Monday, 2 March 2015

The Signals of Neo-Crusades

The Signals of Neo-Crusades

మతయుధ్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి!
ఉషా యస్ డానీ

పారిస్ లోని ఛార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై  దాడి తరువాత పత్రికా స్వేఛ్ఛ మీద మరోసారి విస్తృత చర్చ మొదలయిందిదాడిలో పత్రిక సంపాదకులు సహా అరడజను సిబ్బంది కూడా చనిపోవడంవల్ల చర్చల తీవ్రత కూడా  స్థాయిలోనే కొనసాగుతోందిసామాజిక కోణంలో చూస్తే భావప్రకటనా స్వేఛ్ఛ పేరిట సాగుతున్న  చర్చలోఇరువర్గాలు వర్ణ ప్రాతిపదిక మీద విడిపోయారని సులువుగానే అర్ధం అవుతోందిశ్వేతవర్ణ జాతీయులువాళ్ళ మేధోబృందాలు పత్రిక కార్యాలయంపై  దాడినీసిబ్బంది హత్యనూ తీవ్రంగా ఖండిస్తుంటేఇతర వర్ణాలకు చెందిన ప్రజలువాళ్ళ మేధోవర్గాలు  ఛార్లీ హెబ్డో పత్రిక దుందుడుకు స్వభావాన్నే తప్పుపడుతున్నారు.  

చార్లీ హేబ్డో పత్రిక సామాజిక దృక్పథాన్ని అర్ధం చేసుకోవడానికి ముందు ఫ్రాన్స్ రాజకీయార్ధిక నేపథ్యాన్ని ఒకసారి పరిశీలించాలిఫ్రాన్స్ నిన్నమొనటి వరకు వలస పాలక దేశంగా వుండేదిబ్రిటీష్ వలస పాలకులకన్నా ఫ్రెంచ్ వలస పాలకులు మరింత అహంభావులువలసలు అంతరించి దశాబ్దాలు గడుస్తున్నాఅలనాటి వలసదేశాల ప్రజలంటే ఫ్రెంఛ్ ఉన్నత వర్గాలకూవాళ్ళ మనోభావాల్ని ప్రచారంచేసే పత్రికలకూ ఇప్పటికీ చిన్న చూపేఅక్కడి పత్రికల్లో వచ్చే కార్టూన్లల్లో వర్ణ వివక్ష ప్రస్పుటంగా కనిపిస్తుందివీళ్ళలో మరీ బరితెగించిన పత్రిక ఛార్లీ హేబ్డోమినహాయింపు లేకుండా అందరి మీదా వ్యంగ్య బాణాలు సంధిస్తూ వుంటుందని ఉదారవాద ఫ్రెంచ్మేధావులు  పత్రికని మెచ్చుకుంటూ వుంటారుఇది పాక్షిక సత్యం మాత్రమేకాస్త పరికించి చూస్తే పత్రిక తెల్లవాళ్లను సుతారంగా గోళ్లతో గిల్లి వదిలేస్తుందనీనల్లవాళ్ళు తదితర ఒకనాటి వలస ప్రజల్ని కర్కశంగా గొడ్డళ్ళతో పొడుస్తుందనీ సులువుగానే అర్ధం అవుతుంది.

నిజానికి ఈపాటి జ్ఞానాన్ని సంపాదించడానికి ఆలోచనాపరులెవ్వరూ ప్యారిస్ పర్యటనకు వెళ్ళాల్సిన పనిలేదుతెలుగు వార్తా పత్రికల్ని అధ్యయనం చేసినా సరిపోతుందితెలుగు మీడియా సంస్థలన్నీ ఏదో ఒక రాజకీయపార్టీకి మద్దతు దారులుగా మారిపోయాయన్న సంగతి తెలియనివాళ్ళు ఇప్పుడు ఎవరూలేరుప్రతీ పత్రిక రాజకీయకార్టూన్లు ప్రచురిస్తుంది.  తాము సమర్ధించే పార్టీల ప్రత్యర్ధుల మీదే కాకుండా కొన్ని సందర్భాలలో  తాము సమర్ధించే పార్టీల నాయకుల మీద కూడా కార్టూన్లు వేయాల్సి వుంటుందిఅంత మాత్రాన  వాళ్ళు  సమర్ధించే పార్టీల మీద వేసే కార్టూన్ల తీవ్రతాతాము సమర్ధించే పార్టీల ప్రత్యర్ధుల మీదే వేసే కార్టూన్ల తీవ్రతా ఒకే స్థాయిలో వుంటాయని పుర్రెలో కాస్తంత బుర్ర వున్నవాడు ఎవరయినా నమ్ముతారా?  సీనియర్ పాత్రికేయులు కొందరు నమ్ముతూ వుండవచ్చువాళ్లను చూసి జాలిపడడంతప్ప మనం చేయగలిగింది ఏమీలేదుపత్రికా స్వేఛ్ఛ అంటే యధేఛ్ఛకాదు!

