Sunday 10 February 2019

'సహచరులు' ఆవిష్కరణ 10-2-2019

'సహచరులు'  ఆవిష్కరణ  10-2-2019

వరవరరావు 1985-89 మధ్య కాలంలో ముషీరాబాద్ జైల్లో వున్నారు. అప్పట్లో జైలు నుండి వారు రాసిన పద మూడు లేఖల్ని పర్ స్పెక్టివ్ సంస్థ  'సహచరులు'  శీర్షికతో 1989లో పుస్తకరూపంలో ప్రచురించింది. ప్రస్తుతం వరవరరావు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పెట్టిన కేసులో పూనా ఎరవాడ జైలులో వున్నారు. ఈ సందర్భంగా నవోదయ ప్రచురణలు 'సహచరులు'  పుస్తకాన్ని మళ్ళీ అచ్చువేసింది.

కొత్త పుస్తకాన్ని  ఈరోజు విరసం నల్గొండ పాఠశాలలో నేను  ఆవిష్కరించాను.  మా ప్రసంగాన్ని బెర్తోల్ట్ బ్రెక్ట్ మాటలతో ముగించాను.

   ‘ద గుడ్ పర్సన్ ఆఫ్ షేజ్వాన్’ నాటకంలో  బ్రెక్ట్  ఒక వీధి వేశ్య మాటల్లో  నిర్లిప్త సమాజం మీద తన ఆక్రోశాన్ని ప్రదర్శిస్తాడు.


“ఓరీ మొద్దుబారిపోయిన మనుషుల్లారా! మీ సోదరుడి మీద మూకోన్మాదులు దాడి చేశారు.  మీరు కళ్ళు మూసుకున్నారు. వాళ్ళు అతన్ని పొడిచి పారిపోయారు. మీరు మౌనంగా వుండిపోయారు. ఇదేమి నగరం? మీరేమి మనుషులు? ఒక ఘోరం జరిగినపుడు మనుషులు రగిలిపోవాలి. నగరమంతటా నిరసనలు వెల్లువెత్తాలి. మనుషుల్లో అలాంటి తిరుగుబాటు రాకుంటే చీకటి పడడానికి ముందే ఆ నగరం మంటల్లో మాడి బూడిదైపోవాలి”. 

No comments:

Post a Comment