Sunday, 29 December 2024

Is the problem of Tribal limited to the forest?

 Is the problem of Tribal limited to the forest?

ఆదివాసుల సమస్య అడవికే పరిమితమా?

 

మిత్రులారా!

ఆదివాసుల జాతీయ సదస్సులో ప్రారంభోపన్యాసం చేయడం చాలా ఆనందంగావుంది.

ఇలాంటి ఒక మహత్తర అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు.

ఢిల్లీలో జరగాల్సిన ఈ కార్యక్రమం పోలీస్ పర్మిషన్ రాకపోవడంతో రద్దయి విజయవాడకు మారింది.

ప్రారంభ ఉపన్యాసం చేయాలని కేవలం రెండు గంటల ముందే నన్ను నిర్వాహకులు కోరారు. 

ఆదివాసుల సమస్య మీద వున్నఫళంగా మాట్లాడానికి కూడ నేను సిధ్ధంగా వుంటాను.

ణాకు చాలా ఆసక్తివున్న అంశం ఇది. యానాదులకు దేశంలోనే తొలి సమాఖ్యను1998లో పెట్టే అవకాశం నాకు కలిగినందుకు ఇప్పటికీ చాలా ఆనందంగా వుంటుంది.

 

(డిసెంబరు 10న (2024) విజయవాడలో జరిగిన ఆదివాసి సదస్సులో నా ప్రసంగ పాఠం ఇది)

 

ఆదివాసుల సమస్య అడవికే పరిమితమా?

 

కష్టాలు వేరు; అణిచివేత వేరు. కష్టాలు అందరికీ వుంటాయి. గౌతమ్ ఆదానీగారికీ, నరేంద్ర మోదీగారికి కూడ కష్టాలు వుంటాయి. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా అణిచివేతకు గురవుతున్నది ఎవరూ? అని ప్రశ్నించుకుంటే మాత్రం మనకు రెండు సమూహాలు గుర్తుకు వస్తాయి. మొదటిది; ఆదివాసులు. రెండోది; ముస్లింలు..

 

ఆదివాసి, ముస్లిం సమూహాలు ఈ భూమి మీద వుండడం మెగా కార్పొరేట్లకు ఇష్టంలేదు. ఎందుకంటే, ఆదివాసుల కాళ్ళ కింద వుండే ఖనిజాలు, ముస్లిం దేశాల్లోవున్న చమురు నిల్వలు మొత్తంగా వాళ్ళకు కావాలి.

 

రాజకీయాలను, ఆర్ధిక వ్యవస్థను మనం తరచూ విడదీసి చూస్తుంటాం. అవి ఒకే శరీరానికివున్న రెండు తలలు అనుకోము. పైగా, నరేంద్ర మోదీజీ ప్రధాని కావడంవల్ల ఆదానీ, అంబానీల సంపద పెరుగుతోంది అనే అపోహలో వుంటాము. కానీ, మెగా కార్పొరేట్లు తమ సంపదను పెంచుకోవడానికి తమకు అనుకూలమైన రాజకీయ నాయకుడ్ని   ప్రధానిని చేసుకుంటారనే ఆలోచన మనకు రాదు.

 

ప్రభుత్వ విధానాలు, చట్టాలు మెగాకార్పొరేట్లకు అనుకూలంగానే వుంటాయి. అంటే, ఆదివాసులు, ముస్లింలకు వ్యతిరేకంగా వుంటాయి.  ఆదివాసులు, ముస్లింలను అంతరించిపోతున్న జాతులు (endangered species) అనాల్సినంతగా పరిస్థితులు మారిపోతున్నాయి. చంపాల్సిన కుక్కను పిచ్చిది అని ప్రచారం చేయాలని ఓ కుటిలనీతి వుంది. ఇప్పుడు ఆదివాసులు, ముస్లింల మీద అలాంటి కుటిల ప్రచారాన్నే ఏలినవారు సాగిస్తున్నారు. “ఆదివాసులు అనాగరీకులు; ముస్లింలు మూర్ఖులు” - ఇదీ ఆ ప్రచారం సారాంశం.  ఈ ప్రచారాన్ని ఎక్కువ మంది నమ్మరు. కానీ ఓటర్లలో ఓ మూడోవంతు నమ్మి ఓటేసినా దేశాధినేతలు మళ్ళీమళ్ళీ గెలువగలరు.

 

ఆ మధ్య  కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతిని (UCC) అమలు  చేయాలని ఒక ప్రయత్నం మొదలెట్టింది. ముస్లిం సమూహాన్ని ఇబ్బంది పెట్టడానికి తాము ఒక చట్టాన్ని తెస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ పెద్దలు గట్టి సంకేతాలు ఇచ్చారు. తమ ప్రత్యేక ఉనికిని కోల్పోతున్నట్టు  ముస్లిం సమాజం కూడ ఆందోళన చెందింది.  

 

మైదాన సమాజం ‘అనాగరికులు’ అంటూ తరచూ కించపరిచే ఆదివాసులకు ఈ చట్టం వెనుకనున్న అసలు కుట్ర అర్ధం అయింది. మనదేశంలో ప్రస్తుతం ఏడు వందల రకాల ఆదివాసీ సమూహాలున్నాయి.  ప్రతి ఒక్క సమూహమూ ప్రత్యేకమైన సంస్కృతినీ, ఆచార వ్యవహారాలని పాటిస్తాయి.  వైవిధ్యపూరితమైన తమ సంస్కృతుల్ని అంతం చేయడానికే ఉమ్మడి పౌర స్మృతిని తెస్తున్నట్టు వాళ్ళకు బోధపడింది. ఆదివాసి సంఘాలు ఝార్ఖండ్ లో పెద్ద సభ జరిపి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని ఓ తీర్మానం చేశాయి.  

 

          కొన్ని మసీదులను తవ్వితే వాటి కింద హిందూ దేవాలయాల శిధిలాలు కనిపించే అవకాశాలున్నాయి. ఆంతకన్నా లోతుకు  తవ్వితే బౌధ్ధ, జైన దేవాలయాల శిధిలాలు బయటపడే అవకాశాలున్నాయి. అంతకన్నా లోతులకు పోతే ఆదివాసుల ఆరాధనా చిహ్నాల శిధిలాలు కనిపిస్తాయి. కొన్ని మసీదుల మీద సంఘపరివారం చేస్తున్న వాదన ప్రకారం ఈ భూమి అంతిమంగా ఆదివాసులకు చెందాలి. అలా జరక్కపోగా ఆదివాసులకు ఇప్పుడు మిగిలిన భూమిని సహితం లాక్కోవడానికి ఢిల్లీ స్థాయిలో వ్యూహరచనలు సాగుతున్నాయి.

 

          నక్సల్ బరీ-శ్రీకాకుళం రైతాంగ  సాయుధ ఉద్యమాల రూపంలో భారత గడ్డ మీద కమ్యూనిజానికి తిరిగి ప్రాణం పోసింది ఆదివాసులే. ఆ   ఉద్యమాలను చూసి ఉలిక్కిపడిన ప్రభుత్వాలు మైదాన ప్రాంతాల్లో భూపరిమితి చట్టాల్ని, అటవీ ప్రాంతాల్లో ఆదివాసీ భూముల పరిరక్షణ చట్టాల్ని తెచ్చాయి. ఇప్పుడు ఆ చట్టాలను వరుసగా  రద్దుచేసే పనిలో పడ్డాయి.

 

మణిపూర్ లోని  కొండలు అటవీ భూముల మీద ఆదివాసులయిన కుకీ-జోలకు సాంప్రదాయిక హక్కు వుంది. లోయలో వుండే నాగరీకులయిన మెయితీలకు కూడా కొండలు, అటవీ భూముల మీద హక్కు కల్పిస్తూ కొత్త చట్టం చేయడంతో  అక్కడ మంటలు రాజుకున్నాయి. ఇదంతా బహిరంగ రహాస్యమే. దీని వెనుక అంతకు మించిందేదో వుందని కుకీ-జోలకు గట్టి అనుమానం.

 

ఏడాదిన్నరగా అల్లర్లు చెలరేగుతున్నా మణిపూర్ మీద ప్రధాని  కనీసం స్పందించలేదు. వారు మౌనంగా వుంటూనే పార్లమెటులో ఇంకో పని చేశారు. అంతర్జాతీయ సరిహద్దుల నుండి వంద కిలో మీటర్ల లోపువున్న అటవీ భూముల్ని దేశ ప్రయోజనాలకు అవసరమైన వ్యూహాత్మక ప్రాజెక్టుల కోసం వాడుకునేలా చట్ట సవరణ చేశారు.

