Friday 19 June 2020

The Birth of Modern Muslim Minoritism

ఆధునిక
ముస్లిం మైనారిటీవాదం

ఆవిర్భావం 
డానీ

20200618 PUTTUMACHCHA
Key Words and Tags
Topic : Muslim Intellectuals :
Building Goodwill and
Creating Social Capital          

Haryali Programme
18th June 2020 Thursday
8 p.m. to 9 p.m.

1. Formal Intro
5 Mnts       

Good Evening
నమస్కారం
అస్సలాము అలైలుమ్

హర్యాలి
స్కైబాబా,
షాజహానాలకు
ధన్యవాదాలు.      

కరోనా లాక్ డౌన్
ఆరోగ్య సమస్య గా మొదలు
సామాజిక సమస్యగా మార్పు

క్లినికల్ డిస్టాన్స్ - ఫిజికల్ డిస్టాన్స్     
ఫిజికల్ డిస్టాన్స్  - సోషల్ డిస్టాన్స్
సోషల్ డిస్టాన్స్  - సోషల్ బోయ్ కాట్         

సంపన్నులు
ఎగువ మధ్యతరగతికి
ఇది లాంగ్ లీవ్ / LTA

దిగువ మధ్యతరగతి
పేదలు శ్రామికుల బతుకు 
కష్టాల కడలి         

Migrant labourers 
Mass displaced labourers
వలస కూలీలు నరకం

ఇంత ఘోరం జరుగుతుంటే
పౌరసమాజం నిరసన తెలపాలి

సభలు సమావేశాలు బంద్
సామాజిక వాతావరం
సెల్ఫ్ ఎమర్జెన్సీలా మారింది

ఇలాంటి సమయంలో
సోషల్ మీడియాను
సంపూర్ణంగా వాడుకోవాలి.       

మాదాసు  వినోదిని సంతకం,
షాజహానా- స్కైబాబా హర్యాలి
అపర్ణ తోట ఇష్టమైన పుస్తకం
అందరికీ అభినందనలు

పది రోజుల క్రితం
స్కైబాబ
పుట్టుమచ్చ పరామర్శ
ప్రతి పాదన           

సామాజిక రాజకీయార్థిక రంగాల మీద
నాకు కొంత అధ్యయనం వుంది

కవిత్వం నా subject  కాదు.
పెద్దగా కవిత్వాన్ని చదవలేదు

టాపిక్ -‘పుట్టుమచ్చకనుక
కవి ఖాదర్ కనుక
ఒప్పుకున్నాను.

       
2. పుట్టుమచ్చ పుట్టుక
5 Mnts.      

ఖాదర్ మొహియుద్దీన్
1991 ఫిబ్రవరిలో  పూర్తి చేశాడు

పుట్టుమచ్చ పుట్టి  ఇది 30 సంవత్సరం   
ఇది పరిచయం కాదు పరామర్శ.

2016 లో పాతికేళ్ళ  పుట్టుమచ్చ
సంబరం జరిగింది. 
2016 మే 8 ప్రజ్వలిత సంస్థ  తెనాలి
ఖాదర్ కు సాహితీ సేవామూర్తి
అవార్డు ప్రదానం.

సభలో నేను కూడ ఒక వక్త
ఆంధ్రజ్యోతిలో ప్రసంగ పాఠం  


నేను పుట్టక ముందే
దేశద్రోహుల జాబితాలో
నమోదైవుంది నా పేరు 

పుట్టుమచ్చ  పుట్టక ముందే
శ్రోతల జాబితాలో
నమోదైవుంది నా పేరు  

‘పుట్టుమచ్చ ‘ను రాస్తున్న కాలంలోనే
చాలాసార్లు  చదివి వినిపించేవాడు.

అంతకు ముందు ఖాదర్ వేరు.
తరువాత ఖాదర్ వేరు.

కవిగా సౌమ్యుడు
మనిషిగా మర్యాదస్తుడు

కవిత్వంలో కొంచెం
శృంగార దృష్టి కూడ వుండేది. 

వేళ్ళ కాళ్ళని నగ్నంగా బారజాపి
తపస్సు చేస్తున్న చెట్లు” -  సంధ్య    

తొడల్ని ఎడం చేసుసుకుని
నగ్నంగా పడుకున్న ఆడదిలా వుంటుందినది - పుంస్త్రీలింగం

సాంప్రదాయం నుండి
ఒక్కసారిగా అస్తిత్వవాదం వైపుకు మళ్ళడం కష్టం        

సమాజంలో
నేను అందరి వాడిని
అనడం చాలా సులువు

నేను కొందరివాడిని
అనడం చాలా కష్టం.     

