Thursday, 24 April 2025

*ఆదానీ, అంబానీ పేరు చెప్పగానే అధికారపక్షం, ప్రతిపక్షం ఒకటైపోతున్నారు*

*ఆదానీ, అంబానీ పేరు చెప్పగానే అధికారపక్షం, ప్రతిపక్షం ఒకటైపోతున్నారు*

 

‘సెకీ- ఆదానీ  సోలార్‌ విద్యుత్తు ఒప్పందం రద్దు చేయాలి’

రౌండ్ టేబుల్ సదస్సులో సివిల్ సొసైటీ కన్వీనర్ డానీ ప్రసంగం.

 

24 ఏప్రిల్ 2025, గురువారం, బాలోత్సవ్ భవన్, విజయవాడ  

 

6 mnts.

(నిముషానికి 75 పదాలు / 500 క్యారెక్టర్స్) 




 

మిత్రులారా!

సెంటర్ ఫర్ లిబర్టి సంస్థకూ,

ఇవ్వాల్టి రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ నిర్వాహకులు నలమోతు చక్రవర్తిగారికి,

నాకు మీ ముందు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు.

 

చక్రవర్తిగారు ఈ సదస్సుకు నన్ను ఆహ్వానిస్తూ ఒక సూచన చేశారు.

మీరు వచ్చి మీ కమ్యూనిస్టు అభిప్రాయాల్ని చెప్పాలి అన్నారు.

నేను దానికి కట్టుబడే మాట్లాడుతాను.

 

కేంద్ర ప్రభుత్వం గురించి మనుకున్న సాధారణ అభిప్రాయం ఏమంటే నరేంద్ర మోదీజీ ప్రధాన మంత్రి అయ్యాక ఆదానీ, అంబానీల సంపదను అడ్డగోలుగా పెంచేస్తున్నారు అని.  ఈ నేరేటివ్ నే మనం నమ్ముతున్నాం. అదే మాట్లాడుతున్నాం.

 

ఇది తలకిందులు అవగాహన.

వాస్తవం అదికాదు.

 

1848 నాటి కమ్యూనిస్టు పార్టి మ్యానిఫెస్టో లోనే కార్ల్ మార్క్స్ ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాడు.

పెట్టుబడీదారీవర్గం తన ప్రయోజనాలను సాధించిపెట్టే విధంగా రాజకీయ రంగంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని రూపొందించుకుంది అన్నాడు.

 

పెట్టుబడీదారులకు ఒక్కటే ప్రయోజనం. విపరీతంగా లాభాలు సంపాదించుకోవడం.

 

దాని అర్ధం ఏమంటే, ఆదానీ, అంబానీ తదితరులు కలిసి నరేంద్ర మోదీజీ ప్రధాని అయితే తమ సంస్థలు మరింత లాభాలు గడిస్తాయని అనుకున్నారు. గుజరాత్ ప్రయోగం సక్సెస్ అయ్యాక ఆయన్ని తీసుకుని వచ్చి ప్రధానిని చేసుకున్నారు.

 

మెగా కార్పొరేట్లు చేసిన ప్రధాని గాబట్టి మోదీజీ కూడ  కార్పొరేట్ల సేవలో తరిస్తున్నారు.

 

మోదీజీ మూలంగా కార్పొరేట్లు బలపడడంలేదు; తాము బలపడడం కోసమే కార్పొరేట్లు మోదీజీని ప్రధాని పదవిలో కూర్చోబెట్టుకున్నారు.

దేశంలో కమ్యూనిస్టు పార్టీలు ఎన్నయినా వుండవచ్చు. వాటన్నింటి రాజకీయార్ధిక  అవగాహన మాత్రం ఇదే.  

 

ఈ సదస్సులో చిగురుపాటి బాబూరావు తొలి ప్రసంగం చేసినప్పటి నుండి, తుంగ లక్ష్మీనారాయణ తదితరుల ఉపన్యాసాలు వింటుంటే నాకు ఎన్నడో పదో తరగతిలో విన్న బమ్మెర పోతన భాగవత పురాణం గుర్తుకు వస్తున్నది.

 

మహా భాగవతం తొలి స్కందంలోనే ఒక ఆసక్తికర సన్నివేశం వుంటుంది. వైకుంఠ ద్వార పాలకులైన జయ విజయులు శాపగ్రస్తులై భూలోకానికి పోవాల్సి వస్తుంది. అప్పుడు వారికి విష్ణుమూర్తి రెండు ఛాయిస్ లు ఇస్తాడు. నా భక్తులుగా అయితే ఆరు జన్మల్లోనూ, నా ప్రత్యర్ధులుగా అయితే మూడు జన్మల్లోనూ వైకుంఠానికి తిరిగి వస్తారు అంటాడు.

 

ఆ సన్నివేశాన్ని ఇప్పటి రాజకీయాలకు వర్తింపజేస్తే  ఏమవుతుందీ?

చంద్రబాబులా ఎన్డీయే కూటమిలో సభ్యులుగావున్నా, జగన్ లా కూటమికి ప్రత్యర్ధిగా వున్నా ఇద్దరూ ఐక్యమై తరించాల్సింది మోదీజీ సేవలోనే.

 

అటునేనే – ఇటూ నేనే అన్నమాట. బేధం ఒక భ్రమ.

 

మోదీజీ సేవలో తరించడం అంటే దేశ సహజ సంపదను, కుత్రిమ సంపదను ఆదానీ, అంబానీలకు కట్టబెట్టడం.

