్రాలు ఖాజీ సాహెబ్ దగ్గర నేనూ ఉర్దూ అరబ్బీ చదివేవాడిని. నలుగురు అమ్మాయిలు నేనూ ఒక బ్యాచ్. ఆ బ్యాచ్ లో నేనే ఫస్ట్. ఉర్దూ బాగా చదివేవాడిని. ఎలిమెంటరీ స్కూలు దాటిన తరువాత ఉర్దూ తాలీమ్ ఆపాల్సి వచ్చింది. నా తెలుగు ఉఛ్ఛారణలో ఉర్దూ ప్రభావం వుండేది. ఇది కొంచెం అవమానకరంగా మారింది. కొంతకాలం మా సమూహంలో ఉర్దూ మాట్లాడేవాడినేగానీ రాసే అభ్యాసం పోయింది. తరువాత ఉర్దూ సమూహం కూడ లేక మాట కూడ పోయింది.

 

రాత్రి పడుకునే ముందు నా భార్య ఎందుకోగానీ “వ్యంగ్యం రాయడం ఎందుకు మానేశావూ?” అని  అడిగింది. “అది నీ స్ట్రాంగ్ పాయింట్” అని గుర్తు చేసింది. రాత్రంతా  దాని గురించే ఆలోచిస్తూ వుండిపోయాను. తెల్లారుగట్ల మెలుకువ వచ్చే సమయానికి కిషన్ చందర్ ఉర్దూ నవల ‘ఏక్ గధే కి సర్ గుజస్ట్’ (ఒక గాడిద ఆత్మకథ) గుర్తుకు వచ్చింది. బాల్యంలో మా ఇంటికి ‘షమా’ ఉర్దూ మాస పత్రిక వచ్చేది. అందులో ‘ఏక్ గధే కి సర్ గుజస్ట్’ సీరియల్ గా వచ్చేది. మా అమ్మమ్మ చదివి వినిపించేది. అప్పుడు మాకు అదేదో నవ్వులాటగా వుండేది. రచయిత పేరు కూడ తెలీదు.  కొంచెం ఊహ వచ్చాక దాని గంభీరత, దాని రచయిత పేరు తెలిసివచ్చింది. 

 

ఒక విధంగా నాకు తెలిసిన తొలి రచయిత కిషన్ చందర్. నేను రాసిన ‘గొయ్యి’  స్ట్రీట్ ప్లేకు ప్రేరణ కూడ కిషన్ చందర్ ‘ఏక్ గధే కి సర్ గుజస్ట్’.

 

ఉదయం లేవగానే ముందు నెట్ ఓపెన్ చేసి ‘ఏక్ గధే కి సర్ గుజస్ట్’ కోసం సెర్చ్ చేశాను. దొరికిందిగానీ ఉర్దూలో హెడ్డింగ్ మాత్రమే చదవగలిగాను. టెస్ట్ మ్యాటర్ చదవడం చాలా కష్టంగా వుంది. అక్షరాలు కూడబలుక్కున్నా (హిజ్జే) ముందుకు సాగడంలేదు. ఇక ప్రత్యామ్నాయంగా హిందీ బుక్ కోసం అమేజాన్ లో ఆర్డరు పెట్టాను. ఈ పుస్తకం తెలుగులో కూడ దొరుకుతుందని తెలుసు. అనువాదం కాకుండ ఒరిజినల్   చదవాలని కోరిక.

 

ఉర్దూ చదవలేక పోతున్నందుకు  బాధ వేసింది.

