Sunday, 6 September 2026

On Ganapati

Ganapati

సుదీర్ఘకాలం వున్నారు సరే; ఏంచేశారూ?

డానీ

సమాజ విశ్లేషకులు




 

నక్సలైట్ ఉద్యమంలో గణపతి పేరుతో ప్రసిద్ధులైన ముప్పాళ లక్ష్మణరావు అజ్ఞాత జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి వస్తారనే చర్చ మళ్ళీ మొదలైంది. అయితే, గణపతి బహిరంగ జీవితంలోకి తిరిగి వస్తారా లేదా అన్నదానికంటే  ఆయన మీద కొన్ని పెద్ద ప్రశ్నలు వున్నాయి.

 

గణపతి 1990ల ప్రారంభంలో పీపుల్స్ వార్ నాయకత్వంలోకి వచ్చారు. 2004లో ఆ పార్టి, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ విలీనం అయ్యి సిపిఐ (మావోయిస్టు) ఏర్పడినప్పుడు దాని ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆరేడేళ్ల క్రితం వృధ్ధాప్యం, అనారోగ్యం తదితర కారణాలతో ఆ బాధ్యత నుంచి తప్పుకున్నారు.

 

ఇంత సుదీర్ఘకాలం అజ్ఞాత జీవితాన్ని గడపడం సామాన్య విషయం కాదు. కుటుంబం, వ్యక్తిగత స్వేచ్ఛ, సాధారణ జీవితం అన్నింటినీ వదిలి దశాబ్దాల పాటు ఉద్యమంలో అజ్ఞాత జీవితాన్ని గడపడం నిస్సందేహంగా ఒక  నిబద్ధత. ఎవరయినా సరే  ఆ త్యాగాన్ని గుర్తించాలి.

 

కానీ నిబద్ధత ఒక్కటే నాయకత్వానికి కొలమానమా? గతితార్కిక భౌతికవాదం పరిమాణాన్ని మాత్రమే చూడదు; గుణాత్మక మార్పును కూడా చూస్తుంది. ఒక నాయకుడు ఎన్ని సంవత్సరాలు పదవిలో ఉన్నారన్నది పరిమాణం. ఆ కాలంలో తను నమ్మిన సిధ్ధాంతానికీ, చేపట్టిన ఉద్యమానికి, సమాజానికి ఏం జోడించారన్నదే గుణాత్మక ప్రశ్నలు.

 

కొండపల్లి సీతారామయ్యను తప్పించి గణపతి పీపుల్స్ వార్ నాయకత్వంలోకి వచ్చిన 1990లు ప్రపంచ చరిత్రలో ఒక మహామలుపు. తూర్పు యూరప్‌లో సోషలిస్టు ప్రభుత్వాలు కూలిపోయాయి. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ తన ఆధిపత్యాన్ని విస్తరించింది. అదే సమయంలో భారతదేశంలో 1991 ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. మార్కెట్, ప్రైవేట్ పెట్టుబడి, ప్రపంచ వాణిజ్యం భారత ఆర్థిక వ్యవస్థను మార్చడం ప్రారంభించాయి. ఉరుగ్వే రౌండ్  తరువాత 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడింది; భారత్ దాని వ్యవస్థాపక దేశాలలో ఒకటిగా మారింది.

 

ఇదే కాలంలో భారత రాజకీయార్ధిక సాంస్కృతిక రంగాల్లో మరో గుణాత్మక మార్పు వచ్చింది. అప్పటి వరకు లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్ గా కొనసాగిన భారత రాజకీయాలు రైట్ ఆఫ్ ద సెంటర్ గా మారాయి. 1990 అద్వానీ రథయాత్ర, 1992 బాబ్రీ మసీదు కూల్చివేత దేశ రాజకీయాల దిశను మార్చాయి. సమాజంలో మతపరమైన రాజకీయ సమీకరణ మొదలయింది.  ఒకవైపు వర్గ రాజకీయాలను మార్కెట్ సవాలు చేసింది. మరోవైపు, మతతత్త్వ  రాజకీయాలు ఊపందుకున్నాయి.

 

ఈ పరిణామాల్ని భారత కమ్యూనిస్టు ఉద్యమం, అందులో తాను మొనగాడు అని ప్రకటించుకున్న మావోయిస్టు పార్టి ఎంతవరకు అర్థం చేసుకుంది?  ఇదే అసలు ప్రశ్న.

 

సంతానోత్పత్తి కోసం స్త్రీ పురుషుల మధ్య ఏర్పడిన విభజనే చరిత్రలో మొట్టమొదటి శ్రమ విభజన అనే సూత్రీకరణను 1840లలో కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగిల్స్ జంటగా చేశారు. మార్క్స్‌ మరణానంతరం ఏంగిల్స్ రాసిన ‘కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యాల పుట్టుక’ గ్రంధంలో  "ఒక భర్త ఒక భార్య అనే  ఆధునిక బూర్జువా కుటుంబంలో, భర్త బూర్జువా వర్గానికి ప్రతినిధి; భార్య శ్రామిక వర్గానికి ప్రతినిధి" అంటూ పాత సూత్రానికి కొత్త జవసత్వాలిచ్చాడు. అంతే కాదు వాళ్ళ మధ్య ‘వర్గవైరం’ వుంటుందన్నాడు. 

 

కార్పొరేట్ మతతత్త్వ నిరంకుశ వ్యవస్థలో యజమానివర్గం ఎవరూ? శ్రామికవర్గం ఏవరూ? వర్గ వైరం (class antagonism) ఏ సమూహాల మధ్య  ఏర్పడిందీ? తాము ఎవరి పక్షం వహించాలీ? అనే ప్రాణప్రదమైన చారిత్రక సైధ్ధాంతిక సవాళ్ళను దేశంలోని ఏ కమ్యూనిస్టు పార్టి కూడ ఎదుర్కొనే ప్రయత్నం చేయలేదు. దానికి గణపతి కూడ మినహాయింపుకాదు. అంటే తన కాలంలో తలెత్తిన తాత్విక సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నం ఆయన చేయలేదు. అలాంటివారి   నాయకత్వంలో కొనసాగే పార్టిలు సహజంగానే అంతరించిపోయే జాతుల్లో కలిసిపోతాయి.