నేను మెజారిటీ వాడిని
అనడం సులువు.
నేను మైనారిటీ వాడిని       
చాలా అనడం కష్టం.
         
అలా అనడం ఇప్పటికన్నా
1990లో ఇంకా కష్టం.
















3. సాహిత్యకారులపై
సన్నిహిత సమాజం ప్రభావం
5 mnts       

కవులు, రచయితల  చుట్టూ సన్నిహితులు, మిత్రులు
సహోద్యోగులు బంధువులు

అది రచయితకు
సన్నిహిత సమాజం,
ఒక సామాజిక నిర్మాణం.

సమాజం నిర్మాణం
సాహిత్యకారుల రచనల్ని ప్ర్తభావితం చేస్తాయి.

చుట్టూ వున్నవాళ్ళ
మనోభావాలు దెబ్బతింటే.      
రచయితల  సామాజిక నిర్మాణం మొత్తంగా కూలిపోతుంది

అస్తిత్వవాద రచన అంటే కాగితం మీద పెన్ను పెట్టుకుని
రాయడం కాదు    

It is not mere typing an article through keyboard on the computer; it is a major shift from the old social base for a new one.

అప్పట్లో ఖాదర్ చుట్టూవున్న సమాజం దాని నిర్మాణం
కమ్యూనిజం.        

మన సమాజంలో కులం మతం లేనివాడు ఎవరూ వుండరు.

కొందరు ఒప్పుకుంటారు.
కొందరు ఒప్పుకోరు
తమకు కులం మతం వుందని కమ్యూనిస్టులకు కూడ తెలుసు
బాహాటంగా ఒప్పుకోరు.

కులమతాలను
ప్రత్యక్ష్యంగా  కాకపోయినా
ప్రఛ్ఛన్నంగా కొనసాగిస్తుంటారు.
ఇదొక హిప్పోక్రసీ / బూటకం

ఇందులో అక్కడక్కడ అతి స్వల్ప మినహాయింపులు వుండవచ్చు.
మత విశ్వాసానికీ, మత తత్వానికీ తేడాని వివరించలేని కాలం  అది.

సమర్ధిస్తున్నవాళ్లని వదులుకోవాలి. సమర్ధించే వాళ్లని వెతుక్కోవాలి.

కవి ఖాదర్ మొహిద్దీన్
సాహసం చేశాడు.
స్వీయ సమాజం మీద తపన కారణంగానే సాహసం చేయగలిగాడు.      

ఇతర భారతీయ భాషల్లో ముస్లిం కవులు ఏం చేశారో నాకు తెలీదు.
 
తెలుగు కవిత్వం వరకు అయితే ఖాదర్ చాలా సాహసోపేతంగా        
ఆ పనిచేశాడు.

He bell the cat. 








4. పుట్టుమచ్చ
రాజకీయ నేపథ్యం
10 Mnts.    

భావ కవిత్వం
ఆత్మాశ్రయ  కవిత్వం
కొలిచే ప్రమాణాలు వేరు
అస్తిత్వవాద కవిత్వాన్ని కొలిచే ప్రమాణాలు వేరు.

ఇతర కవిత్వాన్ని భాష  పటిమ
వ్యక్తీకరణ నైపుణ్యంతో
కొలిస్తే సరిపొతుంది.     

అస్తిత్వవాద సాహిత్యాన్ని కొలవడానికి కూడా భాష  పటిమ
వ్యక్తీకరణ నైపుణ్యం  కావాలి.
కానీ అవి మాత్రమే సరిపోవు
రాజకీయ, ఆర్థిక సామాజిక
సాంస్కృతిక కొలమానాలూ కావాలి.

నిజానికి రెండవదే ముఖ్యం.  

1990 నాటి రాజకీయ సన్నివేశం అర్థం కాకుండ పుట్టుమచ్చ అర్థం కాదు.          