 

ఇండియాకు ఏడు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులున్నాయి. వీటి పొడవు 15 వేల కిలో మీటర్లు. ఆ లెఖ్ఖన అటవీ భూముల సవరణ చట్టం కేటాయించిన  భూముల విస్తీర్ణం దాదాపు 15 లక్షల చదరపు కిలోమీటర్లు.  అంటే, 37 కోట్ల ఎకరాలు. ఇంతటి విస్తీర్ణమయిన భూమిని ఎవరి కోసం సేకరిస్తున్నారూ? అనేది ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. దేశానికి వ్యూహాత్మక ప్రాజెక్టులంటే రక్షణ శాఖ ప్రాజెక్టులని ఎక్కువమంది భావిస్తారు. ఆదానీ, అంబానీలకు అవసరమైన భూముల్ని కూడ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలకు అవసరమైన వ్యూహాత్మక ప్రాజెక్టులుగా పరిగణించే వీలు లేకపోలేదు.  

 

ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ తో సహా  అనేకం ఈ వంద కిలో మీటర్ల పరిధిలోనికి వస్తాయి. అంటే  వ్యూహాత్మక ప్రాజెక్టులు వస్తే ఈ రాష్ట్రాలు అంతరించిపోతాయి. దేశంలోని రేవు పట్టణాలన్నీ ఈ పరిధిలోనికే వస్తాయి. ఆ వంద కిలో మీటర్ల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడ ఎలాంటి అధికారాలు వుండవు.

 

మణిపూర్ మీద ఎందుకింత ప్రత్యేక ఆసక్తి? అనేది ఎవరికయినా రావలసిన సందేహం. ఈ సందర్భంగా అనేక వాదనలు వినిపిస్తున్నాయి. మణిపూర్ ను ఆనుకుని మయన్మార్, లావోస్, థాయిలాండ్ దేశాలున్నాయి. మెకాంగ్, రువాక్ (Mekong and Ruak) నదులు ఇక్కడే కలుస్తాయి. ఈ మూడు దేశాల సరిహద్దులు కలిసే ప్రాంతానికి ‘గోల్డెన్ ట్రయాంగిల్’ (బంగారు త్రిభుజి) అనే ఒక చెడ్డ పేరుంది.. ఓపియం, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలకు ఇది ప్రపంచ కేంద్రం. 

 

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దులు కలిసే ప్రాంతాన్ని బంగారు నెలవంక (Golden Crescent) అంటారు. అది సహజ మాదకద్రవ్యాల కేంద్రమయితే, ‘బంగారు త్రిభుజి’ సింథటిక్ మాదకద్రవ్యాల  కేంద్రం. ‘యాబా’ అని పిలిచే మెథంఫెటమైన్ (methamphetamine) సింథటిక్ మాదకద్రవ్యం వాణిజ్యం ఇటీవల ఈ ప్రాంతంలో విపరీతంగా పెరిగింది. డ్రగ్స్ తో పాటు ఆయుధాలు, వాణిజ్య సంభోగం (commercial sex) రవాణాలకు ఇది ట్రాన్సిట్ పాయింట్.

 

 ప్రపంచ వాణిజ్యంలో ఆయుధాలకన్నా మాదకద్రవ్యాలది చాలా పెద్ద వాటా.  స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) అంచనా ప్రకారం సాలీన ఆయుధాల వాణిజ్యం వంద బిలియన్ డాలర్లు. అంతర్జాతీయ శ్రామిక సంస్థ (ILO) అంచనా ప్రకారం ‘వాణిజ్య సంభోగం’ కూడా దాదాపు అంతే పరిమాణంలో వుంటుంది. ఐక్యరాజ్య  సమితి ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (UNODC) అంచనా ప్రకారం మాదకద్రవ్యాల వాణిజ్యం 426 బిలియన్ డాలర్లు.

 

 ఆయుధాలకన్నా మాదకద్రవ్యాల అమ్మకాలు నాలుగు రెట్లు ఎక్కువగా వుండడానికి కారణం ఏమంటే, మనుషులు ఆయుధాలను ఎప్పుడో ఒకసారి వాడుతారు. మాదకద్యవ్యాలకు అలవాటు పడితే ప్రతిరోజూ వాటిని కొనాల్సి వుంటుంది. అంచేత, వాణిజ్యంలో భారీ టర్నోవర్ ఆశించే మెగాకార్పొరేట్లు ఇప్పుడు మాదకద్రవ్యాల మీద దృష్టిపెట్టారనే ఊహాగానాలున్నాయి. గోల్డెన్ ట్రయాంగిల్ మీద పట్టుకోసమే మణిపూర్ ను మండిస్తునారని కుకీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

 

ఈ లోకంతో విరక్తి చెందినవారు పూర్వకాలంలో వనవాసానికి పోయేవారు. ఇప్పుడు వనవాసీలకు కూడ అడవిలో ప్రశాంతత లేదు.  ఆడవుల నుండి ఆదివాసుల్ని తరిమేస్తున్నట్టే  పట్టణ శ్రామిక వాడల నుండి ముస్లింలని ఒక పథకం ప్రకారం బుల్ డోజర్లతో తరిమేస్తుండడాన్ని మనం తరచూ చూస్తున్నాం. భారత ముస్లింలలో కొందరు వ్యాపారులు, కొండొకచో కార్పొరేట్లు కూడ వున్నారు. కానీ, అత్యధికులు యంత్రయుగపు కుల వృత్తుల్లో జీవిస్తున్నారు.

 

మెగా కార్పొరేట్ల ఆగడాలు అడవులకే పరిమితంకావు. ఆదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ (AGEL) నుండి పాతికేళ్ళపాటు సోలార్, పవన విద్యుత్తును అధిక ధరకు  కొనడానికి జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీని కోసం ‘నీకెంత నాకెంత’ (quid pro quo) పధ్ధతిలో భారీగా ముడుపులు అందుకుందని   ఇటీవల అంతర్జాతీయ వేదికల మీద పెద్ద దుమారం రేగడం మనకు తెలుసు. ఒప్పుకున్న షరతుల ప్రకారం భారీ నష్టపరిహారాన్ని చెల్లించాల్సివుంటుంది గనుక ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడమూ  ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి  కుదరదు. ఫలితంగా ఆ భారాన్ని రాష్ట్ర ప్రజలే భరించాల్సి వుంటుంది. ఇది కూడా మనకు తెలుసు. కానీ మనకు తెలియాల్సిన మరో పార్శ్వం ఏమంటే ఆదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థకు గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనూ ప్లాంట్లున్నాయి.  వీటి నిర్మాణానికి ఆయా ప్రాంతాల్లో ఆదివాసులతోపాటు, మత్స్యకారులు, వ్యవసాయదారులు, పేదవర్గాల్ని భారీ సంఖ్యలో సామూహిక స్థానభ్రంశానికి  గురిచేశారు.  

 

ఆధునిక పంచభూతాల్లో విద్యుత్తు కూడ ఒకటి కనుక, దాని ఉత్పత్తి కోసం కొందరి స్థానభ్రంశం తప్పదని వాదించేవారూ వున్నారు. నిర్వాశితులకు పునరావాసం-పునర్ వ్యవస్థీకరణ (R&R Package) పథకాలను సంపూర్ణంగా అమలు చేయాలని వాళ్ళు కోరుతున్నారా? లేదు. విద్యుత్తు ఆవశ్యకతను గుర్తించినవాళ్ళు ఈ పార్శ్వాన్ని మాత్రం వదిలేస్తున్నారు.

 

అణిచివేత ఒకచోట మొదలయితే అది ఒకటి రెండు సమూహాలకు పరిమితమై ఆగిపోదు. హిట్లర్ మందు కమ్యూనిస్టుల్ని, యూదుల్ని అణిచివేయాలనుకున్నాడు. అది అతిశయించి మొత్తం తన దేశ ప్రజల్ని అణిచివేయడానికి సిధ్ధమయ్యాడు. అత్యాశపరులయిన కార్పొరేట్ల ఆగడాలకు బలవుతున్నది అడవుల్లో ఆదివాసులు పట్టణాల్లో మరొకరు మాత్రమే అనుకోవడానికి వీల్లేదు. వాటి దుష్ప్రభావాలు దేశప్రజలు అందరి పైనా వుంటాయి; వుంటున్నాయి.  

 

డానీ

సమాజ విశ్లేషకులు

రచన: 29 డిసెంబరు 2024

ప్రచురణ  : 07 జనవరి 2025

https://www.andhrajyothy.com/2025/editorial/is-the-problem-of-tribals-limited-to-the-forest-1356691.html

https://epaper.andhrajyothy.com/Hyderabad_Main_II?eid=224&edate=07/01/2025&pgid=959493&device=desktop&view=3

Friday, 27 December 2024

The Cannibal’s Gospel

ఆదివాసుల మీద కథ రాయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను.