 

“మాకు కులం లేదు, మతం లేదు” అని చెప్పుకోవడం సులభం. కానీ సమాజంలో కులం, మతం ఎలా పనిచేస్తున్నాయో వర్గ విశ్లేషణ చేయడం  అంత సులభం కాదు. తమకు అర్థంకాని సమాజాన్ని ఎవరూ మార్చలేరు. సమాజంలో వేగంగా విస్తరిస్తున్న మతతత్త్వ పరిణామాల్ని ముందుగా పసిగట్టడంలోనూ, దానిని ఎదుర్కోవడానికి ఒక సైధ్ధాంతిక పునాదిని నిర్మించడంలోనూ  పీపుల్స్ వార్/ మావోయిస్టు పార్టి నాయకత్వం విఫలమైంది. మరోవైపు, మతోన్మాద శక్తులకు కార్పొరేట్ల మద్దతు కూడ లభించడంతో కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ (CCD) దేశంలో బలపడింది.

 

ఈ సందర్భంగా ఒక అనుబంధ ప్రశ్న కూడ ముఖ్యమైనది. మూడు దశాబ్దాల నాయకత్వంలో మార్క్సిస్టు సిద్ధాంతానికి గణపతి చేసిన కొత్త చేర్పు ఏమిటి?

 

మార్క్స్ పెట్టుబడీదారీ వ్యవస్థను విశ్లేషిస్తే, లెనిన్ సామ్రాజ్యవాదంగా మారిన పెట్టుబడీదారీ వ్యవస్థను విశ్లేషించాడు.   అలాగే, వ్యవసాయ ప్రధాన దేశాన్ని సోషలిస్టు దేశంగా మార్చే ప్రయత్నం మావో చేశాడు. అలా భారత సమాజంలో వచ్చిన మార్పుల్ని గణపతి ఏమేరకు అర్థం చేసుకున్నారో చూడాలి.

 

గణపతి పేరుతో గుర్తుండిపోయే ఒక కొత్త సైద్ధాంతిక ప్రతిపాదన ఏమిటి? ముందు ఆటోమేషన్, ఆ వెనక కుత్రిమ మేధ వచ్చాయి. పునాది – ఉపరితలం, ఉత్పత్తి శక్తులు – ఉత్పత్తి సంబంధాలు అనే మార్క్సిస్టు మెధడాలజీనీ కొత్త ఉత్పత్తి విధానానికి ఆయన అన్వయించిన దాఖలాలు మనకు కనిపించవు.  ఇప్పటికీ అర్ధ వలస-అర్ధ భూస్వామ్య సమాజం అంటుండడాన్ని మించిన అభాస మరొకటి వుండదు. ఇలాంటి తత్త్వదారిద్యం ఓటమిని పొందక తప్పదు.

 

గణపతి అనుసరించిన సైనిక వ్యూహాల్లోనూ ఇవే సందేహాలు.  మావో చరిత్రలో ప్రసిద్ధి చెందిన లాంగ్ మార్చ్ / జైత్రయాత్ర నిజానికి యుధ్ధరంగం నుండి వెనుకడుగు (రిట్రీట్). వెనక్కి తగ్గుతూనే దాన్ని ప్రజా మద్దతును పెంచుకునే రాజకీయ వ్యూహంగా మలచగలిగాడు మావో. అందుకు భిన్నంగా గణపతి పార్టి శ్రేణుల్ని పౌరసమాజానికి దూరం చేసి, తనకున్న సాయుధ దళాల్ని ఛత్తీస్ గడ్ అంబుజ్ మడ్ లో మోహరించి పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్నీ వ్యతిరేకిస్తూ సాయుధపోరాటమే ఏకైకమార్గం అన్న మావోయిస్టు పార్టి మొదటి రంగాన్ని వదిలేసింది; రెండో రంగంలో విషాదకరంగా ఓడిపోయింది.

 

గణపతి నిబద్ధతను ప్రశంసించవచ్చు. ఆయన త్యాగాన్ని గుర్తించవచ్చు. ఒక సాయుధ ఉద్యమాన్ని దశాబ్దాల పాటు నడిపిన ఆయన సంస్థాగత సామర్థ్యాన్ని కూడా గుర్తించవచ్చు.అయితే నాణేనికి మరోవైపున కూడ చూడాలి.   

 

కొండపల్లి సీతారామయ్య తప్పులు చేయని రాజకీయ సిధ్ధాంత వేత్త అని చెప్పడం సరికాకపోవచ్చు. ఆయన చేసిన తప్పులు ఆయనకు వున్నాయి. కానీ, దాదాపు బూడిదగా మారిపోయిందనుకున్న నక్సలైట్ ఉద్యమానికి  ఫీనిక్స్ పక్షిలా తిరిగి ప్రాణం పోసి ఏపుగా పెంచిన ఘనత కొండపల్లిదే. కొండపల్లి పెంచిన ద్రాక్షతోటను కాల్చి బూడిదగా మార్చిన రికార్డు ఇప్పుడు గణపతి పేరున నమోదయ్యింది.

 

07 సెప్టెంబరు 2026

 


Friday, 4 September 2026

Notes on Vandemataram Song

 వందే మాతరం గేయం :  వలస వ్యతిరేకత నుండి మత విద్వేషం వరకు 


వందేమాతరం నినాదం వందేమాతరం ఉద్యమం వందేమాతరం గీతం ఒకటికావు. 

మాతృదేశాన్ని  ప్రతి ఒక్కరూ గౌరవించాలి. వందేమాతరం అనాలి. మా తుఝే సలాం అనాలి. తల్లీ నీకు వందనం అనాలి. 

హిందూ దేవతలైన కాళిక దుర్గాలే మాతృ భూమి.   ప్రతిపౌరుడు   ఆ దేవతల్ని పూజించాలంటే  విబేధాలు వస్తాయి. 