 

బయటికి ప్రత్యర్ధులుగా కనిపిస్తూ ఒకే పనిచేసేవారి గురించి గోగోల్ కథ ఒకటి వుంది. నాకు అది కూడా ఇప్పుడు గుర్తుకు వస్తున్నది.

 

ఆదానీ సంస్థతో జగన్  సోలార్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకున్నప్పుడు అది రాష్ట్రానికి నష్టదాయకం అని, దాన్ని ఆపాలని తెలుగు దేశం పార్టి చాలా పెద్ద రాద్దాంతం చేసింది. ఆ పార్టికి చెందిన ఓ సీనియర్  నాయకుడు న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వాజ్యం – పిల్ - వేశారు. ఇప్పుడు ఆయన రాష్ట్రానికి ఆర్ధిక శాఖామంత్రి. కానీ, విచిత్రంగా ఆ ఒప్పందాన్నీ , ఆ వాజ్యాన్నీ వారు మరచి పోయారు.

 

వారు నిద్రపోవడానికి ఏం పిల్లు వేశారో?

 

భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు వంటి పాత పంచభూతాలన్నీ వాళ్లకు కావాలి. వాటితోపాటు విద్యుత్తు, గ్యాస్, టెలీకామ్, రైల్వేలు వంటి కొత్త పంచభూతాలు కూడా వారికే కావాలి.

 

అస్మదీయ కార్పొరేట్లకు ఇవ్వడం కోసం ఇండియాలో 30 కోట్ల ఎకరాల ల్యాండ్‍ బ్యాంకును సిధ్ధం చేశారు.

 

అంతర్జాతీయ సరిహద్దు నుండి వంద కిలో మీటర్ల లోపున్న ప్రాంతాన్ని వ్యూహాత్మక ప్రాజెక్టుల నిర్మాణానికి ఎప్పుడయినా వాడుకోవచ్చు అని ఒక చట్టం చేశారు. వ్యూహాత్మక ప్రాజెక్టులు అంటే ఏమిటీ? ఆదానీ అంబానీలకు అప్పచెప్పడం.

 

 మణిపూర్ లో అల్లర్లు వుధృతంగా చెలరేగుతున్నప్పుడు ఈ చట్టం వచ్చింది. ఆ సమయంలో నేను మిజోరంలో మణిపూర్ బాధితుల శిబిరంలో వున్నాను. అప్పుడు నాతో వున్న ఒక కుకీ జో ప్రొఫెసర్ తమకు నిలబడడనికి నేల లేకుండ చేయడానికే  ఆ చట్టాన్ని తెచ్చారని అన్నాడు.

 

అది నిజమే. మిజోరం వెడల్పు 120 కిలో మీటర్లు. అటు మయన్మార్, ఇటు బంగ్లాదేశ్. చెరోవైపు చెరో వంద కిలోమీటర్లు తీసేస్తే  ఆ రాష్ట్రం వుండదు. అలాగే మణిపూర్, అలాగే నాగాలాండ్. అసలు ఈశాన్య రాష్ట్రాలే దాదాపు వుండవు.

 

దేశంలోని షిప్ యార్డులన్నీ వాళ్ళవే. విమానాశ్రయాలన్నీ వాళ్ళవే, ఒకటి అరా ఇతరులు ఎవరికైనా వుంటే వాటిని స్వాధీనం చేసుకోవడం వాళ్ళకు బాగా తెలుసు. సామ దాన బేధ దండోపాయాల్ని ఉపయోగించి లక్ష్యాన్ని సాధించుకోవడంలో వాళ్లు నిపుణులు.

 

బాహాటంగా సాగుతున్న ఈ క్రౌర్యం, ఈ కపటం అన్నీ మనకు స్పష్టంగా  తెలుసు. రోజూ మనం ఐమ్యాక్స్ స్క్రీన్  మీద 3డి సినిమా చూస్తున్నాం.

 

కానీ, వీటిని ఎలా ఆపాలో మనకు తెలియడం లేదు.

 

రాష్ట్రంలో గత ప్రభుత్వం మీద అన్ని ఆరోపణలు చేసిన వారు అంత రగడ చేసిన వారు తమ చేతికి అధికారం వచ్చాక ఎందుకు మౌనంగా వుండిపోతున్నారూ?

 

టిటిడి ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ మీద టిడిపి ఎంత  గొడవ చేసిందో  మనకు తెలుసు. ఏడాదికి ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల నష్టం వచ్చే  సోలార్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందం మీద  అంతకన్నా పెద్ద గొడవ చేయాలి కదా?

 

కానీ, రాజీ పడిపోతున్నారు. ఆదానీ, అంబానీల పేరు చెప్పగానే భయంతో వణికిపోతున్నారు. ఈ విషయంలో అధికారపక్షం, ప్రతిపక్షం ఒకటే.

 

ఇప్పుడు టెండర్లన్నీ ఒక్కరికే దక్కేలా విధివిధానాలు రూపొందిస్తున్నారు. బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో  కేసుల్ని ఎదుర్కొంటున్నవారు మాత్రమే టెండర్ వేయడానికి అర్హులు అన్నా ఆశ్చర్యం ఏమీలేదు. రేపు గౌతమ్ ఆదానీ ఎత్తూ బరువు వున్న వాళ్ళు మాత్రమే టెండర్ వేయాలని అన్నా అనవచ్చు.