1990 సెప్టెంబరులో బిజెపి అధ్యక్షులు
ఎల్ కే అడ్వాణి రామ్ రథయాత్ర
టొయోటా వ్యాను ఆధునిక అశ్వమేధయాగం        
ప్రధాని విపి సింగ్  
ముస్లిం సంతుష్టీకరణ
Muslim Appeasement
 
ముస్లింలకు సర్కారు బడుల్లో చదువు
సర్కారుదవాఖానాలో వైద్యం
అంతకు మించి హక్కులు లేవు.
నో రిజర్వేషన్స్- ప్రమోషన్స్
చట్ట సభల్లో స్థానం వుండకూడదు
ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి

మరి ముస్లింల స్థానం ఏమిటీ?
హిందీ హిందూ హిందూస్తాన్
ముస్లిం జావో పాకిస్తాన్”
“ముసల్మాన్ కే దోహిస్తాన్
పాకిస్తాన్ యా ఖబరస్తాన్”

1990 అక్టోబరు నెలలో
అద్వాణీ  యాగాశ్వం
ఆంధ్ర ప్రదేశ్ కూ,  కృష్ణాజిల్లాకూ

అప్పుడు నేను
డెక్కన్ క్రానికల్ స్టాఫ్ రిపోర్టర్
జగ్గయ్యపేట నుండి
హనుమాన్ జంక్షన్ వరకు  
విజయవాడలో ఓ రాత్రి బస
ప్రెస్ క్లబ్ లో మీట్ ద ప్రెస్

“All are equal Muslims are more equal”   

అడ్వాణీ రథయాత్ర సాగిన దారెంటా ముస్లీంల మీద హింసాత్మక
దాడులు  అల్లర్లు,
మరణాలు, లూటీలు,   

బాధను మౌనంగా దిగమింగడమేతప్ప  తప్ప నోరు తెరిచే అవకాశం లేదు. భారత ముస్లీం సమాజం
నోట్లో గుడ్డ కుక్కుకుని
తనలోతాను కుమిలిపోతున్నదశ 

Religion is the sigh of the oppressed creature -  Karl Marx 
అణగారిన జీవులకు మతం
ఒక నిట్టూర్పు వంటిది 
“Feed the hungry and visit a sick person, and free the captive, if he be unjustly confined. Assist any person oppressed, whether Muslim or non-Muslim.”
- Prophet Muhammad

విషాద సన్నివేశంలో
ముస్లీం సమాజానికి ఒక నిట్టూర్పు అవకాశాన్ని ఖాదర్ ఇచ్చాడు. బాధాతప్త భారత ముస్లిం సమాజపు
కవితాత్మక నిట్టూర్పుపుట్టుమచ్చ’
         
         
         
         
         
         






















4.       దేశవిభజన శిలువ
5 mnts       

1947 దేశ విభజన

ముస్లిం నాయకులు
మాత్రమేనా కారకులు

హిందూ నాయకులకు
బాధ్యత లేదా?
మహాత్ముడ్ని గాడ్సే
ఎందుకు హత్య చేసినట్టూ?

పంజాబ్ రెండు ముక్కలు
బెంగాల్ రెండుముక్కలు
రెండు రాష్ట్రాల్లోనే
ఇటువాళ్ళు అటు వెళ్ళారు
అటువాళ్ళు ఇటు వచ్చారు     

మిగిలిన రాష్ట్రాల్లో
పాకిస్తాన్ మీద ఆసక్తి చూపిన ముస్లింలు చాలా చాలా తక్కువ

కొత్తగా ఏర్పడిన భారత దేశాన్నే
మాతృభూమిగా నమ్ముకుని  
ఇక్కడే వుండిపోయిన
ముస్లింలు అత్యధికులు

అయినా ఆనాటి ముస్లింల మీద
దేశవిభజన నిందను మోపారు.
సరే ఆ తరం ఆలా వెళ్ళిపోయింది.

“1947 ఆగస్టు 10 నా పుట్టిన తేదీ
అంటుంది పుట్టుమచ్చ
ప్రారంభ వాక్యాల్లోనే     

తాను స్వాతంత్ర్యానంతర
తరానికి చెందిన ముస్లింనని చెప్పడం కవి లక్ష్యం
స్వతంత్ర భారత దేశంలో పుట్టిన ముస్లింలకూ నిందలు తప్పలే ..

“నాయింట కన్ను తెరచిన
నవజాత శిశువు తెగ్గోసుకున్న
తల్లిపేగు చివర     తడియారని నెత్తుటిబొట్టులో 1947ని దర్శిస్తుంది వర్తమానం
         
                   

































5. విశిష్టతత్వం నుండి విశ్వగతత్వం  వరకు
10 mnts.
                   
 కృష్ణాజిల్లాలో ఒక మారు మూల కుగ్రామం మావూరుఅంటూ
మొదలయ్యే పుట్టుమచ్చ కావ్యం
నడక ముందుకు సాగాక
         
ఖండఖండాలుగా నరికి
నిలువునా నన్ను నిర్మూలించి          
అఖండ భారతంనిర్మించాలని కలలు గనడం కుట్రకాదు’’
అంటుంది వెటకారంగా.          

