Friday 13 January 2023

Prajasakti Edit Page Article Words – 948 Characters - 6,500

 

మానవతావాదులు మనలోనే వున్నారు !

Prajasakti Edit Page Article

Words – 948

Characters  - 6,500

 

Jan 13,2023 07:31

ప్రతి ఒక్కరిలో మానవీయ విలువలు నిక్షిప్తమై ఉంటాయి. వాటిని మనం జాగృతం చేసుకుంటూ ఉండాలి. మానవతావాదులు మనలోనే ఉన్నారు. అంటే... మన మధ్యే ఉన్నారని అర్థం. అంతేకాదు, మనలో అంటే ప్రతి ఒక్కరి మనసుల్లో ఉంటారు. స్వార్థం, కుత్సిత బుద్ధి పక్కన పెడితే, మనుషులంతా మానవతావాదులే.. కదా? డబ్బూ, అధికారం చాలా మంది దగ్గర ఉంటాయి. అయితే వాటిని మానవత్వ కోణంలోకి మార్చి, తమ చుట్టూ ఉన్నవారి జీవితాల్ని బాగుచేయాలనుకోవడం గొప్ప సామాజిక సేవ !

''ప్రపంచం మారాలని మనం కోరుకోవడం కాదు. మార్పు మనతోనే మొదలయితే-ప్రపంచం అదే మారుతుంది!'' అంటాడు ప్రపంచ ప్రసిద్ధ రష్యన్రచయిత లియో టాల్స్టాయ్.

           వృద్ధాప్యంలో కన్నబిడ్డలు వదిలేసినా, పూర్వ విద్యార్థులు పూనుకుని, తమ ఉపాధ్యాయురాలిని చేరదీసిన సంఘటన కేరళ లోని మలప్పురంలో జరిగింది. అక్కడ ఒక ప్రయివేటు పాఠశాలలో ఒకప్పుడు ఎంతో తెలివైన ఉపాధ్యాయురాలిగా పేరున్న ఒక టీచర్కాలక్రమంలో వీధిపాలైంది. స్వంత కొడుకులు, కూతుళ్ళు ఆమెను వదిలేశారు. జీవిత చరమాంకంలో ఆమె చాలా కష్టాలపాలైంది. కూడూ, గూడూ లేక వీధుల్లో తిరగాల్సి వచ్చింది. తన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారో ఎక్కడ ఉన్నారో కూడా ఆమెకు తెలియదు. చివరకు బతకడానికి రైల్వే స్టేషన్ముందు బిచ్చమెత్తుకోవలసి వచ్చింది. ఎందరి ఛీత్కారాలకో గురవుతూ, మొండిగా అక్కడక్కడే కాలం గడుపుకోసాగింది. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఒక పూర్వ విద్యార్థిని ఆమెను గమనించింది. అతి కష్టం మీద గుర్తుపట్టింది. దగ్గరికి వచ్చి వివరాలు అడిగింది. అంతే! ఆమె తనకు పాఠాలు చెప్పిన విద్యా టీచర్అని పూర్తిగా నమ్మింది. తనను దివ్యగా పరిచయం చేసుకుంది. తనది బ్యాచో, తన బ్యాచిలో ఎవరెవరు ఉండే వారో చెప్పుకుంది. సంభాషణలు సంబంధాన్ని మరింత బలపరిచాయి. ఒకప్పుడు ఎంతో గౌరవం గా బతికిన విద్యా టీచర్జీవితం అలా కావడం పూర్వ విద్యార్థినికి నచ్చలేదు. ఎంతగానో బాధపడింది. ఊరికే బాధపడితే లాభమేమిటీ? ఏదో చేయాలని అనుకుంది. ఒకప్పటి విద్యార్థిని దివ్య-ఇప్పుడు ఐఎయస్అధికారి. వెంటనే ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళి స్నానం చేయించి, వేరే శుభ్రమైన బట్టలిచ్చి, భోజనం పెట్టి పడుకోబెట్టింది. అధికారి గనుక, దగ్గరలో అన్ని వసతులు ఉన్న చిన్న ఇల్లు వెతకండని మనుషుల్ని పంపింది.

