Wednesday, 28 May 2025

The only winning formula - 20:80 !

 *ఒక్కటే గెలుపు ఫార్మూలా - 20:80  !*

 

నా వ్యాసాన్ని ఈ రోజు సాక్షి దినపత్రిక ప్రచురించింది.

సాక్షి యాజమాన్యానికి, ఎడిటర్ గారికి, ఎడిట్ పేజి నిర్వాహకులకు ధన్యవాదాలు.

 

ఈ వ్యాసం చదివి మీ అభిప్రాయాల్ని  తెలిపితే  ఆనందిస్తాను.

మీ

-        డానీ

    


                      

          ఎన్నికలకు ముందు కొత్త రాజకీయ పార్టీలు పుట్టడం, కొత్త రాజకీయ కూటములు ఏర్పడడం ఆనవాయితి.  ఈసారి ఎందుకోగానీ లోక్ సభ ఎన్నికలు ముగిసి పూర్తిగా ఏడాది కాకుండానే వచ్చే ఎన్నికల గురించి చర్చ మొదలైంది. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఆశించిన మేరకు  పనిచేయడం లేదని ప్రజల్లో అప్పుడే ఒక అసంతృప్తి మొదలయినట్టుంది.  

          మనకు తెలిసిన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల పార్టీలే.  కొందరు వాటిని గొప్పగా పార్లమెంటరీ ప్రజాస్వామిక పంథా అనుకోవచ్చు. అప్పట్లో పీపుల్స్ వార్, ఇప్పట్లో సిపిఐ-మావోయిస్టు పార్టి ఒక్కటి మాత్రమే దీనికి భిన్నంగా వుంటూ వచ్చింది. అది తన పరిథి పరిమితుల్లో  సాయుధపోరాట పంథాను కొనసాగిస్తూ వుండేది. ప్రస్తుతం దాని భవిష్యత్తు పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది. మావోయిస్టు పార్టి కూడ ఎన్నికల పంథాను స్వీకరించవచ్చు అనే ఊహాగానాలు అప్పుడే వినిపిస్తున్నాయి. 

          స్వాతంత్ర్యానంతర కాలపు  తొలి దశ రాజకీయాలు వేరు. అవి ఎంతోకొంత సిధ్ధాంతపరంగా వుండేవి. వాటి ఆర్ధిక విధానాలు కూడ ఆదర్శవంతంగా వుండేవి. ఇటు వ్యవసాయరంగంలోనూ, అటు పారిశ్రామిక రంగంలోనూ ఉత్పత్తిని పెంచడానికి భారీ ప్రాజెక్టుల్ని నిర్మించడం మీద కాంగ్రెస్ దృష్టి పెట్టేది. ఇటు వ్యవసాయ రంగంలో రైతు కూలీలు, అటు పారిశ్రామిక రంగంలో శ్రామికుల  శ్రేయస్సు  దిశగా కమ్యూనిస్టు పార్టీల కృషి సాగుతుండేది.  

          రాజకీయాల్లో కులమతాలకు ఒక పాత్ర, పెట్టుబడికి ఇంకో పాత్ర వుంటుంది. మన ఆలోచనాపరులది ఒంటికన్ను వ్యవహారం. కులమతాల్ని  చూసేవాళ్లు పెట్టుబడిని చూడలేరు; పెట్టుబడిని చూసేవాళ్లు కులమతాల్ని చూడలేరు. నిజానికి ఎన్నికల్లో కులమతాలకన్నా పెట్టుబడి ప్రభావమే ఎక్కువగా వుంటుంది. ఎప్పుడయినాసరే పెద్ద పెట్టుబడి  చిన్న పెట్టుబడుల్ని తన వైపుకు లాక్కుంటుంది. రాజకీయ కూటములు అలాగే ఏర్పడుతుంటాయి. 

          దేశ తొలి ఎన్నికల్లో ప్రధాని నుండి  రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు దాదాపు అందరూ బ్రాహ్మణ సామాజిక వర్గం నుండే ఎన్నికయ్యారు. ఆ తరువాత వ్యవసాయిక కులాల్లో పెట్టుబడి పెరిగింది. సహజంగానే రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లోనికి మారింది. ఆ తరువాత వెనుకబడిన తరగతుల్లోనూ పెట్టుబడి పోగవడం మొదలయింది. వాళ్ళూ కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులయ్యారు. 

ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. ఎస్సీ బిసిలకు అధికారం వచ్చిందనడం అర్ధసత్యం మాత్రమే. ఎస్సీ, బిసీ కులాల్లొ పెట్టుబడి ఎక్కువగా పోగయిన కులాలకు, కుటుంబాలకు మాత్రమే అధికారం దక్కుతుంది. కులమతాలకూ, పెట్టుబడికి వున్న సంబంధాన్ని అర్ధం చేసుకోకపోతే వర్తమాన రాజకీయాలు అర్ధం కావు. 

1991లో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్ పిజి) ఆర్ధిక విధానాలు వచ్చాక రాజకీయాలు ఫక్తు వాణిజ్య వ్యవహారంగా మారిపోయాయి. కొంతకాలం ఆశావహులుగా కొనసాగిన ఎస్సీ, బీసీ రాజకీయ పార్టీల్ని వాణిజ్య రాజకీయాలు గట్టిగా దెబ్బతీశాయి. స్వాతంత్ర్యానంతర రాజకీయాల్లో సైడ్ క్యారెక్టర్స్ వేసుకుని బతికిన ముస్లిం సమూహానికి ఆర్ధిక పునాది బీటలు వారడంతో ప్రేకషక పాత్రలకు పరిమితం కావలసి వచ్చింది. 

పైకి ఎంత వైవిధ్యపూరితంగా కనిపించినా సమస్త రాజకీయ పార్టీల గెలుపు మంత్రం  ఒక్కటే; 20 : 80!. 20 శత్రువర్గం; 80 మన వర్గం. 20 వాళ్ళు; 80 మనం! 

ఓటర్లలో 20 శాతంగా వుండే రాజవంశీకులు , బడా భూస్వాములకు తాను వ్యతిరేకం అని కాంగ్రెస్ చెప్పుకునేది. మిగిలిన 80 శాతం ఓటర్లను ఎన్నికల్లో ఆకర్షించడానికి ఆ పార్టి ప్రయత్నించేది. అది క్యాచ్ మెంట్ ఏరియా; ఆరగాణి ప్రాంతం. అందులో సగం ఓట్లు పడినా విజయం తథ్యం. మరోవైపు కమ్యూనిస్టు పార్టిలు కూడ ఓటర్లల్లో 20 శాతంగా వుండే పెట్టుబడీదారులు, భూస్వాములకు తాము వ్యతిరేకులమనీ, 80 శాతంగా వుండే కార్మికులు, వ్యవసాయకూలీలకు తాము రక్షకులమని చెప్పుకునేవారు. 1990వ దశకంలో బహుజన రాజకీయాల్ని ముందుకు తెచ్చిన  కాన్షీరామ్ కూడ దేశంలో పెత్తందారీ కులాలు 20 శాతం మాత్రమేననీ, 80 శాతం మంది బహుజనులని మరీ లెఖ్ఖలు కట్టి చెప్పేవారు. 

భారతీయ జనతా పార్టీది కూడ సరిగ్గా అదే వ్యూహం. దేశంలో 20 శాతం మాత్రమే హిందూయేతరులు; 80 శాతం హిందువులు అనేది దాని విభజన. మనుషులకుండే సమస్త భావోద్వేగాల్లో మతం చాలా శక్తివంతమైనది. ఈ 80 శాతం హిందువుల్లో 36 శాతం ఓట్లు పడినా అధికారం ఖాయం అని గత మూడు ఎన్నికల్లో బిజెపి నిరూపించింది. 

మతభావోద్వేగాలనీ, కార్పొరేట్ శక్తుల్ని, రాజకీయ అధికారాన్నీ మిళితం చేయడంలో బిజెపి గొప్ప నైపుణ్యాన్ని సాధించింది. ఇప్పుడు బిజెపిని ఎదుర్కోవడానికి కొత్త వ్యూహాల్ని రచించడానికి దాదాపు అన్ని పార్టీలు తలలు పగలగొట్టుకుంటున్నాయి. బిజేపి నాయకత్వంలో కొనసాగుతున్న కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వాన్ని ఎదుర్కోవడానికి ఓటర్లలో 80 శాతంను ఏకం చేసే బైడింగ్ వైర్ ను కనిపెట్టడం అంత సులువుకాదు.  

కమ్యూనిస్టులు, అంబేడ్కరైట్లు  ఏకం అయితే (లాల్ నీల్ మైత్రి)  బిజెపిని నిలవరించవచ్చు అనేది ఒక ఆలోచన. 2019 ఎన్నికల్లో దీన్ని ప్రయోగాత్మకంగా తెలంగాణలో అమలు చేశారు. మొత్తం రాష్ట్రంలో ఒక్క అసెంబ్లీ స్థానం కూడ దక్కలేదు.  ఓటర్లు తిరస్కరించారు. 

మరోవైపు, ఒక వ్యూహం ప్రకారం అంబేడ్కర్ ను బిజెపి క్రమంగా హైజాక్ చేసింది. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బిఎస్పి అధినేత్రి మయావతి ఉత్తరప్రదేశ్ లోనే ఉనికిని కోల్పోయింది. 403 స్థానాలున్న యూపి అసెంబ్లీలో ఆ పార్టికి ఒక్క స్థానం మాత్రమే దక్కింది.  దాదాపు మూడున్నర దశాబ్దాలు నిరాఘాటంగా పశ్చిమ బెంగాల్ ను ఏలిన సిపియం  2021 ఎన్నికల్లో  తనకున్న 26 సీట్లనూ కోల్పోగా బిజేపి అదనంగా 74 సీట్లు గెలుచుకుంది. కమ్యూనిస్టుల స్పేస్ ను కూడ బిజెపి ఆక్రమించుకుంటున్నది అనడానికి ఇదొక ఉదాహరణ.    