 

మోదీజీ పాలనలో ఏదీ అసాధ్యం కాదు. ఏదీ ఆశ్చర్యమూ కాదు.

 

మొత్తం వ్యవహారం ఒక ప్రహసనంగా నవ్వులాటగా మారిపోయింది. చట్టాన్ని వాడడం కాదు; అతిగా వాడడంకాదు; దుర్వినియోగం చేయడం కూడ కాదు; ఎబ్యూజ్ చేస్తున్నారు. అత్యాచారం!

 

నిజానికి ఇది సాంప్రదాయ పెట్టుబడీదారీ సమాజం కూడ కాదు; దానికో పధ్ధతి వుండేది.

 

ఇది లుంపెన్ పెట్టుబడీదారీ సమాజం. అరాచక పెట్టుబడీదారీ సమాజం.

 

ఇది మారాలి. దీన్ని మార్చాలి.

దాని కోసం మనందరం ప్రత్నించాలి.

 


సెకీ - అదానీ ఒప్పందం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం |

https://www.youtube.com/live/4_OOe66KXmg

Wednesday, 23 April 2025

Notes on Udham Singh

 ఉధామ్ సింగ్ మీద చిన్న నోట్స్ 



భారత కమ్యూనిస్టు పార్టి 1920లో ఏర్పడింది. 1925లో తొలి మహాసభ జరుపుకుంది. ఉధామ్ సింగ్ 1927లో అరెస్టు అయి 1931లో విడుదల అయ్యాడు. అదే ఏడాది భగత్ సింగ్ ను  ఉరి వేశారు. తొమ్మిదేళ్ళ తరువాత  1940లో ఉధామ్ సింగ్ ను ఉరి వేశారు. 

అలా విప్లవ కార్యకలాపాల్లో  భగత్ సింగ్ తరువాతి వాడు ఉధామ్ సింగ్. 

వాళ్ళిద్దరూ ప్రతిహింసావాదులు. హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ లో పనిచేశారు. కంటికికన్ను పంటికిపన్ను వాళ్ల సిధ్ధాంతం. గాంధీవంటి అహింసావాదులు,  రాజ్యాంగవాదులు  సహజంగానే వాళ్ల విధానాల;అకు వ్యతిరేకులు.  

గాంధీ-ఇర్విన్ ఒడంబడిక నేపథ్యంలో భగత్ సింగ్  ఉరి మీద దేశవ్యాప్తంగా  - బహుశ ఇంగ్లండ్ లోనూ - చాలా విస్తృతంగా చర్చ జరిగింది. ఆందోళనలు సాగాయి. గాంధీ తన పరిమితుల్లో చేయగలిగింది చేశారు. అంబేడ్కర్ కూడ స్పందించారు. ఉధామ్ సింగ్ విషయంలో వాళ్ళిద్దరు ఎలా స్పందించారో పరిశీలించాలి. 

భగత్ సింగ్ రచయిత. నాస్తికత్వం మీద, సామ్యవాద సమాజం మీద రచనలు చేశాడు. అది తరువాతి కాలంలో అతని పాపులారిటీకి చాలా దోహదపడింది.

ఉధామ్ సింగ్ ఇష్టపడి పెట్టుకున్న పేరు రామ్ ముహమ్మద్ సింగ్ ఆజాద్.  

Saturday, 19 April 2025

State-sponsored religious bias

State-sponsored religious bias

*ప్రభుత్వ ప్రాయోజిత మత పక్షపాతం*

డానీ, సమాజ విశ్లేషకులు

9010757776


*ఈరోజు సాక్షిలో నా వ్యాసం. చదివి మీ అభిప్రాయాలు తెలపండి.* 




కొత్త వక్ఫ్ చట్టాన్ని ముస్లింలు మాత్రమే వ్యతిరేకిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఒక తప్పుడు సంకేతాన్ని ఇస్తున్నాయి. ముస్లిం ధర్మాదాయ దేవాదాయ వ్యవహారాలను వక్ఫ్ అంటారు. 1995 నాటి వక్ఫ్ చట్టం ఇప్పటి వరకు అమల్లో వుంది. ఇప్పుడు దీన్ని United Waqf Management, Empowerment, Efficiency and Development (UWMEED) Act-2025గా మార్చారు.  


వక్ఫ్ సవరణ బిల్లు ఏప్రిల్ 3న లోక్ సభలో 288 – 232 ఓట్లతో గెలిచింది.  రాజ్య సభలో ఏప్రిల్ 4న 128 – 95 ఓట్లతో గెలిచింది. ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడ పడిపోయింది. 


ఇక్కడ ఒక విశేషం వుంది. 543 మంది సభ్యులున్న లోక్ సభలో ముస్లింలు 24గురు మాత్రమే. 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. అంటే 208 మంది ముస్లిమేతర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు.  అలాగే 245 మంది  సభ్యులున్న రాజ్య సభలో ముస్లింలు 15గురు మాత్రమే. 95 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. అంటే 80 మంది ముస్లిమేతర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు. రెండు సభల్లోనూ కలిపి  ముస్లింల సంఖ్య 39 మాత్రమే. వాళ్ల పక్షాన నిలిచిన ముస్లిమేతరులు 288 మంది. 