 

ఇంగ్లీషులో నోట్స్ రాసుకున్నాను. అలా ఇంగ్లీషులోనే ఓ కథ ఆర్డరు తయారయ్యింది. నాది ఇంగ్లీషుకాదు తెంగ్లీషు. అంటే తెలుగులో ఆలోచించి ఇంగ్లీషులోనికి తర్జుమా చేసుకోవడం అన్నమాట. దాన్ని సంస్కరించాల్సి వచ్చింది. అందుకు టెక్నాలజీ సహకారం తీసుకున్నాను. కథ ఇలా వచ్చింది.

 

ఇదొక ప్రయోగం మాత్రమే కనుక అస్థిపంజరంలా వున్నా  ప్రచురించేస్తున్నాను. మీ సూచనలు ఇవ్వండి. దాన్ని బట్టి ఫైనల్ స్టోరి తయారు చేస్తాను.

 

 The Cannibal’s Gospel 

This story explores the themes of identity, survival, and the devastating effects of cultural collision. 

    The roaring thunder of the African waterfall rose above the laughter of the American tourists. For them, this untamed wilderness was a spectacle, a canvas painted in green and gold by a careless god. But joy turned to terror in an instant. As Emily fell into the cascading torrent, her scream was swallowed by the deafening water. They watched, powerless, as her fragile white form vanished downstream, claimed by the merciless embrace of the current. 

        The group scattered along the riverbanks, desperate to recover her body. Their search led them into the shadows of tribal villages, where the faces of the locals betrayed neither guilt nor concern. Days passed, and hope dwindled. Finally, a boy emerged—barefoot, dark as night, his eyes sharp with an intelligence that belied his age. 

    Ochieng, they called him. He stood before the desperate Americans and whispered the truth they feared. "We found her," he said, his voice soft but unwavering. "Her skin was like snow, her body soft and ripe. We cooked her, and she was... delicious." 

        The horror of the revelation swept across continents like wildfire. The idea of a "white woman consumed by black savages" ignited a storm of outrage in America. The Church reacted swiftly, sending Father Thomas to the village. Armed with a Bible and a cross, he sought to tame the "savages" and save their souls. 

    The tribes, wary yet intrigued, allowed him into their world. Father Thomas built a church, a beacon of civilization in the heart of the jungle. Among the curious was Ochieng, the boy who had first spoken of the woman’s fate. He became the priest’s eager assistant, drawn less by faith than by the allure of the wine that Father Thomas consumed each night. 

        Ochieng was clever, cunning even. He spun tales of divine visions, claiming that God himself had commanded him to serve the Father. Amused and pleased by the boy’s apparent devotion, the priest indulged him, offering wine as a nightly reward. 

    Gradually, Ochieng adopted the ways of the church, trading his tribal roots for the robes of a preacher. Years passed, and Ochieng—now Father John—became a symbol of redemption, the “civilized savage” paraded by the Church across America. 

    US Newspapers hailed him as a miracle, and senators invited him to their clubs. Yet fame is a fickle mistress. When the novelty wore off, Ochieng found himself abandoned, scraping by as a cobbler on the streets of New York. 

    As fate would have it, rebellion erupted in his homeland, a cry of defiance against foreign exploitation. The U.S. government, eager to crush the uprising, saw an opportunity in Father John. They gave him a uniform, a rank, and a mission: to suppress the very people from whom he had sprung. 

    Promoted to Major John, he led his troops with brutal efficiency. The rebels fell before his wrath, their villages burned, their cries silenced. In his ascent, he had become the weapon of their destruction, severing the last ties to his origins.

     Standing amid the ashes of his birthplace, Major John looked upon the ruins he had wrought. In the reflection of his polished boots, he saw not the boy who once wandered barefoot but the man he had become—a perfect instrument of power, forged by the forces he once feared. 

    The transformation was complete. Ochieng, the child of the jungle, had been consumed by the machinery of civilization, his soul forever caught between the worlds he had destroyed and the one that now claimed him.

//EOM//

Thursday, 26 December 2024

The flood of Books

The flood of Books

*పుస్తకాలు ప్రవాహంలా వస్తున్నాయి!.*




 

*పుస్తకాలు ప్రవాహంలా వస్తున్నాయి!.*

 

ఈమధ్య ఎక్కడికి వెళ్ళినా కనీసం పది పుస్తకాలతో తిరిగి వస్తున్నాను. కొన్ని ఆసక్తితో కొన్నవి; కొన్ని వాళ్ళు అభిమానంతో ఇచ్చినవి. గతవారం ఖమ్మం నుండి సంచెడు పుస్తకాలతో తిరిగి వచ్చాను. ఈవారం  హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ నుండి ఇంకో సంచెడు పుస్తకాలతో వచ్చాను.

 

ఇప్పుడు తెలుగు పుస్తకాలకు కూడా బూమ్ వచ్చింది. నిజానికి పుస్తకాలకు గిరాకీ ఎప్పుడూ వుంది. డిజిటల్ టెక్నాలజీ పెరిగినా, ఆన్ స్క్రీన్ రీడింగ్, ఆడియో బుక్స్, ఏఐ, ఛాట్ జిపిటి వంటి సౌకర్యాలు వచ్చినా యువతరం సహితం నిరంతరం హార్డ్ కాపీ బుక్స్ చదువుతూనే వుంది.

 

హార్డ్ కాపీలో చదువుతున్నప్పుడు పాఠకునికీ కథ నవల రచనల్లోని పాత్రలకు మధ్య ఒక ఆర్గానిక్ అనుబంధం ఏర్పడుతుంది. ఆ ఫీల్ డిజిటల్ రీడింగ్ లో రాదు. కథాంశం తెలుస్తుందిగానీ, పాత్రలతో తాదాత్మ్యం కలగదు. అలాంటి అనుభూతిని ఇవ్వకపోతే అది వర్ణణాత్మక రచన అవ్వదు. వ్యాసం గొడవ వేరు. వ్యాసం మెదడుని ఆలోచింపచేస్తుంది; కథ నవలలు హృదయాన్ని తాకుతాయి.

 

పాఠకుల్ని సృష్టించుకునే బాధ్యత రచయితలదే. కథా చాలా ఎత్తైన ప్రదేశంలో సాగాలి. పాత్రల చిత్రీకరణ చాలా లోతుగా వుండాలి. అప్పుడు పాఠకులు పెరుగుతారు.

 

తీవ్రవాదం, ఉనికివాదాల మూలంగా తెలుగు సాహిత్యం విస్తృతి బాగా పెరిగింది. కానీ, దాని ఎత్తు, లోతు, శైలి, శిల్పాలు పెరగాల్సినంతగా పెరగలేదు. వ్యక్తిగతంగా నేను కూడ తీవ్రవాదం, ఉనికివాదాల ప్రభావంలో కొనసాగుతున్నవాడినే. ఆ వొరవడిలో కొన్ని కథలు కూడ రాశాను.  ఇంకా రాయాలని కూడ అనుకుంటున్నాను.

 

 ప్రపంచ సాహిత్యంతో పోలిస్తే తెలుగు సాహిత్యం స్థాయి రీత్యా వెనుకబడివుంది. ముఖ్యం, నవలా సాహిత్యం. ముందు మనం దీన్ని గుర్తించాలి.

 

అంతర్జాతీయ ఉనికివాద సాహిత్యంలో వచ్చిన హార్పర్ లీ నవల ‘To Kill a Mockingbird’ ను నేను ఓ పాతికేళ్ళు ఆలస్యంగా 1980లలో చదివాను.  ఒక ఉద్వేగానికి గురయ్యాను. 2021లో వచ్చిన ‘జైభీమ్’ తమిళ సినిమాకు ఆధారం 1993 నాటికి  అడ్వకేట్ గా వున్న జస్టిస్ చంద్రు వాదించిన ‘కడలూరు కేసు’ అని మనకు తెలుసు. ‘To Kill a Mockingbird’ సినిమాగా కూడ వచ్చింది. దాని ప్రేరణ కూడ ‘జై భీమ్’ సినిమా  మీద వుందని నాకు అనిపించింది.  రెండు సినిమాలను ఎవరయినా పోల్చుకోవచ్చు.