పుట్టిన ఊరు నుండి
అఖండ భారతం వరకు
ఆఫ్ఘనిస్తాన్ నుండి మయన్మార్  వరకు
వ్యక్తి నుండి సమాజం వరకు
విశిష్టగతం నుండి విశ్వగతం వరకు

Individual to society
Specific to general
Particularity universality
సమకాలీనత నుండి సర్వకాలీనత

ఈ క్రమాన్ని, ఈ ప్రయాణాన్నీ
పరిణామాన్ని సాధించినపుడే
కవితకు విశ్వజనీనత లభిస్తుంది.
నా అనుభవం నుండి ఒక ఉదాహరణ
సుప్రసిధ్ద నాటక రచయిత
ఎర్రమట్టి ఫేం యం జి రామారావు నాకు గురువుగారు
1972లో మాక్సిం గోర్కిఅమ్మ’ నవల
తెచ్చి ఇచ్చి “ఇది చదువు అన్నారు”
వారు అంతటితో ఊరుకోలేదు.   
“ఇది చదవని వాడు మనిషే కాడు” ప్రకటించారు.         

ఆ మాస్కో నగరం ఆ ఫ్యాక్టరీ గొట్టం బూడిద రంగు పొగ  
దట్టమైన మంచు
వణుకుతూ నడుస్తున్న మనుషులు

మనది నరసాపురం
సముద్రపు గట్టు.
మహా వేడి  చెమట
గాలిలో ఉప్పు తేమ
ఒళ్ళంతా జిడ్డు జిడ్డు
చెమట ఆరితే బట్టల
మీద ఉప్పు అట్టలు కట్టేది

నరసాపురానికీ మాస్కోకో
సీన్ మ్యాచ్ అయ్యేది కాదు.
ఊహకు కూడా అందేది కాదు.

ఎన్నిసార్లు ప్రయత్నించినా
 20 పేజీలను దాటగలిగేవాడిని కాదు.
గురువుగారు తిట్లు

ఒకరోజు దీక్షగా
30 పేజీలు వరకు వెళ్ళాను.
పావెల్ చర్చిలో గ్రిటార్ వాయించి అర్థరాత్రి మిత్రులతో మద్య సేవించి ఇంటికి వస్తాడు
అమ్మ ఏమీ అనదు
కొడుకును మంచం మీద పడుకోబెట్టి
తలుపు చాటున నిలబడి
రాత్రంతా మౌనంగా ఏడుస్తూ వుంటుంది.

అది మా ఇంట్లో సంఘటన
మా అమ్మ కోపిష్టి.
ప్రతి చిన్న తప్పుకూ నన్నూ కొట్టేది.
నేను మొదటిసారి మందుకొట్టి ఇంటికి వచ్చినపుడు విచిత్రంగా
మా అమ్మ నన్ను కొట్టలేదు.
మంచం మీద పడుకోబెట్టి
దుప్పటి కప్పింది.

నవలలో సన్నివేశం
మా అమ్మను గుర్తు చేసింది.
రాత్రి మా అమ్మ కూడా
మౌనంగా ఏడ్చి వుంటుందని పించింది.

సాహిత్యం మన చుట్టూ వున్నవాళ్ళను
లోతుగా అర్థం చేసుకోవడానికి
గొప్పగా తోడ్పడుతుంది.
సాహిత్య ప్రయోజనమే అది

  
ఇక కనెక్ట్ అయిపోయా.
Pelageya Nilovna Vlasova
సుఫియా బేగం అయిపోయింది.
Pavel Vlasov డానీ అయిపోయాడు.
నాన్ స్టాప్ గా గోర్కి అమ్మ చదివేశా.

రచన ఒకసారి 
Particularity universality
ప్రయాణాన్ని పూర్తి చేసేస్తే
రచయిత కూడ ఊహింవ్చని
అనేక అద్భుతాలుజరుగుతాయి.










6. ‘పుట్టుమచ్చ’ లో  సర్వకాలీనతత
5 mnts.
ఈరోజు పరామర్శించడం కోసం నిన్న రాత్రి ‘పుట్టుమచ్చ’ను
ఇంకోసారి చదివా.