కొత్త చట్టం రాజ్యాంగ ఆదర్శాలకు, హామీలకు విరుధ్ధంగా వుందనీ, దాన్ని  పునఃస్సమీక్షించాలని కొన్ని సంఘాలు, కొన్ని రాజకీయపార్టీలు, సుప్రీంకోర్టులో 70కు పైగా పిటీషన్లు వేశాయి. ఈ విషయంలోనూ ముస్లింల సంఖ్య చాలా తక్కువ ముస్లిమేతరుల సంఖ్య చాలా ఎక్కువ. మన దేశంలో వర్ధిల్లుతున్న మతసామరస్యానికి ఇది తాజా ఉదాహరణ.  దీనికి విరుధ్ధంగా బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టానికి మద్దతు ప్రకటించాయి.   

ఒక బిల్లు వుభయ సభల్లో మెజారిటీ సాధించి రాష్ట్రపతి ఆమోద ముద్రపడి  చట్టంగా మారేక కూడ సుప్రీం కోర్టుకు చేరడం విశేషం. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏప్రిల్ 16న ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించింది.


కొత్త చట్టంలో వివాదాంశాలు అనేకం వున్నాయి. ఇందులో నాలుగు అంశాలు మరింత తీవ్రమైనవి. వక్ఫ్ బోర్డులో, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ లో కొత్తగా ముస్లిమేతరులను అనుమతించడం తీవ్రమైన వివాదంగా మారింది.  వక్ప్ భూముల్లో ‘వక్ఫ్ బై యూజర్’ సౌలభ్యాన్ని తొలగించి అది వక్ఫ్ గా కొనసాగాలంటే   రిజిస్ట్రేషన్ దస్తావీజులు చూపాలనడం ఇంకో వివాదాంశం. వక్ఫ్ ఆస్తి అవునోకాదో తేల్చడానికి జిల్లా కలెక్టర్లకు విశేషాధికారాలు కల్పించడం. కనీసం ఐదేళ్ళుగా ఇస్లామిక్ ధార్మిక  ఆచరణను కొనసాగిస్తున్నవారు మాత్రమే వక్ఫ్ దానం చేయడానికి అర్హులు అనడం వివాదంగా మారింది. 


వక్ఫ్ భూములకు దస్తావీజులు చూపడం అసాధ్యమైన విషయం. 19వ శతాబ్దం ఆరంభం వరకు మనదేశంలో అసలు దస్తావీజులు, రిజిస్ట్రేషన్ల సాంప్రదాయమే లేదు. లార్డ్ కార్న్ వాలిస్ 1793లో తొలిసారిగా శాశ్విత భూమిపన్ను విధానాన్ని తెచ్చాడు. అది కూడ ఇప్పటి బెంగాల్, బీహార్, ఒడిశా ప్రాంతంలో మాత్రమే. ఆ తరువాత థామస్  మన్రో మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల్లో  రైత్వారి విధానాలను తెచ్చాడు. భారత దేశంలో 8వ శతాబ్దాం నాటికే ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం ప్రవేశించిన వెయ్యేళ్ళ తరువాత మనకు దస్తావేజులు, రిజిస్ట్రేషన్ విధానాలు వచ్చాయి. 


ఇక్కడ ఇంకో ప్రాణప్రదమైన అంశాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. రాజ్యాంగ రచన సాగుతున్న రోజుల్లోనే ఆలయాల మనుగడ అంశం ముందుకు వచ్చింది. కొత్తగా నిర్మించిన కొన్ని మసీదుల కింద హిందూ దేవాలయాల శిధిలాలు వుండే అవకాశం వుంది. ఆ హిందూ దేవాలయాల శిధిలాల కింద భౌధ్ధ జైన దేవాలయాల శిధిలాలు వుండవచ్చు. వాటి కింద అంతకన్నా పురాతన మత ఆరాధనా స్థలాల శిధిలాలు వుండవచ్చు. అంతిమంగా ఆదివాసుల ఆరాధనా చిహ్నాలు కనిపీంచవచ్చు. అలా ఎంత వెనక్కి మనం చరిత్రను తవ్వుకుంటూ పోతాం? దీనికో పరిష్కారాన్ని ఆనాటి పెద్దలు కనుగొన్నారు. దాని ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి దేశంలోవున్న సమస్త మతాల దేవాలయాల యధాస్థితిని కాపాడాలి అనేది ఆ అంగీకారం. అప్పటికే ఒక కోర్టు వివాదం నడుస్తున్న కారణంగా అయోధ్యలోని బాబ్రీ మసీదు ఒక్క దానికే ఇందులో మినహాయింపు ఇచ్చారు. 


అత్యున్నత న్యాయస్థానపు ధర్మాసనం సరిగ్గా ఈ అంశాన్నే  పట్తించుకుంది.  “మనం చరిత్రను తిరగరాయలేం” అని భారత ప్రధాన న్యాయమూర్తి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు గుర్తుచేశారు. 

వక్ఫ్ వ్యవహారాల్లో పారదర్శకతను ప్రదర్శించడమేగాక,  రెండు మత సమూహాల సహవాసాన్ని కొత్త చట్టం ప్రోత్సహిస్తుందని, ముస్లింల గుత్తాధిపత్యాన్ని తొలగిస్తున్నదని సోలిసిటర్ జనరల్ ధర్మాసనానికి వివరించే ప్రయత్నం చేశారు.   ఇలా రెండు మతసమూహాల కలయిన ఒక ఆదర్శం అని కేంద్ర ప్రభుత్వం నిజంగానే నమ్ముతోందా? నమ్మితే హిందూ ధర్మాదాయ కమిటీల్లోనూ హిందూయేతరులకు స్థానం కల్పించాలిగా?సరిగ్గా ఈ ప్రశ్ననే భారత ప్రధాన న్యాయమూర్తి వేశారు.  తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకు వక్ఫ్ భూములు వేటినీ డీ-నోటిఫై చేయరాదని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.