 

విజయవాడ

29 ఫిబ్రవరి 2024

Monday 19 February 2024

Notes on Fall of Pakistan

 ఈరోజు మొదలెట్టిన  వ్యాసం 

పాకిస్తాన్ పతనం నుండి నేర్చుకోవాల్సిన  గుణపాఠాలు '


టాటా గ్రూపు సంస్థల మార్కెట్ విలువ 341  బిలియన్ డాలర్లు దాటిందని ఈరోజు (19  ఫిబ్రవరి 2024  ) అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF ) ప్రకటించింది. భారత కరెన్సీలో ......... లక్షల కోట్ల  డాలర్లు. ఇవ్వాల్టి మార్కెట్ గణాంకాల్లో ఇదేమీ గొప్ప విషయం ఏమికాదు.  అంతకన్నా ఎక్కువ మార్కెట్ విలువ కలిగిన కార్పొరేట్లు మన దేశంలోనే అరడజను వరకు వున్నాయి. అయితే,  ఇక్కడో ప్రత్యేకత ఉంది. టాటా గ్రూపు సంస్థల మార్కెట్ విలువ పాకిస్తాన్ జాతీయ స్థూల ఉత్పత్తి (GDP ) కన్నా  ఎక్కువ. 2023  లో  పాకిస్తాన్ జిడిపి  340  బిలియన్ డాలర్లు   మాత్రమే. 


పాకిస్తాన్  జిడిపి  ఈ స్థాయికి పడిపోవడానికి కారణం ఏమిటి? అనేది ఎవరికయినా రావలసిన ప్రశ్న. ఇందులో మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలనేకం వున్నాయి. పైగా పాకిస్తాన్ ఆవిర్భావంతో, ఆ దేశ జాతిపిత ముహమ్మద్ అలీ జిన్నాతో టాటా సంస్థకు ఒక అనుబంధం కూడ వుంది. 


పాకిస్తాన్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గోవడానికి జిన్నా టాటా ఎయిర్ వేస్ విమానంలోనే కరాచీ వెళ్ళాడు. ఆ విమానంలో జేఆర్ డి టాటా కూడ వున్నాడు. జిన్నా రెండవ భార్య రుటి     జేఆర్ డి టాటాకు స్వయానా మేనత్త. ఆ రోజు విమానాన్ని జేఆర్ డి టాటా స్వయంగా నడిపారని కూడా అంటారు. 

మతపరమైన భావోద్వేగాలతో అధికారాన్ని నిలబెట్టుకోవచ్చని దేశాధినేతలు  భావించడం వల్లనే పాకిస్తాన్ పతనం అయ్యింది. 

పాకిస్తాన్ దుఖ్ఖ దాయిని కశ్మీర్ అనుకుంటాను. అది  ఎన్నికల అంశం అయి కూర్చున్నది. ఆదాయం రాదు;  నిర్వహణకు సైన్యాన్ని పోషిస్తుండాలి.  సైనికాధికారులు దేశాధినేతల్ని శాసిస్తుంటారు. లేదా వల్లే దేశాధినేతలు అయిపోతుంటారు. పాకిస్తాన్ ను ఎక్కువకాలం సైనికాధికారులే పాలించారు. 

యూరప్ దేశాల సంగతి వేరు. అవి  ప్రాధమికంగా  భాషాజాతులు  ( linguistic nations ). అయినప్పటికీ  ప్రతిదేశంలోనూ  అల్పసంఖ్యాకుల భాషలుంటాయి.  'ఒక భాష ఒకదేశం' అని నినదించిన నెపోలియన్ కే స్వదేశమైన   ఫ్రాన్స్  లో  ఫ్రెంచ్ ను ఏకైక భాష చేయడం కుదరలేదు. అక్కడా  కొన్ని సమూహాలు బ్రెట్టన్, ఓసితం వంటి భాషలు మాట్లాడుతారు. యునైటెడ్ కింగ్ డమ్ లోను స్కాటిష్ వెల్ష్, ఐరిష్ భాషలు మాట్లాడుతారు.  "ఒకే జాతి ఒకే భాష' అంటే మెజారిటీ సమూహాల మద్దతు ఉంటుందని నియంతలు నమ్ముతారు. 