అప్పట్లో ఆఫ్రో-అమెరికన్ నల్లజాతీయుల్ని కోతులుగా చిత్రించిన అమెరికా శ్వేతవర్ణీయుల పత్రికల్నిహిట్లర్ కాలంలో యూదుల్ని కించపరుస్తూ కార్టూన్లు వేసిన జర్మన్ పత్రికల్ని ఛార్లీ హెబ్డో పత్రిక  అనుసరిస్తూ వుంటుంది.  ఇటీవలి కాలంలో ఆర్ధికసంక్షోభంలో పడిపోయిన చార్లీ హెబ్డో పత్రిక  'సమవర్తిముద్ర నుండి బయటపడి ఇస్లామోఫోబియాను ప్రచారం చేయడం ద్వార శ్వేతవర్ణీయుల మద్దతు కూడగట్టి లాభాలబాట పట్టే ప్రయత్నాలు మొదలెట్టిందనే వాదనలున్నాయిదాడి తరువాత  పత్రిక్కి సంఘీభావంగా తరలివస్తున్న శ్వేతవ్వర్ణ నిధులు  వాదనను బలపరుస్తున్నాయిలాభాలు సంపాదించడానికి  ఏకంగా ఒక సంపాదకుని ప్రాణాలను బలిపెడతారాఅనే సందేహం ఎవరికయినా రావచ్చుఅయితే"పది శాతం లాభం కోసం ఉరికభం ఎక్కడానికి కూడా పెట్టుబడిదారులు  వెనుకాడరు." అనేది అందరికీ తెలిసిన సూత్రమే!

ఇంగ్లండ్ ముస్లింలలో అత్యధికులు ఒకనాటి బ్రిటీష్ వలస దేశాలకు చెందినవాళ్ళే అయినట్టుఫ్రాన్సుదేశపు ముస్లింలలో అత్యధికులు సహజంగానే ఒకనాటి ఫ్రెంచ్ కాలనీలకు చెందినవారు వుంటారుఛార్లీ హేబ్డే పత్రిక  సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యం చాటున ముస్లింలను భూతాలుగా (ఇస్లామో ఫోబియానుప్రచారంచేస్తూ వుంటుంది.

ఫ్రెంచ్ సామ్రాజ్యానికీఇస్లాంకు ఒక విచిత్ర  అనుబంధం వుందిఉత్తర ఆఫ్రికా ఖండంలో  ఫ్రెంచ్ సామ్రాజ్యం శిఖరాగ్ర దశలో వున్నప్పుడుఅక్కడ ఇస్లాం చాలా వేగంగా విస్తరించింది.  ఒక దశలో అయితే ముస్లింల జనాభా అత్యధికంగా వున్న సామ్రాజ్యం తనదేనంటూ  ఫ్రాన్సు గొప్పగా చెప్పుకునేదిముస్లిం దేశాల్లోని చమురుపైఆధిపత్యాన్ని సాధించడానికి  జనాభా అంశాన్ని పెద్దగా ప్రచారం చేసుకునేది

ప్రపంచవ్యాప్తంగా శ్వేత జాతీయులు ఇప్పుడు కార్టూన్లు ప్రచురించినందుకు ఒక పత్రికా సంపాదకుడ్ని ముస్లింలు క్రూరంగా చంపేశారని గగ్గోలు పెడుతున్నారుముహమ్మద్ ప్రవక్తను నగ్నంగా చిత్రించడం వ్యంగ్యమేనాముస్లింల ప్రవక్త వికృత మైధూనాని (సుడోమికి పాల్పడినట్టు  ఒక మతిచెడినవాడు తీసిన ఒక బూతు సినిమాకువత్తాసు పలకడం హాస్యమేనాశాసనసభ్యులుగా ఎన్నికైన ’పల్లెటూరి బైతులు ప్రభుత్వం ఇచ్చిన  ల్యాప్ టాపుల్ని మడిచి ఎక్కడ పెట్టుకుంటారోఅని ఒక వెకిలి వ్యాఖ్య చేసినందుకుఅగ్రస్థానంలోవున్న ఒక న్యూస్ ఛానల్ ఆర్ధిక పునాది కదిలిపోవడాన్ని తెలంగాణలో   మనం కళ్ల ముందు చూశాంతమ మతప్రవక్త మీద అదేపనిగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటే విశ్వాసులు ఎలా స్పందిస్తారో ఊహించడం కష్టమేమీకాదు.