కేంద్ర ప్రభుత్వ వాదనను వినిపించడానికి ఒక వారం రోజులు గడువు ఇవ్వాలని సోలిసిటర్ జనరల్ ధర్మాసనాన్ని కోరారు.  ఇందులో ఒక కిటుకు వుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా మరో మూడు వారాల్లో, మే 13న,  పదవీ విరమణ చేయనున్నారు.  ఎలాగోలా ఈ సమయాన్ని సాగదీస్తే కొత్త ప్రధాన న్యాయమూర్తి చేత అనుకూలమైన తీర్పు తెచ్చుకోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వ  వ్యూహంగా కనిపిస్తోంది.  


రచన : 18 ఏప్రిల్ 2025 

ప్రచురణ : sAkShi 20 ఏప్రిల్  2025

https://epaper.sakshi.com/Andhra_Pradesh_Main?eid=99&edate=20/04/2025&pgid=606172&device=desktop&view=3

Thursday, 17 April 2025

State-sponsored religious bias

 *ప్రభుత్వ ప్రాయోజిత మత పక్షపాతం*

ఖాన్ యజ్దానీ (డానీ), సమాజ విశ్లేషకులు
Khan Yazdani (Danny), Social Analyst 
 
            ఏప్రిల్ 17, 2025  బుధవారం రోజు కొత్త వక్ఫ్ చట్టం మీద రెండు టీవీ చానళ్ళ చర్చా కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చింది. ఈరోజు కూడ కొన్ని చర్చలు వున్నాయి. 
 
            వాటి కోసం నేను సిధ్ధం కావడానికి రాసుకున్న టాకింగ్ పాయింట్స్ ఇవి. ఆసక్తివున్న వారు చదవవచ్చు. వాటి మీద మీ అభిప్రాయాలను తెలిపితే ఆనందిస్తాను. నా అభిప్రాయాలు తప్పయితే సరిదిద్దుకుంటాను. 
 

State-sponsored religious bias

 
Talking Points 20250417
(1500 Words) 
 
 

1.           SC Reviews Petitions Challenging the Waqf (Amendment) Act, 2025సుప్రీం కోర్టుకు చేరిన వక్ఫ్ వివాదం. 
 
2.            వక్ఫ్ చట్టం సవరణ మీద చెలరేగిన వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. 
 
3.            కేంద్రం తెచ్చిన వక్ఫ్సవరణ చట్టంలోని కొన్ని సెక్షన్లను సవాల్చేస్తూ అనేక పార్టిలు, సంఘాలు   సుప్రీం కోర్టులో  పిటిషన్లు వేశాయి. 
 
4.            వక్ఫ్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఎంఐఎం, జమియత్‌ ఉలేమా ఏ హింద్‌, ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు వంటి సంస్థలతోపాటు ఆప్‌, డీఎంకే, సీపీఐ, జేడీయూ తదితర పార్టీలు వున్నాయి. 

 

5.            మరోవైపు చట్టానికి మద్దతుగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్ గఢ్‌, అసోం రాష్ట్రాలు పిటిషన్లు వేయడం గమనార్హం.

 

6.            మొత్తం 72 పిటిషన్లు దాఖలయ్యాయి.

 

7.            చీఫ్జస్టిస్సంజీవ్ఖన్నా, జస్టిస్సంజయ్కుమార్‌, జస్టిస్కేవీ విశ్వనాథన్ త్రిసభ్య ధర్మాసనం బుధవారం బుధవారం (ఏప్రిల్ 16న)  పిటిషన్లపై విచారణ ప్రారంభించింది.

 

8.        The original Waqf Act, 1995, is now titled the United Waqf Management, Empowerment, Efficiency and Development (UWMEED) Act, 
 
9.        ఉమ్మీద్ అంటే ఉర్దూలో ఆశ, నమ్మకం, విశ్వాసం 

 

10.    పార్లమెంటరీ ఎన్నికల రాజకీయాలంటేనే ఏదో ఒక విధంగా జన సమూహాలను సమీకరించి ఓట్లు వేయుంచుకోవడం. 

 

11.    మత సమూహాల మధ్య చిచ్చుపెట్టి మెజారిటీ సమూహాన్ని సమీకరిస్తే రాజ్యాధికారం వస్తుందనేది బిజెపి అనుసరించే వ్యూహం. 

 

12.    ముస్లింలను వేధిస్తుంటే హిందూ సమాజంలోని ఛాందస  సమూహం ఆనందించి ఓట్లు వేస్తుందని వాళ్ళ నమ్మకం. 

 

13.    ఒక విడత పౌరసత్వ చట్టం (CAA)తో వేధిస్తున్నామంటారు.

 

14.    ఇంకోసారి ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసి వేధిస్తున్నామంటారు. 

 

15.    మరోసారి కశ్మీర్ కు వున్న ప్రత్యేక హక్కుల్ని రద్దు చేస్తామంటారు. 

 

16.    ఇంకోసారి ఉమ్మడి పౌరస్మృతి తెచ్చి ముస్లింల సంస్కృతిని అణిచివేస్తామంటారు. 

 

17.    ఇప్పుడు వక్ఫ్ ఆస్తుల మీద పడ్డారు. 