భారత ముస్లింల జన్మభూమి కర్మభూమి పుణ్యభూమి కూడ భారత దేశమే.

మక్కా, మదీనా, బైతుల్ ముఖద్దస్ (al aqsa mosque) లను ముస్లింలు పుణ్య క్షేత్రాలుగా భావిస్తారు.  అంతమాత్రాన ఆ మూడు పుణ్యక్షేత్రాలున్న సౌదీ అరేబియా, ఇజ్రాయేల్ దేశాలను, పాలస్తీనాను కూడ  ముస్లింలు పుణ్య భూములు అనుకోవు. ఫాదర్ లాండ్ , మదర్ లాండ్ అనుకోరు. 


బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా 1905లో చెలరేగిన వందేమాతరం ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ముస్లింలు ఎవరూ? 


When and how Rabindranatha Tagore changed his stance on Vandemataram song and became critical of it?


బంకించంద్ర  బ్రిటీష్ ఉద్యోగి. 1857లో హిందూ ముస్లింలు కలిసి భారత  ప్రధమ స్వాతంత్ర్యోద్యమాన్ని సాగించిన 25 ఏళ్ల తరువాత ఆనందమఠ్ నవలను ప్రచురించాడు. 

ఆయన అప్పుడు అధికారంలోవున్న బ్రిటీష వలస పాలనను వ్యతిరేకించలేదు. బ్రిటీష్  పాలన ఆరంభానికి ముందు ముస్లింనవాబుల పాలన కాలంలో  బెంగాల్ లో సాగిన సన్యాసుల తిరుగుబాటును కథాంశంగా తీసుకున్నాడు. ఈ నవలలో హిందూ సన్యాసులు proyogonists;  ముస్లిం పాలకులు antogonists. 

1857 లో భారత హిందూ ముస్లింల మధ్య ఏర్పడిన ఐక్యతను చూసి బ్రిటీష్ పాలకులు భయపడ్డారు. ఆ రెండు మత శిబిరాలను విడదీయాలనుకున్నారు. 

బంకించంద్ర నవల ఆ పనిచేసి పెట్టింది.  

1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా సాగిన వందేమాతరం వుద్యమంలో ఈ విభజన పనిచేసింది. దానితోనే రబీంద్రనాథ్ టాగోర్ ఈ గీతం మీద తన పూర్వ ఆలోచనల్ని మార్చుకున్నాడు. ఆయన ఏకేశ్వరోపాశకుడు కావడం కూడ దీనికి కారణం. . 

బంకించంద్ర వ్యూహానికి ఆధునిక రూపమే 1923లో దామోదర్ వినాయక్ సావర్కర్ ప్రవేశ పెట్టిన  Hindutva సిధ్ధాంతం. 

సెక్స్ లోనే వర్గపోరాటం

*సెక్స్ లోనే వర్గపోరాటం*

అమెరికా ఆంథ్రోపాలజిస్ట్ లూయిస్ హెన్రీ మోర్గాన్ 1877లో ‘పురాతన సమాజం’  అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఆ పుస్తకం మీద కార్ల్ మార్క్స్ తన చివరి రోజుల్లో చాలా ఆసక్తిని చూపించాడు. 1883లో మార్క్స్ చనిపోయిన తరువాత, అతనికి  కొనసాగింపుగా,  1884లో ఫ్రెడరిక్ ఏంగిల్ ‘కుటుంబము, వ్యక్తిగత ఆస్తి, రాజ్యాల పుట్టుక’ అనే పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం మొదట్లోనే, ఒక స్త్రీకి ఒక పురుషుడు అనే వివాహబంధం (Monogamous marriage)  మొదలవడంతోనే సమాజంలో వర్గ పోరాటం మొదలయింది అంటాడు. 


మత వ్యవస్థలో వర్గం వుండదు, వర్గపోరాటం వుండదు అనే కమ్యూనిస్టులు కూడ ఇప్పుడు మన మధ్య వున్నారు. సెక్స్ లోనే వర్గపోరాటం వుంటుందన్న ఏంగిల్స్ ఆత్మ శాంతించుగాక!

30 జూన్ 2026

Tuesday, 1 September 2026

సంపద పెరుగుదల జనాభా తరుగుదల

 

For

Publication in the Edit pages of Sakshi

 

*సంపద పెరుగుదల జనాభా తరుగుదల*

*డానీ*

*సమాజ విశ్లేషకులు*

 

 

ఎల్‌పిజి కాలంలో కుటుంబ బడ్జెట్ ఒక యుద్ధం. పిల్లలు ఒక లగ్జరీ. భవిష్యత్తు ఒక లెక్క. డబుల్ ఇన్‌కమ్ నో కిడ్స్ - డింక్.  సింగిల్ ఇన్‌కమ్ నో కిడ్స్- సింక్. డబుల్ ఇన్‌కమ్ సింగిల్ కిడ్- డిస్క్. ఇవి కొత్త ఫార్ములాలు. ఇది కుటుంబ నియంత్రణ కాదు; సర్వైవల్ బడ్జెట్. జీవికను నిలబెట్టుకునే వనరుల సర్దుబాటు.

 

1991లో ఎల్‌పిజి వచ్చింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్.
గ్లోబలైజేషన్. ఇవి మూడు పదాలుకాదు. మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబాల మనుగడ మీద  వేలాడుతున్న  మూడు కత్తులు. పేదవాళ్ల నెత్తిమీద అనాదిగా కత్తి వేలాడుతూనే వుంటుంది. వృధ్ధ్యాప్య పెన్షన్లు వాళ్ళను చావనివ్వవుగానీ సౌఖ్యంగా వుండనివ్వవు.