   అనేక భాషలు మాట్లాడే దేశంలో  ఒక భాషను అధికార భాషగా ప్రకటించడం వివాదాలకు దారి తీస్తుంది.  మిగిలిన భాషల మనోభాలు దెబ్బతింటాయి. అప్పుడు దేశసమగ్రత కూడా ఇబ్బందుల్లో పడుతుంది. భారతదేశం వంటి బహుళ భాషా సంస్కృతులున్న దేశాల్లోని రాష్ట్రాల్లోనూ ఈ సమస్యలుంటాయి.  తెలుగు - తెలంగాణ భాషా ప్రాతిపదిక మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడాన్ని మనం పదేళ్లక్రితం చూశాం. 


పాకిస్తాన్ లో ఉర్దూను కేంద్రంగా  చేసుకుని దేశ సమగ్రతను సాధించాలని జిన్నా భావించినప్పుడు పెద్ద దుమారం రేగింది. అది చివరకు పశ్చిమ పాకిస్తాన్ నుండి తూర్పు పాకిస్తాన్ విడిపోయి  1971   లో  బంగ్లాదేశ్ ఏర్పడానికి దారి తీసింది. 



సరికొత్త స్టాక్ పై

ప్రతీ రోజూ  

తగ్గింపు ధరలు!



వ్యక్తిగతంగా జగన్ మంచివారు చంద్రబాబు చెడ్డవారు అనే అభిప్రాయం నాకు ఎన్నడూ లేదు. వాళ్ళు  రాజకీయాల్లో బద్ధ శత్రువులు. ఒకరి మీద మరొకరు కక్ష తీర్చుకుంటా

రు.    

Sunday 18 February 2024

Debate on Animal Farm

 Debate on Animal Farm 

Karlapalem Bhaskara Rao

మీ వ్యాసం బాగుందని ఎలా చెప్పగలను? ఫాసిజాన్ని కమ్యూనిజంతో ఈక్వేట్ చేస్తున్నందుకు బాగున్నదని చెప్పాలా? ఆస్తిత్వ ఉద్యమాల సుడిగుండంలో పడి కమ్యూనిస్టులకు కుల ఆధిపత్యం కట్టబెడుతున్నందుకు బాగుందని చెప్పాలా? కమ్యూనిస్టు రష్యాది సోషల్ సామ్రాజ్యవాదమని తెగడి ఇంపరియలిస్టులకు ఆనందం కలిగించటం బాగుందని చెప్పాలా? వెరసి వ్యాసం మొత్తం సమాకాలీన సాహిత్య అవసరాలకు తగ్గట్టు లేదని, రాజకీయాలలో లాగానే, సాహిత్య సృష్టిలో కూడా ఫాసిస్ట్, మరీ ముఖ్యంగా హిందూ ఫాసిస్ట్ ధోరణులను వ్యతిరేకించే భిన్న శక్తుల కూటమి అవసరం అన్న విషయం మీ వ్యాసం ప్రతిబింబించటం లేదు అని చెపితే సరిపోతుందేమో?

కర్లపాలెం భాస్కరరావుగారికి,

 ఇంత వివరంగా స్పందించినందుకు ధన్యవాదాలు. 

మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను. కానీ ,ఆమోదించడంలేదు. 

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో  రెండు వందలకు పైగా  సామాజికవర్గాలు ఉంటాయి. వీటిలో రెండు లేదా మూడు సామాజికవర్గాలకు చెందినవారే కమ్యూనిస్టు ప్రభావం బలంగా ఉన్నకాలంలో  కమ్యూనిస్టు  పార్టీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు  ఎందుకు అయ్యారు? అనే ఒక సామాజిక  ప్రశ్నకు మీ దగ్గర సామాజికార్ధిక  వివరణ ఏమైనా వుందా?  ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్న  సామాజికవర్గాలే  కమ్యూనిస్టు పార్టీలకు కూడ నాయకత్వం వహించడంలో ఉన్న హేతువేమిటి? 

ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా కమ్యూనిస్టు సమాజం ఏర్పడే అవకాశమేలేదు. కనీసం   సోషలిస్టు సమాజం అయినా ఏర్పడిందా? అంటే అదీ జరగలేదు. అది ప్రజల లోపమా? నాయకుల లోపమా? ప్రజలు ఒకప్పుడు కమ్యూనిస్టు నాయకుల్ని అపారంగా ప్రేమించారు? వాళ్ళను గట్టిగా   నమ్మేరు. పార్టీ కోసం ప్రాణత్యాగం చేయమంటే చేశారు.  నాయకులేం చేశారు?   

