Saturday 11 February 2023

*మత మైనారిటీల మనోభావాలను గౌరవిద్దాం*

 *మత మైనారిటీల మనోభావాలను గౌరవిద్దాం*

ఇప్పుడు మనం సంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వం పాలనలో వున్నాం. దీనినే అందరూ సౌలభ్యం కోసం 'ఫాసిజం' అంటున్నారు. మారిన కాలంలో మారిన రూపంలో 'ఫాసిజం' అనడం 'అంత' సరైనది కాదు. నయా ఫాసిజం, రూపం మార్చుకున్న ఫాసిజం, భారత ఫాసిజం, నయా మనువాదం వగయిరా పేర్లు బాగుంటాయి. నిజానికి ఇది మనదేశ శ్రామిక ప్రజలపై కార్పొరేట్ పెట్టుబడి సాగిస్తున్న ఉగ్రవాదం.

సాంస్కృతిక జాతీయవాద కార్పొరేట్ నియంతృత్వం ఎన్నికల ద్వారానే.  ప్ర్జాస్వామిక రాజ్యాంగాల ద్వారానే అధికారంలోనికి వస్తుంది.

ఇద ఆరు  స్థాయిల్లో పనిచేస్తుంది.

1. సాంస్కృతిక రంగంలో మత మైనారిటీలను  అణిచివేస్తుంది.

2. ఆర్ధిక రంగంలో శ్రామికుల్ని, ఆదివాసుల్ని  అణిచివేస్తుంది.

3. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మత మెజారిటీ శ్రామికుల ద్వార  కార్పొరేట్లకు సేవలు చేయిస్తుంది.

4. శ్రామికుల పక్షం వహించే రాజకీయ పక్షాలను అణిచివేస్తుంది.

5. తన వంతుగా దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతుంది.

6. కార్పొరేట్లు బలపడుతుంటే దేశం బలపడినట్టు ప్రచారం చేస్తుంది.

ఫాసిజానికి తొలి బాధితులు మత మైనారిటీలు, ఫాసిస్టుల మీద పోరాటంలో ముందు వరుసలో నిలబడేదీ వాళ్ళే. యూరప్ లోనూ ఫాసిస్టు వ్యతిరేకపోరాటంలో యూదులే గట్టిగా నిలబడ్డారు. ఆ సమయంలో జర్మనీలో మనకు తెలిసిన కమ్యూనిస్టు నాయకుల్లో అత్యధికులు యూదులు. ఫాసిస్టు వ్యతిరేకపోరాటానికి అణుబాంబు చేసి ఇచ్చిన ఐన్ స్టీన్ యూదుడు. ఫాసిస్టుల్ని సాంస్కృతిక రంగంలో ఎదుర్కొన్న చార్లీ చాప్లిన్ ని కూడ యూదుడనే అంటారు.

ఈ వాస్తవాలను  *భారత్ బచావో* గ్రూపులో కొందరు గురించినట్టు లేరు. హేతువాదం, నాస్తికత్వం భాష మాట్లాడుతున్నారు. కొందరు బౌధ్ధాన్ని ఆదర్శంగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అవి తిరిగి తిరిగి మత మైనారిటీల మనోభావాల్ని దెబ్బతీస్తాయి. ముస్లిం, క్రైస్తవ, శిక్కు  మతమైనారిటీలకు ఫాసిస్టులు, హేతువాదులు, నాస్తికులు, కమ్యూనిస్టులు  ఒకేలా కనిపించే ప్రమాదం వుంది. 

మనం ఫాసిస్టు వ్యతిరేక శక్తుల ఐక్యతను కోరుకుంటున్నాం కనుక ఈ జాగ్రత్తలు చాలా అవసరం.

*డానీ - ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)*



Chandra Sskhara Rao garu!

"మత, జాతి సామాజిక సమూహాలను - సైద్దాంతిక శక్తులతో గందరగోళ పరచడం  సరి కాదు." 