 

విద్య ప్రైవేట్ అయింది. ఫీజులు పైకి ఎగిరాయి. కోచింగ్ మాఫియా పుట్టింది. ఒక పిల్లవాడి చదువు అంటే ఒక కుటుంబం అప్పుల్లో మునగడం. ఆరోగ్యం ప్రైవేట్ అయింది. ఒక జబ్బు. అంటే ఒక ఇల్లు అమ్మడం. .ఇల్లు ప్రైవేట్ అయింది.  ఇఎమ్‌ఐ జీవితాంతం వుంటోంది. మరి ఉద్యోగం? గిగ్. కాంట్రాక్ట్. నో సెక్యూరిటీ. నో పెన్షన్.

 

ఇప్పుడు లెక్క వేసుకోండి భార్యాభర్తలిద్దరూ ఇద్దరు సంపాదిస్తూ పిల్లలు లేకుంటే; బయటపడతారు. ఒక్కరే  సంపాదిస్తుంటే పిల్లలు లేకుంటేనే. బయటపడతారు. ఇద్దరు సంపాదిస్తూ ఒక్క పిల్లవాడు.
వుంటే ఏదో సర్దుబాటు చేసుకోవచ్చు.

 

ఇది కుటుంబం కాదఇది కార్పొరేట్ స్ట్రాటజీ. టోటల్ ఫర్టిలిటీ రేట్ (టిఎఫ్ఆర్) 50 యేళ్ల క్రితం 5 వుండేది. అంటే ఒక జంటకు ఐదుగురు సంతానం. ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడ వుండడం లేదు.  కఛ్ఛితంగా చెప్పాలంటే 1.9.

 

దేశంలో చనిపోతున్నవారికన్నా పుట్టేవారు తగ్గిపోతే  రిప్లేస్‌మెంట్ లెవల్  పడిపోతుంది. ఎందుకు ఇలా? పిల్లల్ని కనడం ఖరీదైపోయింది. వాళ్లను పెంచడం ఇంకా ఖరీదయిపోయింది. 1947లో పది రూపాయల ఖర్చుతో ఆసుపత్రుల్లో పిల్ల డెలివరీ చేసేవారు. 1980లలో విజయవాడ సెయింట్ ఆన్స్ (అమెరికన్) వంటి ఆసుపత్రుల్లో మూడు, నాలుగు వందల రూపాయలు వుండేది. 21వ శతాబ్దాంలో దాని రేంజ్ వెయ్యి రేట్లు పెరిగింది. ఇప్పుడు ఒక కార్పొర్ఫేట్ హాస్పిటల్ లో సంతానాన్ని కనడం అంటే లక్షల్లోనే ఖర్చుపెట్టాల్సివస్తున్నది. అంతెందుకూ? అని ఎవరయినా అడగవచ్చు. దానికి దొరికే ఏకైక సమాధానం క్వాలిటి!! అదేమిటో ఎవ్వరికీ అర్ధంకాని బ్రహ్మపదార్ధం అయి కూర్చున్నది.

 

 

తీరా కన్నాక పెంచడం ఖరీదు; చదివించడం ఖరీదు. ఇప్పుడు ఒక మంచి స్కూలులో కొత్తగా చేర్చాలన్నా లక్షల్లో పోయాలి. ఈ మంచికి కూడ ఎవరి అర్ధాలు వారికి వుంటాయి. అనిశ్ఛిత ఉద్యోగాలతో భవిష్యత్తు అనిశ్చితం.

 

మనం ఇప్పుడు జెన్ -జీ నిరసనల్ని చూస్తున్నాం. జెన్ – ఆల్పా కూడ రంగ ప్రవేశం చేసేసింది.  ఏడాదిన్నరగా  జెన్ -బీటా ప్రవేశం  మొదలయ్యింది. ఓ ఇరవై ఏళ్ళ తరువాత వాళ్ళ ఆక్రోశాన్ని సమాజం చూస్తుంది. ఇప్పటికే కొత్తతరాల పుట్టుక రేటు పడిపోయింది. ఇక ముందు ఇంకా తగ్గిపోతుందని ఆందోళన.

 

పుట్టేవాళ్ళు తగ్గడం అంటే వస్తూత్పత్తి చేసేవాళ్ళు తగ్గడం అని అర్ధం. జనాభా కొరత సవాలును ఎదుర్కోవడానికి,  తక్కువ మందితో ఎక్కువ   వస్తూత్పత్తి  చేయడానికి ఏఐ ఇప్పటికే ప్రయత్నిస్తున్నది. అయితే ఇక్కడో చిక్కుముడి వుంది.  జరిగిన ఉత్పత్తిని అమ్ముకుంటేనే పెట్టుబడీదారులకు పెట్టిన పెట్టుబడి, ఆపైన లాభాలూ వస్తాయి.  కొనేవాళ్ళు లేకపోతే, ఉత్పత్తి అయిన సరుకు అమ్ముడు కాకపోతే పెట్టిన పెట్టుబడి కూడ రాకపోతే మార్కెట్ సంక్షోభం వస్తుంది.

 

 

ఎల్‌పిజి ఆశపెట్టింది ఏమిటీ?  గ్రోత్ వస్తుందన్నది. ఉద్యోగాలు వస్తాయన్నది. సంపద పెరుగుతుందన్నది.  కానీ, ఇది అర్ధ సత్యం.
సంపద పెరిగిందిగానీ కానీ, ఉద్యోగాలు పెరగలేదు. జాబ్‌లెస్ గ్రోత్ అన్నమాట. ఇక్కడా ఇంకో మెలిక వుంది.  సంపద పెరిగింది పై పది శాతానికి మాత్రమే. కింది కింది తొంభై శాతం నలిగిపోయింది. అంటే ఎల్పీజి సిధ్ధాంతం పై పది శాతానిదే అని నిర్ధారణ అయ్యింది.