 

అలాగే, జీన్ పాల్ సార్త్రే (ఫ్రెంచ్ వాళ్ళు ఆయన పేరును మరోలా పలుకుతారట) 1946లో రాసిన ‘The Respectful Prostitute’ నాటకం కూడ ఉనికివాద సాంప్రదాయంలో వచ్చిన గొప్ప రచన. చట్టం ముందు తెల్లవాళ్ళు వేరు; నల్లవాళ్ళు వేరు అని చెపుతుందీ నాటకం.  దాన్ని నేటి ‘ఇస్లామో ఫోబియా’ నేపథ్యంలో తెలుగు అడాప్షన్ చేయాలని  కొంత ప్రయత్నం మొదలెట్టాను. ఒక రచయిత్రి నేను కలిసి దాన్ని తెలుగులో అనువాదం చేశాము. ఇండియన్ అడాప్షన్ దశలో కోవిడ్ కారణంగా ఆ ప్రయత్నం ఆగిపోయింది. హైదరాబాద్ లో నేను కోవిడ్ నుండి కోలుకుంటున్న సమయంలోనే జిలుకర శ్రీనివాస్ కొన్ని కథలు పంపించాడు. ఉనికివాద సాహిత్యంలో శిల్పపరంగా అతను అప్పటికి ముందున్నాడు అనిపించింది.

 

ఉనికివాద సాహిత్యానికి కొన్ని పరిమితులుంటాయి. వుంటున్నాయి అనుకోవచ్చు. అది సూక్ష్మస్థాయికి పరిమితం అయ్యే ప్రమాదం వుందని మనం గమనించాలి. దాన్ని స్థూలస్థాయికి పెంచాలి. ఏదో ఒక పక్షాన్ని కాకుండా మొత్తం సమాజాన్ని సమస్య మీద సెన్సిటైజ్ చేయడం లక్ష్యంగా మారాలి.

 

కొత్త తరాన్ని కలిసినప్పుడెల్లా వాళ్ళు కొత్త ఇంగ్లీషు నవలల గురించి చాలా ఆసక్తిగా మాట్లాడుతున్నారు. వాళ్ళేమీ తెలుగుకు వ్యతిరేకులుకాదు. వాళ్ళొక కొత్త మార్కెట్. దాన్ని తెలుగు రచయితలు ఏ మేరకు వుపయోగించుకుంటారో చూడాలి. ఫలానా తెలుగు కథ ఫలానా  ఇంగ్లీషు కథ నుండో, లాటిన్ అమెరికన్ కథ నుండో పుట్టిందని ఇప్పుడు వినిపిస్తోంది. ఫలానా ఇంగ్లీషు కథ ఫలానా తెలుగు కథ నుండి పుట్టిందని అనుకునే రోజులు రావాలి. దానికోసం ఇప్పుడున్న తరాలన్నీ కలిసి ఒక సమిష్టి ప్రయత్నం చేయాలి. 

 

నేను ‘సీనియర్’ ని కనుక కొత్తవాళ్ళను మెచ్చుకో ‘లేననే’  అభిప్రాయం కొందరికి సహజంగానే వుంటుంది. అది నిజం కాదు. నాకు నచ్చింది నచ్చిందని చెపుతూనే వున్నాను. అందరూ గొప్పగా రాస్తున్నారని చెప్పడం ఎలాగూ సాధ్యంకాదు. అయినా నేను అచ్చయిన పుస్తకాలన్నీ చదవడంలేదు. అవకాశాన్నిబట్టి చదువుతున్నాను.

 

ఇంకా గురజాడ, చెలం, శ్రీశ్రీ, యేనా? అనేవాళ్ళూ వున్నారు. ఆరోజుల్లో కూడ ఆ ముగ్గురే లేరు. వాళ్లతో పాటు చాలామంది వున్నారు. ఆ ముగ్గురే మనకు గుర్తున్నారు. ఇపుడూ అంతే చాలా మంది రాస్తుంటారు. ఓ ముగ్గురో నలుగురో తరువాతి తరాలకు గుర్తుంటారు.

 

కొండశిఖరం మీద నిలబడి రాయాలి అని నేను తరచుగా అంటుంటాను. అంటే ఏమిటీ? అని కొందరు అడుగుతుంటారు. వాళ్ళు నిజంగానే తెలుసుకోవాలని అడుగుతున్నారో, వెటకారంగా అంటున్నారో  అనే సందేహం వస్తుంటుంది.

 

ప్రపంచ మానవాళిని కుదిపేసిన ఒక ప్రళయ సంఘటన హీరోషీమా  మీద  1945 ఆగస్టులో అణుబాంబు వేయడం. ఆ ‘లిటిల్ బాయ్’ను ఎవరు వేశారూ? ఎవరు వేయించారు? తయారు చేసినవారు ఎవరూ? మానవ వినాశనాన్ని సాంకేతిక అభివృధ్ధి అనవచ్చా? దీనికి ఎవరెవరెరు సహకరించారు? వాళ్ళెందుకు చేశారూ? ఇది విజ్ఞానశాస్త్ర ప్రయోగమా? క్రూరత్వానికి నిదర్శనమా? ఇందులో  ఉనికివాద కోణం కూడ వుందా? క్రైస్తవ యూదు ఘర్షణ వుందా?  హిట్లర్ కోసం తయారు చేసిందాన్ని జపాన్ మీద వేశారా? అణుబాంబును తయారు చేసిన వాడు దాన్ని ప్రయోగించడానికి ముందు ఎలా వున్నాడూ? లక్షల మంది చనిపోయారని తెలిశాక అతని మానసికస్థితి ఏమిటీ? అతను మహాశాస్త్రవేత్తా? మానవరూపంలోవున్న మహామృత్యువా? ఇలాంటి ప్రశ్నలు వేసుకోవాలి. ఇంతకు మించిన అనేక సందేహాలు Kai BirdMartin Sherwin అనే జంట రచయితలకు వచ్చాయి. వాళ్ళు 2005లో ‘American Prometheus: The Triumph and Tragedy of J. Robert Oppenheimer” పేరిట అణుబాంబు తయారీదారుని జీవిత చరిత్రను రాశారు.   ప్రొమేథియస్ అంటే గ్రీకు అగ్నిదేవుడు.  ఇతనికి విచక్షణ,  ముందు చూపు అనే విశేషణాలు కూడ వున్నాయి.

 

          చారిత్రక సంధి సమయంలో మనం కిరీటధారుల క్రౌర్యాన్ని గురించి రాయాలి అని నాకు అనిపిస్తుంది. దేశ కిరీటధారుల గురించి రాయాలి. వీలయితే ప్రపంచ కిరీటధారుల గురించి రాయాలి. ప్రపంచ నియంతలయిన ముస్సోలిని, హిట్లర్ ల గురించి వాళ్ళు బతికున్న కాలంలోనే 1940లో ఒక స్క్రిప్టు రాసి సినిమా తీసి  ప్రపంచానికి చూపించాడు చార్లీ చాప్లిన్. ప్రపంచ సాహిత్యంలో చోటు సమ్పాదించాలంటే ఇప్పుడు మనమేం చేయాలీ?

 

          ఇప్పుడు ప్రపంచంలో రష్యా-ఉక్రేయిన్ మధ్య, ఇజ్రాయిల్-పాలస్తీనల మధ్య యుధ్ధాలు జరుగుతున్నాయి. సుడాన్, సిరియా, యమన్ లలో అంతర్యుధ్ధాలు జరుగుతున్నాయి. ప్రపంచ యుధ్ధం దగ్గరగా వుందని అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాడ్ ట్రంప్ హెచ్చరిస్తున్నాడు.

 

          భాష; తెలుగు సరే. కథాంశం కూడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే  సాగాలా? ఎందుకీ స్థలకాల పరిమితులు?. జాక్ లండన్ ఐదు వేల కిలో మీటర్లు అత్యంత ప్రమాదకరమైన ప్రయాణం చేసి అలాస్కా వెళ్ళి వచ్చి నవల్లు, కథలు రాశాడు. పంజాబ్ లో అశాంతి చెలరేగిన కాలంలో ‘కృపాణ్’,  హర్యాణ, ఉత్తర ప్రదేశ్లో మతకల్లోలాలు సాగినప్పుడు ‘మదరసా మేకపిల్ల’ రాయడానికి నాకు ఒక విధంగా జాక్ లండన్ పడిన ప్రయాస ప్రేరణ.  మణిపూర్ నేపథ్యంలో ఒక నవల రాసే ప్రయత్నంలో వున్నాను.  

 

ఇప్పుడు మన దేశంలో మతతత్త్వంతో కూడిన నియంతృత్వం కొనసాగుతోంది. దీనికి సూత్రధారులు ఎవరూ? పాత్రధారులు ఎవరూ? అబ్దిదారులు ఎవరూ? కాల్బలం ఎవరూ?  అమాయికపు ఉద్రేకాలకు గురవుతున్న దెవరూ? బాధితులు ఎవరూ? వంటి ప్రశ్నలు వేసుకుని చేసే రచనలు ఒక చారిత్రక దశకు అద్దంపట్టి కాలాతీతంగా నిలబడతాయి అని నేను అనుకుంటాను. భిన్నమైన అభిప్రాయాలు, నిర్వచనాలు  ఎప్పుడూ వుంటాయి. వుండనివ్వండి.