అంబేడ్కరైట్లు, కమ్యూనిస్టులు కొత్తగా ఆదివాసులు, మైనారిటీలతో (లాల్ నీల్ హర్యాలి) కలిసి నడిస్తే ఎమైనా మెరుగైన ఫలితాలు వస్తాయా? అనేది ఒక కొత్త ఆలోచన. ముందు అలాంటి కూటమి ఏర్పడాలి. అంత పెట్టుబడి సమకూరాలి.  ఆ తరువాత అది ఎన్నికల్లో పనిచేయాలి. వచ్చే ఎన్నికల వరకు ఇంకే మార్పులు వస్తాయో చూడాలి. 

*డానీ*

*సమాజ విశ్లేషకులు*

90107 57776 

రచన : 25 మే 2025

ప్రచురణ:  సాక్షి, 29 మే 2025

Sunday, 25 May 2025

What would Ambedkar do if he were here now?

 What would Ambedkar do if he were here now?

 *ఇప్పుడు అంబేడ్కర్ వుంటే ఏం చేసేవారు?* 

*డానీ* 

*సమాజ విశ్లేషకులు*  




మావోయిస్టులది ప్రకటిత సాయుధపోరాటం. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలూ లేవు. హింసామార్గాన్ని చేపట్టిన మావోయిస్టుల్ని హింసతోనే అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ధృఢ నిశ్ఛయంతో వుంది. కగార్, బ్లాక్ ఫారెస్ట్ తదితర ఆపరేషన్లు ఆ లక్ష్యంతోనే పనిచేస్తున్నాయి. ఈ విషయంలోనూ ఎవరికీ ఎలాంటి సందేహాలూ లేవు. అయితే, ప్రభుత్వం చేపట్టిన హింసామార్గం రాజ్యాంగ ఆదర్శాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా వుందా? లేదా? అన్నది వర్తమాన ప్రజాస్వామికవాదుల్ని వెంటాడుతున్న సందేహం.  

అంబుజ్ మడ్ లోని నారాయణ్ పూర్ అడవుల్లో మే 21న సిపిఐ – మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును భద్రతాదళాలు చంపేశాయి. ఆయనతోపాటు మరో పాతికమంది స్త్రీ పురుష  మావోయిస్టుల్నీ చంపేశారు. ఈ సంఘటనపై ఎక్స్ వేదిక మీద స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, “నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఇది ఒక మైలురాయి విజయం” అన్నారు. 

హింసావాదుల్ని హింసతోనే అంతం చేయడం ధర్మబధ్ధమే అని కొందరు అనవచ్చు. కేంద్ర హోం మంత్రి ప్రకటనలు  కొందరికి సమంజసంగా అనిపించవచ్చు. మరి కొందరికి గొప్ప ఉత్సాహాన్ని కూడ కలిగించవచ్చు. ఇంకొందరు ఉన్మాదంతో ఉగిపోనూవచ్చు. కమ్యూనిస్టుల్ని చీదరించుకునేవారో, విప్లవ వ్యతిరేకులో అలా అనుకుంటే అదో ఇది. కానీ, ప్రజలకూ ప్రభుత్వానికి మధ్య భారత రాజ్యాంగం అనే ఆధునిక పవిత్రగ్రంధం ఒకటుందని మరచిపోవడం ఆలోచనాపరులకు సమంజసం కాదు.

రాజ్యాంగ ప్రకటిత ఆదర్శాలను మార్గదర్శకాలనూ ప్రభుత్వాలు సరిగ్గా పాటిస్తే తిరుగుబాట్లు  తలెత్తాల్సిన అవసరమే వుండదు. ప్రభుత్వాలు రాజ్యాంగ ఆదర్శాలను తుంగలో తొక్కినపుడే తిరుగుబాట్లు తలెత్తుతాయి. ఇది అందరికీ తెలిసిన సమాజ నియమం. 

జాతియోద్యమ కాలంలోనే రాజకీయాల్లో రెండు స్రవంతులు ఏర్పడ్డాయి. మనం ఎంతగానో ఉద్వేగభరితంగా తలచుకునే భగత్ సింగ్, అల్లూరి శ్రీరామరాజు, ఉధ్ధామ్ సింగ్ తదితరులది బాహాటంగా హింసామార్గం. గాంధీ, నెహ్రు, అంబేడ్కర్ లది అహింసామార్గం. వాళ్ళ మధ్య అభిప్రాయ బేధాలు, ఇతర వివాదాలు కూడ వుండవచ్చుగాక; వున్నాయి కూడ. అయితే,  అంతిమంగా వాళ్ళది అహింసామార్గం. చాలామంది వాళ్ల మధ్య ఘర్షణను మాత్రమే చూస్తుంటారుగానీ ఐక్యతను చూడరు. ఇదొక సెలెక్టివ్ విజన్. 

రాజ్యాంగ రచన సాగుతున్న కాలంలోనే పొరుగుదేశం చైనాలో రక్తపాత విప్లవం విజయవంతమై ఒక రకం సామ్యవాద సమాజం ఏర్పడింది.  మనదేశంలో భారత కమ్యూనిస్టు పార్టి సాయుధపోరాట పంథాను కొనసాగిస్తున్నది. పైగా, అల్లూరి, భగత్ సింగ్ ల మీద ప్రజలకు ఆరాధనా భావం వుంది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వాల పనితీరుతో విసిగిగిపోయిన ప్రజలు సాయుధులై తిరగబడే ప్రమాదాన్ని నివారించాలనేది భారత రాజ్యాంగ రచనకు ప్రధాన లక్ష్యంగా మారింది. రాజ్యాంగ రచనా కమిటి చైర్మన్ బిఆర్ అంబేడ్కర్ ఇదే విషయాన్ని ఇంకో పధ్ధతిలో చెప్పాడు.  రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తరువాత ముందు  రాజకీయరంగంలో సమానత్వాన్ని సాధిస్తుంది. ఆ తరువాత, భావి ప్రభుత్వాలు ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లోనూ సమానత్వాన్ని సాధించడానికి ప్రత్యేకంగా ప్రయత్నించాలి అన్నాడు. పాలకులు అలా చేయకపోతే, వివిధ రంగాల్లొ కొనసాగుతున్న అసమానత్వానికి బాధితులైనవారు తిరగబడి ఏకంగా  ‘ప్రజాస్వామ్య భవనాన్ని’ పేల్చేస్తారు అని హెచ్చరించాడు. 

వివిధ రంగాల్లొ కొనసాగుతున్న అసమానత్వాన్ని రూపుమాపని ప్రభుత్వాలను మనం ఏమీ అనము. వాళ్ళు అసమానత్వాన్ని పెంచిపోషిస్తున్నా అభ్యంతరం చెప్పము. అసమానత్వం మీద తిరగబడే ప్రజల్ని మాత్రం దోషులుగా, దారితప్పినవారిగా, హింసావాదులుగా, నైరాశ్యంలో కూరుకుపోయినవారిగా నిందార్ధంలో చూస్తాము. మన ఆలోచనల్లో ఇదొక ద్వంద్వం. 

. 19వ శతాబ్దం చివర్లో మద్రాసు- కలకత్తా ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్ నిర్మించడానికి, దారి కోసం బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదివాసుల్ని  అడవి నుండి తరిమేసింది. రైలు పట్టాల కింద వేసే చెక్క స్లీపర్ల కోసం   తూర్పుకనుమల్లోని  అడవుల్ని విచక్షణా రహితంగా నరికి వేసింది. అడవిని కోల్పోయి రోడ్డు నిర్మాణ కూలీలుగా మారిన ఆదివాసుల్ని  అణా (6 నయాపైసలు), అర్ధణా (3 నయాపైసలు) వేతనం ఇవ్వడానికి కూడ వేధించింది. అణిచివేత ఈ స్థాయికి చేరుకోవడంతో అత్యంత సహజంగానే మన్యంలో తిరుగుబాటు తలెత్తింది. 

మన్యంకు వాయువ్య దిశలోనే బస్తర్ వుంటుంది. అక్కడా అప్పట్లో మన్యం వంటి తిరుగుబాట్లు సాగాయి. అక్కడా అల్లూరివంటి పోరాట వీరులు పుట్టుకొచ్చారు. అక్కడి ఆదివాసులు ఇప్పటికీ ఆ వీరుల్ని ఏడాదికి ఒకసారైనా తలుచుకుంటుంటారు. ఇప్పుడూ బస్తర్ లో వందేళ్ల నాటి వేధింపులు సాగుతున్నాయి. ఆదివాసుల్ని అడవుల నుండి తరిమేసి అటవీ సంపదనీ, ఖనిజ వనరుల్ని అస్మదీయ కార్పొరేట్లకు అప్పగించేందుకు ఒక  మహాయజ్ఞం అక్కడ సాగుతోంది. ఆదివాసులకు అప్పుడూ అణిచివేత స్వీయ అనుభవం. ఇప్పుడూ స్వీయ అనుభవమే. తెల్లవాళ్ళ మీద తిరగబడడం న్యాయమేగానీ,  నల్లవాళ్ల మీద తిరగబడడం అన్యాయం అని ఆదివాసులకు మన మైదానవాసులు హితవు చెపుతారా? 

అల్లూరిని చంపినపుడూ ఇంగ్లండులో సహితం  మారుమోగేలా అదొక మైలురాయి విజయం అంటూ  చాలా గట్టిగానే వికటాట్టహాసం చేశారు  ఇక్కడి బ్రిటీషు అధికారులు. భగత్ సింగ్ ను ఉరి వేసిన తరువాత 1931 ఏప్రిల్ 13 నాటి జనతా వార్తాపత్రికలో ’ముగ్గురు బాధితులు’ శీర్షికతో అంబేడ్కర్ ఒక వ్యాసం రాశాడు. న్యాయదేవత మీద భక్తివిశ్వాశాలతో వాళ్ళీ పని చేయలేదు; ఇంగ్లండ్ లోని కన్జర్వేటివ్ పార్టీ పెద్దల్నీ, అక్కడి మూర్ఖులయిన జనాన్నీ సంతృప్తిపరచడానికి ఒక బలిదానాన్ని ఉరికభం ఎక్కించారన్న వాస్తవం  ఈ ప్రభుత్వానికే కాదు ; మొత్తం ప్రపంచానికి కూడ స్పష్టంగా తెలుసు అంటూ తీవ్రంగా విమర్శించాడు. ఇప్పుడు నంబాల కేశవరావును చంపి సరిగ్గా అలాంటి  ప్రకటనలే చేస్తున్నారు ఏలినవారు. ఇప్పుడు అంబేడ్కర్ వుంటే ఏం రాసేవాడో? 