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మూడువేల  మంది  చనిపోయారని అంచనా. అమరవీరుల సామాజికవర్గ విశ్లేషణ ఎవరయినా చేశారా?  అలాగే శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో చనిపోయినవారి  సామాజికవర్గ విశ్లేషణ  చేశారా? అలాగే కరీంనగర్- ఆదిలాబాద్  రైతాంగ సాయుధ పోరాటంలో చనిపోయినవారి  సామాజికవర్గ విశ్లేషణ  చేశారా? నాయకులకు అమరులకు మధ్య సామాజికవర్గ  వైరుధ్యం ఉందని గమనించారా? ఈ తప్పులు కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం నిరంతరం చేస్తున్నపుడు ప్రజలకు తమ సామాజిక ఉనికి గుర్తుకు రావడంలో తప్పేమిటి?  వచ్చి తీరాల్సిందే.  మార్క్సిజం ప్రకారం  సామాజిక అస్తిత్వమే మనుషుల ఛైతన్యన్ని నిర్ణయిస్తుంది. దాన్ని తప్పుపట్టడానికి కమ్యూనిస్టు పార్టీల నాయకులెవరూ? 

ఫాసిజం మత వ్యవస్థలో పీడక వర్గం పక్షాన నిలిచి పీడిత వర్గాల్ని  మరింతగా అణిచివేస్తుందనే సూత్రీకరణతో మీకు ఏకాభిప్రాయం వుందా? వర్తమాన భారతదేశ మత వ్యవస్థలో పీడకులు ఎవరో ? పీడితులు ఎవరో? నిర్ధారించి ఒక విధాన పత్రాన్ని విడుదల చేసే పని కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడయినా చేశాయా? 

ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించిన రెండు సామాజికవర్గాలే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన పార్టీలుగా చీలిపోయి హోరాహోరీ పోరాటం చేస్తున్నాయి. మీరెటువైపు? ఒకనాడు సగర్వంగా కమ్యూనిస్టులమని చెప్పుకునే సమూహం ఇప్పుడు చంద్రబాబు ప్రత్యక్షంగా ఫాసిస్టు పార్టీతో పొత్తుపెట్టుకోవాలని వత్తిడి చేస్తున్నది.   మీరేమో "ఆస్తిత్వ ఉద్యమాల సుడిగుండంలో పడి కమ్యూనిస్టులకు కుల ఆధిపత్యం కట్టబెడుతున్నారు" అని 1990   ల నాటి  ఆవేదనను ఇప్పటికీ మరచిపోలేని స్థితిలో వున్నారు.  కమ్యూనిస్టు పార్టీల నాయకత్వపు వైఫల్యమే నేటి ఈ దుస్థితికి కారణం అని మీకు తెలీదా? పుచ్చలపల్లి సుందరయ్యగారి 'రాజీనామా' పత్రాన్ని చదవలేదా? సిపిఐ కాంగ్రెస్ ను అతిగా ప్రేమిస్తే, సిపియం జనసంఘ్ (ఆరెస్సెస్) తో అంటకాగింది నిజం కాదా?  

ఈ పరిణామాల్ని జార్జ్ ఆర్వెల్ చాలా ముందుగా ఊహించాడు. వీటికి సహజ పరిణామంగా వచ్చే ఫాసిస్టు పాలనను '1984 '   నవలలో  చాలా గొప్పగా రాశాడు. అందుకే ఆర్వెల్ నాకు ఇష్టం. ఆర్వెల్ ను విమర్శించడానికి వెచ్చించిన సమయాన్ని అతను హెచ్చరించిన అంశాల మీద  వెచ్చించి ఉంటే  కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ఇంతటి దయనీయ స్థితిలో ఉండేవి కావు. 

