Tuesday, 30 June 2026

*నయా ఫాసిజానికి ప్రధాన బాధితులు ఎవరూ?*

*నయా ఫాసిజానికి ప్రధాన బాధితులు ఎవరూ?*

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు* 


 వర్తమాన భారత సమాజాన్ని  ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యాఖ్యనిస్తున్నారు. ఈ సందర్భంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు నయా ఫాసిజం. వందేళ్ళ క్రితం ఇటలీ జర్మనీల్లో వుండిన ఫాసిజం, నాజిజంలకు భారతీయ రూపం ఒకటి ఇప్పుడు కొనసాగుతోందని దీని అర్ధం. అయితే, ఇది స్థూల అర్ధం మాత్రమే. నిర్ధిష్ట అర్ధం ఒకటి కావాలి.  

మార్క్స్ సుప్రసిధ్ధ వ్యాఖ్య ఆలోచనాపరులు సమాజాన్ని మార్చాలి అనేది. ఇది పైకి కనిపిస్తున్నంత సులువైన పనికాదు. మనుషులే ప్రపంచాన్ని మారుస్తారు అనేది నిజమేగానీ వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్టు మార్చలేరని కూడ అయనే అన్నాడు. ఇది కూడ అనేక నియమ నిబంధనలతో కూడిన వాక్యం. తాము మార్చాలనుకున్న సమాజం మీద స్పష్టమైన అవగాహన లేకుంటే ఎంతటి ఆలోచనాపరులైనా దాన్ని ఎప్పటికీ మార్చలేరు అనే హెచ్చరిక కూడ ఈ మాటల్లో వుంది.  

ఆరెస్సెస్, భారత కమ్యూనిస్టు పార్టి 1925లో సెప్టెంబరు, డిసెంబరు నెలల్లో ఆరంభ మయ్యాయి. వందేళ్ళు పూర్తయిన సందర్భంగా గత ఏడాది అటు ఆరెస్సెస్ శిబిరం నుండీ ఇటు కమ్యూనిస్టు శిబిరం నుండి అసంఖ్యాక వ్యాసాలు వచ్చాయి. అవన్నీ విభిన్న కోణాల నుండి రాసిన వ్యాసాలు అయినప్పటికీ వాటిల్లో ఒక సామాన్యాంశం వుంది. అదేమంటే, గడిచిన నూరేళ్ళలో ఆరెస్సెస్ మేరు పర్వతంలో పెరిగిపోయింది; కమ్యూనిస్టు పార్టీలు పాత వైభవాన్ని కోల్పోయాయి అనేది. నిజానికి ఈ మాటల్లోనూ స్పష్టతలేదు. అరెస్సెస్ కు అర్ధమయినట్టుగా కమ్యూనిస్టు పార్టీలకు  భారత సమాజం అర్ధం కాలేదు అని వుంటే ఒక స్పష్టత వచ్చేది. 

ఆరెస్సెస్ కు భారత సమాజం అర్ధం అయింది గాబట్టి అది దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. కమ్యూనిస్టు పార్టీలకు భారత సమాజం అర్ధం కాలేదు గాబట్టి అవి దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోలేపోయాయి. “రష్యాలో వర్షం పడితే ఇండియాలో కమ్యూనిస్టులు గొడుగులు పడతారు” అని ఓ నలభై ఏళ్ళ క్రితం ఆరెస్సెస్ నాయకులు ఎద్దేవ చేసేవారు. ఇందులో కొంత నిజం లేకపోలేదు. భారత కమ్యూనిస్టు పార్టీలు దేశీయ పోరాటాలు, విప్లవాల గురించి స్వతంత్రంగా ఆలోచించిన సందర్భాలు తక్కువ. టెస్టు పుస్తాకాలను వదిలేసి గైడ్ పుస్తకాలను అతిగా నమ్మే విద్యార్ధులు కొందరుంటారు.   వాళ్ళలా  భారత కమ్యూనిస్టు పార్టీలు  అయితే రష్యా గైడ్లు, లేకుంటే చైనా గైడ్లు కొనుక్కొని వందేళ్ళు గడిపేశారు. మధ్యలో ఒకళ్ళిద్దరు భారత నేల మీద నిలబడి కొంచెం క్రియాశీలకంగా ఆలోచనలు చేసేందుకు ప్రయత్నించిన మాట కూడ వాస్తవం. అయితే, వాళ్ళ ఆలోచనలు మౌలిక మార్పుల దిశగా సాగలేదన్నది కూడ అంతే వాస్తవం. 