చరిత్ర ఒక ప్రహసనంగా పునరావృతం అవుతోందోలేదోగానీ, మన మధ్యనే మరో ప్రపంచం, మరో సమాజం, మరో జాతి, మరో తెగ  కొనసాగుతున్నాయని గుర్తించకపోవడం మాత్రం మన కాలపు విషాదం.  

రాజ్యాంగం తొలి ప్రతిలో  ప్రజాస్వామ్యం అనే ఆదర్శం ఒక్కటే  వుంది. దానికి మరింత వివరణ ఇస్తూ, దాని పరిధిని పెంచుతూ సామ్యవాద, మతసామరస్య  రాజ్యాంగం అని పునర్ నిర్వచించుకున్నాము.  ఆ తరువాత లెఖ్ఖ ప్రకారం ప్రజల కష్టాలు తగ్గిపోవాలి. కానీ, అలా జరగడంలేదు., రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకుని మోస్తున్నవారు, పార్లమెంటు భవనం మెట్లను ముద్దాడుతున్నవారు అనుక్షణం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. 

రాక్షసులు రాక్షసులుగానూ దేవతలు దేవతలుగానూ వుంటే సమాజం సులువుగా అర్ధం అవుతుంది. రాక్షసులు దేవతల రూపంలో తిరగడం మొదలెట్టినపుడే ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుంది. 

దేశ సంపదలో 70 శాతం కేవలం పది శాతం కుటుంబాల చేతుల్లో వుందట. 40 శాతం సంపద ఒక్క శాతం కుటుంబాల చేతుల్లో వుందట. 70 నుండి 80 శాతం జనాభా కేవలం 3 శాతం దేశ సంపదతో జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నది. రాజ్యాంగ ప్రకటిత ఆదర్శమయిన సామ్యవాదాన్ని ఇంతగా అపహాస్యం చేస్తున్నది ఎవరూ?  

దేశంలో మతసామరస్యం గురించి ఇక చెప్పనక్కర లేదు. దేశంలోని ఒక సమూహాన్ని బాహాటంగా శత్రువర్గం జాబితాలో పడేశారు. ఒక చట్టాన్ని తెచ్చి వాళ్ళ పడక గదుల్లోనికి ప్రవేశించారు. ఇంకో చట్టాన్ని తెచ్చి వాళ్ళ పౌరసత్వాన్ని సంధిగ్ధంలో పడేశారు. మరో చట్టంతో వాళ్ళ ఆస్తి హక్కుని నిరాకరిస్తామన్నారు. వాణిజ్య కుడళ్ళ పక్కన హాకర్లు, చిరు వ్యాపారులుగా మారి కాస్త ఊపిరి పీల్చుకుంటున్నా సరే సహించలేక వాళ్ళ బతుకుల్ని బుల్ డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. అయినా, మతసామరస్యం అనే అక్షరాలు రాజ్యాంగంలో మెరుస్తూనే వున్నాయి. ఇంతటి వైరుధ్యాన్ని, బూటకాన్ని  భరించడం మనుషులకు ఎక్కువ కాలం సాధ్యం కాకపోవచ్చు. 

మైదాన ప్రాంతాల్లో ముస్లింలను భయపెట్టి కొత్త అస్పృశ్యులుగా మార్చాలనీ, అడవుల్లో ఆదివాసుల్ని తుడిచి పెట్టేయాలనీ ఏలినవారు ఒక ధృఢ నిశ్చయంతో వున్నట్టు ఇప్పుడు అందరికీ స్పష్టంగానే కనపడుతోంది. చర్యల మీద మనకు అభ్యంతరాలు లేనపుడు ప్రతిచర్యల మీద మాత్రమే అభ్యంతరాలుండడం సబబుకాదు. 

బస్తర్ ఆదివాసులు మావోయిస్టులుగా మారాలని ఏమీ అనుకోలేదు. అణిచివేతను అడ్డుకోవాలనుకున్నారు. అందుబాటులో మావోయిస్టులు వున్నారుగాబట్టి వాళ్లలో చేరారు. రేపు మరొకరితో చేతులు కలపవచ్చు. ఆయుధాలను చేపట్టడాన్ని తప్పుపడుతున్నవాళ్ళు అణిచివేతనూ తప్పుపట్టాలి. లేకుంటే మనలోనే ఏదో తప్పు వున్నట్టు లెఖ్ఖ. 

నారాయణపూర్ మృతుల ఫొటోల్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు సర్వత్రా అవి అందుబాటులో వున్నాయి. వాళ్ళ తలల్లో  తుపాకుల బాయినేట్లను గుచ్చినట్టు కొన్ని ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నది.  పొరుగుదేశం నుండి వచ్చి పెహల్గాంలో యాత్రికుల మీద భీభత్సాన్ని సృష్టించిన ఉగ్రవాదుల ఫొటోల్ని ప్రభుత్వం ఇలా విడుదల చేస్తుందని చాలా మంది ఆశించారు. కానీ, ప్రభుత్వం బస్తర్ ఆదివాసుల ఫొటోలు విడుదల చేసింది. ఇదొక వైచిత్రి. 

రాజ్యాంగం చెడ్డదయినాసరే అమలు చేసేవాడు మంచోడయితే అది మంచిదయిపోతుంది.  రాజ్యాంగం మంచిదయినాసరే అమలు చేసేవాడు చెడ్డోడయితే అది చెడ్డదయిపోతుంది అని అంబేడ్కరే అన్నాడు. పార్లమెంటు అనే దేవాలయాన్ని నిర్మించి అందులో రాజ్యాంగమనే దేవతను ప్రతిష్ఠించాలనుకుంటే ముందే దాన్ని దెయ్యాలు ఆక్రమించుకున్నాయని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అవకాశం వస్తే తానే ఈ రాజ్యాంగాన్ని తొలుత తగులబెడతానని 1950లలోనే అన్నాడు. ఇప్పుడు అంబేడ్కర్ వుంటే ఏం చేసేవాడో? దెయ్యాలు, భూతాలు కన్నా పెద్ద పదాల్ని ప్రయోగించేవాడు. తగులబెట్టడంకన్నా పెద్ద పనే చేసి వుండేవాడు. 

23 మే 2025

ప్రచురణ : ఆంధ్రజ్యోతి 

24 మే 2025 

https://www.andhrajyothy.com/2025/editorial/maoist-insurgency-violence-and-constitution-challenges-1407915.html

https://epaper.andhrajyothy.com/Hyderabad?eid=34&edate=24/05/2025&pgid=1076701&device=desktop&view=2


Friday, 23 May 2025

ఆ రకమైన గణన జరపాలి !

ఆ రకమైన గణన జరపాలి !

డానీ

సమాజ విశ్లేషకులు  


కులగణన డిమాండును మొదటి నుండీ చాలా తీవ్రంగా నిరాకరిస్తూ వస్తున్న బిజేపి ఇప్పుడు తానే ఆ పని చేస్తాను అంటోంది. ఒకవేళ ఎన్నికల్లో లబ్ది కోసమే తన విధానాన్ని మార్చుకుందనుకున్నా సరే ఇది గొప్ప నిర్ణయం. దీనిని అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజం  తప్పక  మెచ్చుకోవాలి. 


అయితే,  సామాజిక న్యాయం దిశగా చేసే ప్రయాణంలో కులగణన అనేది తొలి అడుగు మాత్రమే. ఇది ఒక పరికరమేగానీ పరిష్కారం కాదు; సాధనమేగానీ సమాధానం కాదు. రాజకీయార్ధిక సామాజిక రంగాల్లో సమానత్వాన్ని సాధించడానికి చాలా పెద్ద కసరత్తు చేయాలి. వర్తమాన భారతదేశం ఎదుర్కొంటున్న సామాజిక సంక్షోభాన్ని కొలవడానికీ,  అందులోని అపార వైవిధ్యాన్నీ, సంక్లిష్టతను అర్ధం చేసుకోవడానికీ కులగణన ఒక్కటే సరిపోదు. రాజకీయార్ధిక, సామాజిక, కులమత గణన (PESRCC)) జరగాలి. 


కులగణన వల్ల దేశంలో ఏ కులస్తులు ఎంతమంది వున్నారో తెలుస్తుంది. ప్రభుత్వంలోనో ప్రభుత్వరంగ సంస్థల్లోనో ఈ కులాలన్నింటికీ  ఎంతెంత శాతం రిజర్వేషన్లు కల్పించాలి అనడానికి ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది. ప్రభుత్వానికి నిజాయితీ వుంటే ఈ కేటాయింపుల్ని వెంటనే అమలు చేయనూవచ్చు. కానీ, అలాంటి కార్యక్రమం ప్రభుత్వానికి వున్నట్టు లేదు. 


ఆర్ధికంగా మెరుగైన స్థితిలో వున్న కులాలే రిజర్వేషన్ అవకాశాలను దక్కించుకోగలుగుతాయనేది అందరికీ తెలిసిన సత్యం. ఇది హిందూ సమాజానికేకాక ముస్లిం సమాజానికి కూడ వర్తిస్తుంది. ఇక ముందు ఓసి, బిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటీలు వంటి అమూర్త, సామూహిక ఉనికిలు వుండవు. చాకలి, సాలె, వడ్రంగి, లద్దాఫ్. నూర్ బాషా, సంబన్, రెల్లి వంటి నిర్దిష్ట కులాలు మాత్రమే వుంటాయి. ఇటీవల ఎస్సీలను మూడు విభాగాలుగా వర్గీకరించారు. ఇక ముందు ఈ వర్గీకరణ  కూడ వుండదు. ప్రతి కులానికీ  వాళ్ళ జనాభా   ప్రాతిపదికగా రిజర్వేషన్ ఇవ్వాల్సి వుంటుంది. జిస్కే జిత్నీ ఉస్కే ఉత్నీ. 