“పోతపోసుకుంటున్న నా వ్యక్తిత్వం మీదికి వింత వింత భయాల్ని
ఉసిగొల్పి    నిర్ధాక్షిణ్యాంగా నన్ను చిత్రవధ చేసి సుడిగాలుల
పాల్జేసింది చరిత్ర”

“పవిత్రమైన పరాచికం నా పౌరసత్వం”

ఈ కవితా పంక్తులు గతం కాదు. వర్తమానం.
CAA NPR NRC  చట్టాలు ఇప్పుడు చేస్తున్నది అదేకదా?

“హిందీ హిందూ హిందుస్తాన్
(ముస్లిం భాగో పాకిస్తాన్) ఇప్పుడు రాజ్యాంగ సవరణకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
“రాజ్యాంగం నా భుజం తట్టదు”

రాజ్యాంగం అప్పుడు కొంచెమయినా
ముస్లింల భుజం తట్టిందేమోగానీ
ఇప్పుడు ముస్లింలను
మనుషులుగానే గుర్తించడంలేదు.

నేను పెళ్ళాడడం కుట్ర
పిల్లల్ని కనడం కుట్ర”

స్త్రీ పురుషుల మధ్య ఒక అనుబంధం ఏర్పడడానికి
మతం ప్రాతిపదిక కావాలా?
లేకుంటే Love Jihad అంటారా?
ఇదేం అమానవీయం?

“అసహనానికి ప్రతీకగా నాగురించి జరిగే ప్రచారాల్ని విని నవ్వుకుంటాను

అసహనం అనేమాట అప్పట్లో అంతగా ప్రాచూర్యంలో లేదు.

అఖ్లాఖ్, జునైద్, గౌరీ లంకేష్, కల్బుర్గీ, పన్సారేల హత్య తరువాత
అసహన వాతావరణం
ఒక ఆందోళనగా మారింది.


బాబ్రీ మసీదు కూల్చివేత
ఆర్టికల్ 370, ఉమ్మడి పౌరస్మృతి అప్పుడు ఎజెండాలొ చేరాయి.  
ఇప్పుడు కార్యరూపం  దాల్చేశాయి.


అప్పుడు అడ్వాణీ ఒక major factor.
వాస్తవం మీద పుట్టుమచ్చ పుట్టింది.
ఇప్పుడు వాస్తవం లేదు.
ఇవ్వాళున్న అడ్వాణీ
అడ్వాణీ కాదు.
ఆయన వున్నా లేనట్టే.

వాస్తవం మారినా అందులోనుండి పుట్టిన సత్యం మిగులుతుంది.

వాస్తవం- సత్యం  
Fact and Truth

పుట్టుమచ్చ అలాంటి
అనేక సత్యాలను చెప్పింది.  
“పార్లమెంటు భవనంలో వాలేందుకు నా నెత్తురు పాదలేపనం అవుతుంది”.

మక్కా మసీదు పేలుళ్ళు
ఆసిఫా హత్యాచారం
ఇటీవలి ఢిల్లీ అల్లర్లు
వీటి నిందితులు ఇప్పుడు ఎక్కడున్నారూ?

వాస్తవం మారిపోయింది.
సత్యం మిగిలి వుంటుంది.
ఇదే సాహిత్య ప్రయోజనం
  
ఖాదర్ యుగకవా? మహాకవా?  
వంటి వాదనల్లోనికి నేను వెళ్ళను.    

వర్తమాన తెలుగు
ముస్లిం సమాజానికి
పుట్టుమచ్చమహాకావ్యం
ఖాదర్ ఆదికవి.
ఇందులో ఎవరికీ  సందేహాలు అభ్యంతరాలు వుండాల్సిన పనిలేదు.

















7. ‘పుట్టుమచ్చ’  పరంపర   
5 mnts.
పుట్టుమచ్చ తరువాత మళ్ళి రాయలేదు అనే
అసమ్మతో, అసంతృప్తో
విమర్శో ఖాదర్ మీద వుంది.

Magnum Opus Master Piece
స్థాయి రచన చేశాక
రచయితలను ఒకరకం భయం
మళ్ళీ ఆ స్థాయి రచనలు చేయగలమా?  
నాసిరకం రచన చేస్తే పాత పరువు పోతుందా?
అనే సందేహాలు వెంటాడుతాయి.
అలాంటి సమయాల్లో కొంత విరామం అనివార్యం అవుతుంది.

ఖాదర్ మరీ ఎక్కువ విరామం తీసుకున్నాడు.

ఒక ఎలుక పిల్లి మెడలో గంట కట్టాక
ఎలుక జాతికి ఒక మార్గం ఏర్పడుతుంది.
ఉత్సాహం ధైర్యం వస్తుంది.

