Monday 30 May 2016

Discourse with VV

Discourse with VV

“ఐక్య కమ్యూనిస్టు పార్టీ 1946లో మొదటిసారి సాయుధ పోరాట పంథాను ప్రకటించింది. 1947 సెప్టెంబర్‌ 11న సాయుధ పోరాటాన్ని ప్రారంభించినా 1948 సెప్టెంబర్ 13-17 నాటికే ఆ పంథా పట్ల అందులోని మితవాద వర్గానికి విశ్వాసం సన్నగిల్లింది. “ 
- వరవరరావు - చరిత్ర - చర్చ -  Sakshi Daily -  | 15.05.2016 01:23:23pm


Works at Journalist
ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు నాకు భారత కమ్యునిస్టుపార్టీ కార్యక్రమం మీద కొన్ని సందేహాలు కలిగాయి. 

1. భారత కమ్యూనిస్టు పార్టి 1947 సెప్టెంబర్ లోనే ఎందుకు సాయుధ పోరాటాన్ని మొదలెట్టిందీ?
2. 1948 సెప్టెంబర్ లోనే ఎందుకు విరమణ ప్రకటించిందీ?
3. ఆ సాయుధపోరాటం నైజాం సంస్థానంలోనే సాగిందా? దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ కొనసాగిందా? మిగిలిన వాటి విస్తృతి ఎంత?
4. దాదాపు వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే కమ్యూనిస్టు పార్టీ సాగించిన సాయుధ పోరాటం కేవలం నిజాంను గద్దెదించడం కోసమేనా?
5. ”ముస్లిం’ నిజాం సంస్థానాన్ని ’హిందూ’ ఇండియన్ యూనియన్ లో విలీనం చేయాలనే ’హిందూత్వ’ కార్యక్రమానికి ఆర్యసమాజ్ సూత్రధారిగావుంటే కమ్యూనిస్టు పార్టీ పాత్రధారిగా వుండిందా?
6. కమ్యూనిస్టు పార్టీలోని అతివాదులు నిజాం మీద సాయుధ పోరాటం చేయాలన్నారు. నిజాం గద్దె దిగగానే మితవాదులు సాయుధ పోరాటవిరమణ చేయమన్నారు. ఇద్దరూ ఒకే మతవాదాన్ని కొనసాగించారా?


LikeReply1May 17, 2016 7:34am

Pendyala VaraVara Rao
1946లో చైనా నూత‌న ప్ర‌జాస్వామిక విప్లవ పంథా అనుస‌ర‌ణీయ‌మ‌ని భావించింది గ‌నుక, 1947 ఆగ‌స్టులో జ‌రిగింది కేవ‌లం ట్రన్స్ఫర్ ఆఫ్ పవర్ అని విశ్లేషించింది గనుక. 46 జులై 4న ప్రకటించిన సాయుధ పోరాట పంథాను చేపట్టింది. మగ్ధూమ్, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి సాయుధ పోరాటాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు.

నెహ్రూ socialist stance పట్ల విశ్వాసం, ఆ భ్రమలతో మితవాద వర్గం మిలిటరీ యాక్షన్ తర్వాత పోరాట విరమణ చేయాలన్నారు. దానికి కూడా రా.నా. నాయకుడు. అయితే మెజారిటీ వ్యతిరేకించారు గనకనే 1951 వరకు సాయుధ పోరాటం కొనసాగింది. ముఖ్యంగా ప్రజలు కోరుకున్నారు. అప్పటికి మతవాసనాలున్నాయని చెప్పలేము. ఎందుకంటే 1952లో పి.డి.ఎఫ్ కు నాయకత్వం వహించిన డా.జయసూర్య స్వయంగా రజాకార్ల పేరుతో కనీసం 40 వేలు, గరిష్టంగా 2లక్షల మందిని యూనియన్ మిలిటరీ చంపిందని కేంద్ర హోం మినిస్ట్రీ కి సమగ్ర రిపోర్టు ఇచ్చాడు. సుందర్ లాల్, నెహ్రూ స్నేహితుడు కూడా 40 వేల మంది ముస్లింలను చంపారని నెహ్రూకు రిపోర్టు ఇచ్చాడు. ఈ సమాచారం అనండి, చరిత్ర అనండి, దీనినుంచి conclusions ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు డ్రా చేయవచ్చు. అయితే జూలై 4 పిలుపుకు ప్రేరణ దొడ్డి కొమరయ్య హత్యపై విసునూరు దొరకు వ్యతిరేకంగా. జనరల్ గా తెలంగాణ, హైదరాబాదు రాజ్యం మొత్తంగా హిందూ భూస్వాములకు వ్యతిరేకంగానే... తక్కువమంది ముస్లిం భూస్వాములు గ్రామీణ ప్రాంతాల్లో ఉండవచ్చు. కానీ పార్టీ విశ్లేషనయే హిందూ భూస్వామ్య పిరమిడ్ పై ముస్లిం ప్రభువున్నాడని. వ్యవస్థ పునాది వీళ్ళని. రజాకార్ల స్వల్ప కాలం మినహాయిస్తే మిగిలిన కాలమంతా ఇక్కడ హిందూ ముస్లింలు రైతులు, కౌలుదారులుగా జీవించారు. బందగీ ఈ పోరాటానికి వేగుచుక్క. కామ్రేడ్స్ అసోసియేషన్ లో డి.వి తప్ప మిగతా అందరూ ముస్లిం మేధావులు, కవులు, తత్వవేత్తలు.
LikeReply1May 18, 2016 11:52pm
ట్రావన్ కోర్ కొచ్చిన్ లో మోప్లా పోరాటం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ముస్లిం రైతాంగం బ్రాహ్మణ భూస్వాములకు వ్యతిరేకంగా చేశారు.


A.m. Khan Yazdani Danny · 
Works at Journalist

ఖిలాపత్ ఉద్యమం మీద బ్రిటీష్ పాలకులు సాగించిన క్రూరఅణిచివేత మోఫ్లా ముస్లింల తిరుగుబాటుకు తక్షణ ప్రధాన కారణం. బ్రిటీష్ ఇండియాలో కమ్యూనిస్టులు 1925 తరువాతనే ఒక పార్టీగా ఏర్పడ్డారు. మోఫ్లా వుద్యమం 1922 ఫిబ్రవరిలోనే ముగిసింది. అప్పటికి భారత కమ్యూనిస్టు పార్టీకి సాయుధ పోరాట పంథా లేదు.
May 31, 2016 11:52pm

No comments:

Post a Comment