చివరగా ఒకమాట చెప్పాలి. కమ్యూనిస్టు ఆలోచనాపరులు అనుక్షణం ప్రజల్ని, పాఠకుల్ని హెచ్చరిస్తూ వచ్చారు. కమ్యూనిస్టు పార్టీల నాయకులే ప్రతి మలుపులోనూ ప్రజల్ని బలిపెడుతూ వచ్చారు.  కమ్యూనిస్టు ఆలోచనాపరుల్ని వెలివేస్తూ వచ్చారు. 

నేను పౌరునిగా  భారతీయుడిని, సామాజికవర్గంగా ముస్లింని, తాత్వికంగా మార్క్సిస్టుని. నేను మాట్లాడే ప్రతిమాటలో చేసే ప్రతి పనిలో ఈ మూడు అంశాలు ఉంటాయి.   

George Orwell - Animal Farm (1945)

 జార్జ్ ఆర్వెల్ నవలిక - యానిమల్ ఫార్మ్స్ (1945)

     నియంతృత్త్వానికి, ఫాసిజానికి  వ్యతిరేకంగా '1984' వంటి మహత్తర  నవలను  ప్రపంచానికి అందించినప్పటికీ కమ్యూనిస్టులకు జార్జ్ ఆర్వెల్ అంటే పడదు. అందుకు  కారణం   అతను రాసిన నవలిక 'యానిమల్ ఫార్మ్ ' నవలిక. ఆ పుస్తకం విడుదల అయ్యాక ఆర్వెల్ ను  సోవియట్  రష్యా వ్యతిరేకిగానేగాక ఏకంగా కమ్యూనిజానికి వ్యతిరేకిగా భావించి విరుచుకు పడ్డారు.   నిజానికి జార్జ్  ఆర్వెల్   సోషల్  డెమొక్రాట్. అతను సామ్యవాదాన్ని ఇష్టపడతాడు; ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తాడు. మొరటు  కమ్యూనిస్టులకు సోషలిజమూ తెలీదు; ప్రజాస్వామ్యమూ తెలీదు.  వాళ్లకు ఆర్వెల్ సోషల్  డెమోక్రసీ నచ్చలేదు. అలా కమ్యూనిస్టుల అపార్ధానికి గురయిన రచయితల్లో జార్జ్ ఆర్వెల్  ఒకడు. 

రెండవ ప్రపంచ యుద్ధ విజేతగా జెవి స్టాలిన్ అనేక దేశాల్లో జేజేలు అందుకుంటున్న కాలంలో,  ఆర్వెల్ 1945  లో   'యానిమల్ ఫార్మ్' ను ప్రచురించాడు. "జంతువులన్నీ సమానం; కొన్ని జంతువులు మరింత సమానం" అనే మాట పెద్ద వివాదంగా మారింది.   

1917  నాటి అక్టోబరు విప్లవంలో  లెనిన్ తరువాత అంతటి నాయకుడు లియోన్ ట్రాట్స్కి.  పెట్రోగ్రాడ్ (సెయింట్ పీటర్స్ బర్గ్) యుద్ధ విజయంలో అతనిదే పెద్ద పాత్ర. క్రెస్తవుడయిన జార్  చక్రవర్తిని వింటర్ ప్యాలెస్ లో నేరుగా  ఎదుర్కోవడానికి  యూదుడయిన ట్రాట్క్సిని ఎంపిక చేశాడు లెనిన్.  ఆయనకు మతఘర్షణను వర్గ ఘర్షణగా మార్చడం తెలుసు. 