- ఇవి మీ మాటలేనా? 


సామాజిక అస్తిత్వాలు వేరు, సామాజిక సిధ్ధాంతాలు వేరని మొదటిసారి ఒక భౌతికవాది నోట వింటున్నాను. 


సామాజిక అస్తిత్వాల నుండే  సామాజిక సిధ్ధాంతాలు పుడతాయనిదే ఆ మహానుభావువుడు కార్ల్‍ మార్క్స్ చెప్పిన వాక్యాల్లో మొదటిది. అదే గతితార్కిక చారిత్రక భౌతిక వాదానికి పునాది సూత్రం. 


తెలిసీ తెలియని మాటల్ని అసందర్భంగా ఉటంకిస్తే సైధ్ధాంతిక చర్చేకాదు చారిత్రక చర్చ కూడ  తప్పక మొదలవుతుంది. దాన్ని స్వాగతించాలి. కాకుంటే వివాదం అవుతుంది. 


చర్చలు, వివాదాలూ వద్దనుకుంటే ఇలాంటి తెలిసీ తెలియని పసిపిల్లల మాటలు వల్లించకూడదు. 


సామాజిక అస్తిత్వాలు లేనిదే సామాజిక సిధ్ధాంతాలు వుండవవీ, పుట్టవవీ  గుర్తించండి. సామాజిక అస్తిత్వాల్ని గుర్తించము అన్నవారిని చరిత్ర ఎక్కడ వుంచాలో అక్కడే వుంచింది. 


ఫాసిజం అంటున్నామంటేనే అది సాంస్కృతిక ఆధిపత్యం అని అర్ధం.  సులువుగా చెప్పాలంటే మతరాజ్యం అని అర్ధం. హిందూమత రాజ్యం వారి స్పష్టమైన లక్ష్యం. 


మీరు మతాన్ని గుర్తించం అంటే ఈ యుధ్ధం నుండి మీరు తప్పుకుంటున్నారని అర్ధం. 


వర్తమాన భారత ఫాసిజానికి ముస్లింలు, క్రైస్తవులు, ఆదివాసులు,   అత్యంత పీడిత సమూహాలని మీరు ఇంకా గుర్తించినట్టు లేదు. ఆ తరువాత అంబేడ్కరిస్టులు అయిన ఎస్సీలు, *మార్క్సిస్టులు* అయిన కమ్యూనిస్టులు  వస్తారు. 


మన దేశంలో ఫాసిజం పెరగడానికి మీరు చెప్పే సైద్దాంతిక శక్తులు ఎలా దోహదం చేశారో  చెప్పాల్సిన పరిస్థితిని తేవద్దు.  ఈ చర్చను కొనసాగించాలనుకుంటే ముందు *పుచ్చలపల్లి సుందరయ్యగారి రాజీనామా* డాక్యుమెంటును చదవండి. ఆ తరువాత మాట్లాడుకుందాము. 


- *డానీ, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)*




ఏం మాటలివీ భాస్కరరావుగారూ!


"ఈ పరిస్థితులను సరిదిద్దే అవకాశం ముస్లిం సంస్థల కన్నా సెక్యులర్ శక్తులగు మార్క్స్ వాదులు, ఫులే- అంబేద్కర్ వాదులకే ఎక్కువగా ఉంటుందనేది నిర్వివాదాంశం" 


"ఏ దేశంలో నైనా జాతి, భాష, మత మైనారిటీ ల ను మరియు మెజారిటీ మత శ్రామిక ప్రజల ను ఐక్యం చేయగల potentiality మార్క్సిజం కి, ఇండియా లో మార్క్స్- అంబేద్కర్ వాదులకు మాత్రమే ఉంది"


భారత్ బచావో గ్రూపులో కన్వీనరే స్వయంగా ఒక వివాదాన్ని రేపారు. 


