Saturday, 7 June 2025

మా భూమి సినిమా పాటలో పది అంశాలు

 *మా భూమి సినిమా పాటలో పది అంశాలు*




 

1.            ఎర్రపహడ్ దొరజెన్నారెడ్డి ప్రతాప రెడ్డి మీద యాదగిరి ‘బండెనక బండికట్టి’ పాటరాశాడు. దీన్ని ఉద్యమ కాలంలో రాసి వుంటాడు.    

 

2.            అతనే నిజాం నవాబు మీద ‘నైజాము సర్కరోడ నాజీల మించినోడ’ పాట కూడ రాశాడు. దీన్ని స్వాతంత్ర్యానంతరం రాసివుంటాడు.   

 

3.            మాభూమి సినిమా కథ ప్రతాప రెడ్డి ఆవరణలో సాగుతుంది. పాట మాత్రం హఠాత్తుగా నిజాము ఆవరణ లోనికి  మారిపోతుంది. ‘బండెనక బండికట్టి’ పాట తలను తీసుకొచ్చి ‘నైజాము సర్కరోడ’ పాట మొండేనికి అతికించారు. వీక్షణం ఎన్ వేణుగోపాల్ భాషలో అక్కడి పల్లవిని తీసుకొచ్చి ఇక్కడి చరణాలకు జోడించారు.  

 

4.            యాదగిరి అటు  ఎర్రపహడ్  దొర‌ను ఇటు నైజాము సర్కారునూ విమర్శిస్తూ పాటలు రాశాడు. రాసిన సందర్భాలు వేరైనా ఆయన దృష్టిలో ఇద్దరూ దోషులే.

 

 

5.            సినిమా పాటలో ఎర్రపహడ్  దొర జెన్నారెడ్డి ప్రతాప రెడ్డికి పూర్తిగా లీగల్ ఇంప్యూనిటి ప్రకటించి నైజాము సర్కరోడిని మాత్రమే బోను ఎక్కించారు.

 

6.            ఇద్దరు వ్యక్తులు ఒకేరకం తప్పుచేసినా ఒకరికి లీగల్ ఇంప్యూనిటి ప్రకటించి మరొకరికి  మాత్రమే శిక్ష వేసే మనుస్మృతి సాంప్రదాయం ఒకటి మనకు వుండింది.

 

7.             “ఆ పాట మీద వివాదం, లేనివి వెతకడానికి ప్రయత్నించడం అనవసరం” అని వేణుగోపాల్ హితవు కూడ పలికారు.

 

8.            వేణుగోపాల్ రైటప్ ఆ పురాతన శిక్షాస్మృతిని బాహాటంగా సమర్ధిస్తున్నది.

 

9.            వారి హితవు దొరజెన్నారెడ్డి ప్రతాప రెడ్డి సామాజికవర్గానికి అనుకూలంగానూ, నైజాము సర్కారు సామాజికవర్గానికి ప్రతికూలంగానూ వున్నది. ఇద్దరూ రెండు మతాలకు ప్రతినిధులు. మావోయిస్టుల్లో స్థాయి మేధావులుగా చెలామణి అవుతున్నవారు ఏ మత సమూహానికి లీగల్ ఇంప్యూనిటీ ఇస్తున్నారూ? ఏ మత సమూహాన్ని బోను ఎక్కిస్తున్నారూ? అనేదే ఈ వివాదానికి మూలం.  ఇది పాట మీద వివాదం మాత్రమేకాదు; మావోయిస్టుల సామాజిక దృక్పథాల మీద వివాదం.

 

10.    It is not the consciousness of men that determines their being, but, on the contrary, their social being that determines their consciousness.

 

*డానీ*

05 జూన్ 2025 

No comments:

Post a Comment