Tuesday 16 February 2021

10 Points one should know about VISAKHA STEEL

 విశాఖ ఉక్కు గురించి

తెలుసుకోవాల్సిన

10 అంశాలు 

1

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు.  భారత దేశంలో తీరప్రాంతంలో వున్న ఏకైక స్టీలు ఫ్యాక్టరీ ఇది.

 

2.

64 గ్రామాల ప్రజలు 33 వేల ఎకరాల భూములిస్తే పుట్టిన ప్రాజెక్టు ఇది.

 

3

ఫ్యాక్టరీ శంఖుస్థాపన జరగడానికి ముందే దాన్ని పోరుగు రాష్ట్రం తమిళనాడుకు హైజాక్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ కుట్రను వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1966లో  పెద్ద ఉద్యమం సాగింది. విశాఖపట్నం, గుంటూరు, వరంగల్, హైదరాబాద్ విద్యార్ధులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన సాగించారు.

 

4.

విశాఖకు చెందిన తెన్నేటి విశ్వనాధం ఉద్యమానికి నాయకత్వం వహించారు. గుంటూరుకు చెందిన టి. అమృతరావు ఆమరణ నిరాహార దీక్ష సాగించారు. ఆనాడు ఏపీలో వున్న రాజకీయ పార్టీలన్నీ ఉద్యమానికి మద్దతు పలికాయి.

 

5.

ఉద్యమంలో విశాఖపట్నానికి చెందిన 12 మంది చనిపోయారు. ఇతర జిల్లాల్లో ఇంకో 20 మంది చనిపోయారు. ప్రాణ త్యాగాలతో ఆ ఉద్యమం విజయవంతమైంది.

 

6

ప్రధానుల్లో లాల్ బహద్దూర్ శాస్త్రి హయాంలో ఉక్కు ఫ్యాక్టరీ  ప్రతిపాదన వచ్చింది. ఇందిరాగాంధి  శంకుస్థాపన చేశారు. పివి నరసింహారావు  జాతికి అంకితం చేశారు. మన్మోహన్ సింగ్ విస్తరణ పథకాన్ని ఆరంభించారు. అప్పటి రష్యా (యూఎస్ ఎస్ ఆర్) ఫ్యాక్టరీ నిర్మాణానికి సాంకేతిక సహకారాన్ని అందించింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరి ప్రస్తుత వ్యవస్థాపక సామర్ధ్యం 63 లక్షల టన్నులు.

 

7

విశాఖ స్టీల్ ప్లాంటులో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి రూ. 6 వేల కోట్ల రూపాయలు మాత్రమే. విశాఖ స్టీల్ ప్లాంటు నుండి వివిధ పన్నుల వగయిరాల ద్వార ఇప్పటి వరకు దాదాపు రూ. 40 వేల కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేరాయి. 

 

8.

అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకు స్వంత ఇనుప గనుల్ని కేటాయించలేదు. 

 

9

విశాఖఉక్కును ప్రైవేటికరించాలని మొదటి నుండీ బిజెపి తపిస్తున్నది. వాజ్ పాయి ప్రభుత్వం విశాఖ ఉక్కు భవిష్యత్తును 2000లో బిఐఎఫ్ ఆర్ కు అప్పచెప్పింది. అప్పటి సియం చంద్రబాబు గట్టిగా ప్రతిఘటించడంతో ఆ ప్రమాదం తప్పింది.

 

10.

ఇప్పుడు విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయడానికి బిజెపి మరోసారి సిధ్ధపడింది.  ఈ మేరకు రిపబ్లిక్ డే రోజున కేంద్ర మంత్రివర్గం ఒక తీర్మానం చేసింది.

No comments:

Post a Comment