- *డానీ, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)*




భాస్కరరావు గారూ!, 


గ్రూపు  కన్వీనరై వుండి మీరే ఒక  వివాదాన్ని రేపారు అని గుర్తు చేయడమే నా ఉద్దేశ్యం. 


గతంలోనూ ఒక అడ్మిన్ స్థాయిలోవున్న వ్యక్తి అకారణంగా ముస్లిం సమాజం మీద కొన్ని అనుచిత వాఖ్యలు చేసి వివాదాన్ని రేపారు. 


ఇక సైధ్ధాంతిక అంశాల మీద కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు చేసే ఓపిక సమయం నాకు లేదు. భారత కమ్యూనిస్టు పార్టీల్లో ఏ ఒక్కటి కూడ తమ ప్రకటిత కార్యక్రమాల్ని ఇంతవరకు కనీసం ఆరంభించలేదని నా అవగాహన.  అవన్నీ వందేళ్ళుగా సైధ్ధాంతిక చర్చలు చేసుకుంటూ వంద పార్టీలుగా చీలిపోయి దేశ జనాభాల్లో రెండు  శాతం ప్రజానీకాన్ని కూడ ప్రభావితం చేసే స్థితిలో లేవు. 


దేశంలో ఫాసిజం లేదనీ, రాదనీ గట్టిగా వాదించిన కమ్యూనిస్టు పార్టీల నాయకుల వీడియో టేపులు నా దగ్గరున్నాయి. వీరిలో వామపక్షాల నుండి  మావోయిస్టు పార్టీల ప్రతినిధుల వరకు వున్నారు. 


(లింకులు కావాలంటే మీకు పంపిస్తాను)


భారత కమ్యూనిస్టు పార్టీల ప్రత్యక్ష పరోక్ష సహకారాలతో  బిజెపి ఎలా ఎలా పెరుగుతూ వచ్చిందో చెప్పే పత్రాలు ఇప్పుడు అనేకం అందుబాటులో వున్నాయి. 


రెండవ ప్రపంచ యుధ్ధ కాలంలో జర్మనీలో నాజిజాన్ని అంతం చేయడంలో ఆనాడు సోవియట్ రష్యా ఒక కీలక పాత్ర నిర్వహించింది. స్టాలిన్ లాంటి ధృఢమయిన నాయకుడున్నాడు. అప్పుడది బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాల స్థాయి దేశం కనుక భారీ ఎర్రసైన్యం వుంది.  అంత మాత్రాన మొత్తం క్రెడిట్ రష్యాకే ఇవ్వడం కూడ కుదరదు. 


ఎర్ర సైన్యం  ప్రవేశానికి రెండేళ్ళ ముందే ఇటలీలో ముస్సోలినీని దించేశారు. ఫాసిజానికి తొలి ఓటమి  ఆఫ్రికా ఖండం ఉత్తర దేశాల్లో ఎదురైంది. లిబియాలోనూ ఫాసిజాన్ని ఎదుర్కొన్నది ముస్లిం సంస్థలే. 'ఓమర్ ముఖ్తార్' సినిమా  అయినా మీరు చూసి వుంటారుగా. 


ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ముస్లింలను మినహాయించి మిగిలిన సిధ్ధాంతాలు గొప్పవని చెప్పడానికి మీరు ప్రయత్నించారు. 


అప్పుడు జర్మనీలో యూదుల్ని మినహాయించి ఇతరుల్ని దగ్గరకు లాక్కొనేవాడు హిట్లర్. ఇప్పుడు మనదేశంలో ముస్లింలను మినహాయించి  ఇతరుల్ని దగ్గరకు లాక్కోనే ప్రయత్నం సంఘపరివారం గట్టిగానే చేస్తున్నది. మీ వాక్యాల్లో ఆ ప్రభావం వుంది. 


ఇదే మనలోని ఫాసిజం. మన అంతరంగంలోనూ మన శతృవు వుంటాడు. చెక్ చేసుకుంటుండాలి.