దేశంలో ముస్లిం సమాజం మీద సాగుతున్న వివక్ష మరీ క్రూరంగా తయారయ్యింది. ముస్లిం సమాజాన్ని రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక రంగాల్లో నయా అస్పృశ్యులుగా మార్చేశారు. కొన్ని కీలకమైన ఉద్యోగాలను వారికి నిషేధంగా మార్చారు. వాళ్ళ చేతివృత్తుల్ని, వ్యాపారాలని, ఓలా, ఊబర్, స్వీగ్గీ,  జమాటో వంటి చిరు ఉద్యోగాలను సహితం బహిష్కరించాలంటూ ఏలినవారి కాల్బలం  ప్రకటనలు చేస్తున్నది. రోడ్డు పక్కన జీవనాధారాన్ని ఎంచుకున్న చిరువ్యారుల్ని హింసిస్తున్న  వీడియోలు సోషల్ మీడియాలో  నిత్యం మనం చూస్తున్నాం.   


ఉపాధి కల్పనలో ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి సంఖ్య రీత్యా చాలా పరిమితమైనవి. ప్రభుత్వరంగ సంస్థలు క్రమంగా ప్రైవేటుపరం అయిపోతున్నాయి. అంటే, అక్కడా అవకాశాలు తగ్గిపోతున్నాయి. అప్పుడు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలి అనే డిమాండు సహజంగానే ముందుకు వస్తుంది. దానికి ప్రభుత్వం సిధ్ధమా? కార్పొరేట్లను ప్రభుత్వం ఒప్పించ గలుగుతుందా? 


దేశ సంపద ఏ సమూహాల్లో తగ్గిపోతున్నది, ఏ సమూహాల్లో పోగవుతున్నది అనేది ప్రాణప్రదమైన అంశం. టెలీకమ్యూనికేషన్స్,  ఐటి, రెన్యూవబుల్ ఎనర్జీ, మౌళికరంగ నిర్మాణాలు, ఇ-కామర్స్, డిజిటల్ ఎకానమీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మాస్యూటికల్, హెల్త్ కేర్, ఆయిల్ గ్యాస్, పెట్రో కెమికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, గనులు, సహజవనరులు, కార్పొరేట్ విద్యా సంస్థలు తదితర రంగాల్లో ఇప్పుడు సంపద సృష్టి అవుతున్నది.  వీటి యాజమాన్యంలో సమస్త కులాలకు స్థానం కల్పిస్తారా? అణగారిన సమూహాలను ఎప్పటిలానే సేవకులుగా కొనసాగించి ప్రాతినిధ్యం కల్పించాము అంటారా?   


వర్తమాన భారత దేశంలో రెండు పరస్పర విరుధ్ధ పరిణామాలు ఒకే సందర్భంలో సాగుతున్నాయి. ఒకవైపు, సంపద వేగంగా పెరుగుతోంది; మరోవైపు; పేదరికం అంతకన్నా వేగంగా పెరుగుతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) అంచనా ప్రకారం 2025 సంవత్సరంలో భారత స్థూల జాతియోత్పత్తి (GDP) నాలుగున్నర ట్రిలియన్ డాలర్లను మించుతుంది. త్వరలో జర్మనీని అధిగమిస్తుంది. ట్రిలియన్ అంటే లక్ష కోట్లు కనుక మన కరెన్సీలో 379 లక్షల 80 వేల కోట్ల రూపాయలు.    


ఆక్స్ ఫాం సంస్థ ఇటీవల ప్రకటించిన ‘ఇండియా రిపోర్టు – 2024’లో దిగ్రాం్నతి కలిగించే అనేక అంశాలున్నాయి. మొత్తం జాతీయ సంపదలో 70 శాతం ఓ పది శాతం కుటుంబాల చేతుల్లో వుందట. 40 శాతం జాతీయ సంపద కేవలం ఒక్క శాతం కుటుంబాల చేతుల్లో వుందట. 50 శాతం జనాభాకు జాతీయ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే దక్కుతున్నదట. అంటే పేదరికం ఏ స్థాయిలో వున్నదో అంచనా వేయవచ్చు. 


సంపద పంపిణిలో అసమానత్వం అత్యధికంగా వున్న దేశాల్లో ఇండియా ఒకటి. విచిత్రం ఏమంటే, మన రాజ్యాంగ ఆదర్శాల్లో సామ్యవాదం కూడా వుంది. 39వ అధీకరణం భౌతిక వనరుల పంపిణీలో సమానత్వాన్ని  పాటించాలని ఆదేశిస్తుంది. ఉమ్మడి పౌరస్మృతిని అమలుపరచాలని రాజ్యాంగం అదేశిస్తున్నదంటూ  రెండేళ్ళ క్రితం బిజెపి చాలా హంగామా చేసింది. ఆటు ఆదేశిక సూత్రాల్లోనేగాక, ప్రధాన ఆదర్శాల్లోనూ వున్న సామ్యవాదం గురించి మాత్రం ఆ పార్టి మాట్లాడడంలేదు. 

7 మే 2025

ప్రచురణ ః సాక్షి 

17 మే 2025 

Saturday, 10 May 2025

కులగణన మంత్రం ఫలిస్తుందా?

 కులగణన మంత్రం ఫలిస్తుందా?

* మోదీ అర్బన్ నక్సలైటు అవతారం!*

*డానీ*
*సమాజ విశ్లేషకులు*




    ప్రేమ, యుధ్ధం, రాజకీయాలు. వీటిల్లో ఎప్పుడయినా ఏమైనా జరగవచ్చు. కులగణన కోరుతున్న రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్ అంటూ విమర్శిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు వారే అర్బన్ నక్సలైటు అవతారం ఎత్తారు. దేశమంతటా కులగణన జరుపుతామని ప్రకటించారు. ఇలాంటి బోల్ట్ ఫ్రం ద బ్లూ పరిణామాలు బిజెపిలో చాలా వుంటాయి.

    కులం భారత సమాజపు ప్రత్యేక లక్షణం. అది అందరికీ తెలుసు. అయితే, దానితో వ్యవహరించడం అంత ఈజీ కాదు. భారత సమాజాన్ని కుల ప్రమాణాలతో విశ్లేషిస్తే వర్గం గొంతులో అడ్డుపడుతుంది. వర్గ ప్రమాణాలతో విశ్లేషిస్తే కులం అడ్డుపడుతుంది. కులవర్గమత ప్రమాణాలతో విశ్లేషించాలి అనడం సులువేగానీ దాని విధివిధానాలు ఇప్పటికీ సరిగ్గా రూపొందలేదు. స్వాతంత్ర్యం వచ్చాక గడిచిన 78 సంవత్సరాల్లో 14 మంది ప్రధానులు మారారుగానీ ఒక్కరూ కులగణన జరపడానికి సాహసించలేదు.

    బ్రిటిష్ ప్రభుత్వంలో జనాభా లెఖ్ఖల కమీషనర్ గా వున్న జె.హెచ్. హట్టన్ 1931లో తొలిసారిగా మనదేశంలో కులగణన నిర్వహించాడు. అదే చివరిసారి కూడ. మన్మోహన్ సింగ్ ప్రధానిగా వుండగా కేంద్ర గ్రామీణాభివృధ్ధి శాఖ 2011లో సామాజిక, ఆర్ధిక, కుల గణన (SECC) నిర్వహించింది. దాని మీద పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగడంతో ఆ నివేదికను బయటికి రాకుండా నిలిపివేశారు. చాలా మందికి గుర్తించని విషయం ఏమంటే; మనం ఇప్పటికీ తొంభైయేళ్ళ క్రితపు గణాంకాల ఆధారంగానే దేశ జనాభాలో కులాల శాతాల గురించి మాట్లాడుతున్నాము.

    జనాభా లెఖ్ఖల్లో ఎస్సీ, ఎస్టిల వరకు వివరాలు సేకరిస్తుంటారు. అది కూడ 2011 తరువాత ఆగిపోయింది. వెనుకబడిన తరగతులు, ముస్లిం సామాజికవర్గాల సంఖ్య, శాతాల విషయంలోనే తరచూ అనేక ఉహాగానాలు, వివాదాలు చెలరేగుతుంటాయి.

    ముస్లిం జనాభా అతి వేగంగా పెరిగిపోతూ సమీప భవిష్యత్తులో ఇండియా ఒక ఇస్లామిక్ దేశం గా మారిపోతుందని సంఘపరివారం తరచూ ఒక ప్రచారం చేస్తుంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టి 2005లో ముస్లిం సమాజంలోని వెనుకబడిన తరగతులకు బిసి-ఇ జాబితాలో 4 శాతం రిజర్వేషన్ కల్పించినపుడు పెద్ద దుమారం రేగింది. ముస్లిం బిసిల జనాభా అంత లేదంటూ సంఘపరివారవర్గాలు హైకోర్టును ఆశ్రయించాయి. జనాభా గణాంకాలను శాస్త్రీయంగా సేకరించకుండా రిజర్వేషన్ కల్పించారని ఆరోపించాయి. న్యాయస్థానం కూడ ఆ ఆరోపణని పరిగణన లోనికి తీసుకుంది. కానీ, జనాభా గణాంకాలను శాస్త్రీయంగా ఎలా సేకరించాలో మాత్రం ప్రభుత్వానికి సూచించలేదు.