ఛార్లీ హెబ్డో పత్రిక మీద దాడి చేసింది ముస్లింలు అనేది కూడా పాక్షిక సత్యమే కేసులో అరెస్టు అవుతున్న వారందరూ ఒకనాటి ఫ్రెంచ్  వలసలైన అల్జీరియామాలియన్ దేశాల నుండి వచ్చినవారే నన్నది మరో కోణంపత్రిక మీద దాడికి మతంకన్నా జాతివివక్ష అంశమే బలంగా పనిచేసిందని దీనినిబట్టి అర్ధం అవుతున్నది.అంతర్జాతీయ పత్రికల్లో శ్వేతవర్ణ మేధావులు రాసే వ్యాసాలు చదివి రెచ్చిపోతున్న మన సమకాలిక ’నల్ల మేధావులకు వలసజాతుల ఆవేదన అర్ధం అయినట్టులేదు.

వలసజాతుల భావోద్వేగాలకు ఉధామ్ సింగ్ అద్భుత ప్రతీకజలియన్ వాలా బాగ్ దురంతాన్ని జరిపిన బ్రిగేడియర్-జనరల్  రెగినాల్డ్ డయర్ (Dyer) కన్నా   నరమేధానికి అనుమతి ఇచ్చిన పంజాబ్ గవర్నర్ మైఖేల్ ఓ’ డయ్యర్ (O’Dwyer) ప్రధాన దోషి అని ఉధామ్ సింగ్ భావించాడుఇరవై యేళ్ళు గడిచిపోయినా సరేడయ్యర్ పదవీ విరమణ చేసి డెభ్భయి ఆరేళ్ళ  వృధ్ధుడు అయిపోయినాసరే  కసి చల్లారక లండన్ వెళ్ళి మరీ చంపేశాడుఅదే ఒక లండన్ పత్రిక తరచూ భారతీయుల్ని కించపరుస్తూ వ్యాసాలోవ్యంగ్య చిత్రాలో ప్రచురిస్తుంటే ఉధామ్ సింగ్ లాంటి వాళ్ళు ఏమి చేసి వుండేవాళ్ళూ?  అప్పుడు  చర్యను వలసపాలకులు ఎలాగూ ఖండిస్తారువాళ్ళచట్టాల ప్రకారం ’దోషుల్ని ఎలాగూ శిక్షిస్తారువలస ప్రజల్ని సమర్ధించే మేధావులు ఏం చేయాలిఅన్నదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న.


ఇస్లామో ఫోబియా అనేది సంస్కృతిక దాడి అయితేదానికి మూలమయిన రాజకీయార్ధిక కారణాలను ఏకధృవ ప్రపంచాన్ని ఏలుతున్న అమెరికా సామ్రాజ్యవాదంలో చూడాలిదానికి వ్యూహాలు రచిస్తున్న అమెరికా-ఇజ్రాయిల్ అనుబంధంలో చూడాలిసామ్రాజ్యవాదిగావున్న అమెరికాను  రాజకీయార్ధిక కోణంలో బాహాటంగాసమర్ధించడానికి కొన్ని మతాలకు కొన్ని ఇబ్బందులు వున్నమాట నిజమేఅయితేసాంస్కృతికంగా ముస్లిం వ్యతిరేక శిబిరానికి నాయకత్వం వహిస్తున్న అమెరికా వెనుక నడవడానికి ఇప్పడు ముస్లిమేతర మతాలన్నీ ఉవ్విళ్ళూరుతున్నాయి.


