Wednesday 27 February 2019

జర్నలిస్టులు వార్తల్ని సృష్టించరు; నివేదిస్తారు


జర్నలిస్టులు వార్తల్ని సృష్టించరు; నివేదిస్తారు

పాత్రికేయ వృత్తి అనేకాదు అన్ని వృత్తుల్లోనూ గత కాలపు విలువలు పడిపోయాయి. న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయమూర్తులు న్యాయస్థానాల్లో  ఘోర అన్యాయాలు చేస్తున్నారు. ప్రాణాలు రక్షించాల్సిన డాక్టర్లు మనుషుల అవయవాలతో వ్యాపారాలు చేస్తున్నారు. జర్నలిజం కూడ పతనం అయిందిగానీ ఈ రేంజ్ లో పతనం అయిందని నేను అనుకోను. 

జర్నలిస్టులు వార్తల్ని సృష్టించరు; వార్తల్ని నివేదిస్తారు. ఇటీవల సంస్థాగత రాజకీయ అనుబంధాల కోసం వార్తల్ని కూడ సృష్టిస్తున్నారు. ఇదొక కోణం అయితే, ఇప్పటి అర్హతల ప్రాతిపదికలు మారిపోయాయి. గతంలో రచనానుభవం కలిగినవాళ్ళే ఈ రంగంలోనికి వచ్చేవారు. ఇప్పుడు రెవెన్యూ  తేగలిగినవాళ్ళకే ఈ రంగంలో ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో ఎడిటర్ అంటే అగ్రపీఠం వేసేవారు. ఇప్పుడు సిఇఓ లదే అగ్రపీఠం. ఈ తేడాలను గుర్తించి మన అర్హతల్ని పెంచుకోవాలి. అన్నింటికి మించి ప్రతి జర్నలిస్టూ తనదైన ఒక ప్రత్యేకతను సాధించుకోవాలి. ఆర్ధిక విషయాల్లో మీడియా సంస్థలు ఎంతగా దిగజారినప్పటికీ  వివిధ రంగాల్లో నిపుణులకు ఎప్పుడూ ఎంతో కొంత స్థానం వుంటుంది.


No comments:

Post a Comment