భారతదేశంలో ప్రస్తుతం మూడు డజన్లకు పైగా కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. వీటి మధ్య అనేక సైద్ధాంతిక, రాజకీయ, వ్యూహాత్మక భేదాలు ఉన్నాయి. కొన్ని పార్టీలు పూర్తిగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికల మార్గాన్ని అనుసరిస్తున్నాయి. మరికొన్ని పార్టీలు ఎన్నికల రాజకీయాలతో పాటు సాయుధ పోరాటాన్ని కూడా అనుసరించాలని భావిస్తున్నాయి. ఇంకొన్ని పార్టీలు పూర్తిగా సాయుధ విప్లవానికే కట్టుబడి ఉన్నాయి.

ఇంతటి వైవిధ్యం ఉన్నప్పటికీ, వీటన్నింటినీ కలిపే ఒక సామాన్య అంశం ఉంది. దాదాపు అన్ని కమ్యూనిస్టు పార్టీల రాజకీయ కార్యక్రమంలో 'నూతన ప్రజాస్వామిక విప్లవం' (New Democratic Revolution) ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. అయితే ఆ విప్లవాన్ని ఏ వ్యూహంతో, ఏ సామాజిక శక్తుల ఆధారంగా, ఏ రాజకీయ రూపంలో విజయవంతం చేయాలనే విషయంలో తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నాయి.

'నూతన ప్రజాస్వామిక విప్లవం' అనే భావనను మావో జెడాంగ్ చైనా విప్లవ అనుభవాల నుండి రూపొందించాడు. ముఖ్యంగా చైనా అంతర్యుద్ధ కాలంలో, ‘స్వయం ప్రకటిత దేశభక్తులు’ అనే కువోమింటాంగ్ దళాల నిరంతర సైనిక దాడులు, లాంగ్ మార్చ్ అనుభవాలు, జపాన్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల నేపథ్యంలో ఆయన ఈ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు. 1940లో 'On New Democracy' అనే పుస్తకంలో దానిని సమగ్రంగా ప్రతిపాదించాడు.

ఇందులో, మావో చెప్పిన అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య సమాజమైన చైనాను నేరుగా సోషలిస్టు రాజ్యంగా మార్చడం సాధ్యం కాదని; ముందుగా కార్మికులు, రైతులు, చిన్న బూర్జువా వర్గం, జాతీయ బూర్జువా వర్గం వంటి సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక విప్లవ శక్తుల ఉమ్మడి రాజకీయ అధికారాన్ని — "అన్ని విప్లవవర్గాల ఉమ్మడి నియంతృత్వం" (Joint Dictatorship of All Revolutionary Classes) — స్థాపించాల్సి ఉంటుందని ఆయన స్పష్టంగా పేర్కొన్నాడు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భారతదేశంలోని అనేక కమ్యూనిస్టు పార్టీలు ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ అనే లక్ష్యాన్ని తమ కార్యక్రమాలలో పదేపదే ప్రస్తావించినప్పటికీ, మావో ప్రతిపాదించిన ఈ విప్లవ వర్గాల ‘ఉమ్మడి నియంతృత్వం’ అనే కీలక రాజకీయ నిర్మాణం మీద పెద్దగా చర్చించలేదు. దాని సామాజిక-రాజకీయ అర్థాన్ని అభివృద్ధి చేయలేదు. ఫలితంగా, ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ అనేది అనేక పార్టీల వద్ద ఒక రాజకీయ నినాదంగా మాత్రమే మిగిలిపోయింది. దానిని అమలు చేసే మధ్యంతర రాజ్య నిర్మాణం, వర్గ కూటమి, అధికార నిర్మాణం వంటి అంశాల్ని ఇప్పటికీ  తగిన స్థాయిలో సిద్ధాంతీకరించలేదు.

ఇప్పుడు భారతదేశంలో నాటి చైనా పరిస్థితులు లేవు.  మావో ఊహకు కూడ అందనట్టుగా దేశంలో మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థ ఏర్పడింది. ఇందులో విప్లవకర వర్గాల్ని గుర్తించడం కమ్యూనిస్టు పార్టీల తొలి బాధ్యత. ఈ బాధ్యతను నెరవేర్చిన కమ్యూనిస్టు పార్టి ఒక్కటీ మనకు కన్పించడంలేదు. కొన్ని పార్టీలు వందేళ్ళ క్రితపు  విప్లవకర వర్గాల జాబితాను ఇప్పటికీ  నమ్ముతున్నాయి. మరొకొన్ని పార్టీలు నలభై ఏళ్ళ క్రితపు విప్లవకర వర్గాల జాబితాను పట్టుకుని తిరుగుతున్నాయి. 2014 తరువాత నెలకొన్న కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్పు బాధితులెవరనే జాబితానొకదాన్ని ఇప్పుడు మనం సిధ్ధం చేయాలి.