 

పది శాతం వెర్సెస్ తోభయి శాతం ఇది సంపద పంపకాల సమస్య మాత్రమేకాదు. జీవన విధానాల సాంస్కృతిక ఘర్షణ. సంపన్నులు పిల్లల్ని బాజాప్త కంటారు, పెంచుతారు. కార్పోరేట్ హాస్పిటల్ లో పుట్టుక, కార్పోరేట్ స్కూల్లో, విదేశీ యూనివర్సిటీల్లో విద్య. ఆ లెఖ్ఖలు పేదవాళ్ళకేకాక మధ్యతరగతికి కూడ అందుబాటులో వుండవు. వాళ్ళు లెక్కలు వేసుకుంటారు. భయం వేసి పిల్లల్ని కనకూడదు అనుకుంటారు. ఇది ప్రకృతి సహజంగా జరిగేదేమీ కాదు, ఆర్ధిక నియమాలు, మార్కెట్ ప్రవృత్తి నిర్ణయించే అంశాలు. అప్పటికే కన్న పిల్లలకు విద్యా ఇవ్వక, ఉపాధి కల్పించలేకపోతే  వాళ్ళు ఉత్సవాల్లో తీన్మార్ డాన్సులు చేసుకుంటూ వుండిపోతారు. రాజకీయరంగంలో ఇలాంటి సమూహాలకు ఇటీవల మంచి గిరాకీ వుంది.

 

జాతి. మతం. కులం. అన్నీ బడ్జెట్ కిందికి వచ్చేస్తాయి. ఒక వైపు సాంప్రదాయం చెప్తుతుంటుంది పిల్లల్ని కనాలని. మరోవైపు బ్యాంక్ బ్యాలెన్స్ చెప్తుతుంటుంది . పిల్లలు వద్దని. చివరకు బ్యాంక్ బాలెన్స్ గెలుస్తుంది.

సింక్ జంట; ఒక్కటే  జీతం. పిల్లల్ని కనే సాహసం చేయలేరు. భయం. డిస్క్ జంట; రెండు జీతాలు. సాహసించి ఒక్క మగపిల్లనో ఆడపిల్లనో కని ఆగిపోతారు. ఆ ఒక్క సంతానం మీదే అన్ని ఆశలూ పెట్టుకుంటారు. వాళ్లు ఫెయిల్ అయితే  మొత్తం కుటుంబం ఫెయిల్. డింక్ జంట;  రెండు జీతాలు; డిస్క్ జంటను చూసి భయపడతారు. అవకాశం వున్నా అయినా  పిల్లల్ని కనరు. ఇవన్నీ కొత్త ఫార్ములాలు. సంతోషంతో పుట్టినవికావు; భవిష్యత్తు మీద భయంతో పుట్టినవి. ఇవి సర్వైవల్ మ్యాథమెటిక్స్.

 

ఎల్‌పిజి విషం కుటుంబాల్లోకి చొచ్చుకొచ్చింది. పిల్లల్ని కాస్ట్ సెంటర్ చేసింది. ప్రేమకు  లెక్కలు నేర్పింది. ఒకప్పుడు పిల్లలు ఆస్తి.
ఇప్పుడు పిల్లలు లయబిలిటీ. టిఎఫ్ఆర్ పడిపోతోంది. ఉత్తర రాష్ట్రాలకన్నా దక్షణ్సా రాష్ట్రాల్లో మరింత వేగంగా తగ్గిపోతోంది. పిల్లలు లేని తరం. ఇది డెమోగ్రాఫిక్ టైమ్ బాంబ్. కొత్త నియమాలు వచ్చేశాయి. మార్కెట్ దేవుడు.
లాభం ధర్మం. కుటుంబం సెకండరీ. జాయింట్ ఫ్యామిలీ కూలింది.
న్యూక్లియర్. ఇంకా ఒంటరి. ఒక తరం పిల్లలు పుట్టకుండా చేసింది. డింక్. సింక్. డిస్క్. ఇవి కొత్త కులాలు.

 

ఎబ్బెట్టుగానో, అతిశయం గానో వుండవచ్చుగానీ ఇదోరకం  భ్రూణహత్యలు!!.

 

01 సెప్టెంబరు 2026

న్యూయార్క్‌లో వేదాంతం! భారతదేశంలో మౌనం!!

 న్యూయార్క్‌లో వేదాంతం!  భారతదేశంలో మౌనం!!

డానీ

సమాజ విశ్లేషకులు 




ఆరెస్సెస్ సర్సంగ్ ఛాలక్ మోహన్ భగవత్  న్యూయార్క్‌లో మాట్లాడారు. చాలా గొప్పగా మాట్లాడారు. మానవత్వం ఒక్కటన్నాడు. సత్యం ఒక్కటన్నారు. మతాలు వేరైనా, మార్గాలు వేరైనా గమ్యం మాత్రం ఒక్కటే అన్నారు.  వైవిధ్యం ప్రకృతి నియమమన్నారు. ఏకత్వం ప్రకృతి సత్యమన్నారు. వైవిధ్యాన్ని అంగీకరించాలన్నారు. దాన్ని అందరూ గౌరవించాలి, . రక్షించాలి అన్నారు. 


వినడానికి ఎంత గొప్పగా ఉంది! కానీ ఒక చిన్న ప్రశ్న. ఈ మాటలు న్యూయార్క్‌లోనే ఎందుకు అంటున్నారూ? భారతదేశంలో ఎందుకు అనడం లేదూ?


భారతదేశంలో వైవిధ్యాన్ని ఎవరు రక్షించాలి? మతసామరస్యాన్ని ఎవరు కాపాడాలి? దేశంలో ద్వేషం వ్యాపిస్తున్నప్పుడు ఎవరు మాట్లాడాలి? ఒక మత సమూహం భయంతో జీవిస్తున్నప్పుడు “మనందరం ఒక్కటే” అని ఎవరు చెప్పాలి?


మోహన్ భగవత్  మరో గొప్ప మాట చెప్పారు. ధార్మిక వైవిధ్యాన్ని రక్షించాలని పిలుపిచ్చారు. వైవిధ్యం అలంకారమన్నారు. దాన్ని అందరూ  అంగీకరించాలన్నారు. గౌరవించాలన్నారు. రక్షించాలన్నారు. 


ఇక్కడా అదే ప్రశ్న.  అయితే భారత్‌లో పరిస్థితి ఏమిటీ? వైవిధ్యాన్ని ఎవరు కూలదోస్తున్నారూ? ఎవరు రక్షిస్తున్నారూ? 