ఆ  తరువాత స్టాలిన్ హయాంలోనూ  రష్యన్ ప్రభుత్వంలో  ట్రాట్క్సీ నెంబర్  టు గా కొనసాగాడు. అది స్టాలిన్ కు ఇష్టంలేదు.  ప్రక్షాళన (purging ) కార్యక్రమంలో భాగంగా ట్రాట్క్సీ మీద దేశ బహిష్కరణ విధించారు. మెక్సికో వెళ్లి తలదాచుకున్నా అతన్ని   వదలలేదు. వెంటాడి చంపేశారు.  ఈ పరిణామాలు జార్జ్ ఆర్వెల్  మనసును  గాయపరిచాయి. సోషలిజం ముసుగులో   స్టాలిన్ నియంతృత్త్వాన్ని సాగిస్తున్నాడని అతనో నిర్ధారణకు వచ్చాడు. అలా పుట్టింది 'యానిమల్ ఫార్మ్'. 

ఈ పుస్తకాన్ని ఆర్వెల్  1943  నవంబరులో మొదలెట్టి  1944 ఫిబ్రవరిలో పూర్తి చేశాడు. నాజీ జర్మనీ నాయకత్వంలోని అక్షరాజ్యాల కూటమికి  వ్యతిరేకంగా ఏర్పడిన  మిత్రరాజ్యాల కూటమికి  రష్యా నాయకత్వం వహిస్తున్న రోజులవి. బ్రిటన్ లో లేబర్ పార్టీ పరపతి పెరుగుతున్న రోజులవి.  బ్రిటీష్ మేధావి వర్గం స్టాలిన్‌ను ఎంతగానో  గౌరవిస్తున్న రోజులవి. ఇలాంటి చారిత్రక సందర్భంలో ఏటికి  ఎదురీదాలని నిర్ణయించుకున్నాడు ఆర్వెల్. యానిమల్ ఫార్మ్స్ ను ప్రచురించడానికి బ్రిటీష్ పబ్లిషర్లు  నిరాకరించారు. అలాంటి ఆలోచనలు మానుకోమని సలహాలు ఇచ్చారు.  అయినా ఆర్వెల్  తన పట్టుదలను వదలలేదు.   

నిన్న జరిగింది ఈరోజు రాయడం సులువు. ఈరోజు జరిగింది ఈరోజు రాయడం కష్టం. రేపు జరగబోయేది ఈరోజు రాయడం ఒక సవాలు. అలాంటి సవాలుకు సిద్ధమయ్యాడు ఆర్వెల్. రెండవ ప్రపంచ యుద్ధం ముసుగుస్తున్న కాలంలో  'యానిమల్ ఫార్మ్'  ప్రచురించాడు. అతని జోస్యం నిజమైయింది. ఆర్వెల్  ఊహించినట్టే రష్యా సోషల్ సామ్రాజ్యవాదిగా మారింది. 1991 లో పూర్తిగా విచ్చిన్నం ఆయిపోయింది. \

రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక, ప్రచ్చన్నయుద్ధ కాలంలో యానిమల్ ఫార్మ్ బెస్ట్ సెల్లర్  గా మారింది. అనేకానేక అవార్డులు గెలుచుకుంది.   

 హాస్యం నవ్విస్తే సరిపోతుంది; వ్యంగ్యం  నవ్వించాలి వీలు చూసి కత్తితో పొడవాలి. 'యానిమల్ ఫార్మ్' శైలిపరంగా ఒక  వ్యంగ్య రచన. పైగా  ఇదొక కాల్పనిక గాధ. పాత్రలన్నీ జంతువులు పక్షులేగానీ వాటన్నింటికి మనుషుల భావోద్వేగాలు ఉంటాయి. మనిషి భాషలో మాట్లాడుకుంటాయి (anthropomorphic  animals).  

\1954 లో  హాలీవుడ్ లో యానిమల్ ఫార్మ్ ను కొంచెం తేలిక చేసి  2 -డి కార్టూన్ సినిమాగా తీశారు.  ఆ సినిమా అంతగా  ఆడలేదు. దానికి కారణం ఏమంటే పెద్దవాళ్లకు అది పిల్లల సినిమాగా అనిపించింది; పిల్లలకు అది పెద్దల సినిమాగా అనిపించింది. ఆ తరువాత కూడా 'యానిమల్స్ ఫార్మ్'   అనేకమార్లు  సినిమాలుగా వచ్చింది. విజువల్   క్యాప్చరింగ్ నటనలో ప్రపంచ మొనగాడుగా ఉన్న ఆండీ  సెర్కిస్  ( Andy Serkis)  ఇప్పుడు మళ్ళీ యానిమల్ ఫార్మ్స్ ను సినిమాగా నిర్మిస్తున్నాడు.  