‘పుట్టుమచ్చ’  ఆవిర్భవించాక
మార్గంలో ముస్లిం కవులు
అనేకులు విజృంభించారు.

అందరి పేర్లు చెప్పడం సాధ్యం కాదు.  నాకు గుర్తున్న కొందరు ప్రముఖుల పేర్ల వరకు ప్రస్తావిస్తాను.
ఖాజా, స్కైబాబా, షాజహానా, కరీముల్లా, అఫ్సర్, వాహెద్, యాకూబ్, ఇక్బాల్ చంద్,
వేంపల్లె షరీఫ్ ఇంకా అనేకులు.
“మేమంతా గోగోల్ ఓవర్ కోట్ నుండి ఊడపడ్డ వాళ్ళమే”

“నాకు దేవుడి మీద నమ్మకం లేదు. ఒకవేళ వుంటే అతను టాల్ స్టాయ్ లా వుంటాడనుకుంటాను”  అన్నాడు మాక్సిం గోర్కి .

మాటల్ని కుర్ర రచయితగా వున్నప్పుడు చెప్పలేదు. అందరూ చనిపోయి తాను ప్రపంచ మహారచయితగా ఒక ఉజ్వల జీవితాన్ని ఆస్వాదిస్తున్న కాలంలో 
తన గురువుల్ని తలుచుకున్నాడు.

గోర్కి సాహిత్య సంస్కారం ప్రభావం
నామీద బలంగా వుంది.
వీలున్న చోటెల్లా  నా గురువుల్ని తలుచుకుంటాను.
అనేకమంది దగ్గర అనేక విద్యలు నేర్చుకున్నాను.

సంస్కారం లేనివాళ్లు
సాంస్కృతిక రంగంలో
గొప్ప విలువల్ని ప్రవేశపెట్టలేరు.

ఎందుకో తరం తనకు గురువు ఎవరూ లేరని చెప్పుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతోంది.

గురువు లేనివారికి
శిష్యులు కూడా వుండరు.  
అదీ అసలు ప్రమాదం!






8. ముస్లింవాదానికి మాతృక ఏదీ?
10 mnts.
పుట్టుమచ్చకు వారసులున్నప్పుడు
దానికి మాతృక ఏదీ? అనేది ఎవరికైనా సరే రావలసిన సందేహం.

మరో విధంగా చెప్పాలంటే;
తెలుగులో ముస్లింవాదానికి  ప్రేరణ ఎక్కడి నుండి వచ్చిందీ? అనేది.

తెలుగు కవులు, రచయితలు, విమర్శకులకు ఎప్పుడో ఒకసారి ఈ సందేహం వచ్చే వుంటుంది.

కానీ ఎవ్వరూ దాన్ని నిర్ధారించేపని ఎప్పుడూ నిర్ధిష్టంగా చేయలేదు.

అయితే సాహిత్య సభల ప్రసంగాల్లో అనేకసార్లు
Passing statements వచ్చాయి.

దళితవాదం నుండి ముస్లింవాదం
పుట్టిందనేది వాటి narrative.  ఒకటికి నాలుగుసార్లు చెప్పడం వల్ల ది నిజమనే భావన కూడ మన సమాజంలో కొనసాగుతోంది.

డాక్టర్ సమీవుల్లా 2005 నవంబరులో ‘మైనార్టీ కవిత్వం తాత్విక నేపథ్యం’
పరిశోధనా వ్యాసం.

“దళితకవిత్వంలో అంతర్భాగంగా మొదలైన ముస్లిం కవిత్వం …” అని సిధ్ధాంతీ కరించాడు.  

ఈ ప్రకటన చాలా అస్పష్టంగా,  
గందరగోళంగా వుంది.
అంతర్భాగంగా మొదలవ్వడం ఏమిటీ?

ముస్లిం కవులు దళితకవుల్ని అనుసరించారన్నది సమీవుల్లా భావం.

ముస్లిం కవిత్వం వేరు; ముస్లింవాద కవిత్వం వేరు.

ముస్లిం కవిత్వానికి 13వ శతాబ్దపు అమీర్ ఖుస్రో మొదలు ఏడు వందల ఏళ్ళ సాంస్కృతిక వారసత్వం వుంది.

ముస్లింల అభ్యున్నది కోసం రాజకీయ చర్యను ప్రతిపాదించేది ముస్లిం వాదం.

వాదం అంటేనే రాజకీయ చర్య.