మసీదులు కూలుతున్నప్పుడు, ముస్లింల వాణిజ్య భవనాలు బుల్‌డోజర్ల కింద నలిగిపోతున్నప్పుడు, అల్పసంఖ్యాక సమూహాలకు చెందిన పేదల ఇళ్లు శిథిలమై పోతున్నపుడు, ఆ సమూహాలను తప్పుడు కేసులతో వేధిస్తున్నప్పుడు, “లవ్ జిహాద్” పేరుతో యువకులను వెంటాడుతున్నప్పుడు, ఆవుల అక్రమ రవాణా పేరుతో ముస్లింలపై కేసులు పెడుతున్నప్పుడు, మూకలు దాడులు చేస్తున్నప్పుడు, నడి రోడ్ల మీద లించింగ్‌లు సాగుతున్నప్పుడు వైవిధ్యాన్ని రక్షించాలి అన్న భగవత్ ఎక్కడున్నారూ?  బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసు నిందితుల్ని  పూల మాలలతో సత్కరిస్తున్నపుడు మోహన్ భాగ్వత్ ఈ హితవులు పలికితే బాగుండేది. పైగా, అలా సన్మానించినవారు భగవత్ అనుచరులే.  ఇదేమి ద్వంద్వ నీతీ?  ‘మాటల్లో సమానత్వం. మైదానంలో మౌనం’!! 


భగవత్ న్యూయార్క్ మేడిసన్ స్క్వేర్ ఉపన్యాసంలో  ఒక గొప్ప ప్రకటన చేశారు. “భారతదేశంలో ముస్లింలు ఉండకూడదని భావించే హిందువులు నిజమైన హిందువులు కాదు” అన్నారు. అది నిస్సందేహంగా గొప్ప మాట.


కానీ, ఒక  గొప్ప మాట చెప్పడం ఒకటి. ఆ మాటను తన అనుచరులు పాటించేలా చేయడం మరోటి. మాట్లాడటం ఒకటి. చర్య తీసుకోవడం మరోటి. వేదాంతం చెప్పడం ఒకటి. చెప్పిన వేదాంతాన్ని సమాజ ఆచరణలో పెట్టడం మరోటి.


మోహన్ భగవత్ తో సమస్య ఇక్కడే. వారు ప్రపంచానికి మతసామరస్యాన్ని బోధిస్తారు. కానీ భారతదేశంలో ద్వేషం వ్యాపించినప్పుడు

అంతే తీవ్రంగా ఖండిస్తారా? అల్పసంఖ్యాక మత సమూహాల మీద హింసాత్మక దాడులు సాగుతున్నప్పుడు తమ సంస్థాను, తన అనుచర గణాన్ని అయినా  నిలదీస్తారా? తన అనుచర సమూహాల్లో విద్వేష ప్రచారం సాగించే వారి మీద చర్యలు తీసుకుంటారా? మౌన ప్రేక్షకుడిలా వుండిపోతారా? 


ఇవే అసలు ప్రశ్నలు. ఎందుకంటే - నిశ్శబ్దం కూడా ఒక రాజకీయ భాషే. ముఖ్యంగా, మీ మాటకు బరువు ఉన్నప్పుడు. మీ సంస్థకు దేశవ్యాప్తంగా విసృత ప్రభావం ఉన్నప్పుడు. మీ భావజాలం అధికార రాజకీయాలను ప్రభావితం చేస్తున్నప్పుడు. మీ మౌనం కేవలం మౌనం కాదు. అది ఒక రాజకీయ వైఖరి.


మోహన్ భగవత్ ది ఒక ప్రత్యేకమైన రాజకీయ శైలి. వారి మాటల్లో ఆవేశం తక్కువ. వేదాంతం ఎక్కువ. సంస్కృతి ఎక్కువ. మానవత్వం ఎక్కువ. “మనమంతా ఒక్కటే” అన్న తత్వం ఎక్కువ. వారి మాటల్ని వింటుంటే ఒక ఆధ్యాత్మిక గురువు మాట్లాడుతున్నట్టుంటుంది. ఓ ప్రవచనకారుడిలా, ఓ వేదాంతిలా కనిపిస్తుంటారు. అది వారి ప్రయత్నం.


కానీ,  దేశ రాజకీయాల దగ్గరకు రాగానే – ప్రశ్నలు, సమాధానాలు అన్నీ మారిపోతాయి. ఆ వేదాంతం ఎక్కడికి పోతోంది? వారి మానవత్వం మాటల్లోనే ఎందుకు మిగిలిపోతోంది? వైవిధ్యరక్షణ ఉపన్యాసాల్లోనే ఎందుకు ఉండిపోతోంది?  భారత సమాజంలోని వైవిధ్యానికి భద్రత కల్పించడంలో వారి సంకల్పం ఎందుకు కనిపించదు? ఇది మొహన్ భగవత్ వ్యక్తిత్వంలోని పెద్ద వైరుధ్యం. వారికి వేదాంతం ఒక ముఖం. రాజకీయ మౌనం మరో ముఖం. 


న్యూయార్క్‌లో వైవిధ్యం గొప్పది అంటారు మరి భారతదేశంలో? విదేశాల్లో వైవిధ్యం అందంగా కనిపిస్తుంది. అమెరికాలో వివిధ మతాల వారితో సమావేశాలు మంచిగుంటాయి. ప్రపంచ మతసామరస్యం గురించి మాట్లాడటం గొప్పగా వుంటుంది.  కానీ, ఆ ఆదర్శాలనూ, ఆ ప్రమాణాలనూ భారతదేశంలో అమలు చేయాలి కదా? అదే అసలు పరీక్ష.