క్లుప్తంగా కథ. 

1   ఇంగ్లాండ్ లోని వెల్లింగ్టన్  నగర శివార్లలో జోన్స్ అనేవాడు ఒక జంతువులశాలను నిర్వహిస్తుంటాడు. అక్కడ అనేక జంతువులు పక్షులు ఉంటాయి. దాని పేరు 'మ్యానోర్ ఫార్మ్'.  

2. జోన్స్ పిసినారి, స్వార్ధపరుడు, జంతువులను హింసిస్తుంటాడు. వాటికీ కావాల్సినంత దాణా కూడ పెట్టడు. వాటి గుడ్లను, పాలను, చివరకు మాంసాన్ని కూడా  అమ్ముకుని  విలాసాలు  అనుభవిస్తుంటాడు.

3   'ఓల్డ్  మేజర్'  అనే వృద్ధ పంది మ్యానోర్ ఫార్మ్ లోని జంతువులకు పెద్ద. 'మరో ప్రపంచం' పిలుస్తున్నట్టు ఓరోజు 'ఓల్డ్  మేజర్' కు కల వస్తుంది. ఆ కలను మిగిలిన జంతువులకు వివరించడానికి ఒక రహస్య సమావేశం పెడుతుంది. మరోప్రపంచాన్ని నిర్మించడానికి జంతువులన్నీ విప్లవించాలని చెపుతుంది.  ఆ వెంటనే చనిపోతుంది. 

4  'ఓల్డ్  మేజర్'  చనిపోయాక జయింతువులన్ని తిరగబడి జోన్స్ ను తరిమి కొట్టి 'మ్యానోర్ ఫార్మ్'ను స్వాధీనం చేసుకుంటాయి. ఈ తిరుగుబాటుకు స్నోబాల్, నెపోలియన్ అనే రెండు పందులు నాయకత్వం వహిస్తాయి.  

5   'మ్యానోర్ ఫార్మ్' పేరును  'యానిమల్ ఫార్మ్' గా మారుస్తాయి. ఏడు అంశాలతో కొత్త రాజ్యాంగాన్ని రాసుకుంటాయి. 

రెండు కాళ్ల మీద నడిచే జీవులు మన శత్రువులు. 

నాలుగు కాళ్లపై నడిచేవి, రెక్కలు ఉన్నవి మన స్నేహితులు. 

జంతువులు బట్టలు ధరించకూడదు.

జంతువులు  మంచం మీద పడుకోకూడదు.

జంతువులు  మద్యం తాగకూడదు.

జంతువులు  ఇతర జంతువులను చంపకూడదు.

జంతువులన్నీ సమానమే 

అనేవి ఇందులోని ఆదేశాలు. 

6   'యానిమల్ ఫార్మ్'  మొదలయిన రోజు నుండే స్నోబాల్, నెపోలియన్ ల మధ్య అధికార పోటీ మొదలవుతుంది. స్నోబాల్ తెలివైనది నెపోలియన్ కపటి. 

7     'యానిమల్ ఫార్మ్' లో విద్యుత్ కొరతను అధిగమించడానికి విండ్ మిల్ నిర్మించాలని స్నోబాల్ ప్రతిపాదిస్తుంది. కపటంతో స్నోబాల్ ను జంతు వ్యతిరేకిగా చిత్రిస్తుంది నెపోలియన్. స్నోబాల్  మీద  తన పెంపుడు కుక్కలను ఉసి గొలుపుతుంది. ప్రాణాలు దక్కించుకుని స్నోబాల్ తప్పించుకుంటుంది. 