ఏ సమాజంలో అయినా బాధితుల జాబితా చాలా పెద్దదిగానే వుంటుంది. కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్పుకు బాధితుల జాబితా కూడా పెద్దదిగానే వుంటుంది. వంద వరకు వున్నా ఆశ్చర్యం ఏమీలేదు.  వీటిల్లో ప్రధాన బాధితులు ఎవరూ అన్నది గుర్తించడం ప్రాణప్రద అంశం. ప్రధాన బాధిత సమూహాలను గుర్తించకుండా వంద సమూహాల  జాబితాను తయారు చేసినా ప్రయోజనం వుండదు.

సాంప్రదాయంగా కమ్యూనిస్టులు చెప్పే ప్రధాన బాధిత సమూహాల్లో వ్యవసాయ కూలీలు, ఫ్యాక్టరీ కార్మికులు వుంటారు. 1990లలో చెలరేగిన అస్తిత్వ ఉద్యమాలు ఆదివాసులు, దళితులు, బహుజనులు, మైనారిటీలు, మహిళల్ని ప్రధాన బాధిత సమూహాలుగా పేర్కొంటాయి. ఇవేమీ తప్పుడు జాబితాలు కాదు. ఆయా కాలాల్లో అవి సరైన జాబితాలే. 2024 నాటి కొత్త జాబితా ఏదీ? అందులో ప్రధాన బాధితులు ఎవరూ? అన్నది ఇప్పటి అసలైన ప్రశ్న.

సమాజంలో ప్రధాన బాధితులు  మనకు అర్ధం కానపుడు, పాలకులు ఎవర్ని తమ ప్రధాన శత్రువులుగా భావిస్తున్నారో అర్ధం చేసుకుంటే సరిపోతుంది. అలా గమనిస్తే కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ రెండు సమూహాలను బాహాటంగా తమకు అడ్డంకిగా భావిస్తున్నాయి. కార్పొరేట్లకు అడవులు, ఖనిజాలు, భూమి కావలసినపుడు ఆదివాసులు తిరగబడుతున్నారు. ముస్లింలను అన్యులుగా చూపిస్తేనే ఎన్నికల్లో హిందూ సమాజం నుండి గెలుపుకు అవసరమైన ఓట్లు పడి అధికారాన్ని నిలబెడుతున్నాయి.  రాజకీయార్ధిక రంగాల్లో ముస్లింలు, ఆదివాసుల్ని ప్రత్యర్ధులుగా చూపించే వ్యూహాల మీదనే కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ బలపడుతున్నది.  

1980వ దశకం వరకు భారతసమాజం కులవ్యవస్థగా కనిపించింది. అప్పటికి అది వాస్తవం కూడ. 1990వ దశకం నుండి అది మత వ్యవస్థగా మారడం మొదలయింది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినాసరే నిందితుల్లో ఒక మైనారిటీ వ్యక్తి వుంటే చాలు అది జాతీయ సమస్యగా మారిపోతున్నది.  దేశంలో ఎంత పెద్ద సంఘటన జరిగినా నిందితుల్లో మైనారిటీలు లేకుంటే అసలది వార్తే కాకుండా పోతున్నది.  తిరుపతి లడ్డూ కల్తీ విషయంలోనూ, ప్రతిష్టాత్మక అయోధ్య రామమందిరంలో నిధుల చోరీ విషయంలోనూ ప్రధాన అధికార ఎన్డీఏ నేతలు, ప్రధాన  స్రవంతి  మీడియా, వ్యవహరించినతీరే దీనికి తక్షణ సాక్ష్యం.

పునాదీ ఉపరితల విభజన మీద కమ్యూనిస్టు నాయకుల్లో మొదటి నుండీ ఒక గందరగోళం కొనసాగుతూవుంది. పునాది, ఆర్ధిక అంశాలలో మాత్రమే వర్గ ఘర్షణ వుంటుందనేది వారి నమ్మకం.  పునాదిలో  ఘర్షణను   నిర్మూలిస్తే ఉపరితల ఘర్షణలు సహితం తొలిగిపోతాయనే భావంతో చాలా మంది కమ్యూనిస్టు నాయకులు చాలా కాలంగా వాదిస్తూ వస్తున్నారు.  కులం, మతం, తెగ, లింగం, భాషా, ప్రాంతాల్లో వర్గపోరాటం వుండదని వారి ప్రగాఢ నమ్మకం. మార్క్స్, ఏంగిల్స్ వంటి మహోపాధ్యాయులు ఎవరూ ఇలాంటి వాదనల్ని చేయలేదు.

