Wednesday 9 December 2020

ముస్లింల కోసం అందరూ; అందరి కోసం ముస్లింలు.

 

దేశవ్యాప్త రైతుల ఆందోళనకు ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)  సంపూర్ణ సంఘీభావాన్ని తెలుపుతోంది.

 

ముస్లింల కోసం అందరూ; అందరి కోసం ముస్లింలు.  

 

 

ఆలోచనాపరుల వేదిక (MTF) సభ్యులూ కో-కన్వీనర్లకు.

 

అస్సలాము అలైకుమ్,

 

మిత్రులారా!

 

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలను వేధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. కార్పొరేట్ల ఊడిగం చేయడానికి మైనారిటీలు మాత్రమేగాక కార్మికులు, కర్షకులు. సామ్యవాదుల్ని సహితం ఈ ప్రభుత్వం అణిచివేస్తున్నది. ఈ  నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు జరిగే  ప్రతి ఉద్యమంలోనూ ముస్లింలు చురుగ్గా పాల్గొనాలి. వీలున్న చోట్ల నాయకత్వాన్ని చేపట్టడానికి చొరవను ప్రదర్శించాలి. 

 

ముస్లింలు అందరి కోసం నిలబడ్డప్పుడు మాత్రమే అందరూ ముస్లింల కోసం నిలబడతారు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ నిరంతరం గుర్తు పెట్టుకోవాలి.

 

ఖాలీదా పర్వీన్,  ఉమర్ ఫారూఖ్ ఖాన్, జహా ఆరా, ఫయాజ్ ఆలీ, హసన్ షరీఫ్ తదితర MTF కో-కన్వీనర్లు నిరంతరం ప్రజల్లో పనిచేస్తున్నారు. వీళ్ళు సహజ నాయకులు.  ఇది మహత్తర విషయం.  కరోనా కాలంలో రాజమండ్రికి చెందిన ఆమీర్ ముహమ్మద్ గొప్ప సేవలు అందించారు.   వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇతర కో-కన్వీనర్లు, సభ్యులు కూడ క్రియాశీలంగా మారాలి.

 

కరోనా ఉధృతి తగ్గగానే మనం త్వరలో ఏదో ఒక నగరంలో సమావేశం అవుదాం. ఈలోగా  జాతీయంగా సాగుతున్న  కార్మిక- కర్షక ఉద్యమాల మీద ముస్లింల అవగాహనను పెంచడానికి తక్షణం ఒక జూమ్ మీటింగును నిర్వహించాల్సిందిగా హసన్ షరీఫ్ ను కోరుతున్నాను.

 

అందరూ ముస్లింల కోసం నిలబడాలంటే ముస్లింలు అందరి కోసం నిలబడాలి.

 

జజఖుల్లా ఖైర్

మీ

ఖాన్ యజ్దానీ

No comments:

Post a Comment