 

18.    సామాన్యజనం రాజకీయాలను ఆర్ధిక వ్యవహారాలను విడిగా చూస్తారు. 

 

19.    ఆలోచనాపరులు రెండింటినీ కలిపిచూస్తారు. 

 

20.    బిజేపిది మత రాజకీయం. కార్పొరేట్ ఆర్ధిక దృక్పథం. 

 

21.    ఒక్క మాటలో చెప్పాలంటే ‘కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం’. 

 

22.    దేశంలో వక్ఫ్ కింద దాదాపు 9 లక్షల ఎకరాల భూములున్నాయి. 

 

23.    వీటి విలువ కూడ 9 లక్షల కోట్ల రూపాయలు. 

 

24.    ఇది చాలా పెద్ద మొత్తం. 

 

25.    కార్పొరేట్లు ఏ ప్రాజెక్టు చేపట్టినా వేల ఎకరాల భూములు కావాలి. ఒక్క ఎయిర్ పోర్టుకు 3 వేల ఎకరాల భూమి కావాలి. ఫ్యాక్టరీలు అయితే పదివేల ఎకరాలు. ఇంకో భారీ ప్రాజెక్టు అయితే 40, 50 వేల ఎకరాలు కావాలి. 

 

26.    ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ కొత్త విధానాన్ని ముందుకు తెచ్చినా దాని వెనుక కార్పొరేట్ల ప్రయోజనాలు వున్నాయనే విమర్శలు వుంటున్నాయి. 

 

27.    వక్ఫ్ భూముల కొత్త చట్టం  దీనికి మినహాయింపు కాదు.

 

28.    వక్ఫ్ సవరణ బిల్లు ఏప్రిల్ 3న లోక్ సభలో 288 – 232 ఓట్లతో ఆమోదాన్ని పొందింది.  

 

29.    రాజ్య సభలో ఏప్రిల్ 4న 128 – 95 ఓట్లతో ఆమోదాన్ని పొందింది.

 

30.    ఇక్కడ ఒక విశేషం వుంది. 543 మంది సభ్యులున్న లోక్ సభలో ముస్లింలు 24గురు మాత్రమే. 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. అంటే 208 మంది ముస్లిమేతర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు. 

 

31.    అలాగే 245 మంది  సభ్యులున్న రాజ్య సభలో ముస్లింలు 15గురు మాత్రమే. 95 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. అంటే 80 మంది ముస్లిమేతర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు. 

 

32.    రెండు సభల్లోనూ కలిపి  ముస్లింల సంఖ్య 39 మాత్రమే. వాళ్ల పక్షాన నిలిచిన ముస్లిమేతరులు 288 మంది. 

 

33.    మతసామరస్యాన్ని చూడాల్సిన పధ్ధతి ఇది. 

 

34.    కొత్త చట్టాన్ని సమర్ధిస్తున్న వారిలో ముస్లింలు లేరు. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్లు వేసిన వారిలో ముస్లింల కన్నా హిందువులు చాలా ఎక్కువగా వున్నారు. ఇవి గణాంకాలు. 

 

35.    కొత్త చట్టాన్ని ముస్లింలు ‘మాత్రమే’ వ్యతిరేకిస్తున్నారంటూ ఒక తప్పుడు సంకేతాన్ని ప్రచారం చేయడానికి బిజెపి ఎలాగూ ప్రయత్నం చేస్తుంది. మీడియా కూడా ఆ అబధ్ధపు ప్రచారంలో భాగం అవుతున్నది.  

 

36.    ఒక బిల్లు రెండు సభల్లో మెజారిటీ సాధించి రాష్ట్రపతి ఆమోద ముద్రపడి  చట్టంగా మారేక వివాదం సుప్రీం కోర్టుకు చేరడం విశేషం. 

 

37.    కొత్త చట్టంలో వివాదాంశాలు అనేకం వున్నాయి. ఇందులో నాలుగు అంశాలు మరింత తీవ్రమైనవి. 

 

38.    వక్ఫ్ బోర్డులో, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ లో ముస్లిమేతరులను అనుమతించడం తీవ్రమైన వివాదం. 

 

39.    వక్ప్ భూముల్లో ‘వక్ఫ్ బై యూజర్’ సౌలభ్యాన్ని తొలగించి వక్ఫ్ గా కొనసాగాలంటే       రిజిస్ట్రేషన్ దస్తావీజులు చూపాలనడం.  

 

40.    వక్ఫ్ ఆస్తి అవునోకాదో తేల్చడానికి జిల్లా కలెక్టర్లకు విశేషాధికారాలు కల్పించడం. 

 

41.    కనీసం ఐదేళ్ళు ఇస్లామిక్ ధార్మిక  ఆచరణను కొనసాగిస్తున్నవారు మాత్రమే వక్ఫ్ దానం చేయడానికి అర్హులు అనడం. 

 

42.    వక్ఫ్ వ్యవహారాల్లో పారదర్శకతను ప్రదర్శించడమేగాక రెండు మత సమూహాల సహవాసాన్ని కొత్త చట్టం ప్రోత్సహిస్తుందని  కేంద్ర ప్రభుత్వం అంటున్నది.  

 

43.    ఇలా రెండు మతసమూహాల కలయిన ఒక ఆదర్శం అని కేంద్ర ప్రభుత్వం నిజంగానే నమ్ముతోందా? నమ్మితే హిందూ ధర్మాదాయ కమిటీల్లోనూ హిందూయేతరులకు స్థానం కల్పించాలిగా. ఆ పని ఎందుకు చేయడం లేదు. 