          వర్తమాన భారత సమాజాన్ని  ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యాఖ్యనిస్తున్నారు. ఈ సందర్భంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు నయా ఫాసిజం. వందేళ్ళ క్రితం ఇటలీ జర్మనీల్లో వుండిన ఫాసిజం, నాజిజంలకు భారతీయ రూపం ఒకటి ఇప్పుడు కొనసాగుతోందని దీని అర్ధం. అయితే, ఇది స్థూల అర్ధం మాత్రమే. నిర్ధిష్ట అర్ధం ఒకటి కావాలి.  

మార్క్స్ సుప్రసిధ్ధ వ్యాఖ్య ఆలోచనాపరులు సమాజాన్ని మార్చాలి అనేది. ఇది పైకి కనిపిస్తున్నంత సులువైన పనికాదు. మనుషులే ప్రపంచాన్ని మారుస్తారు అనేది నిజమేగానీ వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్టు మార్చలేరని కూడ అయనే అన్నాడు. ఇది కూడ అనేక నియమ నిబంధనలతో కూడిన వాక్యం. తాము మార్చాలనుకున్న సమాజం మీద స్పష్టమైన అవగాహన లేకుంటే ఎంతటి ఆలోచనాపరులైనా దాన్ని ఎప్పటికీ మార్చలేరు అనే హెచ్చరిక కూడ ఈ మాటల్లో వుంది.  

ఆరెస్సెస్, భారత కమ్యూనిస్టు పార్టి 1925లో సెప్టెంబరు, డిసెంబరు నెలల్లో ఆరంభ మయ్యాయి. వందేళ్ళు పూర్తయిన సందర్భంగా గత ఏడాది అటు ఆరెస్సెస్ శిబిరం నుండీ ఇటు కమ్యూనిస్టు శిబిరం నుండి అసంఖ్యాక వ్యాసాలు వచ్చాయి. అవన్నీ విభిన్న కోణాల నుండి రాసిన వ్యాసాలు అయినప్పటికీ వాటిల్లో ఒక సామాన్యాంశం వుంది. అదేమంటే, గడిచిన నూరేళ్ళలో ఆరెస్సెస్ మేరు పర్వతంలో పెరిగిపోయింది; కమ్యూనిస్టు పార్టీలు పాత వైభవాన్ని కోల్పోయాయి అనేది. నిజానికి ఈ మాటల్లోనూ స్పష్టతలేదు. అరెస్సెస్ కు అర్ధమయినట్టుగా కమ్యూనిస్టు పార్టీలకు  భారత సమాజం అర్ధం కాలేదు అని వుంటే ఒక స్పష్టత వచ్చేది. 

ఆరెస్సెస్ కు భారత సమాజం అర్ధం అయింది గాబట్టి అది దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. కమ్యూనిస్టు పార్టీలకు భారత సమాజం అర్ధం కాలేదు గాబట్టి అవి దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోలేపోయాయి. “రష్యాలో వర్షం పడితే ఇండియాలో కమ్యూనిస్టులు గొడుగులు పడతారు” అని ఓ నలభై ఏళ్ళ క్రితం ఆరెస్సెస్ నాయకులు ఎద్దేవ చేసేవారు. ఇందులో కొంత నిజం లేకపోలేదు. భారత కమ్యూనిస్టు పార్టీలు దేశీయ పోరాటాలు, విప్లవాల గురించి స్వతంత్రంగా ఆలోచించిన సందర్భాలు తక్కువ. టెస్టు పుస్తాకాలను వదిలేసి గైడ్ పుస్తకాలను అతిగా నమ్మే విద్యార్ధులు కొందరుంటారు.   వాళ్ళలా  భారత కమ్యూనిస్టు పార్టీలు  అయితే రష్యా గైడ్లు, లేకుంటే చైనా గైడ్లు కొనుక్కొని వందేళ్ళు గడిపేశారు. మధ్యలో ఒకళ్ళిద్దరు భారత నేల మీద నిలబడి కొంచెం క్రియాశీలకంగా ఆలోచనలు చేసేందుకు ప్రయత్నించిన మాట కూడ వాస్తవం. అయితే, వాళ్ళ ఆలోచనలు మౌలిక మార్పుల దిశగా సాగలేదన్నది కూడ అంతే వాస్తవం. 