ఓబిసిలకు రాజ్యాంగం తొలి ప్రతిలో రిజర్వేషన్ లేదు. తమిళనాడులో నిరసనలు చెలరేగాక, సుప్రీం కోర్టు జోక్యంతో రాజ్యాంగానికి తొలి సవరణగా ఆర్టికల్ 15 (4) చేర్చి రాష్ట్రాల స్థాయిలో విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించారు. అయితే, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ సౌకర్యం కల్పించలేదు.

ఓబిసిలు సామాజిక, విద్యా, ఆర్ధిక రంగాల్లో ఎదుర్కొంటున్న వివక్ష, వెనుకబాటుతనం, పేదరికాలను తొలగించడానికి అవసరమైన సూచనలు ఇవ్వడానికి 1979 జనవరి 1న అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయి బిపి మండల్ కమీషన్ వేశారు. దేశ జనాభాలో ఓబిసిలు 54 శాతం వున్నారని మండల్ కమీషన్ తేల్చింది. వారికి కేంద్ర ప్రభుత్వంలో, ప్రభుత్వరంగ సంస్థల్లో 27 శాతం రిజర్వేషన్ కల్పించాలని సూచించింది. ఆ సిఫార్సుల్ని ఓ దశాబ్దం తరువాత 1990 ఆగస్టు 7న అప్పటి ప్రధాని విపి సింగ్ ఆమోదించారు.

ఓబిసిలకు రిజర్వేషన్ కల్పించడం సహించలేని ఆధిపత్య కులాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాయి. వాళ్ళ సంతతి వీధి పోరాటాలు నడిపింది. ఉత్తర భారతదేశంలో నిరసన జ్వాలలు చెలరేగాయి.

1984 లోక్ సభ ఎన్నికల్లో 2 స్థానాలు గెలుచుకుని పార్లమెంటులో ప్రవేశించిన బిజెపి, 1989 ఎన్నికల్లో బాగా పుంజుకుని 85 స్థానాలకు చేరుకుంది. ఆ పార్టి తన రాజకీయ భవిష్యత్తును ఆధిపత్య కులాల నిరసనల్లో గుర్తించింది. ‘మండల్ కు వ్యతిరేకంగా కమండలం’ చేపట్టి రామ్ రథయాత్ర మొదలెట్టింది. ఇందులో బిజెపికి నాలుగు లక్ష్యాలున్నాయి. మొదటిది; రాజకీయ రంగంలో ఆధిపత్య కులాల ప్రతినిధిగా ప్రకటించుకోవడం. రెండోది; ఓబిసిలకు రిజర్వేషన్ కల్పించిన విపి సింగ్ ప్రభుత్వాన్ని కూల్చేయడం. మూడోది; ముస్లింల నుండి హిందూమతానికి ముప్పు పొంచి వుందని ప్రచారం చేయడం. నాలుగోది; దేశంలోని ఓబిసి తదితర బహుజనుల దృష్టిని రిజర్వేషన్ల నుండి అయొధ్య శ్రీరాముని వైపు మళ్ళీంచడం. రామ్ రథయాత్ర పెట్టుకున్న లక్ష్యాల్లో కొన్నింటిని పూర్తిగా కొన్నింటిని పాక్షికంగా సాధించింది.
సంఘపరివారం రోడ్ మ్యాప్ లో 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేతతో ఒక ఘట్టం ముగిసింది. ఆ మహాసంస్థ తను చేపట్టిన ‘పవిత్ర యుధ్ధం’లో హిందూ ఎస్టి, ఎస్సి, బిసిలలో చెప్పుకోదగ్గ భాగాన్ని తన కాల్బలంగా మార్చుకోగలిగింది. ఈ పరిణామం 2002 నాటి గుజరాత్ అల్లర్లలో స్పష్టంగా కనిపించింది.

సంఘపరివారం కులాలను గుర్తించదు. హిందూసమాజం మొత్తం ఒకే మతం అనేది దాని సిధ్ధాంతం. ఈ సిధ్ధాంతానికి ప్రభావితులైన ఎస్టి, ఎస్సి, బిసి నేతలు కొందరు బిజెపికి తమ శక్తిమేర సేవలు అందించారు. వారిలో ప్రముఖ అంబేడ్కరైట్లు కూడ వున్నారు. రాడికల్ అంబేడ్కరైట్లు, రాడికల్ ఫూలేయైట్లు కులాన్ని ప్రధాన వైరుధ్యంగా భావిస్తారు. వాళ్లు సంఘపరివారాన్ని గట్టిగా వ్యతిరేకిస్తారు.

బయటి ప్రపంచానికి అంతగా తెలియదుగానీ ఆదివాసుల్లో తండాకు ఒక మతం వుంటుంది. మరింత లోతుకు వెళితే ఒక్కో సమూహానికి ఒక్కో మత విశ్వాసం వుంటుంది. ఇప్పుడు జనాభా లెఖ్ఖల్లో ఆ వైవిధ్యాన్ని పూర్తిగా తొలగించేశారు. హిందూ, ఇస్లాం, క్రైస్తవం, శిక్కు, బౌద్ధ జైన మతాల్లో ఏదో ఒకదాన్ని ఆదివాసులు ఎంచుకునేలా జనాభా లెఖ్ఖల చట్టాన్ని సవరించారు.

భారత ముస్లింసమాజంలో కూడ శాఖ, కుల వర్గీకరణ తెచ్చి ‘సున్నీ అష్రాఫ్’లకు వ్యతిరేకంగా షియా, సున్నీ బిసి, ఎంబిసిలను దగ్గరికి చేర్చుకోవడానికి ఒక దశలో బిజెపి ప్రయత్నించింది. అది ‘పవిత్రయుధ్ధం’ ఫార్మూలాకే ముప్పుగా మారుతుందని భయపడి ఆ కాడిని దించేసింది.
బ్రిటీష్ పాలకులు నేరస్మృతిని ఇంగ్లండు నుండి తెచ్చారుగానీ పౌరస్మృతిని ఇక్కడి స్థానికుల్నే ఎంచుకోమన్నారు. బెంగాల్ గవర్నర్ జనరల్ గావున్న వారెన్ హేస్టింగ్స్ 1772లో హిందూ ప్రతిధుల కోరిక మేరకు మనుధర్మాన్ని పౌరస్మృతిగా ప్రకటించాడు. భారత రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షునిగా వ్యవహరించిన బిఆర్ అంబేడ్కర్ ఇక మనుసృతికి కాలం చెల్లింది అని ప్రకటించడం సంఘీయులకు బాగా ఆగ్రహాన్ని తెప్పించింది. రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోనికి రాగా, ఆ వెంటనే వచ్చిన ఆర్గనైజర్ ఫిబ్రవరి 6 సంచిక "మనువు మన హృదయాలను పాలిస్తుంటాడు" అని ప్రకటించింది.

హిందూ ఎస్సి, బిసి, ఎస్టిలను మత ప్రాతిపదిక మీద తమకు దగ్గరగా తీసుకొని ఓటు బ్యాంకును పెంచుకోవాలనుకుంటున్న సంఘీయులు అంబేడ్కర్ ను వ్యూహాత్మకంగా స్వంతం చేసుకుంటున్నారు. అంబేడ్కర్ రచనల్ని వాళ్ళు ఆరు భాగాలుగా విభజిస్తున్నారు.

మొదటిది; మనుస్మృతి, కుల అణిచివేత మీద అంబేడ్కర్ చేసిన ఘాటైన విమర్శను దాచి పెడతారు. లేదా, వర్ణం తప్ప కులం అనేది అస్సలు హిందూ సాంప్రదాయమే కాదనే వాక్యంతో అంబేడ్కర్ ఆరోపణలన్నింటినీ తేలిగ్గా కొట్టిపడేస్తారు.
రెండవది; ఇస్లాం, ముస్లింల మీద కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంబేడ్కర్ చేసిన విమర్శల్ని తమ పవిత్ర యుధ్ధానికి అనుకూలంగా వాడుకుంటారు. ఎస్సి, ఎస్టి, బిసిలు ముస్లింలతో జట్టుకట్టకుండ ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తారు.

మూడవది; గాంధీ అంబేడ్కర్ల మధ్య సాగిన వివాదాలకు ఎక్కువ ప్రచారం కల్పించి ఎస్సి, ఎస్టి, బిసిలు జాతీయ కాంగ్రెస్ కు దగ్గర కాకుండ చూసేందుకు వాడుతారు.
నాలుగవది; కమ్యూనిస్టు పార్టిల్ని అంబేడ్కర్ తన ప్రధాన శత్రువులని భావించేవారని విస్తృతంగా ప్రచారం చేసి ఎస్సి, ఎస్టి, బిసిలు మార్క్సిజానికి ఆకర్షితులు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఐదవది; కుల వివక్ష రద్దుకు అంబేడ్కర్ చూపిన పరిష్కారాల్ని మెచ్చుకుంటూ ఆయన్ని హిందూమత సంస్కర్తగా కొనియాడుతారు. అంబేడ్కర్ పేరులోనే రాముడు (రాంజీ) వున్నాడని ఈమధ్య ప్రత్యేకంగా పేర్కొంటున్నారు. శ్రీరాముడ్ని విశ్వసించే ఎస్సీ, బిసిల మీద ఈ మాటలు బాగా పనిచేస్తాయి.
ఆరవది; రాజ్యాంగం మన దేశానికి అంబేడ్కర్ ఇచ్చిన ప్రసాదమని పేర్కొనడమేగాక, దానిని నెత్తి మీద పెట్టుకుని తిరుగుతారు. తాము ఏది చేసినా రాజ్యాంగానికి విధేయులమై వుంటున్నామని బుకాయిస్తారు.
ఇంతటి ప్రచార హోరుతో ప్రజల్ని సంఘ్ పరివారం వశీకరిస్తున్నా సమస్త రంగాల్లో కులవివక్ష అనే కఠిన వాస్తవం బహుజనుల్ని ఎప్పుడో ఒకప్పుడు మెలుకువ వచ్చేలా చేస్తుంది. అప్పుడు వాళ్లు కులగణన జరిపించమని తప్పక అడుగుతారు. పైగా, రాహుల్ గాంధీ రోజుకు ఒకసారి ‘జిస్కే జిత్నీ భాగేదారీ ఉస్కే ఉత్నీ హిస్సేదారి’ (ఎవరి జనాభా ఎంతో సంపదలో వారికి అంత’) అని నినదిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల భయంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అందరికన్నా ముందుగా కులగణన చేపట్టారు. వెనుకబడిన తరగతులు 27 శాతం, అతి వెనుకబడిన తరగతులు 36 శాతం, ఎస్సిలు 20 శాతం అని బీహార్ ప్రభుత్వం తేల్చింది. ఇప్పుడు ముంపు నీరు బిజెపి కాళ్ళ కిందికి వచ్చింది. ఆ పార్టి ఇప్పుడు అర్బన్ నక్సలైట్ అవతారం ఎత్తక తప్పలేదు.
ఈ అర్బన్ నక్సలైట్ సిధ్ధాంతం ఒక విధంగా అంబేడ్కర్ దే. రాజకీయ రంగంతోపాటు సామాజిక, ఆర్ధిక రంగాల్లోనూ సమానత్వాన్ని సాధించకపోతే ప్రజలు తిరగబడతారని అంబేడ్కర్ సాక్షాత్తు రాజ్యాంగ సభలోనే హెచ్చరించాడు. రాజకీయాల్లో ఎస్టి రాష్ట్రపతిని చూసి అడవిలో ఆదివాసులు, బిసి ప్రధానిని చూసి మైదానాల్లో బిసిలు సంతృప్తి పడిపోరు. వాళ్ళకు సాంఘీక, ఆర్ధిక సమానత్వం కావాలి. అదీ అసలు విషయం. వాళ్ళను అడవి నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్లు అని ఎద్దేవ చేయవచ్చుగానీ అది పరిష్కారం కాదు. పిక్చర్ అభి బాఖీ హై!