మనం ఇప్పుడు మాట్లాడుతున్న తెలుగు సాహిత్యంలో ముస్లిం వాదం గురించి.

“మైనార్టీ కవిత్వానికి మ్యానిఫెస్టో అనదగ్గ కవిత తెలుగులో ఖాదర్ మొహియుద్దీన్ ‘పుట్టుమచ్చ’ – అని తనే ఆ గ్రంధంలో  రాశాడు.

అది దళిత కవిత్వంలో అంతర్భాగం అని నిరూపించాలిగా? ఆ పని చేయలేదు.

తెలుగులో ‘పుట్టుమచ్చ’కు దారి చూపిన దళిత  కవిత ఏదీ? ఆ కవి ఎవరూ?

ఈ వివరణ ఇచ్చే బాధ్యతను నిర్వహించలేదు.

గాల్లో వున్న అపోహల్ని విశ్వవిద్యాలయాల్లో స్థిరపరిచాడు సమీవుల్లా. ఇదొక మేధో నేరం.


సమీవుల్లా  పరిశోధన గ్రంధం మీద  నేను 2006 ఆరంభంలో ఆంధ్రజ్యోతిలో   సమీక్ష రాశాను. అప్పుడు ప్రశ్నలు లేవనెత్తాను         
ఇప్పటి వరకూ ఎవరూ సంతృప్తికరంగా సమాధానం చెప్పలేదు.

యూనివర్శిటీల్లో పరిశోధకులకు
గైడ్లు, రీడర్లు వుంటారు.  
గైడ్లకు కొన్ని ఆసక్తులు,
కొన్ని అభిప్రాయాలు,
కొన్ని అవసరాలు వుంటాయి.  
గైడ్ల అభిప్రాయాలే పరిశోధనల్లో ప్రతిబింబిస్తాయి.
రీసెర్చ్ స్కాలర్లు కూడ ఏమాత్రం క్రాస్ చెక్ చేసుకోరు.
గైడ్ మాటను జవదాటలేరు.
ధోరణిలో కొట్టుకు పోతుంటారు. 
అందుకే యూనివర్శిటీ పరిశోధనలు గాలికబుర్లుగా మారిపోతుంటాయి.     

ఇంతకీ తెలుగులో ముస్లింవాదానికి ప్రేరణ ఎక్కడి నుండి లభించింది అనేది కీలక మైన ప్రశ్న.

‘పుట్టుమచ్చ’ వరకు అయితే
అడ్వాణీ రామ్ రథ యాత్ర
దేశంలో సృష్టించిన
అసహన వాతావరణం
తక్షణ ప్రేరణ.

ఇంకొంచెం వెనక్కు వెళితే
1986లో రాజీవ్ గాంధీ  అయోధ్యలో రామమందిరం తలుపులు తెరవడంతో
బాబ్రీ మసీదు కూల్చివేత అంశం తెర మీదకు వచ్చింది.
అడ్వాణి రథయాత్రకు ప్రేరణే ఇది.

సరిగ్గా కాలంలోనే షాబానో మనోవర్తి కేసు దేశాన్ని కుదిపేసింది.
ఉమ్మడి పౌర స్మృతి అంశం అజెండాలోనికి వచ్చింది.

ముస్లిం రాజవంశాలు కొన్ని
భారత దేశాన్ని
అనేక ఏళ్ళు పాలించాయి.

కింది నుండి పై వరకు ముస్లింలదే రాజ్యం అని మనువాదులు అనవచ్చు.

రోజుల్లో కూడా
సామాన్య ముస్లింలు
సంతోషంగా లేరు; మావాడే చక్రవర్తి అనే వెర్రి ఆనందంతప్ప.

నిజాం నవాబు పాలనలో పేద ముస్లింల వైభోగం ఏమిటీ?
రైతాంగ తిరుగుబాటులో తొలి అమరుడు ముస్లిం బందగీ ఎందుకయ్యాడు?

అంతెందుకూ
దేశంలో ఇప్పుడు మనువాదుల పాలనే సాగుతోంది.
లాక్ డౌన్ కాలంలో వలస కార్మికుల పరిస్థితి ఏమిటీ?
వాళ్ళది పాలక మతం కాదా?
ముస్లిం రాజుల పాలనా  కాలంలోనూ సామాన్య ముస్లింలది అదే పరిస్థితి. 

ఘట్టం 1857తో ముగిసిపోయింది.
తరువాత భారత ముస్లింల సామాజిక చరిత్రంతా ‘పరాజితుల ఆక్రందన’.