ఏదో ఒక శత్రువు లేకుండా మనుగడ సాగించలేని  అమెరికా సామ్రాజ్యవాదం  సోవియట్ రష్యా పతనం తరువాత ముస్లింలనే తన ప్రధాన శత్రువుగా భావిస్తోందివర్తమాన ప్రపంచంలో అసంఖ్యాక పీడిత ప్రజలు అనేక యుధ్ధరంగాల నుండి అనేక రకాలుగా అమెరికా సామ్రాజ్యవాదంతో తలపడుతున్నారనేది ఎవరికైనా అర్ధం అయ్యేవిషయమే.   యుధ్ధాల్లో ముందుశ్రేణిలో నిలబడి అమెరికాతో తలపడుతున్నది ముస్లింలే అనేది కూడా  సులభంగానే తెలుస్తోంది జ్ఞాన సముపార్జన క్రమం ఇంకో అడుగు ముందుకు వేస్తే ఎవరికైనా అర్ధం అయ్యేది ఏమంటే వర్తమాన ప్రపంచంలో ప్రధాన పీడితులు ముస్లీంలు అనివిప్లవ రచయిత వరవరరావు వంటి వారుముస్లింలతోపాటూ ఆదివాసుల్ని కూడా ప్రధాన పీడితులుగా పేర్కొంటున్నారుఇది సంమంజసమైన ప్రతిపాదనముస్లిం దేశాల్లో చమురు నిల్వలున్నాయిఆదివాసుల నివాసాల్లో ఖనిజ నిక్షేపాలున్నాయిఇది సాంస్కృతిక రూపంలో సాగుతున్న పచ్చి ఆర్ధిక పోరాటం.

మధ్య యుగాల్లో రాజకీయార్ధిక వ్యక్తీకరణలన్నీ  మత రూపంలోనే సాగేవిపధ్ధెనిమిదవ శతాబ్దం ఆరంభంలో వాల్టేర్రూసోలు రంగప్రవేశం చేశాక మాత్రమే రాజకీయార్ధిక వ్యక్తీకరణలకు ఆధునిక మాధ్యమం ఏర్పడిందిగడిచిన మూడు శతాబ్దాల కాలంలో జరిగిందేమంటే పెట్టుబడీదారీ రాజకీయార్ధిక విధానాలు సామ్రాజ్యవాద దశకుచేరుకుని ప్రపంచ పీడిత ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకను ఎదుర్కొంటున్నాయి సంక్షోభాన్ని దాటి మళ్ళీ ఆమోదాంశాన్ని పొందాలంటే సామ్రాజ్యవాద దేశాలు తమ రాజకీయార్ధిక వ్యక్తీకరణలకు ఒక కొత్త మాధ్యమాన్ని కనిపెట్టాలిఇప్పుడు వాటికా శక్తిలేదుఅంచేత గతంలో వదిలేసిన మత మాధ్యమాన్నే అవి పునరుధ్ధరిస్తున్నాయి.అమెరికా నాయకత్వంలో సాంస్కృతికంగా ప్రపంచం ఇప్పుడు నిజంగానే రెండు మత శిబిరాలుగా చీలిపోయింది.  గ్లోబ్ ను మతయుధ్ధ మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి!

ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ప్రధాన వార్తల్ని చూస్తుంటే ఇస్లాంను ద్వేషించని వారు భూగోళం మీద ఎవరూ లేరేమో అనిపిస్తోందిఇంకొన్ని పేజీలు తిరగేస్తుంటే అందుకు విరుధ్ధమైన వార్తలు కూడా కనిపిస్తున్నాయిముస్లిం జనాభా మెజారిటీ అయిపోతోందని యూరప్ దేశాలు భయపడిపోతున్నాయటఇంగ్లండ్జర్మనీఅమెరికాలనూఇప్పుడు ఇస్లాం భూతం వెంటాడుతోంది!.  అంతమంది అంతలా తిట్టిపోస్తున్నాముస్లింలను భూతాల్లా చూపిస్తున్నాఇస్లాంను స్వీకరించేవాళ్ళు రోజురోజుకూ పెరిగిపోతుండడం నిజంగా ఆశ్చర్యమేఇలాంటి సందర్భాల్లో  ఖిలాఫత్ ఉద్యమ నాయకుడుభారత జాతీయ కాంగ్రెస్‍ కు అలనాటి అధ్యక్షుడుకవి మౌలాన ముహమ్మద్ ఆలీ(జౌహర్) కవితా పంక్తులు గుర్తుకు వస్తాయి.  "ఖతల్  హుస్సేన్ అసల్ మే మర్గ్  యజీద్ హై /  ఇస్లాం జిందా హోతాహై హర్ కర్బలా కే బాద్"  దీనికి ఒక్క ముక్కలో అర్ధం చెప్పుకోవాలంటే "అణిచివేత నుండే ఇస్లాం జీవాన్ని నింపుకుంటుంది".