రచన : 5 మే 2025
ప్రచురణ : ఆంధ్రజ్యోతి
10 మే 2025

Thursday, 8 May 2025

Abulits and Kalamits

 Abulits and Kalamits

మార్క్సిస్టులు, అంబేడ్కరిస్టులు, ఫూలేయిస్టులు, బిర్సాయిస్టులు, అబులైట్లు.

 కలామైట్లు అని కూడ అనుకోవచ్చు.

 *అబుల్ కలామ్ ఆజాద్ మనకు ఆదర్శం*.

*మత సామరస్యం మన లక్ ష్యం*

  

గ్రూపులో  ముస్లింలకు సంబంధించి ఆర్ధిక, రాజకీయ, సామాజిక, చారిత్రక అంశాల మీద ప్రధానంగా దృష్టిపెట్టండి.

 ధార్మిక విషయాల ప్రస్తావన అసలు లేకుంటేనే మంచిది.


 వాళ్ళు ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాక్ చట్టంతో మన బెడ్ రూముల్లోనికి వచ్చారు.

CAA చట్టంతో మనకు పౌరసత్వం రద్దుచేస్తామనే హెచ్చరిక చేశారు.

ఇప్పుడు వక్ఫ్ చట్టంతో మనకు ఆస్తి లేకుండా చేస్తామని హెచ్చరించారు.

దేశంలో ఆదివాసులు సహితం మనలాంటి వివక్షను అనుభవిస్తున్నారు.

 

*మన పోస్టులకు రెండే ప్రమాణాలు.*

మొదటిది; ముస్లిమేతరులు ఎక్కువ మంది మనతో కలిసేలా పోస్టులు పెట్టండి.

రెండోది; కలిసి రావలసిన సమూహాలను శత్రువులుగా మార్చే పోస్టులు వద్దేవద్దు. 

Tuesday, 6 May 2025

Future Collaboration with the Marxist Thinkers Forum

 To

Com. CBR

Subject: Regarding Future Collaboration with the Marxist Thinkers Forum

Dear Sir,

I extend my sincere thanks for your prompt and positive response to my letter of disassociation.

As a democrat firmly committed to the constitutional ideals of Justice, Liberty, Equality, and Fraternity, I continue to express my complete and unwavering solidarity with the Marxist Thinkers Forum from outside. This commitment is absolute and unchanging, and I hold no second opinion in this regard.

However, for me to participate actively within the organization, there are four guiding principles that I must insist upon:

1.      Defining the Ruling Establishment as Corporate Communal Dictatorship (CCD) (కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం)

While many have described the current domination as Brahminical or Saffronized, and while such terminology may not be lexically incorrect, it is important to note that, politically and economically, Vinayak Damodar Savarkar coined the term Hindutva in 1922. However, the majority of ordinary Hindus are neither aware of this historical context nor its political implications.

The use of such terminology risks hurting the sentiments and beliefs of millions, including members of my own family and many of my close friends who are Brahmins. I believe it is essential to avoid language that could wound their faith.

Therefore, I propose that we describe the ruling dispensation as Corporate Communal Dictatorship (CCD), a characterization that captures the essence without alienating the common people.

2. Adopting "Lal-Neel-Haryali Maitri" as our Slogan:

‘Haryali’ (greenery) is a Telugu/Sanskrit word familiar in expressions such as the 'Green Revolution.' Similarly, while ‘Lal’ (red) was initially unfamiliar to Telugu speakers, it has now gained currency.

Green symbolizes a shared identity for both Adivasis and Muslims.

Henceforth, I propose that at every meeting and gathering, we raise the slogan:

"Lal-Neel-Haryali Maitri" (Red-Blue-Green Solidarity).

 

3. Recognizing and Honoring the Contribution of Muslims — The Kalamites or Kalamists :

There is a widespread misconception that Muslims have not contributed significantly to modern progressive movements.

In reality, Muslim youth established the Communist Party of India at Tashkent in 1920.

In the organization of the first CPI Congress in 1925, leaders such as Muzaffar Ahmad and Kazi Nazrul Islam played pivotal roles.

The founders of the Progressive Writers’ Association were predominantly Muslims.

During the Telangana Armed Peasant Struggle, the intellectual backbone — the Comrades’ Association — was largely comprised of Muslims.

Over time, as atheism was emphasized within communist leadership, Muslim participation gradually declined.

It is also worth recalling that Muslims were the first to deliver a military defeat to fascism (in North Africa).

In recent times, the Shaheen Bagh movement, led by Muslim women, demonstrated remarkable resistance against the Communal Dictatorship (CCD) regime, inspiring subsequent movements such as the farmers’ protests.

At every critical juncture of the national movement, Muslims stood shoulder to shoulder with other oppressed communities.

At the Round Table Conferences, Muslim leaders strongly advocated for separate electorates for the Depressed Classes.

It was Muslim leaders who facilitated Dr. B.R. Ambedkar’s election to the Constituent Assembly by vacating a reserved seat through the resignation of their representative Jogendra Nath Mandal.

Despite our collective amnesia about these contributions, historical facts remain indelible.

Figures such as Sir Syed Ahmad Khan and Maulana Abul Kalam Azad have had an enduring impact on the social and political life of Muslims.

Sir Syed is primarily remembered as a social reformer, yet he had a significant political vision.

Conversely, Maulana Azad is remembered chiefly as a political leader, but he was equally a social reformer.

Today, the Muslim community looks up to both as its guiding lights.

In that spirit, we proudly declare ourselves Kalamites and Kalamists, the followers of Maulana Abul Kalam Azad, who is a synonym for Nationalists.

 

4. Ensuring Adequate Representation of Muslims and Adivasis in Leadership:

According to the 2011 Census, Muslims comprise 14.2% and Adivasis 8.6% of India’s population.

It is not our demand that leadership positions be compulsorily assigned to Muslims or Adivasis.

However, it is our earnest desire that these communities receive fair and proportionate representation in the central executive committee, in policy-making, program implementation, and public campaigns.

We must also ensure that Muslim Dalits (Pasmanda), Muslim Adivasis, and Muslim OBCs are accorded due dignity and recognition.

As you have proposed, I invite the three members you mentioned — and if needed, up to two more — to visit my residence on Wednesday, 30th April 2025, between 4:00 PM and 6:00 PM.

My address is:

32-13-53/105, Dasari Ramana Nagar, Church Street, Opposite AMMA Kalyana Mandapam, Vijayawada – 520010.

I will share the location via WhatsApp for your convenience.

If we are able to reach a consensus on these four principles, I would be more than happy to work actively and constructively within the organization.

Looking forward to a fruitful discussion.

With warm regards,

Khan Yazdani (Danny)

Vijayawada, 28th April 2025


మిత్రులారా !

అందరికీ సులువుగా అర్ధం అవుతుందని మనం ఫాసిజం పదాన్ని తరచూ వాడుతున్నాం. 


నిజానికి మన దేశపు వర్తమాన పరిస్థితులకు ఫాసిజంతోకన్నా నాజిజంతో ఎక్కువ పోలికలున్నాయి. 


ఈ ఫాసిజం, నాజిజం అనే పేర్లు వాడినపుడు 1920-45నాటి  ఇటలీ, జర్మనీలతో పోలిక లొస్తాయి. దానితో విబేధాలు వస్తాయి. 

కొన్ని పార్టీలు ఈ ఫాసిజం పదాన్ని ఇప్పటి నియంతృత్వానికి అన్వయించలేక సతమత మౌతున్నాయి.


దీనికి సిపియం తాజా ఉదాహరణ. 


వందేళ్ల క్రితపు పరిస్థితులు ఇప్పుడు వుండవు. మారిపోతాయి.  


1935లో  మాస్కోలో జరిగిన కొమింటర్న్ 7వ కాంగ్రెస్ లో జార్జి డిమిట్రావ్ ఫాసిజాన్ని నిర్వచించాడు. 

అప్పటికి జర్మనిలో హిట్లర్ ఫ్యూరర్ అయ్యాడుగానీ అక్కడ నాజిజం ఇంకా విశ్వరూపాన్ని ప్రదర్శించలేదు. 