మతసామరస్యం అంటే పదిమంది భిన్నమతాచార్యులు ఒక  వేదిక మీద కూర్చోవడం మాత్రమే కాదు; వాళ్ళు బలహీన సమూహాల పక్షాన నిలబడాలి, బాధితులకు న్యాయం చేయాలి. ఎక్కడయినా సరే ద్వేషాన్ని ఖండించాలి. మూక హింసను ఆపాలి. న్యాయాన్ని అందరికీ సమానంగా అమలు చేయాలని గట్టిగా కోరాలి.  బుల్‌డోజర్ రాజకీయాలను ప్రశ్నించాలి. తప్పుడు ఆరోపణలతో సాగే  వేధింపుల్ని  ఖండించాలి.  ఇవేవీ  చేయకుండా  “మానవత్వం ఒక్కటే; మతాల లక్ష్యం ఒక్కటే ” అని చెప్పడం ఎంతవరకు సబబూ?


భారత అధికార రాజకీయాలను గమనిస్తే ఒకే శిబిరం నుండి మూడు భిన్నమైన భాషలు కనిపిస్తాయి. మూడు వేర్వేరు శైలులు. మూడు వేర్వేరు ముఖాలు.


మోహన్ భగవత్; వేదాంతం మాట్లాడతారు. సంస్కృతి మాట్లాడతారు.  మానవత్వం మాట్లాడతారు. ధార్మిక వైవిధ్యం గురించి మాట్లాడతారు.

నరేంద్ర మోదీ; ప్రజాస్వామ్య భాష మాట్లాడతారు. “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” అంటారు. అందరికీ అభివృద్ధి ఫలాలు దక్కాలి అంటారు. అందరికీ అవకాశాలు అంటారు. 


అమిత్ షా. అధికార భాష మాట్లాడతారు. విపక్షాలపై రాజకీయ దాడుల భాష మాట్లాడతారు. నిరసనల మీద కఠిన చర్యల హెచ్చరికలు చేస్తుంటారు. 


అంటే— ఒకరు వేదాంతం. మరొకరు అభివృద్ధి. ఇంకొకరు అధికారం.  మూడు ముఖాల మధ్య  అదే వైవిధ్యం. ముగ్గురి లక్ష్యాల మధ్య అదే ఏకత్వం.  ఒకే భాజాలనికి, ఒకే లక్ష్యానికి  భగవత్ నైతిక ముఖం ఇస్తారు; మోదీ అభివృధ్ధి భాషను జోడిస్తారు. అమిత్ షా అధికార ముఖాన్ని ప్రదర్శిస్తారు.  


నాటి హెగ్దేవార్ నుండి ఇప్పటి మొహన్ భగవత్  వరకు ఆరెస్సెస్ సర్సంగ్ ఛాలకులు అందరిదీ ఒకటే మాట. తమది మత సంస్థ కాదు; రాజకీయ సంస్థకాదు; కేవలం సేవా సంస్థ అని వారంటుంటారు. వాళ్ళ ఆచరణను దగ్గరగా గమనించేవారెవరయినా  ఆరెస్సెస్ ను స్థూలంగా  మత రాజకీయాలకు సేవలందించే సంస్థ అనే నిర్ధారణకు వస్తారు. మత విశ్వాసాలు వేరు; మత రాజకీయాలు వేరు  అని ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 


ప్రపంచ వేదికల మీద మతసామరస్య విలువల గురించి మాట్లాడటం సులభం. భారతదేశంలో మతసామరస్యం కోసం నిలబడటం కష్టం. న్యూయార్క్ లో ప్రకటించిన ఆదర్శాలను ఇకముందు భారత్ లో భగవత్ ఏ మేరకు ఆచరిస్తారన్నది ఇప్పుడు ప్రాణప్రదమైన ప్రశ్న. 


1 సెప్టెంబరు 2026

Friday, 21 August 2026

“Dimagi Naxals? That Simply Means We Have Brains”

 

“Dimagi Naxals? That Simply Means We Have Brains”

A Conversation with Neha Bora Danny, social analyst

My thanks to the daily newspaper Sakshi for publishing this conversation with Neha Bora.



First, congratulations on the leadership role you played in one of the most successful movements of recent times—one that has given the country a new sense of hope. More than that, it has, to some extent, lifted the climate of fear that has enveloped society for the past two decades. Again, congratulations.

Now, to the questions.

Why the nationwide tour after Jantar Mantar?

The main purpose of this tour is to express solidarity with the student movements unfolding across the country.

In Jharkhand, students are agitating for the cancellation of the JPSC and JSSC examinations. That is why we went to Ranchi.

In Kolkata, students at the Indian Statistical Institute are mounting a major protest against a bill that threatens the autonomy of their institution. So we went there as well.

Next we traveled to Jaipur, in Rajasthan. The state has become a hub of paper leaks. The private coaching mafia is a serious problem there, and the pressure of the education system has driven many students to suicide. Paper-leak incidents are widespread in Kota. We expressed solidarity with the students there.

In Hyderabad, some students are fighting against violence by the ABVP. At another university, students are resisting the administration. There is even the threat that those who oppose inviting the Chief Justice of India to a convocation will not be allowed to register with the bar.

In short, student movements are underway across the country. The Jantar Mantar agitation gave enormous strength to students elsewhere. Now they are fighting on their own issues. We are going to stand with them, to give them courage. They are fighting for themselves; we are fighting alongside them.

What lessons did the Jantar Mantar movement teach?

The principal reason for its success was that we remained united.

Wherever students are struggling, they too must organize. To truly confront authoritarian tendencies and undemocratic forces, they must come together, raise their own consciousness, and demonstrate that they stand united against the administration and the government.

What is your immediate goal now?

There is no single, specific immediate goal.

Meeting students, expressing solidarity with their movements, organizing as many students as possible, bringing them into organized politics, and helping them understand that real power lies in unity—these are our aims.

We must fight for quality education and for a better future for students.

At Jantar Mantar, three different streams came together on a single platform. What about the future?

We are not going to form a new organization together. I am part of AISA; that is my organization. Abhijit Dipak is part of CJP; that is his. Sonam Wangchuk is an independent individual with his own views. But if there are common issues concerning students and the country’s youth, we can again fight together on a united platform.

Will you enter mainstream politics?

