ఉధామ్ సింగ్ మీద చిన్న నోట్స్
భారత కమ్యూనిస్టు పార్టి 1920లో ఏర్పడింది. 1925లో తొలి మహాసభ జరుపుకుంది. ఉధామ్ సింగ్ 1927లో అరెస్టు అయి 1931లో విడుదల అయ్యాడు. అదే ఏడాది భగత్ సింగ్ ను ఉరి వేశారు. తొమ్మిదేళ్ళ తరువాత 1940లో ఉధామ్ సింగ్ ను ఉరి వేశారు.
అలా విప్లవ కార్యకలాపాల్లో భగత్ సింగ్ తరువాతి వాడు ఉధామ్ సింగ్.
వాళ్ళిద్దరూ ప్రతిహింసావాదులు. హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ లో పనిచేశారు. కంటికికన్ను పంటికిపన్ను వాళ్ల సిధ్ధాంతం. గాంధీవంటి అహింసావాదులు, రాజ్యాంగవాదులు సహజంగానే వాళ్ల విధానాల;అకు వ్యతిరేకులు.
గాంధీ-ఇర్విన్ ఒడంబడిక నేపథ్యంలో భగత్ సింగ్ ఉరి మీద దేశవ్యాప్తంగా - బహుశ ఇంగ్లండ్ లోనూ - చాలా విస్తృతంగా చర్చ జరిగింది. ఆందోళనలు సాగాయి. గాంధీ తన పరిమితుల్లో చేయగలిగింది చేశారు. అంబేడ్కర్ కూడ స్పందించారు. ఉధామ్ సింగ్ విషయంలో వాళ్ళిద్దరు ఎలా స్పందించారో పరిశీలించాలి.
భగత్ సింగ్ రచయిత. నాస్తికత్వం మీద, సామ్యవాద సమాజం మీద రచనలు చేశాడు. అది తరువాతి కాలంలో అతని పాపులారిటీకి చాలా దోహదపడింది.
ఉధామ్ సింగ్ ఇష్టపడి పెట్టుకున్న పేరు రామ్ ముహమ్మద్ సింగ్ ఆజాద్.
No comments:
Post a Comment