 

          తెలుగులో కొత్త రచయితలు ఇంకా కొండ శిఖరం మీదకు చేరుకోకపోయినా  కొత్తగా రాస్తున్నారు. కొత్త తరాన్ని ఆకర్షిస్తున్నారు. త్వరలో వాళ్ళు కొండ శిఖరం మీదకు చేరుకోనూ వచ్చు. అది వాళ్ళకేగాక తెలుగు సాహిత్యానికీ చాలా మేలు చేస్తుంది. ఆ రోజు కోసం అందరం ఎదురుచూడ్డం కాదు; కృషి చేద్దాం. 

 

ఉషా యస్ డానీ

FaceBook Post

విజయవాడ,  27 డిసెంబరు 2024


Thursday, 19 December 2024

Philosophy of Karl Marx: Dialectical and Historical Materialism

 

Philosophy of Karl Marx: Dialectical and Historical Materialism

Karl Marx's philosophy centers on understanding and transforming society through the lens of material conditions and economic structures. His concepts of dialectical materialism and historical materialism form the backbone of Marxist theory, providing a framework to analyze societal development, class struggles, and the dynamics of capitalism.


1. Dialectical Materialism

Definition: Dialectical materialism is a philosophy of science and nature developed from the works of Karl Marx and Friedrich Engels. It combines Hegel's dialectical method with materialism, emphasizing the primacy of the material world over ideas.

Key Features:

  1. Dialectics:

    • Based on Hegelian dialectics, which proposes that change occurs through contradictions and their resolution (thesis, antithesis, synthesis).
    • Marx adapted this to focus on material conditions rather than abstract ideas.
  2. Materialism:

    • Reality is fundamentally material, and ideas arise from material conditions.
    • Human consciousness and institutions are shaped by the economic base (means of production and relations of production).
  3. Change through Contradictions:

    • Progress happens through the resolution of contradictions within material conditions, such as the conflict between labor and capital.

Example: In capitalism, the contradiction between the bourgeoisie (owners of production) and the proletariat (workers) leads to class struggle, which drives societal transformation.


2. Historical Materialism

Definition: Historical materialism applies the principles of dialectical materialism to the study of human history, positing that the economic base (infrastructure) shapes the superstructure (culture, politics, religion, etc.).

Key Features:

  1. Material Conditions Determine History:

    • Economic structures and modes of production are the primary drivers of historical change.
  2. Stages of Development:

    • Marx identified historical stages based on modes of production:
      • Primitive Communism
      • Slave Society
      • Feudalism
      • Capitalism
      • Socialism
      • Communism
  3. Class Struggle:

    • History is the history of class struggles, where one class dominates and exploits another until revolutionary change occurs.
  4. Base and Superstructure:

    • The "base" (economy) determines the "superstructure" (institutions, ideologies), but the superstructure can also influence the base.

Example: The transition from feudalism to capitalism occurred due to contradictions in feudal society, such as the rise of a merchant class that eventually overthrew feudal lords.


Books Explaining These Theories

While Marx did not write a single book exclusively dedicated to these theories, they are developed across his works, especially:

  1. "The Communist Manifesto" (1848):

    • Co-written with Friedrich Engels, it outlines the principles of historical materialism and the inevitability of proletarian revolution.
  2. "Das Kapital" (1867):

    • Marx's magnum opus focuses on the critique of political economy, detailing the workings of capitalism and the contradictions inherent in it.
  3. "The German Ideology" (1845-1846):

    • Co-written with Engels, this work elaborates on historical materialism, critiquing idealist philosophy and explaining the materialist conception of history.
  4. "Critique of Hegel's Philosophy of Right" (1843):

    • Marx critiques Hegel's idealism and emphasizes material conditions as the basis of societal development.
  5. "Theses on Feuerbach" (1845):

    • A brief but foundational text, where Marx states, "The philosophers have only interpreted the world, in various ways; the point is to change it."

Legacy and Influence

Marx’s theories of dialectical and historical materialism have had profound impacts on:

  1. Political Movements:

    • Marxist ideologies influenced socialist and communist revolutions, including the Russian Revolution (1917) and the Chinese Revolution (1949).
  2. Philosophy:

    • His materialist approach reshaped social sciences, emphasizing the role of economic structures in shaping society.
  3. Critique of Capitalism:

    • Marx provided a systematic critique of capitalism, predicting its eventual collapse due to internal contradictions.

Conclusion

Karl Marx’s dialectical and historical materialism provide a comprehensive framework to analyze and understand the dynamics of societal change. His works, particularly Das Kapital and The Communist Manifesto, remain foundational texts in philosophy, economics, and political theory. These theories continue to influence debates on class, power, and the future of society.

Review on Jayasree Muvva 's story NOPPI

 Review on Jayasree Muvva 's story NOPPI

*గొప్ప రచయిత్రి కావడానికి ప్రయత్నించు*  

నీ కథ ‘నొప్పి’ ఇప్పుడే చదివాను. 

ఇదొక షాక్ ట్రీట్మెంట్ కథ. 

క్లుప్తంగా సూటిగా శిల్ప పరంగా బాగుంది. 

 

అక్కడక్కడ భావోద్వేగాలను కవితాపరంగా వ్యక్తం చేయడం నచ్చింది. 

వచనంలో కవిత్వం బాగుంటుంది కూడ. 

 

“మాటలైతే మల్లెపూలకి వెన్నెలద్దుకున్నట్టే వుంటాయి”.

“శరీరానికి మాత్రమే కదా ఇంకో మనిషిని పుట్టించే శక్తి అవకాశం వుంది”. 

“వొళ్ళంతా కదిలిస్తూ తంగేడు కొమ్మని దులిపినట్టు నవ్వేది”. 

“ఆమె ప్రేమ, అతని మత్తు ఎవరూ ఎవరినీ జయించలేకపోయారు”. 

 “మాటకంటే మౌనం చాలా పదునుగా వుంటుంది”. 

“ఒక్కోసారి నిశబ్దం చేసే శబ్దం వినలేనంత భయంకరంగా వుంటుంది”.

“లోపల గుండె అంతా ఎవరో తగలబెట్టినట్టు  కమురు వాసన”.

“ఒంట్లో నీరు యాతం వేసి తోడినట్టు” 

“ఎవరికీ కనిపించని యుధ్ధం”

“రెండు వైపులా తానే పోరాడుతోంది”. 

 “మత్తుకన్నా అనుమానం మనిషిని కుమ్మరి పురుగులా తొలిచేస్తుంది”. 

“ఆవిరి ముద్దలా”

“మనిషి నాగుపాము కంటే ఎక్కువ విషం చిమ్ముతూ నాలుక చాపినట్టు”.

వంటి వ్యక్తీకరణలు బాగున్నాయి. 

 

నీ వాక్యాలకు చదివించే గుణం వుంది. 

 

“బతికే వున్నాడా? వుండాలి” అనే ముగింపు బాగుంది.  

వాడు బతికుండాలి. వాడిని చూసినప్పుడెల్లా లోకం వాడు చేసిన తప్పును గుర్తుచేసుకోవాలి. మరొకడు అలాంటి తప్పుచేయడానికి భ యపడాలి. 

 

ఇవి నీ కథలో వున్న పాజిటివ్ అంశాలు. 

 

కథకులు ఎంపిరికల్ అనుభవం దగ్గర ఆగిపోవడం నాకు నచ్చదు. 

దానితో కథల విస్తృతి మరీ చిన్నదై, వ్యక్తిగతం అయిపోతుంది. 

ఇప్పుడు చాలా మంది తెలుగు కథకులు ఈ స్థాయిలోనే ఆగిపోతున్నారు. 

అలా ఆగిపోవడం నేరం ఏమీకాదుగానీ, తమది అంతర్జాతీయ స్థాయి అనుకుంటున్నారు. 

ఇది వాళ్ళ పెరుగుదలనేగాక, మొత్తం తెలుగు సాహిత్యం పెరుగుదలను అడ్డుకుంటుంది. 

 

భార్య ప్రొటోగానిస్ట్ అయితే భర్త యాంటోగోనిస్టు.

ఒక ఊరు ప్రొటోగోనిస్టు అయినప్పుడు యాంటోగోనిస్టు ఎవరూ? 

సమాజం ప్రొటోగోనిస్టు అయినప్పుడు యాంటోగోనిస్టు ఎవరూ? 

