Tuesday 24 July 2012

Is Poetry Becoming Obsolete?


ముస్లిం సాహిత్యసభ 


స్కై బాబా ఆధ్వర్యాన ఆదివారం సీఫెల్ లో జరిగిన సాహిత్య సభ బాగా జరిగింది. అంతర్జాతీయంగా ముస్లిం సాహిత్యంలో వస్తున్న మార్పులపై అఫ్సర్ చేసిన విశ్లెషణ ఆలోచనల్ని రేకెత్తించింది. 

సామాజిక పరిణామంలో మెధావులు జోక్యం చేసుకోడానికి, కవిత్వం ముసుగుగానో, వృధాగానో మారిపొయిందని అఫ్సర్ అనడం కొత్త పరిణామం. 

కవిత్వంపై అఫ్సర్ అభిప్రాయంతో నాకు ఒక విధంగా ఏకాభిప్రాయం వుంది. కవిత్వం అనేది అంతరించిపోతున్న సాహిత్య ప్రక్రియ అని నేను గట్టిగా అనుకుంటాను.కవిత్వం నిర్వర్తించాల్సిన చారిత్రక పాత్ర చాలాకాలం క్రితమే ముగిసిందని నా అభిప్రాయం. వర్తమానంలో వచనం, భవిష్యత్తులో ఉపన్యాసం సాహిత్య ప్రక్రియలుగా అగ్రపీఠం అందుకుంటాయి.

తెలంగాణ వ్యతిరేకులు కవిత్వ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారని సభలో కొందరన్నారుగానీ అది వాదం కాదు; నిరాధారమైన ఆరోపణ.

ముస్లిం సమాజంలో ఉనికికి ప్రాతిపదికగావున్న కులం స్థానాన్ని మతం ఆక్రమిస్తున్నదని అఫ్సర్ గమనించిన అంశం కూడా కీలకమైనది. వర్తమాన హిందూ సమాజం కులాల ప్రాతిపదికగా విడిపొతుంటే, ముస్లిం సమాజం కులాల పరిధిని పక్కనపెట్టి అంతర్గత ఏకీకరణ దిశగా సాగుతోంది. రెండూ వేరువేరు దశలు.

No comments:

Post a Comment