My understanding of mainstream politics is different. I come from a left ideology. We do not regard mainstream politics as ideal politics. Therefore I will not join mainstream parties. I am already in politics—I will continue my ideology as deeply and as extensively as I can. Mainstream parties may continue with their own politics.

What is your response to the new label “Dimagi Naxal” that Modi has recently attached to you?

It is a completely ineffective word. They keep inventing new terms to portray people as villains, to demoralize them, to break their spirit. But “Dimagi Naxal” is nothing more than a joke. Everyone is directing all sorts of satirical slogans at Narendra Modi. It seems he thought, “Everyone is mocking me this way, so I too must invent some new phrase,” and came up with “Dimagi Naxal.”

Yet there is another side to it. “Dimagi Naxal” means that all of us have brains. We have the capacity to think. We do not need a teleprompter to say what we are thinking. We do not need someone else to write our words before we can speak in front of a camera. Nor do we need the Instagram language that ordinary people cannot understand—the language that distances one from the people instead of fostering friendship with them.

So if they call us “Dimagi Naxals,” let them. In this country they are pasting all kinds of labels on ordinary people. Every time they invent a new label, our unity only grows stronger. On one side stand the people of this country. On the other stand those who hand out labels. That is all.

“You are the sharpest voice of the protest.”

I have Marxist politics.

Thursday, 20 August 2026

There is a fundamental misunderstanding about me.

 - నా గురించి ఒక మౌలిక అపార్ధం వుంది.

 నేను దాదాపు 50 యేళ్ళుగా మార్క్సిస్టుని. సమాజం కోరుకునే సాధారణ స్వప్నం కమ్యూనిజం అనేది నా నిశ్చిత అభిప్రాయం. మార్క్స్, ఏంగిల్స్, లెనిన్, ట్రాట్స్కీ అంటే విపరీత అభిమానం.

అయితే కమ్యూనిజం వేరు; కమ్యూనిస్టు పార్టీలు వేరు. నిరంతరం మారుతున్న సమాజాన్ని అధ్యనం చేయలేక, దీర్ఘకాలిక వ్యూహాలను రచించలేక కమ్యూనిస్టు పార్టీలు నిస్సారంగా, నిస్సత్తువగా మారిపోయాయన్నది నా విమర్శ.

ముఖ్యంగా 1990 తరువాత ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన మార్పుల్ని ఏ కమ్యూనిస్టు పార్టి కూడ అధ్యయనం చేయలేదన్నది నా విమర్శ.

కమ్యూనిస్టు పార్టీల మీద, వాటి నాయకుల ఆలోచనల మీద నేను తరచూ విమర్శలు చేస్తుంటాను. అది నా బాధ్యత. తమ కాలపు మార్క్సిస్టులు, కమ్యూనిస్టుల మీద మార్క్స్, లెనిన్ కూడ చాలా తీవ్ర విమర్శలు చేసేవారు. "దేవుడా నన్ను మార్క్సిస్టుగా పుట్టించనందుకు ధన్యవాదాలు" అన్నది స్వయంగా కార్ల్ మార్క్సే.

విమర్శను సహించలేనివారు నన్ను కమ్యూనిస్టు వ్యతిరేకిగా చిత్రించడానికి ప్రయత్నిస్తుంటారు. వారి అమాయికత్వానికి నేను నవ్వుకుంటుంటాను.

భోపాల్ లో మిక్ గ్యాస్ లీక్ నుండి ఇప్పటి వరకు దేశంలో జరిగిన ప్రతి ఉద్యమ నాయకుల్ని నేను స్వయంగా వెళ్ళి అభినందనలు తెలిపి వచ్చాను. కొన్నింటికి నేరుగా నాయకత్వం కూడ వహించాను. జంతర్ మంతర్ నిరసనోద్యమంలొ పాల్గొనడానికి ఢిల్లీ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాను. రానూపోనూ టిక్కేట్లూ బుక్ చేసుకున్నాను. సరిగ్గా బయలు దేరాల్సిన రాత్రే అక్కడ ఉద్యమం ముగిసింది.

షాహీన్ బాగ్ ఉద్యమం, రైతుల ఉద్యమం మణిపూర్ అల్లర్లు అన్నింటికీ వెళ్ళాను.

మనోళ్ళు చాలా మందికి సెలెక్టివ్ మెమోరీ లాస్. కమ్యూనిస్టు కార్యకలాపాలని విమర్శిస్తే చాలు సరిదిద్దుకోరు. పైగా యాంటి కమ్యూనిస్టు ముద్ర వేస్తారు. ఇది కమ్యూనిస్టులు సహితం నేర్చుకున్న సోషల్ మీడియా కల్చర్.

There is a fundamental misunderstanding about me.

I have been a Marxist for nearly fifty years. It is my firm conviction that communism remains the shared dream that society ultimately seeks. My admiration for Marx, Engels, Lenin and Trotsky runs deep.

Communism, however, is one thing; Communist parties are another. My criticism is that these parties have grown barren and enervated, incapable of studying a society in constant flux or of crafting durable long-term strategies. In particular, I fault them for failing to examine the profound global transformations that followed 1990.

I regularly critique Communist parties and the thinking of their leaders. That is my responsibility. Marx and Lenin themselves leveled sharp criticism at the Marxists and Communists of their own time. Karl Marx once remarked, “Thank God I was not born a Marxist.”

Those who cannot abide criticism attempt to paint me as an anti-Communist. I find their innocence amusing.

From the Bhopal MIC gas leak to the present day, I have personally traveled to congratulate the leaders of virtually every significant movement in the country; in some I have taken a direct leadership role. I arranged everything necessary to travel to Delhi for the Jantar Mantar protests, even booking round-trip tickets. The movement ended on the very night I was scheduled to depart.

I went to Shaheen Bagh, to the farmers’ protests, to the unrest in Manipur—everywhere.

Too many of our people suffer from selective amnesia. Criticize Communist activities and they refuse to correct course; instead they brand the critic an anti-Communist. It is a social-media habit that even Communists have acquired.