దేశం ప్రొటోగోనిస్టు అయినప్పుడు యాంటోగోనిస్టు ఎవరూ? 

ప్రపంచం ప్రొటోగోనిస్టు అయినప్పుడు యాంటోగోనిస్టు ఎవరూ? 

తెలుగు రచయితలు ఇలా ప్రశ్నించుకుంటూ తమ స్థాయిని పెంచుకోవాలి.

తద్వార తెలుగు కథ స్థాయి కూడ పెరుగుతుంది.  

ఓ వందేళ్ళ క్రితం  సాహిత్యం పాలకులదే వుండేది. దాన్ని వ్యతిరేకిస్తూ

పాలితుల గురించి రాయాలనే సాంప్రదాయం వచ్చింది. ఇది మంచి సాంప్రదాయం. అయితే, అందులోనూ

ఒక అతివాదం వచ్చింది. పోరాటాలను చిత్రించేదే సాహిత్యం అనేవారు  వచ్చారు. పోరాటం అనేది మనిషి అంతర్గ సంఘర్షణ కూడ

కావచ్చు. దాన్ని ఒక ప్రాంతానికి ఓ రెండు జిల్లాలకు  కుదించడం సంకుచిత వాదం (Reductionism). అతివాద వాస్తవికవాదంవల్ల తెలుగు సాహిత్యానికి చాలా నష్టం

కూడ జరిగింది. ఇప్పుడు ధోరణి మారుతోంది. 


వ్యక్తిగతంగా నాకు కూడ నష్టం జరిగింది. నాకు జానపద సాహిత్యం, మాయలు, మంత్రాల సాహిత్యం మీద   కొంత పట్టుంది.

నేను పోరాట ప్రాంతానికి చెందిన వాడిని కాను. Fantasy, Folkloric and magical Traditionలోనూ పోరాట సాహిత్యం   రాయవచ్చు

అనుకున్నాను. ప్రవక్త మోజెస్ ఎర్ర సముద్రాన్ని చీల్చిన సంఘటన ప్రేరణతో వేలం అనే ఒక

కథను కూడ రాశాను. కానీ అప్పట్లో దాన్ని ఆమోదించేవారుకారు. ఈ సాంప్రదాయంలో ఆఫ్రికన్లు,

లాటిన్ అమెరికన్లు గొప్ప విజయాలను సాధించారు. Gabriel  García Márquez's నవల ‘One Hundred Years of Solitude’ చదివే వుంటావు. అలాగే వీలయితే  Guillermo del Toro సినిమా Pan's

Labyrinth తప్పకుండా చూడు. నియంతృత్వాన్ని ఇంత ఫాంటిసీగా చెప్పడం ఒక అద్భుతం అనిపించింది. 

 

ఇది నా అభిప్రాయం మాత్రమే. 

నా అభిప్రాయం అల్టిమేట్ అని నేను ఎన్నడూ అనుకోను. 

నా అభిప్రాయాన్ని ఏ వేదిక మీద అయినా ఇలాగే చెపుతాను.  

మొన్న ఖమ్మం ఈస్థటిక్స్ సభలోనూ ఈమాటే అన్నాను. 

నీకు నచ్చిందో లేదో నాకు తెలీదు. 

కొందరికి నచ్చుతుంది; కొందరు నొచ్చుకుంటారు. 

 

నీ కథలో కొన్ని గ్రామెటికల్ తప్పులు కనిపించాయి. 

ఇలాంటి తప్పుల్ని సీనియర్లు కూడ చేస్తున్నారు. 

నిజానికి వీటిని ఎవరూ పట్టించుకోవడంలేదు. 

కానీ పట్టించుకుంటే చదవడానికి ఇంకా బాగుంటుంది.  

 

… గాల్లోకి తీక్షణంగా చూస్తుంది – చూస్తోంది, చూస్తున్నది,  

అరుస్తుంది – అరుస్తోంది. 

పొగలు కక్కుతుంది – పొగలు కక్కుతోంది.

పోరాడుతుంది – పోరాడుతోంది. 

ఏడుస్తుంది –ఏడుస్తున్నది. 

 

సూర్యుడు ఉదయిస్తాడు – తధ్ధర్మ క్రియ. 

సూర్యుడు ఉదయిస్తున్నాడు – present continuous tense

జరుగుతుంది వేరు; జరుగుతున్నది వేరు.  

రెండింటికీ తేడా వుంది. గమనించు. 

 

మరింత పెద్ద వేదిక మీద నిలబడి మాట్లాడానికి ప్రయత్నించు. 

దానికి కావలసిన దినుసులు నీ దగ్గరున్నాయి.  వాడుకో. 

 

నువ్వు ఆల్రెడీ రచయిత్రివి. గొప్ప రచయిత్రి కావడానికి ప్రయత్నించు. 

 

-        డానీ 

Tuesday, 17 December 2024

Kethu Viswanatha Reddy's story 'Rekkalu' - Three-Act Play analysis

 

*కేతు విశ్వనాధ రెడ్డిరెక్కలుకథ - మూడు అంకాల విశ్లేషణ*

ఉషా యస్ డానీ

          కథకులు వేరు; విమర్శకులు వేరు అనే అసంబధ్ధపు బైనరీ ఒకటి ఇటీవల తెలుగు సాహిత్య సమూహాల్లో కొనసాగుతోంది. దీనికి పరిష్కారంగా నేరుగా కథకుల్నే ఒకచోట కూర్చోబెట్టి ఇతర కథకుల కథల్ని సమీక్షించమనడం మంచి ఆలోచన. ‘కథాంతరంగం – 2024’ పేరిట ఖమ్మం ఈస్థటిక్స్ సంస్థ ఇలాంటి వినూత్న ప్రక్రియను చేపట్టింది. ఇదొక మంచి పరిణామం.

          దాదాపు 30 మంది రచయితలు నాలుగు బృందాలుగా ఏర్పడి రెండు రోజులుగా (డిసెంబరు 14,15) 5 క్లాసిక్ తెలుగు కథల మీద చర్చించారు.   చర్చల సారాంశాన్ని నాలుగు బృందాల నుండి నలుగురు ప్రతినిధులు సమర్పించారు. వీరుగాక, మరి కొందరు సీనియర్ కథా సాహిత్య పరిశీలకులు కూడ ఈ చర్చల్లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

        ఇప్పుడు ఆరో క్లాసిక్ తెలుగు కథగా  సుప్రసిధ్ధ రచయిత కేతు విశ్వనాథ రెడ్డి (1939, జూలై 10 - 2023, మే 22)  రాసినరెక్కలుకథను మీరందరూ పరిశీలించారు. మీ ప్రతిస్పందనను మీ ప్రతినిధులు ఈ వేదిక మీద నుండి వివరించారు. రెక్కలు’ కథకు సంబంధించిన అనేక అంశాలు, పార్శ్వాలు, సూక్ష్మాలను పోలింగ్ డ్యూటీలో  తమ స్వీయ అనుభవాలను కూడ కలిపి  వారు ప్రస్తావించారు.  కేతు విశ్వనాథ రెడ్డి కథల్లో ప్రత్యేకంగా వినిపించే కథకుని కంఠధ్వని (tone) గురించి కూడ రావులపాటి సీతారాం గుర్తు చేశారు. గంటన్నరకు పైగా సాగిన ప్రక్రియను సమీక్షించడం ఇప్పుడు నాకు అప్పగించిన బాధ్యత.

ఇంతకు ముందే ప్రతినిధులు, సీనియర్ సాహిత్య పరిశీలకులు ఈ కథ గురించి ప్రస్తావించిన అంశాలను నేను రిపీట్ చేయను. పునరుక్తి దోషం రాకుండా కథ నిర్మాణం గురించి మాట్లాడుతాను. ఇది అందరికీ కాకున్నా కొందరికైనా ఉపయోగకరంగా వుంటుందని ఆశిస్తాను.

కథ; ఒక సంఘటనను ఎంచుకుని దాన్ని పది కోణాల్లో  వివరిస్తుంది. నవల చాలా విస్తారమైనది. పాత్రలకు వుండే అనేక పార్శ్వాలనూ, వివిధ సందర్భాల్లో, విభిన్న చారిత్రక దశల్లో అవి  ప్రతిస్పందించిన తీరును  చిత్రిస్తుంది.