 

44.    ఈ సమ్మిశ్రమ ఆదర్శం ముస్లింలకు మాత్రమేనా? 

 

45.    వక్ఫ్ భూములకు దస్తావీజులు చూపడం అసాధ్యం. 19వ శతాబ్దం వరకు మనదేశంలో అసలు దస్తావీజులు, రిజిస్ట్రేషన్ల సాంప్రదాయమే లేదు. 

 

46.    లార్డ్ కార్న్ వాలిస్ 1793లో తొలిసారిగా శాశ్విత భూమిపన్ను విధానాన్ని తెచ్చాడు. అది కూడ ఇప్పటి బెంగాల్, బీహార్, ఒడిశా ప్రాంతంలో మాత్రమే. 

 

47.    ఆ తరువాత థామస్  మన్రో మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల్లో  రైత్వారి విధానాలను తెచ్చాడు. 

 

48.    భారత దేశంలో 8వ శతాబ్దాం నాటికే ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం ప్రవేశించిన వెయ్యేళ్ళ తరువాత మనకు దస్తావేజులు, రిజిస్ట్రేషన్ విధానాలు వచ్చాయి. 

 

49.    సరిగ్గా ఈ అంశాలనే సుప్రీంకోర్టు తప్పుపట్టింది. 

 

50.    ఇక్కడ ఇంకో ప్రాణప్రదమైన అంశాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. 

 

51.    రాజ్యాంగ రచన సాగుతున్న రోజుల్లోనే ఆలయాల అంశం ముందుకు వచ్చింది. 

 

52.    కొత్తగా నిర్మించిన కొన్ని మసీదుల కింద హిందూ దేవాలయాల శిధిలాలు వుండే అవకాశం వుంది. ఆ హిందూ దేవాలయాల శిధిలాల కింద భౌధ్ధ జైన దేవాలయాల శిధిలాలు వుండవచ్చు. వాటి కింద అంతకన్నా పురాతన మత ఆరాధనా స్థలాల శిధిలాలు వుండవచ్చు. అంతిమంగా ఆదివాసుల ఆరాధనా చిహ్నాలు కనిపీమ్చవచ్చు. 

 

53.    అలా ఎంత వెనక్కి మనం చరిత్రను తవ్వుకుంటూ పోతాం? 

 

54.    దీనికో పరిష్కారాన్ని ఆనాటి పెద్దలు దాని ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి వున్న సమస్త మతాల దేవాలయాల యధాస్థితిని కాపాడాలి అనేది ఆనాటి అంగీకారం. ఇందులో అప్పటికే ఒక కోర్టు వివాదం నడుస్తున్న కారణంగా అయోధ్యలోని బాబ్రీ మసీదు ఒక్క దానికే మినహాయింపు ఇచ్చారు. 

 

55.    సరిగ్గా ఈ అంశాన్నే అత్యున్నత న్యాయస్థానపు ధర్మాసనం  గుర్తు చేసింది. 

 

56.    Referring to properties that were declared waqf centuries ago and which continued to remain waqf by user till the law came into effect, the court said, “We cannot rewrite the past. A property declared as waqf some 100 or 200 years ago, suddenly you turn around and say it cannot be waqf.”

 

57.    “Waqf property may have been constructed in the 14th or 15th century. Before the British came, we did not have any Registration Act. To now require them to produce a registration deed will not be possible,” said the bench

 

58.    తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకు వక్ఫ్ భూములు వేటినీ డీ-నోటిఫై చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 

 

59.    Solicitor general Tushar Mehta,

 

60.    Inclusivity: Non-Muslim members prevent “monopolization” and ensure transparency.

61.    Kapil Sibal, Rajiv Dhavan and Abhishek Manu Singhvi

 

62.    the law was in breach of articles 25 and 26 of the Constitution.

 

63.    Article 25: Freedom of conscience and free profession, practice and propagation of religion.

 

64.    Article 26: Freedom to manage religious affairs.

 

65.    The bench, also comprising justices Sanjay Kumar and KV Viswanathan said, “When a legislation is passed, courts generally do not interfere.If a property declared as waqf by user is denotified, it can have huge consequences.”

 

66.    A waqf is a Muslim religious endowment, usually in the form of landed property, made for purposes of charity and community welfare.
 

 

67.    వక్ప్ చట్టంలోని కొన్ని అంశాలపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని బుధవారం సిజెఐ ధర్మాసనం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

 

68.    కౌంటర్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం వారం రోజులు సమయం ఇచ్చింది.
 
69.    అలానే తదుపరి విచారణ తేదీ వరకు ఎలాంటి నియామకాలు జరగకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక తదుపరి విచారణ తేదీ వరకు.. యూజర్ వై వక్ఫ్గా పర్కొన్నవాటితోపాటు నోటిఫికేన్ ద్వారా రిజిస్టర్ చేయబడినవి.. డీ నోటిఫై చేయకూడదంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది.

 

70.    పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై వారం రోజుల్లో వివరణాత్మక సమాధానం ఇవ్వాలని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టంగా సూచించింది.