               తనతో చదువుకున్న పూర్వ విద్యార్థినీ విద్యార్థుల్ని సంప్రదించింది. విషయం వారందరికీ తెలియజేసింది. అంతే కాదు, తన సర్కిల్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళకు చెప్పి, అందరినీ కదిలించింది. తన విద్యాటీచర్భవిష్యత్కోసం కొంత నిధి ఏర్పాటు చేసింది. అలా తమ స్కూలు టీచర్కు మంచి జీవితం అందించాలన్న పూర్వ విద్యార్థుల సంకల్పం నెరవేరింది. తను చొరవ తీసుకుని, అందరినీ కలుపుకుని సమిష్టిగా ఒక ప్రయత్నం చేసి విజయురాలైంది ఐఏయస్దివ్య. కన్నవాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఆమె ఆస్థి కాజేసి, నిస్సహాయురాలిని చేసి రోడ్డున పడేసినా, ఒక టీచర్‌, తన విద్యార్థుల సహకారంతో మళ్ళీ గౌరవప్రదమైన జీవితంలోకి రావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. విద్యాటీచర్తను ఉద్యోగంలో ఉన్నప్పుడు బోధించిన పాఠాల సారాంశం, అందించిన సంస్కారం పూర్వ విద్యార్థుల్లో పనిచేసింది. ఆమె ఎంత నిజాయితీగా నిబద్ధతతో పాఠాలు చెప్పకపోతే, ఆమె తన విద్యార్థినీ విద్యార్థులకు అంత ప్రీతిపాత్రురాలు కాగలదూ? అలా పదేళ్ల తర్వాత కూడా వాళ్ళు ఎందుకు తరలివచ్చారూ? ప్రతి ఒక్కరిలో మానవీయ విలువలు నిక్షిప్తమై ఉంటాయి. వాటిని మనం జాగృతం చేసుకుంటూ ఉండాలి. మానవతావాదులు మనలోనే ఉన్నారు. అంటే... మన మధ్యే ఉన్నారని అర్థం. అంతేకాదు, మనలో అంటే ప్రతి ఒక్కరి మనసుల్లో ఉంటారు. స్వార్థం, కుత్సిత బుద్ధి పక్కన పెడితే, మనుషులంతా మానవతావాదులే.. కదా? డబ్బూ, అధికారం చాలా మంది దగ్గర ఉంటాయి. అయితే వాటిని మానవత్వ కోణంలోకి మార్చి, తమ చుట్టూ ఉన్నవారి జీవితాల్ని బాగుచేయాలనుకోవడం గొప్ప సామాజిక సేవ !

           మన సమాజంలో ఇలాంటి పనులు ఎంతమంది చేస్తున్నారూ? అని నిట్టూర్పులు విడిచి, నిరాశపడకుండా ''మనమేమైనా చేయగలమా?'' అని ఎవరికి వారు కార్యాచరణకు పూనుకోవాలి. వారి పరిధిలో వారు చేయగలిగింది చేయడానికి సిద్ధపడాలి. మానవవాదులంటే ఎవరో ప్రత్యేకంగా ఉండరు. మనలోనే ఉంటారు. మన ఆలోచనల్లోనే ఉంటారు. చేయవల్సిందల్లా 'వారిని' బయటికి తీయడమే. అంటే ఆలోచనలతోనే మరో పదిమందికి స్ఫూర్తినందించడం. జిలుగు వెలుగుల సినిమా రంగంలో ఉండి కూడా ప్రజల పక్షాన నిలిచిన నటులు కొందరు మనకు ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవాడు నానా పటేకర్‌. తన ఆదాయంలో తొంభయి శాతం ఛారిటీలకు ఇచ్చారు. గతంలో కార్గిల్యుద్ధ సమయంలో సైన్యానికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. తన ఆదాయంలో ఎక్కువ మొత్తం రైతుల అభ్యున్నతికి ఖర్చుపెట్టారు. కరువుకు గురైన నాలుగు గ్రామాల్ని దత్తతకు తీసుకున్నారు. పేద ప్రజల కొరకే తన జీవితం అన్నట్లుగా అన్ని వేళలా వారికి అండగా ఉంటున్నారు. ఉదాహరణకు ఇక్కడ ఒక్క నానా పటేకర్గురించి చెప్పుకున్నాం. కానీ, సమాజంలో అక్కడక్కడా ఇలాంటి వారు ఉన్నారు. ఇలాంటి వారి సంఖ్య గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది. ప్రయత్నం మనలోంచే ప్రారంభం కావాలి! అలాగే ఇటీవల కరోనా లాక్డౌన్సమయంలో వలస కార్మికులకు రవాణా సౌకర్యరం కల్పించి, స్వంత ఖర్చుతో వారిని వారి వారి గమ్యాలకు చేర్చిన ఘనత నటుడు సోనూ సూద్కు చెందుతుంది. వెండితెర మీద విలన్లుగా నటించినా, నిజ జీవితంలో గొప్ప హీరోలుగా నిలిచారు.

''ప్రయత్నిస్తూ ఉండే వారికి సాధ్యం కానిది ఏదీ ఉండదు'' అన్నాడు అలెగ్జాండర్ గ్రేట్‌.''జీత్తొ పతా నహీు లేకిన్యె చరాగ్

కం సె కం రాత్ నుక్సాన్బహుత్కర్తాహై'' ఉరుదూ కవి ఇర్ఫాన్సిద్దీఖి. విజయం సంగతి తెలియదు కానీ, దీపం రాత్రికి చాలా నష్టం కలిగిస్తుంది - అని అర్థం. ఇందులో రాత్అంటే రాత్రి. అమానవీయత - రాత్రిగాక మరేమిటీ? ఆశ అనే దీపం - ప్రయత్నమనే దీపం పట్టుకుని పోతూ ఉంటే చీకట్లు వాటికవే తొలగిపోతుంటాయన్న ఆశావాద దృక్పథం చరణాలలో ఉంది. సమకాలీనంలో జరుగుతున్న ఘోరాల్ని చూసి బెంబేలెత్తిపోవడం కాదు, ప్రయత్నించి ఎదుర్కొంటూ పోతేనే విజయం వరిస్తుంది.