          ఇది ఒక కథ. అంటే  ఒక సంఘటన. కథా రచన గురించి మనందరికీ  తెలిసిన బేసిక్స్ రెండున్నాయి. రచయిత ఏ సంఘటన ద్వార కథను  చెప్పాడు అనేది కథాంశం. కథ ద్వార రచయిత ఏం చెప్పదలచుకున్నాడు? అనేది కథా వస్తువు. నవలకు కూడ ఈ సూత్రమే వర్తిస్తుంది. పోలింగ్ బూతులో ఎలక్షన్ డ్యూటీ చేస్తున్న  బృందానికి ఒక రోజు కలిగిన అనుభవం ఇందులో కథాంశం. మహిళల స్వీయరక్షణ (Self defense)  ఇందులో కథావస్తువు.

          ఓ మూడు పాత్రల ద్వార ఈ కథను చెప్పాలనుకున్నాడు రచయిత.  మొదటిది; కథ చెపుతున్నవాడు. ఉత్తమ పురుష. ఆ పాత్రకు పేరులేదు. అతని  పదవి కూడా రచయిత స్పష్టంగా చెప్పలేదు. కానీ అతను అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ అని మనకు అర్థం అవుతుంది. రెండో పాత్ర   పోలింగ్ ఆఫీసర్ నాగేశ్వర రావు. మూడో పాత్ర మహిళా కానిస్టేబుల్ / హోంగార్డు పంకజం.

          జలపాతంలా జలజలా పారుతూ అగ్నికణంలా రగులుతూ ఇట్టే ఆకట్టుకునే స్వభావంతో సందడి చేస్తుంటుంది కనుక ఈ కథ ఆమె కోసమే  అనిపిస్తుంది. నిజానికి కథను పంకజం కోసం రాయలేదు. మరెవరి కోసం రాసినట్టూ?  కథలో ప్రధాన పాత్రను నిర్ధారించడానికి మనకు కొన్ని పరికరాలు ప్రమాణాలూ వున్నాయి.

సాహిత్యానికి మారకపు విలువ వున్నా లేకపోయినా ఉపయోగపు విలువ అయినా వుండాలి. సాహిత్యం మెరుగయిన సమాజ నిర్మాణానికి తోడ్పడాలి. అదే సాహిత్య ప్రయోజనం. మెరుగయిన సమాజం  అంటే కొందరికి సమసమాజం. కొందరికి కుల అణిచివేత లేని సమాజం. కొందరికి మతసామరస్యంతో మెలిగే సమాజం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు  సనాతన ధర్మాన్ని పాటించేదే మెరుగైన సమాజం. సరే, ఇదంతా కథల బహ్యాత్మక ప్రభావం.

సాహిత్యానికి సమాజాన్ని మార్చే శక్తి ఏమాత్రం వుండదు అనే వారున్నారు. కళ కళ కోసమేగానీ మధ్యలో ఈ సమాజం ఎక్కడి నుండి వచ్చిందీ? అని గడుసుగా అడిగే వారూ వున్నారు. సరే; ఎవరి ఛాయిస్ వారిది.

సాహిత్య ప్రక్రియల్లో అంతర్గత ప్రభావం ఒకటి వుంటుంది. రచన ఒక స్థితిలో ఆరంభమయ్యి అంతకన్నా మెరుగైన స్థితిలో ముగియాలి. కనీసం మెరుగైన ఆలోచనల్ని రగిలిస్తూ ముగియాలి. మూల స్థితికన్నా గమ్యస్థితి మెరుగ్గా వుండాలి. ఆరంభ స్థితికన్నా ముగింపు స్థితి వున్నతంగా  వుండాలి. కథ సాగేకొద్దీ పరిమాణం పెరగడమేగాక ఒక గుణాత్మక పరిణామం చోటుచేసుకోవాలి.  

కథలో ఇలాంటి మార్పు ఎవరిలో వచ్చింది? పంకజం ఎలా ఎంటరయ్యిందో అలాగే వెళ్ళిపోయింది. ఆమెలో మార్పు లేదు. పి వో నాగేశ్వర రావు ఎలా ఎంటరయ్యాడో అలాగే వెళ్ళిపోయాడు. అతనిలోనూ కొత్తగా వచ్చిన మార్పు లేదు. కానీ పి వో పాత్ర అలా కాదు. ఒక భయంతో మొదలయ్యి కథా క్రమంలో కొంత ధైర్యాన్ని కూడబలుక్కుంటాడు. కథలో మార్పు వచ్చింది ఈ పాత్రలోనే. అదే ప్రధాన పాత్ర. అతనిలో కలిగిన  పరివర్తనకు కారణం పంకజం. ఆమె గమనం; అతను గమ్యం.

ఆడపిల్లల్ని తల్లిదండ్రులు తమ రెక్కలతో కాపాడడం ఎల్లకాలం  సాగదు; కుదరదు. అంచేత, ఆడపిల్లల్ని తమ స్వంత కాళ్ళ మీద నిలబడేలా ప్రోత్సహించాలి  అని గ్రహిస్తాడు ఏ పి వో. ఇది గుణాత్మక మార్పు. ఇదే కథ ప్రయోజనం.

కథకు ఎంచుకున్న మూడు అంకాల (three-act play)  ఫార్మాట్ బాగుంది. మూడు అంకాలంటే ఆరంభ సన్నివేశంసంఘర్షణ -  పరిష్కారం. (Set up – confrontation – resolution). తర్కశాస్త్రంలో ప్రతిపాదన – ఖండన – పరిష్కారం (Thesis – Antithesis – Synthesis) అని వుంటాయి. అవే కళాసాహిత్య రంగాల్లో ఆరంభ సన్నివేశంసంఘర్షణ -  పరిష్కారంగా మారుతాయి.

ఆరంభ సన్నివేశం, సంఘర్షణ, పరిష్కారాల్లో దేనికి ఎంత శాతం చోటు కేటాయించాలనే సందేహాలు అక్కరలేదు. మన ఇంగితాన్ని బట్టి కొన్నింటికి  ఎక్కువ స్పేస్ కేటాయించవచ్చు. కొన్నింటికి తక్కువ స్పేస్ కేటాయించవచ్చు. వరుస క్రమం కూడ సరిగ్గా ఇలాగే వుండాలని ఏమీలేదు. ఘర్షణని ముందుకు తేవచ్చు. ఆరంభ సన్నివేశాన్ని వెనక్కి గెంటేయ వచ్చు. అవన్నీ మన సృజనాత్మకత మీద ఆధారపడి వుంటాయి. మూడు అంకాల్ని సరిగ్గా అర్ధం చేసుకోవడం అన్నింటికన్నా ముఖ్యం. ఆ తరువాత మనకు ఇష్టమొచ్చినట్టు  వాటితో ‘మూడు ముక్కలాట’ ఆడుకోవచ్చు.

three-act play  అనగానే మనకు ప్లేటో గుర్తుకొస్తాడు. అయితే కథా నవలా నాటక సాహిత్యాల్లో  three-act playను పాటించాలని ప్లేటో ఎక్కడా చెప్పలేదు. (అప్పటికి ఇన్ని కళా సాహిత్య ప్రక్రియలు కూడ లేవు.) కానీ, తన రచనల్లో three-act play విధానాన్ని ప్లేటో పాటించాడు.  three-act playను ప్లేటో సిధ్ధాంతీకరించాడంటే ఎన్ వేణుగోపాల్ వంటివాళ్ళు ఒప్పుకోరు. రుజువుగా ప్లేటో నుండి స్పష్టమైన కొటేషన్ ఒకటి కావాలంటారు. ప్రజాస్వామ్యంలో డిసెంట్ వాయిస్ కూడ ఒకటి వుండాలిగా? వుండనిద్దాం. వాచ్యంగా వున్నా లేకపోయినా లోకంలో కొన్నింటిని మనంగా అర్ధం చేసుకోవాలి.  అంచేత చాలామంది  three-act play మీద కాపి రైట్స్ ను ప్లేటోకు ఇచ్చేశారు.

          three-act play కోసం ఇప్పుడు మీరు ప్లేటోను ప్రత్యేకించి చదవాల్సిన పనిలేదు. అంతంత హోం వర్క్ అక్కరలేదు. మనకు నచ్చిన ప్రతి రచనలోనూ పరికించి చూస్తే  మూడు అంకాల విధానం వుంటుంది. రామాయణం, మహాభారతం, భాగవతం లోనూ మూడు అంకాల నిర్మాణాన్ని చూడవచ్చు.

          శ్రీరామునికి పట్టాభిషేకం జరిపేందుకు సన్నాహాలు జరుగుతుంటాయి. అది ఆరంభ సన్నివేశం. పట్టాభిషేకాన్ని రద్దుచేసి శ్రీరాముడ్ని అడవులకు పంపుతారు అది సంఘర్షణ. రావణుడు వచ్చి సీతను ఎత్తుకు పోతాడు అది మరింత పెద్ద సంఘర్షణ. రావణుడ్ని శ్రీరాముడు వధిస్తాడు. శ్రీరాముడు ప్రతీకారం తీర్చుకున్నాడు సరే.  ఇందులో లోకకళ్యాణం కూడ వుంది. వ్యక్తిగతం కాస్తా సామాజికం అయిపోయింది. అది ఉన్నత స్థితి. అదే  పరిష్కారం.

