Naredra
Modi and Amit Shah Face Saving Tactics
బిజెపి 2014లో
అధికారానికి వచ్చినప్పటి నుండీ అమెరికాతో సన్నిహితంగా వుంటూ వస్తున్నది.
ప్రపంచ
మార్కెట్లో చైనా విస్తరణను అదుపుచేయడానికి ఇండియా తనకు వ్యూహాత్మక భాగస్వామి అని
అమెరికా కూడా భావిస్తున్నది.
భారత ప్రధాని
నరేందర్ మోదీ ఇంతకు ముందు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లొ డొనాల్డ్ ట్రంపుకు
ప్రచారం కూడ చేశారు.
రెండేళ్ల
క్రితం అంబానీ రిలయన్స్ సంస్థకు చమురు కోసం మోదీజీ రష్యా వైపుక్లు మొగ్గారు.
అమెరికాకన్నా,
పశ్చిమాసియా దేశాలకన్నా చౌక ధరకు రష్యా చమురును సరఫరా చేసింది.
రెండోసారి
అధికారానికి వచ్చిన డోనాల్డ్ ట్రంప్
ఇండియా మీద కక్షకట్టారు.
భారీగా
టారీఫ్ లు విధించారు.
మరోవైపు,
రష్యా చ అవుక చమురు ప్రయోజనాలు భారత
ప్రజలకు దక్కలేదు.
దేశంలో
పెట్రోలు డీజిల్ ధరలు తగ్గలేదు.
ఆ చమురు
లాభాలన్నీ రిలయన్స్ సంస్థకే దక్కాయని విమర్శలు వచ్చాయి.
మళ్ళీ
మోదీజీ అమెరికా వైపుకు మళ్ళారు.
దేశానికి
నష్టాన్ని చేకూర్చే ఒక ట్రేడ్ డీల్ ను అమెరికాతో చేసుకున్నారు.
అంతేకాదు
అమెరిక-ఇజ్రాయేల్ కలి ఇరాన్ మీద యుధ్ధానికి సిధ్ధం అవుతున్న వేళ ఇజ్రాయేల్ వెళ్ళి పొగిడి
వచ్చారు. ఇండియాలో గ్రామగ్రామాన ఇజేయేల్ టెక్నాలజీని విస్తరింపజేస్తామని వచ్చారు.
ఇంతగా
వారు ఎందుకు లొంగి ప్రవర్తిస్తున్నారనే చర్చ దేశంలో మొదలయ్యింది.
తీవ్ర
వివాదాస్పదుడైన జెఫ్రీ ఎపిస్టీన్ ఫైల్స్ లో నరేంద్ర మోదీ, ఆయన కేబినెట్ మత్రుల
పేర్లు వుండడం వల్లనే మోదీజీ జుట్టును పట్టుకుని ట్రంప్ ఆడిస్తున్నారనే మాట బాగా
ప్రచారంలో వుంది.
ఈమాట మీద పార్లమెంటులో
తనను నిలదీస్తారనే భయంతోనే మోదీజీ ఒ నెలరోజులుగా పార్లమెంటుకు రావడంలేదు. ముఖం
చాటేశారు.
గతంలో మిత్రునిగావున్న
ఇరాన్ కు దూరమయ్యారు.
భారత దేశం
విశాఖపట్నంలో జరిగిన నౌకా విన్యాసాల్లో పాల్గొని
వెనక్కు వెళుతున్న ఇరాన్ యుధ్ధనౌకను అమెరికా కూల్చి వేసినా, ఇరాన్ దేశాధినేతల్ని
చంపేసినా మోదీజీ కొంచెమైనా నిరసన / సానుభూతి
వ్యక్తం చేయలేదు.
ఇప్పుడు
హర్మూజ్ జలసంధిలో భారత ఓడల్ని అనుమతించాలని ఇరాన్ ను వేడుకుంటున్నారు.
జ్ఞానం శీలంతో
పాటు కఠినమైన నిర్ణయాలు తీసుకునే స్తోమత తమకు వుందని మోదీ తరచు ప్రచారం చేసుకునేవారు.
చైనా
గాల్వాన్ ఆక్రమణకు వచ్చినప్పుడు మోదీజీ తటపటాయించారని అప్పటి సైనిక ఉన్నతాధికారి రాసినట్టు చెపుతున్న
పుస్తకం కూడ మోదీ ఇమేజ్ ను దెబ్బతీసింది.
హిందూమతం
ప్రమాదంలో వుందనే ప్రచారాన్ని ఉధృతం చేసి ఓటర్లను హిందూ ముస్లిం అంటూ చీల్చి
రాజకీయంగా లబ్ది పొందుతూ వస్తున్నారు మోది.
ఇప్పుడు శంకరాచార్య
లాంటి హిందూ మతాచార్యులు కొందరు మోదీకి వ్యతిరేకంగా మారారు.