8   'యానిమల్ ఫార్మ్' లో పాతపద్ధతులన్నీ వచ్చేస్తాయి.  జంతువులన్నీ సమానమే  అనేదాన్ని జంతువులన్నీ సమానమే గానీ కొన్ని జంతువులు మరింత సమానం అని రాజ్యాంగ సవరణ చేస్తారు.  

9.   నెపోలియన్ రెండుకాళ్ళజీవులతో సామరస్యంగా ఉండడం మొదలెడతాడు (రివిజనిజం అన్నమాట ) రెండుకాళ్ళజీవులు కూడ మంచివే అనే వాదనను ముందుకు తెస్తాడు. 

10.    జోన్స్ ను మించిన నియంతగా మారిన నెపోలియన్ తన అనుయాయులు, పెంపుడు కుక్కలతో విలాసాలను ఆస్వాదిస్తుంటుంది. తిరగబడినవారిని చంపించేస్తుంటుంది . స్నోబాల్ పథకమైన విండ్ మిల్ ప్రాజెక్టును తనదిగా చెప్పుకుని దాని పూర్తి  చేయమని  ఆదేశిస్తుంది. 

11.    ఇన్ని ఘోరాలు జరుగుతున్నా మరోప్రపంచం సాకారం అవుతుందని  బాక్సర్ అనే ఓ గుర్రం, బెంజమిన్ అనే గాడిద గట్టిగా నమ్ముతుంటాయి. అవి  పగలు రాత్రి విండ్ మిల్   దగ్గర పనిచేస్తుంటాయి.  

12.     ఒకరోజు  విండ్ మిల్  దగ్గర ప్రమాదం జరిగి  బాక్సర్ తీవ్రంగా గాయపడుతుంది . పని చేయలేని బాక్సర్ ను నెపోలియన్ కబేళాకు పంపించేస్తాడు. ఆ దారుణాన్ని చూసి జంతువుల్లో తిరుగుబాటు వస్తుంది. 

13. యానిమల్ ఫారంలో ఓల్డ్ మేజర్ ఫోటోను కూడా తొలగించేస్తాడు నెపోలియన్.  యానిమల్ ఫారంలో  తొలగించేస్తాడు నెపోలియన్  ఫారంలో తన పందుల సంతతిని పెంచుకుంటాడు. 

14. ఎల్లప్పుడూ తమను పందులు మాత్రమే ఎందుకు నాయకత్వం వహిస్తున్నాయని మిగిలిన జంతువులకు సమంజసమైన  పెద్ద అనుమానం వస్తుంది. ఈ సీన్స్ లో  భారతదేశ  కమ్యూనిస్టు పార్టీల్లో కొనసాగుతున్న కుల ఆధిపత్యం గుర్తుకు వస్తుంది. 

15.   ఓ రాత్రి జంతువుల ఉత్పత్తుల అమ్మకానికి  మానవ   వ్యాపారులతో నెపోలియన్ బేరసారాలు కుదుర్చుకుని విందులు చేసుకుంటుంది. 

16.   బయట కిటికీల నుండి ఈ విందు కోలాహలాన్ని చూస్తున్న  జంతువులకు పందులే మనుషులుగా మనుషులే పందులుగా కనిపిస్తుంటాయి. తాము మోసపోయామని వాటికీ అర్ధం  అవుతుంది.

17,   పశువులశాల మళ్లీ మనుషుల చేతుల్లోనికి పోవడానికేనా  తాము కష్టపడింది పోరాడింది  ప్రాణ త్యాగాలు చేసింది అని అవి బాధపడి కుమిలిపోతాయి.

18. తరువాత ఏం జరిగి ఉంటుందో  ఊహించుకోవచ్చు 

- ఉష యస్ డానీ

జార్జ్ ఆర్వెల్ నవలిక - యానిమల్ ఫార్మ్స్ ను  ఈ కింది లింకులో ఉచితంగా  చదవవచ్చు. 

https://docs.google.com/file/d/0B-qbgH1SfSUdUWNxNFBWeHNCR3M/view?resourcekey=0-y0UaERHtE7aLaKt_cwsElg