          ‘రెక్కలు’ కథ సుఖాంతం అవుతుంది. అయితే, సుఖాంత కథల్లోనేగాక విషాదాంత కథల్లోనూ మెరుగయిన సమాజ సూచనలుంటాయి. ఉదాహరణకు గౌరీ లంకేష్ మీద కథ రాస్తే చివరకు ఆమె దారుణ హత్యకు గురవుతుంది. ఇది విషాదాంతమే. కానీ ఇలా జరక్కూడదు, మరో గౌరీ లంకేష్ చనిపోకూడదు అని పాఠకుడికి అనిపిస్తుంది. అప్పుడూ అది మెరుగైన సమాజం కోసం ఆరాటమే  అవుతుంది.

మంచి రచయితలు అసంకల్పితంగానే మూడు అంకాల నియమాలని పాటిస్తారు. రచయితలకు మూడు అంకాల నియమాల గురించిన అవగాహన వుంటే మరింత మంచి కథలొస్తాయి. అందుకే సాహిత్య విమర్శకులు మూడు అంకాల నిర్మీతిని వివరిస్తుంటారు. ఈ చట్రాన్ని కొందరు నిరాకరించవచ్చు. ఆ హక్కు ఎవరికయినా వుంటుంది. నిరాకరించడం కోసం అయినా సరే  ముందు ఈ మూడు అంకాల చట్రాన్ని అర్ధం చేసుకోవాలి.

కథ మొదటి పేరాలో, మహిళా కానిస్టేబుళ్ళు / హోంగార్డులు పివోలు ఏపివోలు   పోలింగ్ డ్యూటీలకు బయలుదేరుతారు. ఇది ఆరంభ సన్నివేశం.  రెండో పేరాలోఆడపిల్లల తండ్రిగా శంకించడం, కీడెంచడం, భయపడ్డం అలవాటయ్యాయిఅని వుంటుంది.  ఇది సంఘర్షణకు ఆరంభం. “మా అమ్మాయిలను ఇన్నాళ్ళూ కాపాడుతున్నాయనుకుంటున్న మా రెక్కలు ఎంత బలహీనమైనవో క్షణంలో తెలిసి వచ్చిందిఅని కథ ముగుస్తుంది.

ముగ్గురి వయసులకు అటూ ఇటూ వయసులున్న నా కూతుళ్ళు చెయ్యలేని పని వీళ్ళు చేస్తున్నారు. ముచ్చటేసిందిఅని రెండో పేరాలో ఒక వాక్యం వుంటుంది. వాక్యాన్ని చివరి వాక్యంతో కలిపిచూస్తే మహిళలు స్వీయ రక్షణ అలవరచుకోవాలనే అర్ధం వస్తుంది. ఇది పరిష్కారం. చేపల్ని పంచడంకన్నా చేపల్ని ఎలా పట్టాలో నేర్పించడం గొప్పది అనే మాట ఒకటుంది. ఇది అలాంటిదే.

పరిష్కారం మీద స్పష్టమైన అవగాహన వుంటే సెటప్ గా  దేన్నయినా ఎంచుకోవచ్చు. ఈ కథను పోలింగ్ బూత్ సెటప్ లో చెప్పారు. ఓ చలికాలం లంబసింగిలో క్యాంప్ ఫైర్ దగ్గర ఈ కథను ఆరంభించవచ్చు. ఓ రాత్రి పూట రైల్వేస్టేషన్ లోనో బస్ స్టాండ్ లోనో ఈ కథను ఆరంభించవచ్చు. ఓ వర్షపురాత్రి మర్రి చెట్టు కింద ఈ కథను ఆరంభించవచ్చు. మన ఊహా శక్తినిబట్టి అనుభవం అబ్వగాహనలను బట్టి ప్రపంచంలో ఎక్కడయినా ఈ కథను ఆరంభించవచ్చు. రూల్స్ ఆఫ్ ద గేమ్  తెలియాలి. అంతే. ఎంచుకున్న  పరిష్కారం దిశగా ఆసక్తికరంగా కథను నడపడమే రచయితకు ఉండాల్సిన నైపుణ్యం.

మూడు అంకాలను నిర్ణయించుకున్నాక వాటి మీద తప్పకుండా విస్తారంగా రీసెర్చ్ చేయాలి. అప్పుడు కొన్ని కొత్త కోణాలు, సున్నితమైన అంశాలు మనకు తెలుస్తాయి. అవి కథకు రక్తమాంసాల్ని అందిస్తాయి. ఈ కథ పోలింగ్ బూత్ లో జరుగుతుంది కనుక ఎన్నికల ప్రక్రియను సమగ్రంగా  అధ్యయనం చేయాలి.

ఎన్నికల్ని కొందరు పవిత్రకార్యం అనుకుంటారు. కొందరు ఉత్తడొల్ల అనుకుంటారు. మరి కొందరు ఎన్నికల్ని బహిష్కరించాలంటారు. ప్రజాస్వామ్యం బతుకుతున్నదే ఎన్నికల మీద అనే వారూ వుంటారు. మరోవైపు; ప్రజలు ఊరికే ఓట్లు వేయరు; నాయకులు వాటిని డబ్బు పెట్టి కొనుక్కుంటారు అనే వారూ వుంటారు. చివర్లో ఓ పది ఇరవై మందికి ఓట్లు వేసే అవకాశాన్ని నిరాకరిస్తే ఎన్నికల ఫలితాలే తారుమారు కావచ్చు. ఇలాంటి వన్నీ తెలుసుకోవాలి. ఈ కథ రాసే నాటికి బ్యాలెట్ పేపర్ విధానమే వుంది. ఇప్పుడు ఎలక్ట్రానికి ఓటింగ్ మిషిన్లు (EVM) వచ్చాయి. ఈ మార్పుల మీద  రచయితలు మరింతగా పరిశోధన చేయాల్సి వుంటుంది.  అప్పుడు కథలు రక్తమాసాలతో జీవాన్ని పోసుకుని తొణికిసలాడుతుంటాయి.

ఈ కథలో మహిళా కానిస్టేబుల్ ని పోలింగ్  ఆఫీసర్  గోకుతుంటాడు. ప్రజాస్వామ్యంలో అధికారాల వికేంద్రీకరణ ప్రకారం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడం పోలింగ్ ఆఫీసర్ల బాధ్యత,  పోలింగ్ బూత్ ను కాపాడడం పోలీసుల బాధ్యత. అలాంటప్పుడు ఈ గోకడం దేన్ని సూచిస్తుందీ? సందర్భానుసారంగా ఏక్ తారా మీద “పుట్టి ఆ దారినే వస్తివి మరలా ఆ దారి కాశిస్తివి” అంటూ ఒక తత్త్వం వినబడుతుంటుంది. ఎంచుకున్న అంశం మీద విస్తారమైన పరిశోధన, పరిశీలన సాగించినపుడే ఇలాంటి చురకలు వేయడం రచయితలకు సాధ్యం అవుతుంది. లేకుంటే కథ రక్తమాంసాలు లేని అస్థిపంజరంలా వుండిపోతుంది.

ఈ కథ మీద చిన్న అసంతృప్తి కూడ వుంది. కేతు విశ్వనాథ రెడ్డి  రెక్కలుకథను 1991లో రాశారు.  అప్పటికే తెలుగునాట స్త్రీవాద ఉద్యమాలు వుధృతంగా సాగుతున్నాయి. ఉనికి ఉద్యమాల్లో తొలి అడుగు మహిళలదే. 1990 దశకం నాటికి తెలుగు సమాజంలోనూ, సాహిత్యంలోనూ మహిళల ఉనికి చైతన్యం బాగా అభివృధ్ధి చెందింది. అలా చూస్తే ఈ కథ వాస్తవ సమాజంకన్నా కొంచెం వెనుకబడి వుందనవచ్చు.  సాహిత్యం ఎప్పుడూ తన కాలపు సమాజంకన్నా ఒక అడుగు ముందుండాలి. రేపు జరగబోయేది సూచనగా అయినా చెప్పాలి. అయితే, ఆఫీసుల్లో, పర్క్ ప్లేసుల్లో ఈ ‘గోకడాలు’ ఇప్పుడూ వున్నాయి కనుక ఈ కథ  ప్రాసంగికత కొనసాగుతోంది అనవచ్చు.  

15 డిసెంబరు 2024