ఈ పరిమితుల్ని అర్ధం చేసుకోక జార్జి డిమిట్రావ్ నిర్వచనాన్ని పట్టుకుని వేళ్ళాడడం చారిత్రక భౌతిక వాదానికి అపచారం. 


ఫాసిజం, నాజిజం రెండూ సోషలిస్టు పార్టీలే అనేది మనం మరచిపోతే మరో తప్పు చేస్తున్నవాళ్లం అవుతాము. 


టెక్నికల్ గా అది 'కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్'. 

మనం తెలుగులో 'కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం' అనాలి. 

'కార్పొరేట్ సాంస్కృతిక నియంతృత్వం' అని కూడ చెప్పుకోవచ్చు. 


మన చర్చను ఫాసిజం పదం చుట్టూ తిప్పవద్దు. 


ఆ పదాన్ని వాడడంవల్ల సౌలభ్యంకన్నా సమస్యలు ఎక్కువగా వస్తాయి.


ఈ విషయాన్ని నేను నా మూడవ డాక్యుమెంటు చాలా స్పష్టంగా చెప్పాను. 


మే 4 నాటి సమావేశంలోనూ వివరించాను. 


ఇప్పటికీ ఫాసిజం అంటామంటే చేయగలిగింది ఏమీ లేదు. 

మనం హాయిగా 1935 లో జీవించవచ్చు. 


ఖాన్ యజ్దానీ (డానీ) 

7 మే 2025



పెట్టుబడిదారీ అనేది 19వ శతాబ్దపు పదం.
20వ శతాబ్దంలో లెనిన్ సామ్రాజ్యవాదం అన్నాడు.
ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో వున్నాం.
కార్పొరేట్ అనడం సమంజసం.
వచ్చే శతాబ్దంలో ఇంకో పదం రావచ్చు. 
ఆ ఫ్లెక్సిబిలిటి మనలో వుండాలి.

Malyadri S Bahujana - సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇట్స్ రైట్ నేమ్
[15:33, 07/05/2025] khanyazdani: ఈ పేరుతో వంద ఫ్రంట్ లు గతంలో ఎర్పడ్డాయి.

Sribnivasa Rao - మైనార్టీలు దళిత ,గిరిజన బహుజనులు లో వుంటారు

[15:46, 07/05/2025] khanyazdani: దళిత, గిరిజన, బహుజనుల్లో మైనార్టీలు వుంటారా?

మైనారిటీలకు స్వంత వునికిని భారత కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం ఎలాగూ ఇవ్వదు.
మీరూ ఇవ్వదలచలేదా?  
ఇలాంటి ప్రతిపాదనలు గతంలో చాలామంది చేశారు. 

"భారత కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వానికి ప్రధాన బాధితులు ముస్లింలు"  
అనే స్పష్టమయిన విధాన ప్రకటన లేని సంఘాలు, సమాఖ్యలు, కూటముల్లో నేను వుండను అని అనేకసార్లు చెప్పాను. 

దీని మీద ఏప్రిల్ 30న మా ఇంట్లో ఒక సమావేశం జరిగి 
ఒక నిర్ణయానికి వచ్చాము. 
మీరు మళ్ళీ దళిత, గిరిజన బహుజనుల్లో ముస్లింలు వుంటారంటున్నారంటే ఫన్నీగా వుంది. 
ఇంత ఫన్నీ గ్రూపులో నేను వుండను. 
నిష్క్రమిస్తున్నాను.

Narendra Modi become a New Urban Naxalite

 *నయా అర్బన్ నక్సలైటు నరేంద్ర మోదీ!*

* అర్బన్ నక్సలైటుగా మారిన  మోదీ!*

* మోదీ అర్బన్ నక్సలైటు అవతారం!*

 

 

 

*డానీ*

*సమాజ విశ్లేషకులు*

 

ప్రేమ, యుధ్ధం, రాజకీయాలు. వీటిల్లో ఎప్పుడయినా ఏమైనా జరగవచ్చు. కులగణన కోరుతున్న రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్ అంటూ  విమర్శిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు వారే  అర్బన్ నక్సలైటు అవతారం ఎత్తారు. దేశమంతటా కులగణన జరుపుతామని ప్రకటించారు.  ఇలాంటి బోల్ట్ ఫ్రం ద బ్లూ పరిణామాలు బిజెపిలో చాలా వుంటాయి.

 

కులం భారత సమాజపు ప్రత్యేక లక్షణం. అది అందరికీ తెలుసు. అయితే, దానితో వ్యవహరించడం అంత ఈజీ కాదు. భారత సమాజాన్ని కుల ప్రమాణాలతో విశ్లేషిస్తే వర్గం గొంతులో అడ్డుపడుతుంది. వర్గ ప్రమాణాలతో విశ్లేషిస్తే కులం అడ్డుపడుతుంది. కులవర్గమత ప్రమాణాలతో విశ్లేషించాలి అనడం సులువేగానీ దాని విధివిధానాలు  ఇప్పటికీ సరిగ్గా రూపొందలేదు. స్వాతంత్ర్యం వచ్చాక గడిచిన 78 సంవత్సరాల్లో 14 మంది ప్రధానులు మారారుగానీ ఒక్కరూ  కులగణన జరపడానికి సాహసించలేదు.  

 

బ్రిటిష్ ప్రభుత్వంలో జనాభా లెఖ్ఖల కమీషనర్ గా వున్న జె.హెచ్. హట్టన్ 1931లో తొలిసారిగా మనదేశంలో కులగణన నిర్వహించాడు. అదే చివరిసారి కూడ. మన్మోహన్ సింగ్ ప్రధానిగా వుండగా కేంద్ర గ్రామీణాభివృధ్ధి శాఖ 2011లో సామాజిక, ఆర్ధిక, కుల గణన (SECC) నిర్వహించింది. దాని మీద పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగడంతో ఆ నివేదికను బయటికి రాకుండా నిలిపివేశారు. చాలా మందికి గుర్తించని  విషయం ఏమంటే; మనం ఇప్పటికీ తొంభైయేళ్ళ క్రితపు గణాంకాల  ఆధారంగానే దేశ జనాభాలో కులాల శాతాల గురించి మాట్లాడుతున్నాము.

 

జనాభా లెఖ్ఖల్లో ఎస్సీ, ఎస్టిల వరకు వివరాలు సేకరిస్తుంటారు. అది కూడ 2011 తరువాత ఆగిపోయింది. వెనుకబడిన తరగతులు, ముస్లిం సామాజికవర్గాల సంఖ్య, శాతాల విషయంలోనే తరచూ అనేక ఉహాగానాలు, వివాదాలు చెలరేగుతుంటాయి. 

 

ముస్లిం జనాభా అతి వేగంగా పెరిగిపోతూ సమీప భవిష్యత్తులో ఇండియా ఒక ఇస్లామిక్ దేశం గా మారిపోతుందని  సంఘపరివారం తరచూ ఒక ప్రచారం చేస్తుంటుంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టి  2005లో ముస్లిం సమాజంలోని వెనుకబడిన తరగతులకు బిసి-ఇ జాబితాలో 4 శాతం రిజర్వేషన్ కల్పించినపుడు పెద్ద దుమారం రేగింది. ముస్లిం బిసిల  జనాభా అంత లేదంటూ  సంఘపరివారవర్గాలు హైకోర్టును ఆశ్రయించాయి. జనాభా గణాంకాలను శాస్త్రీయంగా సేకరించకుండా రిజర్వేషన్ కల్పించారని ఆరోపించాయి. న్యాయస్థానం కూడ ఆ ఆరోపణని పరిగణన లోనికి తీసుకుంది. కానీ, జనాభా గణాంకాలను శాస్త్రీయంగా ఎలా సేకరించాలో మాత్రం ప్రభుత్వానికి సూచించలేదు. 

 

ఓబిసిలకు రాజ్యాంగం తొలి ప్రతిలో రిజర్వేషన్ లేదు.  తమిళనాడులో నిరసనలు చెలరేగాక, సుప్రీం కోర్టు  జోక్యంతో రాజ్యాంగానికి తొలి సవరణగా ఆర్టికల్ 15 (4) చేర్చి రాష్ట్రాల స్థాయిలో విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించారు. అయితే, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ సౌకర్యం కల్పించలేదు. 

 

ఓబిసిలు సామాజిక, విద్యా, ఆర్ధిక రంగాల్లో ఎదుర్కొంటున్న వివక్ష, వెనుకబాటుతనం, పేదరికాలను తొలగించడానికి అవసరమైన  సూచనలు ఇవ్వడానికి 1979 జనవరి 1న అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయి బిపి మండల్  కమీషన్ వేశారు. దేశ జనాభాలో ఓబిసిలు 54 శాతం వున్నారని మండల్ కమీషన్ తేల్చింది. వారికి కేంద్ర ప్రభుత్వంలో, ప్రభుత్వరంగ సంస్థల్లో 27 శాతం రిజర్వేషన్ కల్పించాలని సూచించింది. ఆ సిఫార్సుల్ని  ఓ దశాబ్దం తరువాత 1990 ఆగస్టు 7న అప్పటి ప్రధాని విపి సింగ్ ఆమోదించారు.

 

          ఓబిసిలకు రిజర్వేషన్ కల్పించడం సహించలేని ఆధిపత్య  కులాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాయి. వాళ్ళ సంతతి వీధి పోరాటాలు నడిపింది. ఉత్తర భారతదేశంలో నిరసన జ్వాలలు  చెలరేగాయి.