          కేరళ కోజికోడ్జిల్లాకు చెందిన శశి తల్లితో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాడు. కొన్నేళ్ల క్రితం బ్యాగుల పరిశ్రమ పెట్టేందుకు స్టేట్బ్యాంక్ఆఫ్ఇండియా నుండి యాభై వేలు లోన్‌ (అప్పు) తీసుకున్నాడు. అసలూ, వడ్డీ ఏదీ చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఇంటిని జప్తు చేసేందుకు వెళ్ళారు. శశి నిస్సహాయత, కూలిపోయే అతని పాత ఇంటిని చూసి చలించిపోయారు. తొమ్మిది మంది ఉద్యోగులు కలిసికట్టుగా తమ స్వంత డబ్బుతో అతడి ఇల్లు బాగు చేయించి ఇచ్చారు. అంతే కాదు, బ్యాంకు ఉద్యోగులే తమ స్వంత డబ్బుతో అతడి బ్యాంకులోన్చెల్లించారు. దేశంలో ఇలాంటి వారు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానన్నవాడు రెండుసార్లు ప్రధానిగా వెలిగిపోయాడు గానీ, ఇలాంటి చిన్న పాటి సహాయమూ దేశంలో ఎవరికీ చెయ్యలేదు. ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. రైతు తీసుకున్న అప్పు సకాలంలో బ్యాంకుకు తిరిగి చెల్లించలేదని ఒక బ్యాంకర్కోర్టులో పిటిషన్వేశాడు. పిటిషన్ను జస్టిస్చంద్రచూడ్కొట్టేశారు. ''రైతు అప్పు చెల్లించలేదని అతన్ని కోర్టుకు లాగుతారా? ముందు అప్పు ఎగ్గొట్టి పారిపోయిన ''పెద్ద దొంగలను''... పట్టుకోండి!'' అంటూ ఆయన తన తీర్పులో సూచించారు. ప్రకృతి పరిరక్షణ కార్యకర్త డాక్టర్వందనా శివ అంటారు-''భూమి హక్కులను రక్షించుకోవడమన్నది అత్యంత ముఖ్యమైన విషయం. ఇదే మన కాలంలో మనం జరిపే అతి పెద్ద శాంతి ఉద్యమం. సామాజిక న్యాయాన్ని, మానవ హక్కులను రక్షించడం అందులో భాగమే!'' ఒక స్థాయికి ఎదిగి ఆలోచించే వారికి మాత్రమే ఆమె మాటలు అర్థమవుతాయి. భూమిలో రైతుకు మాత్రమే కాదు, మనుషులందరికీ ఉన్న సంబంధం గూర్చి అవలోకించగలగాలి. అది మానవతావాదులైతే గాని చేయలేరు! ఇండోనేషియాలో ముస్లింలు తొంభైయి శాతం. హిందువులు రెండు శాతం. మిగతా ఎనిమిది శాతం ఇతర మతస్థులు. అలాగే అమెరికాలో డెబ్బయి శాతం క్రైస్తవులు, ముప్పయి శాతం ఇతర మతస్థులు. అయినా, అక్కడ మతాన్ని అడ్డుపెట్టుకుని ఎవరూ రాజకీయాలు చేయడంలేదు. అల్లర్లు లేవు. మెజారిటీలదే రాజ్యం అని కూడా అనడం లేదు. మన దేశంలో ఆరెస్సెస్‌, బీజేపీలు అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశం హిందువులదేనని అంటున్నారు. మిగతా మతస్థులపై దాడులు చేస్తున్నారు. ఇక్కడ మరొక విచిత్రం జరుగుతూ ఉంది. ఆవు పాలు నేల పాలు చేస్తారు. ఆవు నెయ్యి నిప్పులో తగలేస్తారు. ఆవు మూత్రం మాత్రం తాగుతారు. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలోని దేశంలోనూ లేదు. కొందరికి-ముస్లింలు ప్రమాదంలో ఉన్నారని అనిపిస్తుంది. మరి కొందరికి-హిందువులు ప్రమాదంలో ఉన్నారని తోస్తుంది. అసలు విషయమేమంటే... దేశమే ప్రమాదంలో ఉందన్నది అందరూ గ్రహించాల్సి ఉంది. దీనికి ఒక్కటే పరిష్కారం - జాతి, మత, కుల, ప్రాంతీయ భేదాల్ని పక్కకు నెట్టి కలిసి మెలసి జీవించడమే! మానవతావాదులన్న వారు కుల మతాల్ని తప్పనిసరిగా త్యజించాలి. ఆర్థిక స్థోమతల్ని పట్టించుకోగూడదు. మానవాభ్యుదయమే ధ్యేయంగా ఆధునిక స్త్రీ పురుషులందరూ కలసికట్టుగా ఒక మానవతావాద ప్రపంచాన్ని సృష్టించుకోవాలి !

వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త/

డా|| దేవరాజు మహారాజు

No comments:

Post a Comment