భారతదేశంలో ప్రస్తుతం మూడు డజన్లకు పైగా కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. వీటి మధ్య అనేక సైద్ధాంతిక, రాజకీయ, వ్యూహాత్మక భేదాలు ఉన్నాయి. కొన్ని పార్టీలు పూర్తిగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికల మార్గాన్ని అనుసరిస్తున్నాయి. మరికొన్ని పార్టీలు ఎన్నికల రాజకీయాలతో పాటు సాయుధ పోరాటాన్ని కూడా అనుసరించాలని భావిస్తున్నాయి. ఇంకొన్ని పార్టీలు పూర్తిగా సాయుధ విప్లవానికే కట్టుబడి ఉన్నాయి.

ఇంతటి వైవిధ్యం ఉన్నప్పటికీ, వీటన్నింటినీ కలిపే ఒక సామాన్య అంశం ఉంది. దాదాపు అన్ని కమ్యూనిస్టు పార్టీల రాజకీయ కార్యక్రమంలో 'నూతన ప్రజాస్వామిక విప్లవం' (New Democratic Revolution) ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. అయితే ఆ విప్లవాన్ని ఏ వ్యూహంతో, ఏ సామాజిక శక్తుల ఆధారంగా, ఏ రాజకీయ రూపంలో విజయవంతం చేయాలనే విషయంలో తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నాయి.

'నూతన ప్రజాస్వామిక విప్లవం' అనే భావనను మావో జెడాంగ్ చైనా విప్లవ అనుభవాల నుండి రూపొందించాడు. ముఖ్యంగా చైనా అంతర్యుద్ధ కాలంలో, ‘స్వయం ప్రకటిత దేశభక్తులు’ అనే కువోమింటాంగ్ దళాల నిరంతర సైనిక దాడులు, లాంగ్ మార్చ్ అనుభవాలు, జపాన్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల నేపథ్యంలో ఆయన ఈ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు. 1940లో 'On New Democracy' అనే పుస్తకంలో దానిని సమగ్రంగా ప్రతిపాదించాడు.

ఇందులో, మావో చెప్పిన అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య సమాజమైన చైనాను నేరుగా సోషలిస్టు రాజ్యంగా మార్చడం సాధ్యం కాదని; ముందుగా కార్మికులు, రైతులు, చిన్న బూర్జువా వర్గం, జాతీయ బూర్జువా వర్గం వంటి సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక విప్లవ శక్తుల ఉమ్మడి రాజకీయ అధికారాన్ని — "అన్ని విప్లవవర్గాల ఉమ్మడి నియంతృత్వం" (Joint Dictatorship of All Revolutionary Classes) — స్థాపించాల్సి ఉంటుందని ఆయన స్పష్టంగా పేర్కొన్నాడు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భారతదేశంలోని అనేక కమ్యూనిస్టు పార్టీలు ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ అనే లక్ష్యాన్ని తమ కార్యక్రమాలలో పదేపదే ప్రస్తావించినప్పటికీ, మావో ప్రతిపాదించిన ఈ విప్లవ వర్గాల ‘ఉమ్మడి నియంతృత్వం’ అనే కీలక రాజకీయ నిర్మాణం మీద పెద్దగా చర్చించలేదు. దాని సామాజిక-రాజకీయ అర్థాన్ని అభివృద్ధి చేయలేదు. ఫలితంగా, ‘నూతన ప్రజాస్వామిక విప్లవం’ అనేది అనేక పార్టీల వద్ద ఒక రాజకీయ నినాదంగా మాత్రమే మిగిలిపోయింది. దానిని అమలు చేసే మధ్యంతర రాజ్య నిర్మాణం, వర్గ కూటమి, అధికార నిర్మాణం వంటి అంశాల్ని ఇప్పటికీ  తగిన స్థాయిలో సిద్ధాంతీకరించలేదు.

ఇప్పుడు భారతదేశంలో నాటి చైనా పరిస్థితులు లేవు.  మావో ఊహకు కూడ అందనట్టుగా దేశంలో మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థ ఏర్పడింది. ఇందులో విప్లవకర వర్గాల్ని గుర్తించడం కమ్యూనిస్టు పార్టీల తొలి బాధ్యత. ఈ బాధ్యతను నెరవేర్చిన కమ్యూనిస్టు పార్టి ఒక్కటీ మనకు కన్పించడంలేదు. కొన్ని పార్టీలు వందేళ్ళ క్రితపు  విప్లవకర వర్గాల జాబితాను ఇప్పటికీ  నమ్ముతున్నాయి. మరొకొన్ని పార్టీలు నలభై ఏళ్ళ క్రితపు విప్లవకర వర్గాల జాబితాను పట్టుకుని తిరుగుతున్నాయి. 2014 తరువాత నెలకొన్న కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్పు బాధితులెవరనే జాబితానొకదాన్ని ఇప్పుడు మనం సిధ్ధం చేయాలి.

