Showing posts with label Chidambaram. Show all posts
Showing posts with label Chidambaram. Show all posts

Tuesday, 24 July 2012

Tribal and Delhi

ఆదివాసులు - హస్తినాపురం

సామాజిక వర్ణమాలకు (స్పెక్ట్రం) ఏడమ చివర్న ఆదివాసులుంటారు. కుడి చివర్న హస్థినాపురం వుంటుంది. అటు గిరిజనులుంటారు. ఇటు హొం మంత్రులు వుంటారు. 

బిర్సాముండా, గాం మల్లు దొర, అల్లూరి శ్రీరామరాజుల నుండి ఇవ్వాల్టి అరకులొయలో బాక్సైట్ వ్యతిరేకపోరాటం సాగిస్తున్న వారి వరకు ఒక వారసత్వం.

వల్లభాయి పటేల్ నుండి గొవింద్ వల్లభ్ పంత్, ఇందిరా గాంధీ, కాసు బ్రహ్మానంద రెడ్డి, పిసీ సేథీ, ఎల్కే అద్వానీ, షివరాజ్ పాటిల్, పి. చిదంబరం వరకు ఇంకో వారసత్వం.

ఇంకాస్త వెనక్కి వెళితే, ద్వాపర యుగంలో ఇటు తక్షకుడు, నాగులు,అటు శ్రీకృష్ణార్జునులు.

వర్ణమాలలో ఆ చివర ఈ చివర ఎప్పుడూ స్థిరమే. హోం మంత్రులు వాళ్ల అణిచివెతను మానలెదు. ఆదివాసులు వాళ్ల పోరాటాన్ని ఆపలెదు.

మారిందల్లా మధ్యనున్న సమూహాలే.

ఈ సమూహాల్లో సమస్య వచ్చినపుడు, అందరూ కాకున్నా, ఎక్కువమంది, గతంలొ ఎడమ వైపుకు చూసేవారు.

దాదాపు 45 యేళ్ళ క్రితం, నాటి యువతరానికి, డార్జిలింగ్ కొండల్లో, ఙానబోధ చేసినవాడు ఒక ఆదివాసి. జంగల్ సంతాల్. అతడే మా తరానికి గీతాచార్యుడు.

ఇప్పుడు కాలం మారింది. ఙానం కోసం జనం ఏడమవైపుకు కాకుండా, కుడివైపుకు చూస్తున్నారు.

కుడిపక్షం వాళ్ళను మింగేస్తోంది. ఆవహించేస్తోంది.

అదే ఇప్పుడు అసలు సమస్య!