 

1984 లోక్ సభ ఎన్నికల్లో 2 స్థానాలు గెలుచుకుని పార్లమెంటులో ప్రవేశించిన  బిజెపి, 1989 ఎన్నికల్లో బాగా పుంజుకుని 85 స్థానాలకు చేరుకుంది. ఆ పార్టి తన రాజకీయ భవిష్యత్తును ఆధిపత్య కులాల నిరసనల్లో గుర్తించింది. ‘మండల్ కు వ్యతిరేకంగా కమండలం’ చేపట్టి   రామ్ రథయాత్ర మొదలెట్టింది. ఇందులో బిజెపికి నాలుగు  లక్ష్యాలున్నాయి. మొదటిది; రాజకీయ రంగంలో ఆధిపత్య కులాల ప్రతినిధిగా ప్రకటించుకోవడం. రెండోది; ఓబిసిలకు రిజర్వేషన్ కల్పించిన విపి సింగ్ ప్రభుత్వాన్ని కూల్చేయడం. మూడోది; ముస్లింల నుండి హిందూమతానికి ముప్పు పొంచి వుందని ప్రచారం చేయడం. నాలుగోది; దేశంలోని ఓబిసి తదితర బహుజనుల దృష్టిని రిజర్వేషన్ల నుండి అయొధ్య శ్రీరాముని వైపు మళ్ళీంచడం. రామ్ రథయాత్ర పెట్టుకున్న లక్ష్యాల్లో కొన్నింటిని పూర్తిగా కొన్నింటిని పాక్షికంగా సాధించింది.

సంఘపరివారం రోడ్ మ్యాప్ లో 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేతతో ఒక ఘట్టం ముగిసింది. ఆ మహాసంస్థ తను  చేపట్టిన ‘పవిత్ర యుధ్ధం’లో హిందూ ఎస్టి, ఎస్సి, బిసిలలో చెప్పుకోదగ్గ భాగాన్ని తన కాల్బలంగా మార్చుకోగలిగింది. ఈ పరిణామం 2002 నాటి గుజరాత్ అల్లర్లలో స్పష్టంగా కనిపించింది.

 

సంఘపరివారం కులాలను గుర్తించదు. హిందూసమాజం మొత్తం ఒకే మతం  అనేది దాని సిధ్ధాంతం. ఈ సిధ్ధాంతానికి ప్రభావితులైన ఎస్టి, ఎస్సి, బిసి నేతలు కొందరు బిజెపికి తమ శక్తిమేర సేవలు అందించారు. వారిలో ప్రముఖ అంబేడ్కరైట్లు కూడ వున్నారు. రాడికల్ అంబేడ్కరైట్లు, రాడికల్ ఫూలేయైట్లు కులాన్ని ప్రధాన వైరుధ్యంగా భావిస్తారు. వాళ్లు సంఘపరివారాన్ని గట్టిగా వ్యతిరేకిస్తారు.

 

బయటి ప్రపంచానికి అంతగా తెలియదుగానీ ఆదివాసుల్లో  తండాకు  ఒక మతం వుంటుంది. మరింత లోతుకు వెళితే ఒక్కో సమూహానికి ఒక్కో మత విశ్వాసం వుంటుంది. ఇప్పుడు జనాభా లెఖ్ఖల్లో ఆ వైవిధ్యాన్ని పూర్తిగా తొలగించేశారు. హిందూ, ఇస్లాం, క్రైస్తవం, శిక్కు, బౌద్ధ  జైన మతాల్లో ఏదో ఒకదాన్ని ఆదివాసులు ఎంచుకునేలా జనాభా లెఖ్ఖల చట్టాన్ని సవరించారు.

 

భారత ముస్లింసమాజంలో కూడ శాఖ, కుల వర్గీకరణ తెచ్చి ‘సున్నీ అష్రాఫ్’లకు వ్యతిరేకంగా  షియా,  సున్నీ బిసి, ఎంబిసిలను దగ్గరికి చేర్చుకోవడానికి ఒక దశలో బిజెపి ప్రయత్నించింది. అది ‘పవిత్రయుధ్ధం’ ఫార్మూలాకే ముప్పుగా మారుతుందని భయపడి ఆ కాడిని దించేసింది.  

 

 బ్రిటీష్ పాలకులు నేరస్మృతిని ఇంగ్లండు నుండి తెచ్చారుగానీ పౌరస్మృతిని ఇక్కడి స్థానికుల్నే ఎంచుకోమన్నారు. బెంగాల్ గవర్నర్ జనరల్ గావున్న వారెన్ హేస్టింగ్స్ 1772లో హిందూ ప్రతిధుల కోరిక మేరకు మనుధర్మాన్ని పౌరస్మృతిగా ప్రకటించాడు. భారత రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షునిగా వ్యవహరించిన బిఆర్ అంబేడ్కర్ ఇక మనుసృతికి కాలం చెల్లింది అని ప్రకటించడం సంఘీయులకు బాగా ఆగ్రహాన్ని తెప్పించింది. రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోనికి రాగా, ఆ వెంటనే వచ్చిన ఆర్గనైజర్ ఫిబ్రవరి 6 సంచిక "మనువు మన హృదయాలను పాలిస్తుంటాడు" అని ప్రకటించింది.

 

హిందూ ఎస్సి, బిసి, ఎస్టిలను మత ప్రాతిపదిక మీద తమకు దగ్గరగా తీసుకొని ఓటు బ్యాంకును పెంచుకోవాలనుకుంటున్న  సంఘీయులు అంబేడ్కర్ ను వ్యూహాత్మకంగా స్వంతం చేసుకుంటున్నారు. అంబేడ్కర్ రచనల్ని వాళ్ళు ఆరు భాగాలుగా విభజిస్తున్నారు.  

 

మొదటిది; మనుస్మృతి, కులఅణిచివేత మీద  అంబేడ్కర్ చేసిన ఘాటైన విమర్శను దాచి పెడతారు. లేదా, వర్ణం తప్ప కులం అనేది అస్సలు హిందూ సాంప్రదాయమే కాదనే వాక్యంతో అంబేడ్కర్  ఆరోపణలన్నింటినీ తేలిగ్గా కొట్టిపడేస్తారు.

 

రెండవది; ఇస్లాం, ముస్లింల మీద కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంబేడ్కర్ చేసిన విమర్శల్ని తమ పవిత్ర యుధ్ధానికి అనుకూలంగా వాడుకుంటారు.  

 

మూడవది; గాంధీ అంబేడ్కర్ల మధ్య సాగిన వివాదాలకు ఎక్కువ ప్రచారం కల్పించి ఎస్సి, ఎస్టి, బిసిలు జాతీయ కాంగ్రెస్ కు దగ్గర కాకుండ చూసేందుకు వాడుతారు.

 

నాలుగవది; కమ్యూనిస్టు పార్టిల్ని అంబేడ్కర్ తన ప్రధాన శత్రువులని భావించేవారని విస్తృతంగా  ప్రచారం చేసి  ఎస్సి, ఎస్టి, బిసిలు  మార్క్సిజానికి ఆకర్షితులు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

 

ఐదవది; కుల వివక్ష రద్దుకు అంబేడ్కర్ చూపిన పరిష్కారాల్ని మెచ్చుకుంటూ ఆయన్ని హిందూమత సంస్కర్తగా కొనియాడుతారు. అంబేడ్కర్ పేరులోనే రాముడు (రాంజీ)  వున్నాడని ఈమధ్య ప్రత్యేకంగా పేర్కొంటున్నారు. శ్రీరాముడ్ని విశ్వసించే ఎస్సీ, బిసిల మీద ఈ మాటలు బాగా పనిచేస్తాయి.

 

ఆరవది; రాజ్యాంగం మన దేశానికి అంబేడ్కర్ ఇచ్చిన ప్రసాదమని పేర్కొనడమేగాక, ఇప్పుడు రాజ్యాంగాన్ని నెత్తి మీద పెట్టుకుని తిరుగుతారు.  తాము ఏది చేసినా రాజ్యాంగానికి విధేయులమై వుంటున్నామని బుకాయిస్తారు.  

 

 

ఇంతటి ప్రచార హోరుతో ప్రజల్ని సంఘ్ పరివారం  వశీకరిస్తున్నా  సమస్త రంగాల్లో కులవివక్ష అనే కఠిన వాస్తవం బహుజనుల్ని ఎప్పుడో ఒకప్పుడు మెలుకువ వచ్చేలా చేస్తుంది. అప్పుడు వాళ్లు కులగణన జరిపించమని తప్పక అడుగుతారు. పైగా, రాహుల్ గాంధీ రోజుకు ఒకసారి ‘జిస్కే జిత్నీ భాగేదారీ ఉస్కే ఉత్నీ హిస్సేదారి’ (ఎవరి జనాభా ఎంతో సంపదలో వారికి అంత’) అని నినదిస్తున్నారు.

 

అసెంబ్లీ ఎన్నికల భయంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అందరికన్నా ముందుగా కులగణన చేపట్టారు. వెనుకబడిన తరగతులు 27 శాతం, అతి వెనుకబడిన తరగతులు 36 శాతం, ఎస్సిలు 20 శాతం అని బీహార్ ప్రభుత్వం తేల్చింది. ఇప్పుడు ముంపు నీరు బిజెపి కాళ్ళ కిందికి వచ్చింది. ఆ పార్టి ఇప్పుడు అర్బన్ నక్సలైట్ అవతారం ఎత్తక తప్పలేదు.

 

ఈ అర్బన్ నక్సలైట్ సిధ్ధాంతం ఒక విధంగా అంబేడ్కర్ దే. రాజకీయ రంగంతోపాటు సామాజిక, ఆర్ధిక రంగాల్లోనూ సమానత్వాన్ని సాధించకపోతే ప్రజలు తిరగబడతారని అంబేడ్కర్ సాక్షాత్తు రాజ్యాంగ సభలోనే హెచ్చరించాడు.  రాజకీయాల్లో ఎస్టి రాష్ట్రపతిని చూసి అడవిలో ఆదివాసులు,  బిసి ప్రధానిని చూసి మైదానాల్లో  బిసిలు సంతృప్తి పడిపోరు. వాళ్ళకు సాంఘీక, ఆర్ధిక సమానత్వం కావాలి. అదీ అసలు విషయం. వాళ్ళను అడవి నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్లు అని ఎద్దేవ చేయవచ్చుగానీ అది పరిష్కారం కాదు. పిక్చర్ అభి బాఖీ హై!

 

5 మే 2025