Friday 4 May 2018

Chandrababu Should Answer to Muslims


చంద్రబాబు సమాధానం చెప్పాలి
డానీ  ( యం ఖాన్ యజ్దానీ)


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక తరహా హోదాతోపాటూఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం -2014 అమలు  కోసం  ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు ముస్లిం ఆలోచనాపరుల వేదిక సంపూర్ణ మద్దతు  తెలుపుతోంది.

అయితే ముస్లిం సమాజానికి  తెలుగుదేశం  ప్రభుత్వం చేసిన, చేస్తున్న  అన్యాయాల్ని  సందర్భంగా ప్రస్తావించాల్సిన అవసరం వుంది.

యన్టీ రామారావు హయాంలో ముస్లింలు తెలుగు దేశం పార్టీ మీదఅభిమానంతోవుండేవారు. చంద్రబాబు ముఖ్యమంత్రి  అయ్యాక సన్నివేశం మారిపోయింది. 1998 మార్చి మూడవ వారంలో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా హైదరాబాద్ నుండి బయలుదేరిన చంద్రబాబు ఢిల్లీలో ఎన్డీఏ కన్వీనర్ గా రాజకీయాంతీకరణ గావించి ఏబి వాజ్ పాయిని ప్రధాని చేయడంలో కీలక పాత్ర వహించారు. చంద్రబాబు హిందూ మతతత్త్వ శక్తులతో చేతులు కలిపినందుకు మనస్తాపం చెందిన బహిరుద్దీన్ బాబూఖాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

2002లో గుజరాత్ లో ముస్లింల మీద నరమేధం జరిగినప్పటికీ చంద్రబాబు బీజేపీకి మద్దతునుఉపసంహరించుకోలేదు. వాజ్ పాయి  పాలనను ఓడించాలనే  లక్ష్యంతో ముస్లింలు 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ కు  మద్దతు   పలికారుమతతత్త్వ శక్తులతో చేతులు కలిపిన   చంద్రబాబు  పాలన   ఆంధ్రప్రదేశ్ లో అంతం కావడానికి తమ వంతు కృషి చేశారు. 2009  ఎన్నికల్లోనూ  ముస్లింలు  టిడిపిని విశ్వసించలేదు.

2011 టిడిపి మహానాడు సభా వేదిక నుండియన్ టి రామారావు జయంతి అయిన మే 28న చంద్రబాబు  ముస్లిం  సమాజానికి  తనంతట తానుగా  క్షమాపణలు  చెప్పారు.ఎన్డీఏ పాలనకు మద్దతు ఇవ్వడం నా తప్పుఇంక ఎన్నడూ ఎట్టి పరిస్థితుల్లోనూ మతతత్త్వశక్తులతోచేతులు కలపను అని హామీ ఇచ్చారు. వారు  క్షమాపణలు చెప్పి ఊరుకోలేదు.  2012  సెప్టెంబరు  28  శుక్రవారం  నాడు  చంద్రబాబు ముస్లింల మీద వరాల  జల్లు  కురిపించారు.  తాము  అధికారానికి రాగానే రూ. 2500 కోట్ల రూపాయలతో ముస్లిం సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామన్నారు.

ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఏర్పాటు చేసిన మరో ప్రత్యేక సదస్సులో ముస్లింలకు రాజకీయవిద్యాఉపాధిరంగాలతోపాటూ , సాలీన రాష్ట్ర బడ్జెట్ లో 8 శాతం కోటా  కల్పిస్తామన్నారు. 24 మంది  ముస్లిం  అభ్యర్ధులకు  టిడిపి  టిక్కెట్లు  ఇవ్వడగాక  కనీసం 15 మంది అభ్యల్ని గెలిపించుకునే బాధ్యతను తాను వుక్తిగతంగా స్వీకరిస్తానన్నారు. రాష్ట్రంలో జస్టిస్ సచార్ కమిటీ సిఫార్సుల్ని అమలు పరుస్తా మన్నారు.

అప్పటికి బీజేపి ప్రధానమంత్రి అభ్యర్ధిగా వున్న నరేంద్రమోదీ 2013  జులై  నెలలో ఒక టీవీ ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ  గుజరాత్ నరమేధాన్ని  కారు కింద పడిన కుక్కపిల్ల గా పోల్చారు.  అప్పుడు చంద్రబాబు  ఇలాంటి వ్యక్తి  దేశప్రధాని పదవికి పనికి రాడు అని ప్రకటించారు. తరువాత , మోదీని  భావి భారత మహానాయకునిగా చిత్రిస్తూ కార్పొరేట్ కంపెనీలు సాగించిన బూటకపు  ప్రచారానికి చంద్రబాబు కూడా లొంగిపొయారు.

 ప్రధానిగా మోదీ వస్తే దేశం బాగుపడుతుందని  పార్టీతో పొత్తు పెట్టుకున్నాం  అని ఇప్పుడుచంద్రబాబు అంటున్నారుదీని అర్ధం ఏమిటీ?

మతతత్త్వశక్తులతో పొత్తులు పెట్టుకోమువిద్యాఉపాధిరాజకీయరంగాల్లో ముస్లిం ప్రాతినిధ్యాన్నిపెంచుతాంసచార్ కమిటీ  సిఫార్సుల్ని  అమలు  చేస్తాం అన్న చంద్రబాబు వాగ్దానాలన్నీ కాలి బూడిదై పోయాయి. ముస్లింలకు  8 శాతం రిజర్వేషన్లు, 15 మంది ఎమ్మెల్యేలు కాదు కదా గుజరాత్  నరమేధ  కిరీటధారినరేంద్ర మోదీ మనోభావాలు దెబ్బతింటాయని రాష్ట్ర  కేబినెట్  లో  ఒక్క  ముస్లింకు కూడా స్థానంకల్పించలేదు.

నరేంద్ర మోదీ తనను నాలుగేళ్ళు మోసం చేశారని చంద్రబాబు ఇప్పుడు ఆరోపిస్తున్నారుఈనాలుగేళ్ళు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలను ఘోరంగా మోసం చేస్తూ వచ్చారు.

మోదీ చేసిన మోసానికి నిరసనగా చంద్రబాబు ఇప్పుడు  పుట్టిన రోజు దీక్షలుధర్మపోరాటాలుచేస్తున్నారుమరి చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా ముస్లింలు ఎలాంటి నిరసనలు తెలపాలీ? తనవల్ల  ముస్లిం  సమాజానికి  జరిగిన  నష్టానికి  పరిహారంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో ఇప్పుడయినా చంద్రబాబు ప్రకటించాలి.

చంద్రబాబును విమర్శిస్తున్నామంటే జగన్ ను సమర్ధిస్తున్నట్టుకాదుజగన్ ఢిల్లీలో నరేంద్ర మోదీతోరహాస్య రాజకీయ అనుబంధాన్ని కొనసాగిస్తున్నట్టు  ముస్లిం  సమాజం అనుమానిస్తున్నదిఅదేనిజమయితే నంద్యాల ఉప ఎన్నికల  అనుభవాన్నే రేపు 2019 అసెంబ్లీ, లోక్ సభా ఎన్నికల్లో జగన్ చవిచూస్తారు. ఈలోపు చంద్రబాబు గతంలో తాను ప్రకటించిన ముస్లిం సబ్ ప్లాన్ ను అమలు చేయాలి.

(రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) కన్వీనర్)

Vijayawada
3 May 2018  

ప్రచురణ :
ప్రజాపాలన, 4 మే 2018                                 

No comments:

Post a Comment