 

 

71.    CJI: "When we sit here, we lose our religion. We are absolutely secular."

 

72.    CJI expressed concern over violent protests, notably in Murshidabad, West Bengal, where arson and riots occurred.

 

 

73.    Let us await the Supreme Court’s wisdom in navigating this complex issue.

 

74.    Interim Relief:

75.    Properties declared Waqf by courts cannot be de-notified.

76.    Stay on provisions freezing Waqf status during Collector inquiries.

77.    All Waqf Board members (non-ex-officio) must be Muslim.

78.    CJI’s Query: “If Waqf Boards include non-Muslims, should Hindu trusts include Muslims?”

79.    Hindu endowments are managed exclusively by Hindus; petitioners seek similar autonomy.

80.    Public Response and Protests

81.    Murshidabad, West Bengal, demonstrations escalated into violence, resulting in three fatalities and over 200 arrests.

82.    In Tripura's Unakoti district, protests turned violent, injuring 18 police personnel. The unrest underscores the deep-seated concerns within the Muslim community regarding the Act's implications.

83.    The sequence of events is reminiscent of violent protests against NRC and CAA in Murshidabad following the enactment of the Citizenship Amendment Act in 2019.

 

84.           గత గోదావరి పుష్కరాల సందర్భంగా ఒక విశేషం జరిగింది. మరో జిల్లా కలెక్టరును తూర్పు గోదావరి జిల్లా కలెక్టరుగా బదిలీ చేయాలనుకున్నారు. చివరి నిముషంలో ఒక ధార్మిక సమస్య వచ్చింది. హిందువులు పవిత్రంగా భావించే పుష్కరాలు జరుగుతున్న చోట  హిందూయేతరుడ్ని కలెక్టర్  గా వేస్తే భక్తుల సెంటిమెంట్‍ దెబ్బ తింటుందని భయపడి ఆ బదిలీ ప్రక్రియను పుష్కరాలు ముగిసే వరకు నిలిపి వేశారట.

 

85.    తిరుపతి లడ్డు కల్తీ వివాదం ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సంచలనంగా మారింది.  

 

86.    నెయ్యిని కల్తీ చేయడం నేరం కనుక నేర స్మృతి ప్రకారం దోషుల్ని శిక్షిస్తే సరిపోతుంది.

 

87.    సనాతన సాంప్రదాయం మీద విశ్వాసం లేనివారు పాలకమండలిలో  వుండబట్టే లడ్డు అపవిత్రం అయిందని అదనంగా ఆరోపించారు.  నెయ్యిని కల్తీచేయడంకన్నా  నిష్ట లేకపోవడాన్నే ఆ కేసులో ప్రధాన ఆరోపణగా మార్చారు. సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి రంగంలోనికి దిగి ప్రక్షాళన కార్యక్రమాన్నీ అనేక దేవాలయాల్లో నిర్వహించారు.

 

88.    ఇంతటి తాజా ఉదాహరణ మన కళ్ళ ముందు వుండగా, ఇస్లామిక్ ధర్మాదాయ దేవాదాయ పాలక మండళ్ళలో ముస్లిమేతరుల్ని ఎలా చేరుస్తారూ?

 

89.    భారత ప్రధాన న్యాయమూర్తి కూడ ఈ అంశం మీద తీవ్రంగా స్పందించారు. హిందు ధర్మాదాయ దేవాదాయ పాలక మండళ్ళలో ముస్లీంలను పెడతారా? అని సొలిసిటర్ జనరల్ ను కొంచెం గట్టిగానే అడిగారు.

 

90.    "Will Muslims be allowed on Hindu endowment boards?"

 

91.    Solicitor General Tushar Mehta clarified that only two non-Muslim members (maximum) and ex-officio members are permitted, aiming for inclusivity.

 

92.    కేంద్ర ప్రభుత్వ వాదనను వినిపించడానికి ఒక వారం రోజులు గడువు ఇవ్వాలని సోలిసిటర్ జనరల్ ధర్మాసనాన్ని కోరారు.

 

92.       ఇందులో ఒక కిటుకు వుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా మరో మూడు వారాల్లో, మే 13న,  పదవీ విరమణ చేయనున్నారు.

 

93.       ఎలాగోలా ఈ సమయాన్ని సాగదీస్తే కొత్త ప్రధాన న్యాయమూర్తి చేత అనుకూలమైన తీర్పు తెచ్చుకోవచ్చు అనేది ఎస్.జి. వ్యూహంగా కనిపిస్తోంది.  

 

94.       ఇటీవలి కాలంలో భూ ఆక్రమణలతో  మసీదులు కట్టేస్తున్నారనే విమర్శ ఒకటుంది. ఇది సరైన విమర్శే.

 

95.       ఇలాంటి అక్రమ కట్టడాలను దాదాపు అన్ని మత సమూహాలూ చేస్తున్నాయి. రోడ్లపక్క అనేక మందిరాలు నిత్యం వెలుస్తున్నాయి.

 

96.        వాటివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు, శబ్ద కాలుష్యం కూడ జరుగుతోంది. వీటిని క్రమబధ్ధం చేయాల్సిందే. అవసరం అయితే వీటన్నింటినీ తొలగించాల్సిందే.

 

97.       అలా కాకుండ కేవలం మసీదులు, దర్గాలు, ఖబరస్తాన్ లను మాత్రమే క్రమబధ్ధం చేస్తామంటే అది ప్రభుత్వ ప్రాయోజిత మత పక్షపాతం అవుతుంది.

 

98.       అదొక కొత్త సమస్య; కొత్త వివాదం.

 

99.       అప్పుడు మళ్ళీ రాజ్యాంగం చేత పట్టుకుని ఉన్నత న్యాయస్థానం తలుపుతట్టాల్సి వస్తుంది.

 

 

//EOM//