కళాకారులుఆలోచనాపరులు చెయ్యాల్సిన పని ఆధిపత్యాన్ని సవాలుచేయడంవాళ్ళు ఎప్పటికీ చేయకూడని పని పీడితుల్ని వెటకరించడంఅమెరికా ప్రపంచ ప్రధాన పీడక దేశం అయ్యిముస్లింలుఆదివాసులు ప్రపంచ ప్రధాన పీడితులు అయినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వున్న సామ్రాజ్యవాద వ్యతిరేకులు ఏం చేయాలీఅనేదేఈరోజు మన ముందున్న ప్రధాన సమస్యదానికి ఎవరికివారు ఇచ్చుకునే సమాధానమే ప్రపంచ ప్రజల ముందున్న చారిత్రక కర్తవ్య నిర్వహణకు దారితీస్తుందిఇటో అటో తేల్చుకోవాల్సిన సమయమిది.

(రచయిత సీనియర్ పాత్రికేయులు సమాజ విశ్లేషకులు)
మొబైల్ : 90107 57776

హైదరాబాద్,  21  జనవరి 2015
ప్రచురణ :
 వీక్షణం మాసపత్రిక, ఫిబ్రవరి 2015 :

Sunday, 25 January 2015

తుళ్ళూరు : బూమ్ నుండి క్రాష్ దిశగా

తుళ్ళూరు : బూమ్ నుండి క్రాష్ దిశగా
డానీ

పాత దీపాలకు కొత్త దీపాలు ఇస్తానంటాడు అల్లావుద్దీన్ అద్భుత దీపం కథలో  మాంత్రికుడు. దాదాపు అదే తరహాలో, పల్లెల్లోని పంటపొలాలకు రాజధాని నగరంలో ఇళ్లస్థలాలు, వాణిజ్యస్థలాలు ఇస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

రైతు రుణమాఫీ ప్రహసనాన్ని చూశాక వ్యవసాయదారుల్లో కొత్త ప్రభుత్వం మీద నమ్మకం సడలింది అంటే అతిశయోక్తికాదు. కాబోయే కోర్ రాజధాని తుళ్ళూరు రైతుల్లో నమ్మకాన్ని పెంచడానికి స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోనికి దిగారు. కొత్త రాజధాని ఎలా వుంటుందో వివరిస్తూ పది రకాల ఊహా చిత్రాలను ప్రజల ముందు ఆవిష్కరించారు. వారి మాటల్లోనే చెప్పాలంటే కొత్త రాజధాని హైదరాబాద్ కన్నా ఘనంగా వుంటుంది. సింగపూర్, పుత్రజయల్ని తలదన్నేలా వుంటుంది. న్యూయార్కు మహానగరం కూడా అసూయ పడేలా వుంటుంది.

హైదరాబాద్ లో వాణిజ్యస్థలాలు, ఇళ్ళస్తలాలూ అంటే ఎవరైనా బంజారా హిల్స్, జూబిలీహిల్స్ ల లోని ప్రధాన రోడ్లనో, మాధాపూర్ లోని ఐటీ కంపెనీలనో ఊహించుకుంటారే తప్ప చింతల్ బస్తీ, సితాఫల్ మండీ, సఫిల్ గూడనో ఊహించుకోరుకదా? తుళ్ళూరులో భూములు కొన్నవాళ్ళు అక్కడ హైదరాబాద్ జూబిలీహిల్స్, బంజారాహిల్స్ లలోని ప్రధాన రోడ్లనే ఊహించుకున్నారు.

ఈ సందర్భంగా చాలామంది  మరచిపోతున్న చారిత్రక వాస్తవం ఏమంటే హైదరాబాద్ భూములకు బూమ్  2005 తరువాత వచ్చింది,  అప్పటికి హైదరాబాద్ వయస్సు నాలుగు వందల సంవత్సరాలు దాటింది.  ఇది వేగయుగం కనుక, అందులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు హైటెక్కు ప్రతినిధి గనుక హైదరాబాద్ అభివృధ్ధికి   నాలుగు వందల సంవత్సరాలు పడితే కోర్ కేపిటల్ తుళ్ళూరు అభివృధ్ధికి   అందులో  పదోవంతు  కూడా  పట్టదని ప్రభుత్వ ప్రచారకులు గట్టిగా వాదిస్తున్నారు.