మోది భక్తులు,
అల్లరి మూకలు ముస్లింల మీద చెలరేగిపోతున్నారు. ఈ పరిణామాల్ని బిజెపి అభిమానులు సహితం చీదరించుకుంటున్నారు.
బిజెపి అధికారంలోవున్న
రాష్ట్రాల్లో పోలీసులు సహితం ముస్లింల మీద చెలరేగిపోతున్నారు. ఈ విషయంలో కోర్టులు
జోక్యం చేసుకుని పోలీసు అధికారుల్ని మందలిస్తున్నాయి.
కిలో మాసం
ఇంట్లో వుంచుకున్నందుకు లించింగ్ ముఠాలు ఇళ్ళలోనికి
దూరి ముస్లింలను చంపేసిన సంఘటనలున్నాయి. ఆ
కేసుల్లో అసలది బీఫో కాదో తేలలేదు.
ఇప్పుడు బీఫ్
ఎగుమతుల్లో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది.
అందులో
ఆవుమాసం కూడ వుందని వార్తలొస్తున్నాయి.
ఏకంగా ఆరెస్సెస్
నాయకుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కుటుంబ సభ్యులే బీఫ్ ఎగుమతి చేస్తూ
పట్టుబడ్డారు.
బీఫ్
ఎగుమతిదారుల నుండి బిజెపికి ఏలా భారీ ముడుపులు, పార్టీ ఫండ్స్ బాహాటంగానే
అందుతున్నాయి.
బ్యాంకుల్లో
వందల వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని వాటిని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినవాళ్ళు
అందరు హిందువులే కావడం, అందులోనూ అత్యధికులు గుజరాతీయులు కావడం అనేక అనుమానాలకు
తావ ఇస్తున్నది.
భారీ కుంభకోణాల్లో
చిక్కున్న పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు బిజెపిలో చేరి రాత్రికి రాత్రి
పునీతులైపోతున్నారు.
బిజెపి
నేతల చాలా జుగుప్సాకరమైన నేరాలు, అనైతిక ప్రవర్తనలు ఇటీవలి కాలంలో వరుసగా బయటికి వస్తున్నాయి.
దేశంలోని
సహజవనరులు, ఎనర్జీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాలన్నింటినీ క్రమంగా అస్మదీయ కార్పొరేట్లకు కట్టబేట్టేస్తున్నారనే
వాస్తవం ఇప్పుడు బహిరంగ చర్చగా మారిపోయిం.
ఏప్రిల్ నెలలో
అస్సాం, కేరళ, పాండుచ్చెరీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
వీటిల్లో
ఆధిక్యత రాకపోయినా మోదీ గ్రాఫ్ పడిపోతున్నదనే ప్రచారం మొదలవుతుంది.
అసలు దేశంలో
ఎన్నికలే ఒక అప్రహసనంగా మారిపోయాయి. పోలిగ్ లెఖ్ఖలు హాస్యాస్పదంగా మారిపోయాయి.
ఇవిఎంల మాయ నిజమేనని నమ్మేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
ఇన్ని
తలవంపుల మధ్య మోదీ తన ఇమేజ్ ను కాపాడుకోవడానికి మోదీజీ ఒక పని చేయవచ్చని ఒక
ప్రచారం జరుగుతోంది.
ఛతీడ్ గడ్
లో మావోయిస్టుల మీద ఆపరేషన్ కగార్ భారీగా సాగుతోంది.
మావోయిస్టుల్ని
లేకుండా చేయడానికి మార్చి 31ని గడువు తేదీగా హోంమంత్రి అమిత్ షా ప్రకటించి
వున్నారు.
ఇప్పటికే వందల
మంది మావోయిస్టుల్ని ఆయుధాలతోసహా లొంగిపోయేలా చేశారు. అనేక మందిని చంపేశారు. కొందరిని
అరెస్టు చేర్శారు. ఇక బహుకొద్దిమంది మాత్రమే లోపలున్నారు. వారిని కూడ ఈ పది
రోజుల్లో అరెస్టు చేయడమో, లొంగదీసుకోవడమే చేస్తారు.
వీరినీ,
ఇటీవల లొంగదీసుకున్నవారికీ కలిపి ఓ మూడు నాలుగు వందల మంది మావోయిస్టూలతో ఛత్తీస్
గడ్ లో పెద్ద ప్రదర్శన నిర్వహిస్తారు.
మావో
యిస్టుల్ని లేకుండా చేస్తాం అన్నాం చేసి చూపించాం అని గొప్పగా ప్రచారం
చేసుకోవడానికి రంగాన్ని సిధ్ధం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇప్పటి జవాబు
చెప్పుకోలేని ఆరోపణల పర్వం ఇదొక్కటే వాళ్లకు ఫేస్ సేవిం్ మార్గం.
No comments:
Post a Comment