ఏ సమాజంలో అయినా బాధితుల జాబితా చాలా పెద్దదిగానే వుంటుంది. కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్పుకు బాధితుల జాబితా కూడా పెద్దదిగానే వుంటుంది. వంద వరకు వున్నా ఆశ్చర్యం ఏమీలేదు.  వీటిల్లో ప్రధాన బాధితులు ఎవరూ అన్నది గుర్తించడం ప్రాణప్రద అంశం. ప్రధాన బాధిత సమూహాలను గుర్తించకుండా వంద సమూహాల  జాబితాను తయారు చేసినా ప్రయోజనం వుండదు.

సాంప్రదాయంగా కమ్యూనిస్టులు చెప్పే ప్రధాన బాధిత సమూహాల్లో వ్యవసాయ కూలీలు, ఫ్యాక్టరీ కార్మికులు వుంటారు. 1990లలో చెలరేగిన అస్తిత్వ ఉద్యమాలు ఆదివాసులు, దళితులు, బహుజనులు, మైనారిటీలు, మహిళల్ని ప్రధాన బాధిత సమూహాలుగా పేర్కొంటాయి. ఇవేమీ తప్పుడు జాబితాలు కాదు. ఆయా కాలాల్లో అవి సరైన జాబితాలే. 2024 నాటి కొత్త జాబితా ఏదీ? అందులో ప్రధాన బాధితులు ఎవరూ? అన్నది ఇప్పటి అసలైన ప్రశ్న.

సమాజంలో ప్రధాన బాధితులు  మనకు అర్ధం కానపుడు, పాలకులు ఎవర్ని తమ ప్రధాన శత్రువులుగా భావిస్తున్నారో అర్ధం చేసుకుంటే సరిపోతుంది. అలా గమనిస్తే కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ రెండు సమూహాలను బాహాటంగా తమకు అడ్డంకిగా భావిస్తున్నాయి. కార్పొరేట్లకు అడవులు, ఖనిజాలు, భూమి కావలసినపుడు ఆదివాసులు తిరగబడుతున్నారు. ముస్లింలను అన్యులుగా చూపిస్తేనే ఎన్నికల్లో హిందూ సమాజం నుండి గెలుపుకు అవసరమైన ఓట్లు పడి అధికారాన్ని నిలబెడుతున్నాయి.  రాజకీయార్ధిక రంగాల్లో ముస్లింలు, ఆదివాసుల్ని ప్రత్యర్ధులుగా చూపించే వ్యూహాల మీదనే కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ బలపడుతున్నది.  

1980వ దశకం వరకు భారతసమాజం కులవ్యవస్థగా కనిపించింది. అప్పటికి అది వాస్తవం కూడ. 1990వ దశకం నుండి అది మత వ్యవస్థగా మారడం మొదలయింది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినాసరే నిందితుల్లో ఒక మైనారిటీ వ్యక్తి వుంటే చాలు అది జాతీయ సమస్యగా మారిపోతున్నది.  దేశంలో ఎంత పెద్ద సంఘటన జరిగినా నిందితుల్లో మైనారిటీలు లేకుంటే అసలది వార్తే కాకుండా పోతున్నది.  తిరుపతి లడ్డూ కల్తీ విషయంలోనూ, ప్రతిష్టాత్మక అయోధ్య రామమందిరంలో నిధుల చోరీ విషయంలోనూ ప్రధాన అధికార ఎన్డీఏ నేతలు, ప్రధాన  స్రవంతి  మీడియా, వ్యవహరించినతీరే దీనికి తక్షణ సాక్ష్యం.

పునాదీ ఉపరితల విభజన మీద కమ్యూనిస్టు నాయకుల్లో మొదటి నుండీ ఒక గందరగోళం కొనసాగుతూవుంది. పునాది, ఆర్ధిక అంశాలలో మాత్రమే వర్గ ఘర్షణ వుంటుందనేది వారి నమ్మకం.  పునాదిలో  ఘర్షణను   నిర్మూలిస్తే ఉపరితల ఘర్షణలు సహితం తొలిగిపోతాయనే భావంతో చాలా మంది కమ్యూనిస్టు నాయకులు చాలా కాలంగా వాదిస్తూ వస్తున్నారు.  కులం, మతం, తెగ, లింగం, భాషా, ప్రాంతాల్లో వర్గపోరాటం వుండదని వారి ప్రగాఢ నమ్మకం. మార్క్స్, ఏంగిల్స్ వంటి మహోపాధ్యాయులు ఎవరూ ఇలాంటి వాదనల్ని చేయలేదు.