నిర్మాణరంగంలో ప్రీ-ఫ్యాబ్రికేటెడ్  సాంకేతిక పరిజ్ఞానం వచ్చేసింది. ఆ విభాగంలో  గ్లోబల్ మొనగాడుగావున్న ఎల్ అండ్ టి సంస్థ ప్రమోటర్లు  చంద్రబాబుకు అత్యంత సన్నిహితులనే ప్రచారం కూడా వుంది.  ఎల్ అండ్ టి సంస్థ ఈ పాటికే ఎక్కడో ఒకచోట భావి కోర్ కేపిటల్ ను ఫ్యాబ్రికేషన్ చేసేసి రెడీగా వుంచేసిందనీ,  సింగపూర్ కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్ ప్రైజెస్, జురాంగ్, సుహాన సంస్థలు మాస్టర్ ప్లాన్ ఇచ్చిన మరుక్షణం వాటిని తెచ్చి ‘రాత్రికిరాత్రే’ తుళ్ళూరులో అమర్చేస్తారని నమ్ముతున్నవాళ్ళూ లేకపోలేదు.   ఆ వెంటనే జపాన్ సంస్థలు   రంగప్రవేశం చేసి   రాజధాని ప్రాంతాన్ని(కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అధారిటీ) అభివృధ్ధి చేసేస్తారనీ  మరో ప్రచారం సాగుతోంది. నిజానికి ఇలాంటి అతిశయోక్తుల ప్రచారాలకు స్వయంగా ప్రభుత్వాధినేతే ఆస్కారాన్ని ఇస్తున్నారు. 

హైదరాబాద్ అభివృధ్ధి వేగవంతం కావడానికి తమ  పెట్టుబడే కారణమనే అభిప్రాయం ఆంధ్రా ప్రాంతంలోని ఒక వర్గంలో బలంగావుంది. కొత్త రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ లో వున్న ఆంధ్రా కంపెనీలన్నీ స్వంత రాష్ట్రానికి తరలిపోతాయని ‘సమైక్యాంధ్రా ఉద్యమ’ కాలంలో ఒక బెదిరింపు లాంటి ప్రచారం కొంత సాగింది.

హైదరాబాద్ పెట్టుబడులన్నీ తన వెంటే నడుస్తాయని నమ్మే చంద్రబాబు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే తాను మంగళగిరి నుండి పరిపాలన సాగిస్తాననీ, అవసరమైతే చెట్ల కిందే  కుర్చీలు బల్లలు వేసుకుని పనిచేస్తామని ప్రకటించారు. కానీ అలా జరగలేదు. ఆ తరువాత విజయవాడలో షెడ్లు వేసుకుని పనిచేస్తామని వారు మరో ప్రకటన చేశారు. అదీ అమలు కాలేదు. హైదరాబాద్ నివాసాన్ని వదలలేని చంద్రబాబు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు అతిథిగా కొనసాగుతున్నారు. దానితో ఆంధ్రా పెట్టుబడుల తిరుగు-వలస కూడా సంధిగ్ధంలో పడిపోయింది.  

లాభార్జనే పెట్టుబడికి ఏకైక లక్ష్యం. లాభాల కోసం అది ప్రపంచమంతా విస్తరిస్తుంది. నాదేశం, నా రాష్ట్రం, నా జిల్లా, నాఊరు, నావాళ్ళు అనే ఆదర్శాలు పెట్టుబడికి నప్పవు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో అలాంటి భావోద్వేగాలు కనిపించినా అది కేవలం దాని ఆమోదాంశాన్ని పెంచుకోవడానికి చేసింది మాత్రమే అని అర్ధం చేసుకోవాలి. అంతేకానీ, అదే దాని ప్రధాన కార్యాకలాపం కాదు. పెట్టుబడికీ భావోద్వేగాలకూ సూత్రప్రాయంగా పడదు.

ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కు రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటిస్తుంటే  మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఆంధ్రా పెట్టుబడుల తిరుగు-వలసకు అడ్డుకట్టలేసే ప్రయత్నాలు మొదలెట్టారు. ఎన్నికలకు ముందు, ఎన్నికయిన కొత్తలో ఆంధ్రుల మీద  కేసిఆర్  ప్రదర్శిస్తూ వచ్చిన కరకు వైఖరిలో ఇటీవల చాలా మార్పులు వచ్చాయి.

ఆంధ్రుల్ని ‘ఏరిపారేస్తాం’ అనే పరోక్ష సంకేతాలతో కేసిఆర్  అట్టహాసంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే కాగితాల గుట్టల వైపు ఇప్పుడు కన్నెత్తి చూసేవాడులేడు. తెలంగాణలో ఆంధ్రుల ప్రతినిధిగా భావించే తుమ్మల నాగేశ్వరరావును పార్టీలోనికి తీసుకోవడమేగాక మంత్రివర్గంలో సహితం స్థానం కల్పించారు. సాక్షాత్తు చంద్రబాబుకు రాజగురువుగా భావించే రామోజీరావును స్వయంగా వెళ్ళి కలిసి రామోజీ ఫిల్మ్ సిటీని పొగిడి వచ్చారు. అక్కడ గజం భూమి కూడా ఆక్రమణ జరగలేదని అధికార ప్రకటన చేశారు.  అక్కినేని నాగేశ్వరరావు వల్లనే చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వచ్చి నగరాభివృధ్ధికి దోహదం  చేసిందని ఇంకో సందర్భంలో ఇంకో కితాబునిచ్చారు. ఆంధ్రావారైనాసరే పెట్టుబడులతో వస్తే  ఎర్రతివాచీ పరచి స్వాగతం చెపుతామని ఇంకో చారిత్రాత్మక  ప్రకటన చేశారు.

 గత ఏడాది సంక్రాంతి పండుగ తరువాత ఆంధ్రా ప్రాంతం నుండి తిరిగి వస్తున్న బస్సులు, రైళ్ళు, కార్లను తెలంగాణ ఉద్యమకారులు  అడ్డుకున్నారు. అక్కడక్కడ రాళ్ళు రువ్విన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఈసారి వాళ్లను పూలు పంచి స్వాగతం పలికినా  ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఇవన్నీ ఆంధ్రా పెట్టుబడులు వెనక్కి మరలకుండా చూడ్డానికి కేసిఆర్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమని  భావించాలి. ప్రాంతీయాభిమానంకన్నా పెట్టుబడి సంచయనం శక్తివంతమైనది.

ఆంధ్రప్రదేశ్ కోర్ కేపిటల్ గా తుళ్ళూరును ఎంపిక చేసినట్టు మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి ప్రకటించగానే అక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎకరం కేవలం 10-15 లక్షల రూపాయలున్న భూముల ధరలు ఒక వారం రోజుల్లో పది రెట్లు పెరిగాయి. అయితే, ఈ బూమ్ తుళ్ళూరుకే పరిమితం. విజయవాడకు అతి సమీపంలోవున్న ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం తదితర పరిసర గ్రామాల్లో భూముల ధరలు ఏడాది క్రితమే రెండు కోట్ల రూపాయలు దాటాయి. అక్కడి రైతులు అంతకన్నా తక్కువ ధరకు భూములివ్వడానికి సిధ్ధంగా లేరు.

ఇప్పుడు తుళ్ళూరులో కూడా భూమి ధరలు రెక్కలు తెగి పతనదిశగా సాగుతున్నాయి. భూ లావాదేవీలు పూర్తిగా ఆగిపోయాయి. దీనికి రెండు కారణాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కోర్ క్యాపిటల్ మీద  చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు అతిశయోక్తులుగా కనిపిస్తూ వుండడం ఒక కారణంకాగా తమ మీద  కేసిఆర్ సానుకూల వైఖరిని ప్రదర్శిస్తే తాము స్వరాష్ట్రానికి తరలి వెళ్ళాల్సిన అవసరం రాకపోవచ్చని ఆంధ్రా ప్రమోటర్ల కార్పొరేట్ కంపెనీలు భావిస్తుండడం మరో కారణం. హైదరాబాద్ మీద చంద్రబాబుకే కాదు కార్పొరేట్ కంపెనీలకూ  ప్రేమే కదా!

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
సెల్ : 90107 57776
హైదరాబాద్‍
14 జనవరి 2015  

ప్రచురణ : సాక్షి దినపత్రిక , 26 జనవరి 2015