తరువాతి ప్రధాన ఘట్టం
1947  దేశ విభజన.

పాకిస్తాన్ ఏర్పడ్డప్పుడు
కొందరు ముస్లింలు
సంతోషంగానే అక్కడికి పోయారు.

వాళ్లు అక్కడికి పోవడంవల్ల
ఇక్కడి వాళ్ళు ఇప్పటికీ
నిందలు మోస్తున్నారు.   

పోనీ అక్కడికి వెళ్ళీన వాళ్లయినా
సంతోషంగా వున్నారా? అంటే
అదీ లేదు.

వెళ్ళి వాళ్ళూ కష్టాల పాలయ్యారు.
వెళ్ళకుండ వీళ్ళూ ఇబ్బందుల పాలయ్యారు.

దేశ విభజన ఎవరికి లాభం?
అది రెండు విధాలా విషాదమే.
         
ఇప్పుడు పాకిస్తాన్
ఒక దేశం గానూ,
సమాజంగానూ
ఏ విధంగానూ
ఆదర్శం కాదు.     

ఒక వర్తమాన ముస్లిం ఆలోచనాపరునిగా
భారత ముస్లింవాదానికి మూలాలు
1984 నాటి శిక్కుల ఊచకోతలో వున్నాయి అనుకుంటాను.

అప్పట్లో నేను స్టీల్ బర్డ్ ఇంటర్నేషనల్      అనే ఆటోమోబైల్ సంస్థలో ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాల ప్రతినిధిగా పని చేసేవాడిని
ఆ సంస్థ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ.
తరచుగా ఢిల్లి వెళ్ళాల్సివచ్చేది.  

అలా నాకు

పంజాబ్ లో తిరుగుబాటు

Insurgency in Punjabను

ఢిల్లీ అల్లర్లను

పరిశీలించే అవకాశం దక్కింది.

శిక్కుల తరువాత మనువాదుల టార్గెట్ ముస్లీంలే అని నాకు 1984లో అర్థం అయింది.
ఆ ఏడాది అక్టోబరు మొదట్లో  ‘కృపాణ్’ కథ రాయడానికి నా ప్రేరణ అదే. ఇది ఢిల్లీ అల్లర్లకు ముందు రాసిన కథ.

సాహిత్య పరిశోధకులు
ఎక్కువగా కవిత్వాన్ని ఎంచుకుంటారు.
కవితల సైజు చిన్నది కనుక పరిశోధన సులువుగా వుంటుంది.

సమీవుల్లాకు ఒక మన్నింపు వుంది. ఆయన పరిశోధన కవిత్వానికే పరిమితం.
మేధోమధనం, వాదాల గురించి పరిశోధించేవారు కథలు, నవలలు, వ్యాసాల్నే కాదు ఉపన్యాసాల్ని కూడ పట్టించుకోవాలి.

షాబానో కేసు సందర్భంగా 1986 మే నెలలో‘స్త్రీ విముక్తి -ఉమ్మడి పౌరస్మృతి’ వ్యాసం రాశాను.    
1987లో నేను రాసిన ‘సాహిత్యంలో మతతత్వం’ సిధ్ధాంత వ్యాసాన్ని
ఉదయం దినపత్రిక ధ్వని పేజీలో 1988 ఫిబ్రవరి 8న
చాలా ప్రముఖంగా ప్రచురించింది.

ఈ వివరాలు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నానంటే
దస్తరాలను సరిచేయడానికి.
అపోహలను తొలగించడానికి.

‘పుట్టుమచ్చ’ ప్రచురణలోనే మతసామరస్యం వుంది. దాన్ని రాసింది ముస్లిం సామాజికవర్గానికి చెందిన ఖాదర్‌, ప్రచురించినవాళ్ళు హిందూ సామాజికవర్గానికి చెందిన త్రిపురనేని శ్రీనివాస్‌, రావి రాంప్రసాద్‌. ముస్లిం అస్తిత్వ వాదాన్ని చర్చకు పెట్టిన ‘పుట్టుమచ్చ’ కవితను అంకితం చేసింది రావి శేషయ్యగారికి.

ఇదీ మనం కోరుకునే భారత సమాజం.
మత సామరస్యం ముస్లింలకు ప్రాణవాయువు.
రచన : 17 జూన్ 2020
ప్రసారం : 18 జూన్ 2020
(హర్యాలీ ఆన్ లైన్ వీక్లీ ప్రోగ్రాం)

No comments:

Post a Comment