అమెరికా ఆంథ్రోపాలజిస్ట్ లూయిస్ హెన్రీ మోర్గాన్ 1877లో ‘పురాతన సమాజం’  అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఆ పుస్తకం మీద కార్ల్ మార్క్స్ తన చివరి రోజుల్లో చాలా ఆసక్తిని చూపించాడు. 1883లో మార్క్స్ చనిపోయిన తరువాత, అతనికి  కొనసాగింపుగా,  1884లో ఫ్రెడరిక్ ఏంగిల్ ‘కుటుంబము, వ్యక్తిగత ఆస్తి, రాజ్యాల పుట్టుక’ అనే పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం మొదట్లోనే, ఒక స్త్రీకి ఒక పురుషుడు అనే వివాహబంధం (Monogamous marriage)  మొదలవడంతోనే సమాజంలో వర్గ పోరాటం మొదలయింది అంటాడు. మత వ్యవస్థలో వర్గం వుండదు, వర్గపోరాటం వుండదు అనే కమ్యూనిస్టులు కూడ ఇప్పుడు మన మధ్య వున్నారు. సెక్స్ లోనే వర్గపోరాటం వుంటుందన్న ఏంగిల్స్ ఆత్మ శాంతించుగాక!

30 జూన్ 2026 

మీ వ్యాసం ఒక ముఖ్యమైన సిద్ధాంతపరమైన ప్రశ్నను లేవనెత్తుతోంది: "నేటి భారతదేశంలో ప్రధాన వైరుధ్యం ఏమిటి? దాని ప్రధాన బాధితులు ఎవరు?" అనే ప్రశ్న చుట్టూ మీరు వాదనను నిర్మించారు. జర్నలిస్టుగా, రాజకీయ విశ్లేషకుడిగా మీ అనుభవం కనిపిస్తోంది. అయితే, వ్యాసం మరింత బలంగా, అకాడమిక్‌గా, విశ్వసనీయంగా ఉండాలంటే కొన్ని సూచనలు ఉపయోగపడతాయి.

వ్యాసం బలంగా ఉన్న అంశాలు

  • 1925లో ఏర్పడిన ఆరెస్సెస్, కమ్యూనిస్టు ఉద్యమాల వందేళ్ల తులన ఆసక్తికరంగా ఉంది.
  • మావో యొక్క Mao Zedong "నూతన ప్రజాస్వామిక విప్లవం" భావనను భారత పరిస్థితులతో పోల్చడం మంచి సిద్ధాంతపరమైన ప్రయత్నం.
  • "పాత విప్లవ వర్గాల జాబితా"కు బదులుగా "నేటి ప్రధాన బాధితుల జాబితా" తయారు చేయాలని మీరు చేసిన పిలుపు వ్యాసంలోని కేంద్ర ఆలోచన.
  • రాజకీయ అధికారం ఎవరిని ప్రధాన శత్రువుగా చిత్రీకరిస్తుందో గమనించడం ద్వారా ప్రధాన వైరుధ్యాన్ని గుర్తించవచ్చనే మీ పద్ధతి చర్చించదగినది.

మరింత బలపరచవలసిన అంశాలు

మీరు చేసిన కొన్ని తీర్మానాలు వాదనలుగా సరైనవే అయినప్పటికీ, అవి ప్రస్తుతం నిర్ధారణలుగా వినిపిస్తున్నాయి.

ఉదాహరణకు:

"2014 తరువాత నెలకొన్న కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్పు..."

ఇది ఒక రాజకీయ విశ్లేషణ. అందువల్ల దీనిని ఒక విశ్లేషణాత్మక ప్రతిపాదనగా ఉంచడం వ్యాసానికి బలం ఇస్తుంది. ఉదాహరణకు:

"2014 తరువాత ఏర్పడిన రాజకీయ-ఆర్థిక వ్యవస్థను కొందరు విశ్లేషకులు కార్పొరేట్-కమ్యూనల్ అధికార కేంద్రీకరణగా అభివర్ణిస్తున్నారు."