పైగా ఇంకో ఫాసిస్టు వ్యతిరేక వాట్స్ అప్ గ్రూపులో చర్చిద్దాం అంటున్నారు. ముస్లింలను మినహాయించే స్వభావం వున్న మేధావులతో చర్చలేంటీ?  


- *డానీ, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)*




చంద్రశేఖర రావు గారూ! 


మీరు చర్చను దారి మళ్ళిస్తున్నారు. 


భారత ఫాసిజానికి తొలి బాధితులు, అత్యంత పీడితులు ముస్లింలు. భారత ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో ముందు పీఠిన నిలబడేదీ సహజంగానే ముస్లింలు. 


అయితే,  ఫాసిజానికి ముస్లింలు మాత్రమే  బాధితులుకాదు; ఈ వరసలో అనేక సామాజిక  శ్రేణులున్నాయి; మార్క్సిజం, అంబేడ్కరిజం తదితర అనేక సామాజిక సిధ్ధాంతాలున్నాయి. 


*ఈ శ్రేణులు సిధ్ధాంతాలు కలిసి ఐక్యంగా పోరాడితేనే  భారత ఫాసిజాన్ని ఎదుర్కోగలం; భారత సమాజన్ని  కాపాడుకోగలం*. ఈ అవగాహనతోనే నేను 1984 నుండి (ఆశ్చర్యపోవద్దు) పనిచేస్తున్నాను.  


"ఈ పరిస్థితులను సరిదిద్దే అవకాశం ముస్లిం సంస్థల *కన్నా* సెక్యులర్ శక్తులగు మార్క్స్ వాదులు, ఫులే- అంబేద్కర్ వాదులకే ఎక్కువగా ఉంటుందనేది నిర్వివాదాంశం" 


"ఏ దేశంలో నైనా జాతి, భాష, మత మైనారిటీ ల ను మరియు మెజారిటీ మత శ్రామిక ప్రజల ను ఐక్యం చేయగల potentiality మార్క్సిజం కి,  *మాత్రమే ఉంది*" (అలా జరిగిన ఒక్కటంటే ఒక్క  దేశం పేరు వారు చెపుతారా?). ఇండియా లో మార్క్స్- అంబేద్కర్ వాదులకు *మాత్రమే ఉంది*"


*కన్నా, మాత్రమే* అని భారత్ బచావో ఏపి గ్రూపు కన్వీనర్  భాస్కరరావుగారు  రిడక్షనిస్టు పోస్టు పెట్టడం చాలా అభ్యంతరకరం. ఆయనే గ్రూపులో ఐక్యతకు చిచ్చు పెట్టారు. 


 ఈ గ్రూపులో వున్న మరెవ్వరికన్నా ముందు నుండి మార్క్సిస్టులు, అంబేడ్కరిస్టులు, ఆదివాసులతో కలిసి పనిచేస్తున్నముస్లింని నేను. *లాల్, నీల్, హర్యాలీ నా నినాదం*. హర్యాలీ అంటే ఆకుపచ్చ. అది ముస్లింలు, ఆదివాసులకు ప్రతీక. 


ఇప్పుడు "ముస్లిం మైనారిటీలకు కమ్యూనిష్టులు , అంబేద్కరిస్టులు మితృలు అని మీరు భావిస్తున్నారా!" అని మీరు గడుసుగా అడుగుతున్నారు. ఇది పధ్ధతి కాదు. 


చిచ్చు పెట్టిన సభ్యులే తమ వాదాన్ని సమర్ధించుకోవాలీ; లేదా ఉపసంహరించుకోవాలి. 


చిచ్చు పెట్టిందే గ్రూపు కన్వీనర్ అయితే? ఏం చేయాలీ? 


న్యాయమూర్తి స్థానంలో వుండాల్సినవాళ్ళు, కక్షిదారుగా మారితే వివాదమే చెలరేగుతుంది. 


- *డానీ, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)*

No comments:

Post a Comment