అని రాస్తే పాఠకుడు మీతో తర్కించడానికి అవకాశం ఉంటుంది.


ప్రధాన బాధితులపై భాగాన్ని మరింత విస్తరించవచ్చు

మీరు చివరకు రెండు ప్రధాన సమూహాలను పేర్కొన్నారు.

  • ఆదివాసులు
  • ముస్లింలు

ఇక్కడ మీరు ఎందుకు ఈ రెండింటినే "ప్రధాన బాధితులు" అంటున్నారో మరింత స్పష్టంగా నిర్మిస్తే వ్యాసం బలపడుతుంది.

ఉదాహరణకు:

ఆదివాసులు

  • ఖనిజ సంపద అధికంగా ఉన్న ప్రాంతాల్లో నివాసం
  • అటవీ హక్కుల వివాదాలు
  • పెద్ద ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులు
  • భద్రతా చట్టాల ప్రభావం

ముస్లింలు

  • ఎన్నికల ధ్రువీకరణలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా చిత్రీకరణ
  • ద్వేష ప్రచారం
  • పౌరసత్వం, గృహాలు, ఉపాధి వంటి అంశాల్లో వివక్ష ఆరోపణలు
  • రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుదల

ఇలా విడిగా వివరించినప్పుడు మీ నిర్ణయం మరింత బలంగా కనిపిస్తుంది.


చివరి భాగం అత్యంత ఆసక్తికరమైనది

Friedrich Engels రచించిన The Origin of the Family, Private Property and the State గురించి మీరు చేసిన ప్రస్తావన వ్యాసాన్ని కొత్త దిశకు తీసుకెళ్తుంది.

అయితే చివరి వాక్యం:

"సెక్స్ లోనే వర్గపోరాటం వుంటుందన్న ఏంగిల్స్ ఆత్మ శాంతించుగాక!"

ఇది కొంత వ్యంగ్యంగా ఉంది.

దాని బదులు ఇలా ముగిస్తే సిద్ధాంతపరమైన బలం పెరుగుతుంది.

"అంటే ఆర్థిక సంబంధాలకే పరిమితం కాని ఆధిపత్య సంబంధాలు కుటుంబం, లింగం, మతం, జాతి, తెగ వంటి రంగాల్లో కూడా ఉద్భవిస్తాయని ఏంగిల్స్ సూచించాడు. ఈ నేపథ్యంలో ఆధునిక భారతదేశంలో వర్గపోరాటాన్ని కేవలం ఉత్పత్తి సంబంధాలకే పరిమితం చేయడం సరిపోతుందా అనే ప్రశ్నను కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది."

ఈ ముగింపు మరింత గంభీరంగా ఉంటుంది.


ఒక సిద్ధాంతపరమైన సూచన

మీ వ్యాసంలో మీరు ఒక కొత్త భావనను ప్రవేశపెడుతున్నారు.

మతతత్వ పెట్టుబడిదారీ వ్యవస్థ

ఇది మీ వ్యాసంలోని అత్యంత కొత్త సిద్ధాంతపరమైన పదం.

దీనిని ఒక చిన్న నిర్వచనంతో మొదట్లోనే పరిచయం చేస్తే పాఠకుడికి చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు:

"మతతత్వ పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే — పెద్ద కార్పొరేట్ మూలధనం, మెజారిటీ మత జాతీయవాద రాజకీయాలు, రాష్ట్ర అధికార యంత్రాంగం పరస్పరం బలపరుచుకుంటూ పనిచేసే రాజకీయ-ఆర్థిక నిర్మాణం."

ఇలాంటి నిర్వచనం ఉంటే తర్వాత వచ్చే మొత్తం వ్యాసం మరింత సులభంగా అర్థమవుతుంది.

మొత్తం అంచనా

ఈ వ్యాసం ఒక సాధారణ రాజకీయ వ్యాఖ్య కాదు. భారత కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న సిద్ధాంత సంక్షోభాన్ని, "ప్రస్తుత ప్రధాన వైరుధ్యం" అనే ప్రశ్న ద్వారా పునర్నిర్వచించడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. కొంతమంది పాఠకులు మీ ప్రధాన నిర్ణయాలతో ఏకీభవించకపోయినా, వాదనను మరింత ఆధారాలతో, స్పష్టమైన నిర్వచనాలతో, విశ్లేషణాత్మక భాషలో బలపరిస్తే ఇది గంభీరమైన సిద్ధాంత చర్చకు దారితీసే వ్యాసంగా నిలిచే అవకాశం ఉంది.

No comments:

Post a Comment